-
శ్రీరస్తు.. ఉచిత విద్యా ప్రాప్తిరస్తు
మొదటి విడతలో ఎంపికై న విద్యార్థులు నియోజకవర్గం ప్రైవేటు పాఠశాలలకు ఎంపికై న విద్యార్థులు ఆళ్లగడ్డ 26 బనగానపల్లె 78 డోన్ 270 నంద్యాల 273 నందికొట్కూరు 206 పాణ్యం 28 శ్రీశైలం 79 మొత్తం 960ఆళ్లగడ్డ: చదువుకు పేద, పెద్ద అంతరాల్లేవ్.. అడ్డుగోడలు అంతకన్నా ఉండకూడదు.. పేదరికాన్ని పారద్రోలే పెద్ద ఆయుధం విద్య.. అక్షర జ్ఞానంతోనే పేదల ఆర్థిక పర్థిస్థితిని మెరుగుపరచవచ్చు అన్న సంకల్పంతో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు పైసా ఖర్చు లేని ఉచిత విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మొదటి విడతగా జిల్లాలో 960 మంది విద్యార్థులను ఎంపిక చేయగా వారు ఈ నెల 20 తేదీ లోపు అడ్మిషన్లు పొందాలని గడువు విధించింది. జిల్లాలో 960 మందికి ప్రవేశాలు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుతో 2024 – 25 విద్యాసంత్సరానికి పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 247 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలతో ఆన్లైన్ పోర్టర్లో నమోదు చేసుకున్నాయి. వీటిలో సుమారు 3 వేల సీట్లు అందుబాటులో ఉండగా మొదటి విడతలో 1,867 మంది పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 960 మంది విద్యార్థులను జిల్లా అడ్మిషన్ మానిటరింగ్ కమిటీ ఎంపిక చేసి జాబితాను విద్యాశాఖ మండల అధికారులకు పంపింది. వీరిలోనూ ఇప్పటికే 600 మంది ప్రవేశం పొందారు. మిగతా వారు ఈ నెల 20వ తేదీలోపు కేటాయించిన పాఠశాలల్లో ప్రవేశం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. సీట్ల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ సూళ్లన్నింటిలోను 2024 – 25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో తప్పనిసరిగా 25 సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. అనాథలు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఇతర వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. అనుమానాల నివృత్తికి 14417 టోల్ ఫ్రీ నంబర్ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు, సీట్లు పొందే అంశాలపై ఏమైనా ఇబ్బందులు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం 14417 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచింది. విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. వచ్చిన గ్రీవెన్స్లను సత్వర పరిష్కారం కోసం ఎంఈఓ, డీఈఓ స్థాయిలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశారు. ఫీజు చెల్లింపు.. ప్రైవేటు పాఠశాలల్లో సీటు పొందిన విద్యార్థులు ఏడాదికి ఎంత ఫీజు చెల్లించాలనేది ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. పట్టణాల్లో రూ.8 వేలు, రూరల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100. వీటిని అమ్మ ఒడి పథకం కింద విద్యార్థులు ప్రవేశం పొందిన పాఠశాలకు ప్రభుత్వం చెల్లించనుంది. చేరకుంటే సీటు రద్దు జిల్లాలోని ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయిస్తాం. ఎంపికై న వారిని చేర్చుకోబోమని అడ్మిషన్లు తిరస్కరించినా, ఫీజు చెల్లించాలని వేధించినా కఠిన చర్యలు తప్పవు. ప్రస్తుతం 960 మంది విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు కేటాయించారు. ఈ నెల 20వ తేదీ లోపు చేరాలి. లేకపోతే సీటు రద్దు అవుతుంది. – సుధాకర్రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య ప్రైవేట్, కార్పొరేట్, స్కూళ్లలో విద్యాహక్కు ద్వారా ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్న ప్రభుత్వం నిర్బంధ విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలు ఈ ఏడాది ఉచిత విద్యకు మొదటి విడతలో 960 మంది విద్యార్థులు ఎంపిక ఈనెల 20 లోపు పాఠశాలల్లో చేరకుంటే సీటు రద్దు -
18005994599
● ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుకు టోల్ఫ్రీ నంబర్ కర్నూలు (న్యూటౌన్): సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలపై ఫిర్యాదుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ను, మెయిల్ ఐడీని ఏర్పాటు చేసిందని జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ టి రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీచ్ల నుంచి ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 18005994599, మెయిల్ ఐడీ dmgapsandcomplaints@yahoo. comకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
No Headline
కూతురు రక్షితన ఎత్తుకుని ఉన్న ఈమె పేరు స్వర్ణలత. ఆళ్లగడ్డలోని డానియేల్ వీధికి చెందిన ఈమెకు భర్త రాజశేఖర్ ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. కూతురిని కార్పొరేట్ పాఠశాలలో చదివించాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ఈ క్రమంలో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నారని తెలుసుకుని ఆన్లైన్లోఽ దరఖాస్తు చేసుకోవడంతో తమ ఇంటి సమీపంలోని సెంట్ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సీటు వచ్చింది. ‘మాలాంటి ఎస్సీ నిరుపేదలకు ఇంతటి సాయం చేస్తున్న జగనన్నకు రుణపడి ఉంటాం’ అని ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. -
నాణ్యతతో పంపిణీ చేస్తాం
వేరుశనగ విత్తన కాయలను నాణ్యతతో పంపిణీ చేయనున్నాం. రెండు జిల్లాలకు సంబంధించి 10వేల క్వింటాళ్లు ప్రాసెసింగ్ చేసి 30 కిలోల బ్యాగ్లు కూడా సిద్ధం చేశాము. వర్షాలు పడుతుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా వేరుశనగను అందుబాటులో ఉంచుతాం. – ధనలక్ష్మి, మేనేజర్, ఏపీసీడ్స్, కర్నూలు, నంద్యాల కొరత తలెత్తనివ్వం ఈ సారి ముందస్తుగా వర్షాలు పడుతున్నందున వేరుశనగ సకాలంలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి జిల్లా కలెక్టర్ సృజన అనుమతి ఇచ్చారు. ఈ నెల 20 నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో కొరత తలెత్తనివ్వం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
సమ్మోహనం.. జగన్మోహిని రూపం
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశస్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడవీధుల్లో ఊరేగించారు.ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని శుక్రవారం ఇంటర్ విద్య జిల్లా అధికారిణి సునీత తెలిపారు. ఈనెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలకు దరఖాస్తులు అందజేయాలన్నారు. నెలాఖరులోగా తొలి విడత ప్రవేశాలను ముగించి వచ్చేనెల 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 57 ప్రైవేటు కళాశాలలు, 90 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయన్నారు. గత ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ కోర్సుల్లో 12,287 మందికి ప్రవేశాలు జరిగాయని, ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగిన నేపథ్యంలో కనీసం 15 వేలు తగ్గకుండా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పచ్చి మిర్చి @ 90 నంద్యాల(సెంట్రల్): పచ్చి మిర్చి ధర అమాంతం పెరిగింది. రెండు నెలల క్రితం కిలో రూ.45 ఉన్న పచ్చి మిర్చి ధర పది రోజుల క్రితం రూ.60కి చేరింది. శుక్రవారం నాటికి ఏకంగా రూ.90 చేరింది. దీంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. వేసవి కావడంతో సాగు తక్కువగా ఉండడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కాగా స్థానిక శ్రీనివాస్ నగర్, టెక్కే రైతు బజారులో కిలో రూ.84 అమ్ముతున్నారు. నిలకడగా ఎండుమిర్చి ధరలు నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం సూపర్–10 రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.17,500, మధ్యస్థ ధర రూ.13,000, కనిష్ట ధర రూ.9,500 గా నమోదైంది. ఇదే రకం తాలుకాయ జనరల్ గరిష్ట ధర క్వింటాలు రూ.6,500, మధ్యస్థ ధర రూ.5,600, కనిష్ట ధర రూ.5,000 గా పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ గోస్పాడు: స్థానిక మోడల్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ సిలబస్పై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం డీఈఓ సుధాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ యాజమన్యంలోని 69 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గణితం, పీఎస్, కెమిస్ట్రీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు మొదటగా ఈనెల 17, 18 తేదీల్లో, సోషల్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఈనెల 20, 21 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో పని చేసే ప్రతి ఒక్క సబ్జెక్టు ఉపాధ్యాయుడు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ బేగ్, కర్నూలు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఎంఈఓలు అబ్దుల్కరీం, సురేంద్రనాథ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కస్తూర్బాగాంధీ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, హైస్కూల్ హెచ్ఎంలు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాం
బొమ్మలసత్రం: ఎన్నికల ప్రక్రియలో జిల్లా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా విధులు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలకు తావులేకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో పౌరులకు వినియోగించుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి శాంతి భధ్రతలకు భంగం కలిగించకుండా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి 8,522 మంది అనుమానాస్పద వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, నగదు రవాణాలకు అడ్డుకట్ట వేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 324 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ కవాతు నిర్వహించి ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించామన్నారు. జిల్లాలోని అన్ని లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్యూఆర్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్లతో ప్రత్యేక గస్తీలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించారన్నారు. కానీ రెండు రోజులుగా ప్రముఖ దినపత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు ప్రచురించడం సమంజసం కాదన్నారు. ప్రజలకు – పోలీసు వ్యవస్థకు వారధిలా ఉండాల్సిన మీడియా.. నిరాధారమైన వార్తలు ప్రచురించడం భావ్యం కాదన్నారు. నిరాధారమైన వార్తలు రాయడం తగదు జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి -
ఖరీఫ్ సాధారణ సాగు వివరాలు...
పంట సాధారణ సాగు (హెక్టార్లలో) పత్తి 2,43,699 వేరుశనగ 58,969 కంది 25,557 ఆముదం 9,231 మిరప 29,998 ఉల్లి 15,698 వరి 12,771 ఇతర పంటలు 23,306 మొత్తం 4,19,219 -
నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోండి
నంద్యాల(న్యూటౌన్): తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో డీఎంఅండ్హెచ్ఓ, డీపీఓ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశమయ్యారు. వర్షాలు కురుస్తున్నందున తాగు నీరు కలుషితమై ప్రజలకు డయేరియా బారిన పడే ప్రమాదముందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి క్లోరినేషన్తో పాటు ట్యాంకులను శుభ్రం చేయించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, మున్సిపల్ అధికారులకు సూచించారు. పైపులైన్ల లీకేజీల మరమ్మతులు, పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రామతీర్థం, యర్రగుంట్ల గ్రామాల్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ, డీపీఓ మంజులవాణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 20 నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు
● ఉమ్మడి జిల్లాకు 16,379 క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు ● కర్నూలు జిల్లాకు 13,929, నంద్యాల జిల్లాకు 2,450 క్వింటాళ్లు ● పత్తికొండ సబ్ డివిజన్కు అత్యధికంగా 9,184 క్వింటాళ్లు ● వేరుశనగ కిలో ధర రూ.95, సబ్సిడీ 40 శాతం ● రైతులు చెల్లించాల్సిన ధర రూ.57 ● 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలుఆర్బీకేలకు తరలించేందుకు సిద్ధం చేసిన వేరుశనగ విత్తనకాయల ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): ముందస్తు వర్షాల నేపథ్యంలో విత్తనం సకాలంలో అందించేందుకు వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఖరీఫ్లో వర్షాధారం కింద సాగు చేసే పంటల్లో ప్రధానమైంది వేరుశనగ. సాధారణ సాగు 4,19,219 హెక్టార్లు. ముందస్తు వర్షాల నేపథ్యంలో రైతులు విత్తనాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే గత ఏడాది ఖరీఫ్లో పంపిణీ చేసిన వేరుశనగ కంటే ఈసారి తక్కువ కేటాయించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రితో చర్చించకుండానే ఏకపక్షంగా వేరుశనగ కేటాయించినట్లు తెలుస్తోంది. మామూలుగా గత ఏడాది పంపిణీని పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేపడతారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ 15,350 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ జరిగింది. ఈ సారి ముందస్తు వర్షాలు పడుతుండటం, రానున్న రోజుల్లో కూడా విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వేరుశనగకు డిమాండ్ ఏర్పడింది. ఈ సారి ఖరీఫ్లో వేరుశనగ సాధారణ సాగు 58,969 హెక్టార్లు ఉండగా.. కర్నూలు జిల్లాకు 13,929 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. జిల్లాకు మరో 5వేల క్వింటాళ్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపినా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల ధరలు, సబ్సిడీలు ఖరారు కావడంతో పంపిణీకి వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ముమ్మరంగా సాగుతున్న ప్రాసెసింగ్ రైతులకు సకాలంలో విత్తనం అందించే లక్ష్యంతో ఏపీసీడ్స్ ఆర్బీకేల వారీగా వేరుశనగ విత్తన కాయలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రైతులకు నాణ్యమైన వేరుశనగ అందించేందుకు ప్రాసెసింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కర్నూలులోని ఏపీసీడ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లాకు విత్తనాలు సరఫరా చేస్తోంది. ప్రయోగశాలల్లో నాణ్యతను నిర్ధారించిన వేరుశనగను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20 నుంచి సబ్సిడీ విత్తనాల కోసం సంబంధిత రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. 20 తర్వాత ఏ రోజు నుంచైనా పంపిణీకి వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ సిద్ధంగా ఉన్నాయి. 16,379 క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు ఉమ్మడి కర్నూలు జిల్లాకు 16,379 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించింది. కర్నూలు జిల్లాకు 13,929 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2,450 క్వింటాళ్ల ప్రకారం కేటాయింపులు చేపట్టారు. గత ఏడాది పంపిణీ అయిన వేరుశనగతో పోలిస్తే తక్కువే కేటాయించినప్పటికీ డిమాండ్ను బట్టి అదనంగా కేటాయించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఖరీఫ్ మొదలవుతుంది. ఈ సారి ముందస్తుగా వర్షాలు పడుతున్నందున ముందస్తుగానే వేరుశనగ వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సారి కొత్తగా టీసీజీఎస్ 1694 వేరుశనగ రకాన్ని సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. జిల్లాకు కేటాయించిన వేరుశనగలో కే–6 రకం 11,974, టీసీజీఎస్ 1694 రకం 1,250, కదిరి లేపాక్షి రకం 750 క్వింటాళ్లు కేటాయించింది. ● కర్నూలు జిల్లాలోని పత్తికొండ సబ్ డివిజన్లో 6 మండలాలు ఉండగా.. 9,184 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కర్నూలు సబ్ డివిజన్కు 800, ఆదోని సబ్ డివిజన్కు 1,570, ఎమ్మిగనూరు సబ్ డివిజన్కు 505, ఆలూరు సబ్ డివిజన్కు 1,870 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు. ● నంద్యాల జిల్లాలోని డోన్ సబ్ డివిజన్లో మాత్రమే వేరుశనగ సాగు అవుతుంది. ఈ డివిజన్కు 2,450 క్వింటాళ్లు కేటాయించారు. 40 శాతం రాయితీపై వేరుశనగ పంపిణీ జిల్లాకు ఈ సారి మూడు వేరుశనగ రకాలను కేటాయించారు. వేరుశనగ ధర, సబ్సిడీలు కూడా ఖరారు అయ్యాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గరిష్ట ధర రూ.6,800 నుంచి రూ.7,500 పలుకుతోంది. సగటు ధర రూ.6,699. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తన కాయలను 40 శాతం సబ్సిడీతో ఇస్తోంది. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ కిలో ధర రూ.95గా నిర్ణయించారు. ఏపీసీడ్స్కు ఎవరైతే వేరుశనగ సరఫరా చేస్తున్నారో ఆ కంపెనీలే ప్రాసెసింగ్ చేసి, 30 కిలోల బ్యాగులు సిద్ధం చేసి ఆర్బీకేల వారీగా సరఫరా చేయాల్సి ఉంది. సబ్సిడీ పోను రైతులు కిలోకు రూ.57 చెల్లించాల్సి ఉంది. 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వరి సాగు చేసే ప్రాంతాల్లో పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంటుంది. పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లి పెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. జిల్లాకు జీలుగ 197 క్వింటాళ్లు, పిల్లి పెసర 25 క్వింటాళ్లు కేటాయించింది. జీలుగ విత్తనాలు కిలో ధర రూ.88 ఉండగా.. సబ్సిడీ పోను రూ.44 చెల్లించాల్సి ఉంది. పిల్లి పెసర కిలో ధర రూ.134 ఉండగా.. సబ్సిడీ పోను రైతులు రూ.67 చెల్లించాలి. -
మొక్కలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
2024–25 సంవత్సరంలో పచ్చదనం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. పండ్లతోటల అభివృద్ధి ద్వారా దాదాపు 7.25 లక్షల పండ్ల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. ఈ ఏడాది ఉపాధి నిధులతో జలసంరక్షణ పనులు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అమృత్సరోవర్లు, మినీ అమృత్ సరోవర్లు, ఫాంపాండ్స్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మొక్కలు నాటడం, జలసంరక్షణ పనులు చేపట్టడం వల్ల జిల్లాను అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
ఇసుక అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు
కర్నూలు (న్యూటౌన్): పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక రీచ్లలో తవ్వకాలు చేయకూడదని, ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ టి రాజశేఖర్ హెచ్చరించారు. సి బెళగల్ మండలం పల్దొడ్డి గ్రామంలోని ఇసుక రీచ్ను గురువారం జిల్లా మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తరలింపుపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలిచ్చిందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక రీచ్లలో తవ్వకాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 15 రోజుల కిందటే ఇసుక రీచ్లలో తవ్వకాల పనులు ఆపేశారని చెప్పారు. అలాగే సి బెళగల్ మండలం కె సింగవరం వద్ద బోటు ద్వారా ఇసుకను తీసే ప్రదేశాన్ని తనిఖీ చేశామన్నారు. అక్కడే ఉన్న బోటులను వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తనిఖీల్లో జిల్లా మైనింగ్ విజిలెన్స్ ఏడీ బైరాగినాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ , రిజిస్ట్రార్ డాక్టర్ నాగుల అంకన్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం సెషన్లో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 9,803 మందికి 8,866, బీఈడీ మూడో సెమిస్టర్కు 3,306 మంది విద్యార్థులకుగాను 3,089 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో జరిగిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 60 మందికి 55 మంది, బీఈడీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1355 మందికి 12260 మంది విద్యార్థులు హాజరయ్యారని వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కాయ్.. రాజా.. కాయ్...!
పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొన సాగించారు. ముఖ్యంగా యువత కోసం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళలకు పలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేద వర్గాల ప్రజల కోసం ఇంత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే వారికి మేలు చేకూర్చింది. పోలింగ్ తీరును పరిశీలిస్తే ..మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈ ఓటు బ్యాంకు అంతా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.బస్సుల్లో, ఆటోల్లో, సెలూన్లలో, హోటళ్లలో.. ఇలా ప్రతి చోటా పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఏ నలుగురు గుమికూడినా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అభ్యర్థులకు వచ్చే మెజార్టీలు.. తదితర అంశాలపై తమకు తెలిసింది, అక్కడక్కడ విన్నది చెబుతున్నారు. పోలింగ్ జరిగిన తీరును బేరీజు వేసుకుంటూ పలువురు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. స్థాయిని బట్టి రూ. వేల నుంచి రూ. కోట్లలో బెట్టింగ్ కడుతున్నారు.సాక్షి, నంద్యాల/ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. దీంతో గెలుపోటములు, మెజార్టీలపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ధపా పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్ ప్రారంభానికి ముందుగానే క్యూలైన్లలో బారులుతీరి నిలబడి ఓర్పుతో ఓటెయ్యడం.. అందులో మహిళలు, వృద్ధులు ఉండటం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు గ్రామ, మండలాల వారీగా కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాలు, గ్రూపులు, వర్గాల వారీగా కూడా అంచనాలు వేసుకుంటూ ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఫలితాలకు సమయం ఉండడంతో ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్ల హవా నడుస్తోంది. స్థాయిని, మెజారిటీని బట్టి రేట్లు రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొందరు ‘మీ నియోజకవర్గంలో ఎలా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది.. ఎంత మేర మెజార్టీ రావచ్చు’ అని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులను, పరిచయస్తులకు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు. కొందరు నాయకులు చేసిన అబివృద్ధి, అభ్యర్థుల వ్యక్తిత్వం, వ్యతిరేకత, పంపిణీ చేసిన నగదు తదితర అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. జిల్లాలో అభ్యర్థుల మెజారిటీలతో పాటు ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే ప్రధానంగా పందేలు నడుస్తున్నాయి. వైఎస్సార్సీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని జోరుగా పందేలు కాస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా పందేలకు మాత్రం దూకుడుగా ముందుకు రావడం లేదని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.. ఎంపీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందన్న అంశాలే బెట్టింగ్ రాయుళ్లకు ప్రధానాంశాలుగా మారాయి. మెజారిటీ ఎక్కువగా వస్తుందని పందెం వేస్తే ఒకటికి మూడు, నాలుగు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపైనా... జిల్లాలో పందెం రాయుళ్ల హాట్ ఫేవరేట్గా పిఠాపురం నిలుస్తోంది. అక్కడ పోటీలో ఉన్న పవన్ కల్యాణ్, వంగా గీతలో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పందెం కాస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి పవన్కల్యాణ్ ఓడిపోవడంతో ఈ సారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా? లేక అలవాటైన రీతిలో ఓడిపోతారా? అని ఆరా తీస్తున్నారు. మంగళగిరి, హిందూపురం, కుప్పం స్థానాలపైనా పందేలు నడుస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతుందని పందెం కాయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. టీడీపీ వైపు ముందుకురాని పందెంరాయుళ్లు నంద్యాల జిల్లాలో వైఎస్సార్ సీపీ గెలిచే స్థానాలపై పందెం కాసేందుకు టీడీపీ అభిమానులు ముందుకు రావడం లేదు. 2014లో ఒక్క బనగానపల్లె మినహా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ గెలిచింది. 2019లో ఉమ్మడి జిల్లా క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఐదేళ్లలో సంక్షేమం ఇంటి ముంగిటకే రావడంతో ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. తాజాగా జరిగిన పోలింగ్లోనూ ఇదే అంశం ప్రస్ఫుటమైనట్లు భావిస్తున్నారు. దీంతో మరోసారి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనాలు ఉండడంతో పందెం కాయడానికి టీడీపీ వారు ముందుకు రావడం లేదని పంటర్స్ చెబుతున్నారు. మెజారిటీలపై.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ గెలుపు గ్యారంటీ అని, గత ఎన్నికలతో పోలిస్తే కాస్త మెజారిటీ అటు ఇటుగా ఉంటుందని.. మెజారిటీలపై పందెం కాయడానికి సిద్ధమని టీడీపీ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు పంటర్స్ చెబుతుండడం గమనార్హం. అలాగే డోన్ నుంచి ఈ సారి మంత్రి బుగ్గన హ్యాట్రిక్ సాధిస్తారని ఎక్కువ మంది పందెం కాయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, బనగానపల్లెలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మెజారిటీలపై జోరుగా పందేలు కాస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇద్దరి మధ్య పందెం సెట్ చేసి పెద్ద మత్తంలో పంటర్స్ కమీషన్ తీసుకుంటున్నారు. టీడీపీ నేతల మేకపోతు గాంభీర్యం ఓటమి తప్పదని తెలిసినప్పటికీ టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటి దాక భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ప్రచారం నిర్వహించుకున్నారు. నిన్నటి వరకు స్వల్ప మెజార్టీతో అయినా గెలుపు మాదే అంటున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీకి గతంలో వచ్చిన అంత మెజార్టీ రాదు తక్కువ మెజార్టీతో బయట పడొచ్చు అని చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ధైర్యం జిల్లాలో జోరుగా సాగుతున్న పందేలు పోలింగ్ ముగియడంతో గెలుపోటములపై బెట్టింగ్లు మరోసారి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న విశ్లేషకులు ఇరు పార్టీల మధ్య పందెం సెట్ చేసి కమీషన్ తీసుకుంటున్న మధ్యవర్తులు -
జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం
ఉపాఽధి పనుల్లో భాగంగా జలసంరక్షణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఊరూరా చేపట్టిన పనుల్లో 95 శాతం భూగర్భ జలాల అభివృద్ది, జలసంరక్షణ పనులే చేపడుతున్నారు. ఫీడర్ చానల్స్ల్లో పేరుకుపోయిన పూడిక తీయడం వల్ల వర్షపు నీరు చెరువుకు చేరుతుంది. ఉపాధి నిధులతో 50 అమృత్ సరోవర్లు, 960 మినీ అమృత్ సరోవర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చెరువులను అమృత్ సరోవర్లుగా, కుంటలు వంటి వాటిని మినీ అమృత్ సరోవర్లుగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లతో పూడిక తీయడం, కట్టలు బలోపేతం చేయడం చెరువు కట్టలపై మొక్కలు నాటడం వంటి పనులు చేపడుతారు. అలాగే 9,600 ఫాంపాండ్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. వీటితో పాటు పర్కులేషన్ ట్యాంకులు, మేజర్ కెనాల్స్, బౌండరీ ట్రెంచెస్ తవ్వకాల పనులు జరుగుతున్నాయి. ● మొక్కల పెంపకంపై జిల్లా నీటియాజమాన్య సంస్థ దృష్టి ● 200 కిలోమీటర్లలో అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్ ● 10,350 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనే లక్ష్యం ● ఉద్యమ తరహాలో జలసంరక్షణ పనులు ● అమృత్ సరోవర్లు, ఫాంపాండ్లకు ప్రాధాన్యత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఏడాది వరకు వేసవిలో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది అవి 47 డిగ్రీలు దాటాయి. ఇందుకు ప్రధాన కారణం పచ్చదనం లేకపోవడమేనని జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 200 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, గాజుల దిన్నె ప్రాజెక్టు వంటి వాటి పరిధిలో కెనాల్ ప్లాంటేషన్ కింద కిలోమీటరుకు 400చొప్పున 100 కిలోమీటర్ల మేర మొక్కలు నాటనున్నారు. మొత్తం 4 లక్షల మొక్కలు నాటే అవకాశం ఉంది. అలాగే అవెన్యూ ప్లాంటేషన్ కింద మరో 100 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. వీటిని సంరక్షించే బాధ్యత జిల్లా నీటియాజమాన్య సంస్థ తీసుకోనుంది. అంతేగాక ఇస్టిట్యూషనల్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆలూరు, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ, ఎమ్మిగనూరు మండలం బనవాసిలో నర్సరీలు ఉండగా.. అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్కు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీల నుంచి రైతులకు అవరమైన మొక్కలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండ్లతోటల అభివృద్ధి.. జిల్లాలో ఈ ఏడాది 10,350 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధ్దికి చర్యలు చేపట్టారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉండి, జాబ్ కార్డు కలిగిన రైతులందరూ పండ్లతోటల అభివృద్ధికి అర్హులే. ప్రస్తుతం అర్హులైన రైతులను ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. సాధారణంగా ఈ పాటికి జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతులు తీసుకోవడం, పిట్టింగ్ పనులు చేపట్టడం జరిగేది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా పరిపాలనా అనుమతులు తీసుకునే ప్రక్రియ మొదలు కాలేదు. అయితే పండ్లతోటల అభివృద్ధిపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే 4,000 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధ్దికి అర్హులైన రైతులను గుర్తించారు. మామిడి, సపోట, జామ, దానిమ్మ, డ్రాగన్ప్రూట్స్, చీనీ, నిమ్మ ఇలా అన్ని రకాల పండ్లతోటలు 100 శాతం సబ్సిడీతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఎకరాకు సగటున 70 మొక్కలు నాటుతారు. పండ్లతోటల అభివృద్ధి ద్వారా 7.25 లక్షల మొక్కలు నాటే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భగ్గుమన్న మండు టెండలు ప్రజలను భయపెట్టాయి. పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండటంతో మొక్కలు నాటే కార్యక్రమంపై జిల్లా నీటియాజమాన్య సంస్థఽ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం కెనాల్, అవెన్యూ ప్లాంటేషన్ను విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. అంతేకాకుండా వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. -
సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూంల పర్యవేక్షణ
పాణ్యం: ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. గురువారం స్ట్రాంగ్ రూంలను వారు తనిఖీ చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీ ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లుపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దంచికొట్టిన వాన జూపాడుబంగ్లా: మండలంలోని పారుమంచాల, తాటిపాడు, జూపాడుబంగ్లా, తంగడంచ, తూడిచెర్ల తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. 45 నిమిషాల పాటు కురిసిన వర్షం దాటికి పారుమంచాల గ్రామశివారులోని నల్లవాగు ప్రవహించింది. చెక్డ్యాంలు, కుంటల్లో వర్షం నీరు చేరింది. పొలాలు పదునెక్కడంతో దుక్కులు ప్రారంభించి రైతులు ఖరీఫ్కు సన్నద్ధమవుతున్నారు. మొదటిరోజు ఈఏపీ సెట్కు 65మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్కు గురువారం మొదటి రోజు 65 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 100 మందికి 98 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 99 మందికి 93మంది హాజరయ్యారు. అలాగే శ్రీరామకృష్ణ పీజీ కాలేజీలో ఉదయం జరిగిన పరీక్షకు 170 మందికి 152 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 169 మందికి 161 మంది, ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 360 మందికి 346 మంది , మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 358 మందికి 341 మంది హాజరయ్యారు. విద్యార్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోగా.. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించారు. -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులునంద్యాల(న్యూటౌన్): ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని రిటర్నింగ్, నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహించే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండాలన్నారు. ఇందుకు 760 మంది సిబ్బంది అవసరం అవుతారని, వారిని సిద్ధం చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాతనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలన్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ పద్మజ, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్
నంద్యాలటౌన్: క్షయ వ్యాఽధి నిర్మూలన కోసం 18 ఏళ్లు పైబడిన వయోజనులకు గురువారం నుంచి అన్ని సచివాలయాల్లో బీసీజీ టీకా వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సచివాలయాల వారిగా సీహెచ్ఓలు, ఆశా, ఏఎన్ఎం, టీబీ చాంపియన్లు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన సర్వేలో ఐదేళ్ల నుంచి టీబీ మందులు వాడి వ్యాధి నయమైనవారు, టీబీ వ్యాధిగ్రస్తులకు, షుగర్ పేషంట్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి సచివాలయాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం బీసీజీ టీకాలను వేస్తామన్నారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. టీకా వేయించుకున్న వారిని ఆశా, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారన్నారు. -
మామిడి ధరకు రెక్కలు
● దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు ● 100 పండ్ల ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలు బేతంచెర్ల: పండ్లలో మధు రాజ ఫలంగా పేరుగాంచిన మామిడి పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలు రెట్టింపయ్యాయి. ఫలింగా సామాన్యుడు కొని తినలేని పరిస్థితి దాపురించింది. మండలంలోని ముద్దవరం, యంబాయి, ముసలాయిచెర్వు, గూటుపల్లె, ఆర్ఎస్ రంగాపురం, కొలుములపల్లె, శంకలాపురం, మండ్లవానిపల్లె, రుద్రవరం గ్రామాల్లో మామిడి తోటలు ఉన్నాయి. యంబాయి గ్రామ పరిసరాల్లో సాగయ్యే మామిడి పండ్లకు మంచి పేరుంది. ఇక్కడ బేనిషాన్, మలగుబా, రెడ్డిపసంద్, సువర్ణ సుందరి రకాలు కూడా లభిస్తాయి. ఈఏడాది పూత లు బాగానే వచ్చినా వాతావరణంలో మార్పుల కారణంగా పూత, పిందె రాలిపోవడంతో దిగుబడి మీద ప్రభావం చూపింది. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడులు రావాల్సిన మామిడి.. ఈ ఏడాది ఒకటిన్నర టన్నుకు మించి రావడం లేదు. ఫలితంగా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సరైన వర్షాలు లేక పోవడంతో పాటు డిసెంబర్, జనవరి నెలలో పూత రావాల్సిన మామిడి తోటలు ఆలస్యంగా ఫిబ్రవరిలో పూత వచ్చి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పూత, పిందెలు రాలిపోయాయి. దీంతో మామిడి తోటలు కొనుగోలుచేసిన రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. రూ.లక్షలు పెట్టి మామిడి తోటలు కొనుగోలుచేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అరకొరగా వచ్చిన దిగుబడులను పక్వానికి రాకముందే ధర బాగా ఉందనే కారణంతో మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 100 పండ్ల ధరలు సైజ్ను బట్టి రూ. 4వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఆకాశాన్నటుంతున్న ధరలను చూసి సామాన్యులు కొని తినలేని పరిస్థితి దాపురించింది. -
స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రత
నంద్యాల: పట్టణ శివారు ప్రాంతం పాణ్యం మండలం నెరవాడ గ్రామం సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీసీ టీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునెలా పార్టిషన్ చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈని, విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్లను ఏర్పాటు చేయాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. కాలేజీలో ఉన్న లైబ్రరీ హాలులో మీడియా రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మజ, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు. -
జగమేలు నాయక.. జగదానంద కారక
● వైభవంగా నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో నృరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలంలో యోగా నృసింహ గారుడ వాహనముపై దేదీప్యమానంగా వెలుగొందిన లక్ష్మీనారసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం తెల్లవారు జామునే మూలమూర్తి జ్వాలనరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్లను మేలుకొలిపి, సుప్రభాత సేవ, నిత్యపూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలనరసింహ స్వామి ఉభయ దేవేరులతో ప్రత్యేకాలంకరణ గావించిన యోగానంద గరుడ విమాన వాహనంలో కొలువై ఆస్థాన విధ్వాంసుల మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. నేటి నుంచి ఈఏపీ సెట్ ● జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ నంద్యాల(న్యూటౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీఈఏపీసెట్)–2024 గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న పరీక్షలకు అధికారులు రామకృష్ణ డిగ్రీ, పీజీ, ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలను కేంద్రాలుగు ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అగ్రికల్చరల్ ఫార్మసీ(బైపీసీ) విద్యార్థులకు ఈనెల 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీమ్(ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్కు 5,478 మంది, అగ్రికల్చల్ ఫార్మసీకి 2,517 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజు రెండు సెషన్స్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నేడు సీడీసీ డీన్లతో సమీక్ష కర్నూలు కల్చరల్: విజయవాడలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్లతో గురువారం యాప్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల అఫ్లియేషన్ అంశంపై చర్చించనున్నారు. శుక్రవారం వర్సిటీల అకడమిక్ అఫైర్స్ డీన్లు, పరీక్షల విభాగం డీన్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లతో సమీక్షిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలండర్, పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయం నుంచి సీడీసీ, అకడమిక్ అఫైర్స్, ఎగ్జామినేషన్స్ డీన్లు పాల్గొననున్నారు. 17న ఉరుకుందలో వేలం పాటలు కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 17న వివిధ వ్యాపారాల లైసెన్స్ కోసం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్, ట్రస్టుబోర్డు చైర్మన్ నాగరాజ్గౌడ్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. 18న స్వామివారి హుండీ ఆదాయం లెక్కించనున్నట్లు తెలిపారు. -
వికసిస్తున్న ‘సిరి’మల్లె
మల్లె పూలు సువాసన వెదజల్లడమే కాదు ఎంతో మందికి సిరులు కురిపిస్తున్నాయి. పూలు తెంపడంతోపాటు ప్యాకింగ్, రవాణా తదితర పనులతో వందల మందికి ఉపాధినిస్తున్నాయి. ప్రధానం వాణిజ్య పంటగా గుర్తింపు పొందిన మల్లె పూలు మండల పరిధిలో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోంది. జనవరి నుంచి దిగుబడులు ప్రారంభమై ఆగస్టు నెల వరకు పంట చేతికి వస్తుంది. ఈ 8 నెలల పాటు పలువురికి ఉపాధి లభిస్తోంది. మల్లెపూలు తెంపుతున్న కూలీలు చాగలమర్రి మండీలో కుప్పగా పోసిన మల్లెపూలుకూలీల కొరత ఉంది మల్లె పూల సాగు కష్టంతో కూడుకొని ఉంది. పూలు కోయటానికి కూలీలు దొరకడం కష్టం. సీజన్ మొదలయ్యే సమయానికి ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో కూలీలు పనికి రావడానికి భయపడుతారు. ఎక్కువ మంది రైతులు పూల సాగు చేపట్టడంతో అందరికీ ఒకేసారి కూలీల అవసరం ఏర్పడటం కూడా కూలీల కొరతకు కారణమవుతోంది. ఒక్కోసారి ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల నుంచి కూడా కూలీలను ఆటోలలో తెచ్చుకుంటుంటాం. – మహబూబ్ షరీఫ్, రైతు చాగలమర్రి రూ.3 లక్షల ఆదాయం రెండు ఎకరాల్లో నాలుగేళ్లుగా మల్లె పూల సాగు చేస్తున్నాను. ఎకరాకు ఏటా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తోంది. 60 నుంచి 70 శాతం కూలీ, ఎరువులు, క్రిమి సంహారక మందులకు పోనూ 20 నుంచి 30 శాతం ఆదాయం మిగులుతుంది. – షేక్ షరీఫ్, రైతు, ముత్యాలపాడు గ్రామం ఉపాధి హామీలోకి చేర్చాలి మల్లె పూల సాగుకు కూలీల కొరత చాలా ఉంది. పూల తోటల పనులను కూడా ఉపాధి పనుల్లో చేర్చాలి. ఎరువులు, క్రిమి సంహారక మందులు, పూలు కోయటానికి కూలీలకు చెల్లించే కూలీ డబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పూల ధరలు మాత్రం మార్కెట్లో గిరాకీని బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. – ముల్లా ఖాదర్బాషా, కౌలు రైతు, చాగలమర్రి చాగలమర్రి: ఉద్యాన పంట అయిన మల్లె సాగుపై మండల రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండి నీటి తడుతులు ఇవ్వడం, ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందులు చల్లడం తదితర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రతి 10, 15 రోజులకు ఒకసారి పంటకు సాగునీరు అందివ్వడంతో పాటు దిగుబడి తగ్గకుండా నెలకు ఒక సారి ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తూ కాపాడుకుంటున్నారు. గతంతలో వాతావరణ మార్పులను బట్టి మొగ్గ దశలోనే పూలకు ఎర్రనల్లి తెగులు సోకేది. దీంతో పురుగు పూలను మొగ్గ దశలోనే కొరకడం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది. వ్యవసాయాధికారి సలహాలతో అవసరమైన క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేవారు. అయితే నాలుగేళ్లుగా జగనన్న ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఉద్యాన, వ్యవసాయ అసిస్టెంట్లను నియమించి, రైతులకు సలహాలు ఇస్తున్నారు. దీని వల్ల తెగులు బారిన పడిన పంటను రైతులు తక్కువ సమయంలోనే కాపాడుకోగలుగుతున్నారు. రైతుల నుంచి మండీ యజమానులు కొనుగోలు రైతుల నుంచి చాగలమర్రిలో ఉన్న పూల మండీల యజమానులు పూలను కొనుగోలు చేస్తారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉదయం 10.00 గంటలకు నిర్ణయించిన ధరతో కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలుకు రైతు నుంచి ప్రతి రూ.100కు 4 పైసల కమీషన్ను మండీల యజమానులు తీసుకుంటారు. మండీ యజమాని 10 పైసల కమీషన్కు హైదరాబాద్కు విక్రయిస్తాడు. ప్రతి పూల మండీలో అకౌంటెంట్ రైతులు తీసుకొచ్చిన పూలను తూకం వేసి, వారి ఖాతా పుస్తకంలో తూకంతో పాటు ధర నమోదు చేసి, మండీ ఖాతా పుస్తకంలో కూడా రైతుల పూల తూకం, ధర, డబ్బుల మొత్తం వివరాలను నమోదు చేస్తారు. హైదరాబాదుకు చెందిన పూల మండీ నిర్వాహకులు 10 రోజులకు ఒక సారి డబ్బు మొత్తాన్ని చాగలమర్రిలోని మండీలకు పంపిణీ చేయగా, వీరు అదే రోజు స్థానిక రైతులకు పంపిణీ చేస్తారు. రోజుకు 10 టన్నుల దిగుబడి మండల పరిధిలో సాగు చేస్తున్న 2,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి రోజు సుమారు 10 టన్నుల మేర పూల దిగుబడి వస్తోంది. ఈ దిగుబడిని చాగలమర్రి పట్టణంలోని 4 పూల మండీల యజమానులు సేకరిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తారు. థర్మోకోల్ బాక్సులలో కేజీ పరిమితి ఐస్ గడ్డలు ప్లాస్టిక్ కవర్లలో వేసి ఒక్కో బాక్సులో 10 నుంచి 15 ఐస్ కవర్లు వేసి వాటి మధ్యలో 30 నుంచి 50 కేజీల పూల బాక్సును ఉంచి ప్రతిరోజు బొలేరో వాహనాల్లో హైదరాబాదుకు తరలిస్తారు. తెంపిన 6 గంటల్లోపే గుడిమల్కాపూర్ పూల మార్కెట్టుకు తరలిస్తారు. 1 కేజీ మల్లెపూల ధర రూ.150 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. పూల తరలింపులో ఆలస్యమైతే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. పూలు తరలించే వాహనానికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు మండీ యజమాని అద్దె చెల్లిస్తాడు. కుటీర పరిశ్రమగా అభివృద్ధి మల్లెపూల సాగు చాగలమర్రిలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. పూలను విడిగా అమ్మడం ఒక ఎత్తైతే, పూలను అల్లి కూడా ఎగుమతి చేయడం మరోఎత్తు. పూల అల్లకం కోసం మండీ యజమానులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏంజెంట్లకు 1 కేజీ పూల అల్లకానికి రూ.60 కూలీ చెల్లిస్తారు. ప్రతి రోజు 100 నుంచి 150 కేజీల విడి పూలను మండీ నుంచి తీసుకొని, 250 గ్రాముల బరువుతో ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తారు. ఈ ప్యాక్ చేసిన పూల పొట్లాలను మోటారు సైకిల్పై మధ్యాహ్నం 1 గంటకు వీధుల్లో పూలు అల్లే గృహిణులకు ఒక్కో ఇంట్లో 10 నుంచి 15 ప్యాకెట్ల పూలను పంపిణీ చేస్తారు. ఒక్కో పాకెట్ పూలు అల్లినందుకు రూ.10 చెల్లిస్తారు. అంటే సగటున 1 కేజీకి రూ.40 కూలీ చెల్లిస్తారు. ఏజెంటుకు రూ.20 కమీషన్ లభిస్తుంది. ఇలా ఏజెంటుకు ప్రతి రోజు పూల తూకాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ వస్తుంది. అల్లిన పూలను తిరిగి సాయంత్రం 6.00 గంటలకు తీసుకెళ్లి మండీ వారికి అప్పగిస్తారు. ఒక ఇంట్లో ఐదుగురు, ఆరుగురు, నలుగురు ఉంటే ఇంట్లోనే ఉంటూ ప్రతి రోజు ఒక్కొక్కరు రూ.300 నుంచి రూ.500 వరకు ఆదాయం పొందుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థినులు ఇళ్ల వద్దే ఉంటూ వారి తల్లులకు సాయం చేస్తున్నారు. ఇలా చాగలమర్రిలో మల్లె పూల సాగు వల్ల రైతులతో పాటు పూలు కోసే కూలీలకు, ప్యాకింగ్ చేసే యువకులకు, ఎగుమతి చేసే వాహనదారులకు, ఏజెంట్లకు, గృహిణులకు ఉపాధి లభిస్తోంది. వాణిజ్య పంటగా మల్లెపూల సాగు మండలంలో 2,500 ఎకరాల్లో సాగు రోజుకు 10 టన్నుల దిగుబడి 8 నెలల పాటు కాపు హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలింపు కూలీలకు చేతినిండా ఉపాధి కుటీర పరిశ్రమగా మల్లె పూల అల్లకం -
ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి
శ్రీశైలం: ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఈఓ పెద్దిరాజు కోరారు. బుధవారం ఆయన దేవస్థానం పరిపాలన విభాగంలో సత్రాల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులు వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులను తిని జంతువులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించరాదని ఆదేశించారు. ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ ఫోర్క్లు, ప్లాస్టిక్ కప్పులు తదితరవాటిని పూర్తిగా నిషేధించామన్నారు. మట్టి, స్టీల్, రాగి, గాజు పాత్రలను వినియోగించాలన్నారు. ఈ ఆదేశాలను క్షేత్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సత్రాల యజమానులు పాటించాలన్నారు. ఆయా సత్రాలకు వచ్చే భక్తులకు భోజనానికి అరటి ఆకులు, విస్తర్లు ఉపయోగిచాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ, శానిటేషన్, రెవెన్యూ ఏఈఓ మల్లికార్జున రెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, సెక్యూరిటీ విభాగం అధికారి అయ్యన్న, రెవెన్యూ సూపరింటెండెంట్లతో పాటు ఏపీఆర్వో శివారెడ్డి పాల్గొన్నారు. -
ఏవీ వర్సెస్ భూమా అఖిల
● ఆళ్లగడ్డలో మళ్లీ పురుడుపోసుకున్న ఫ్యాక్షన్ ● టీడీపీ నేతల నిర్వాకంతో ఆందోళనలో ప్రజలు సాక్షి, నంద్యాల: ప్రశాంతమైన పల్లెల్లో తెలుగుదేశం పార్టీ నేతలు చిచ్చు రగిలిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై హత్యాయత్నం జరగడంతో ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడం కోసం దాడులను ప్రోత్సహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పూ.. నిప్పులా ఏవీ, అఖిల ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఉప్పూ నిప్పులా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తమ ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి అక్రమంగా హస్తగతం చేసుకున్నాడని అఖిలప్రియ ఆరోపిస్తూ వస్తున్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో అడుగుపెడితే ఊరుకునేది లేదని బహిరంగంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆళ్లగడ్డలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అఖిలప్రియ సమక్షంలోనే ఏవీపై దాడి జరిగింది. అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ ఏవీ చొక్కా పట్టుకొని పక్కకు లాగేసి ముఖం మీద పిడిగుద్దులు కురిపించడంతో సుబ్బారె డ్డికి రక్త గాయాలయ్యాయి. లోకేష్ ఉండగానే పరస్పరం ఘర్షణలకు పాల్పడడంతో ఇద్దరిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఎన్నికలు ముగిసే వరకు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుబ్బారెడ్డి నంద్యాలకే పరిమితమయ్యారు. ఆళ్లగడ్డలో అడుగు పెడితే బాగోదు.. యువగళం ఘటన నాటి నుంచి ఏవీ, అఖిలప్రియ ఎదురుపడే సందర్భం రాలేదు. ఈ ఫిబ్రవరిలో ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా.. కదలి రా సభలో పాల్గొనేందుకు ఏవీ ప్రయత్నం చేశారు. సభకు ఏవీ హాజరైతే తీవ్రంగా స్పందిస్తానని అఖిలప్రియ బహిరంగంగానే హెచ్చరించింది. మరోవైపు ఆళ్లగడ్డకు రావొద్దు అనడానికి ఆమె ఎవరంటూ ఏవీ ప్రశ్నించడంతో పాటు సభకు హాజరవుతానని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముంగింట్లో పార్టీలోని నేతలు గొడవలకు పాల్పడితే పార్టీ పరువు బజారున పడుతుందని భయపడిన ఆ పార్టీ నేతలు ఏవీకి సర్ది చెప్పి సభకు రాకుండా ఆపగలిగారు. పగతో రగిలిపోతున్న సుబ్బారెడ్డి అఖిలప్రియ వ్యవహారశైలితో ఏవీ సుబ్బారెడ్డి విసిగిపోయారు. ఆమె చర్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లుతుందని గ్రహించారు. మరోవైపు దాడి చేసిన వాడిని వదిలేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని అనుచరులు చెప్పడంతో తగిన బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి ఏవీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగియగానే పక్కా ప్రణాళికతో నిఖిల్పై దాడి చేశారు. అఖిలప్రియ ఇంటి వద్దే దాడి చేసి తమ జోలికి వస్తే తాము తీవ్రంగా స్పందిస్తామనే సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. తీవ్రంగా గాయపడిన నిఖిల్ నిఖిల్ కదలికలపై కొద్దిరోజులుగా రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది. భూమా అఖిల ఇంటి వద్దే నిఖిల్ను మట్టుబెట్టాలనే ఆదేశానుసారం బాధితునిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కారుతో ఢీకొట్టి తర్వాత ఒక్కసారిగా విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏ ఒక్కడూ ఊర్లో ఉండడు ఇది ఇలా ఉండగా పోలింగ్ రోజు సాయంత్రం రుద్రవరం మండలంలో అఖిల సోదరుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఏ ఒక్కడినీ వదిలిపెట్టేది లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మన సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కడూ ఊరిలో ఉండడు. ఊరిని వదిలించే బాధ్యత తీసుకుంటా. భూమా నాగిరెడ్డి రాజకీయాన్ని మళ్లీ చూస్తారు.. అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. తమ ఆధిపత్యం కోసం ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు రగిలిస్తూ ఉండడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశాజనకంగాఎండుమిర్చి ధరలు
నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. బుధవారం సూపర్–10 రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.17,200, మధ్యస్థ ధర రూ.14,000, కనిష్ట ధర రూ.9,500 గా నమోదైంది. ఇదే రకం తాలుకాయ జనరల్ గరిష్ట ధర క్వింటాలు రూ.6,300, మధ్యస్థ ధర రూ.5,700, కనిష్ట ధర రూ.4,500 పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోకుండా యార్డులోని ఽధ్రువీకృత వ్యాపారుల వద్ద సరకు అమ్ముకొని మంచి ధరను పొందాలని సూచించారు. -
వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం పట్టు పీతాంబారలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం అధిరోహించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కటాక్షించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement