పకడ్బందీగా బందోబస్తు | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా బందోబస్తు

Published Sat, May 4 2024 1:00 AM

పకడ్బందీగా బందోబస్తు

ఎర్రవల్లిచౌరస్తా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న ఎర్రవల్లి మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ రానున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ రితిరాజ్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఎస్పీ ఎర్రవల్లి మండల కేంద్రానికి చేరుకొని హెలిప్యాడ్‌, వీఐపీ పార్కింగ్‌, ట్రాఫిక్‌ రూట్లు, సభా స్థలానికి వెళ్లే దారులు, జనరల్‌ పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం బందోబస్తు పరంగా చేయాల్సిన ఏర్పాట్లను గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితిల్లో కూడా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. సభా ప్రాంగణం చుట్టూ ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ గుణశేఖర్‌, పదవ పటాలం కమాండెంట్‌ సాంబయ్య, డిఎస్పి సత్యనారాయణ, సాయిధదళ డిఎస్పీ నరేందర్‌, అలంపూర్‌ సిఐ రవిబాబు, ఆర్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement