-
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
చి‘వరి’కీ కష్టాలే..
పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. కళ్లెదుటే తడుస్తున్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెబ్బేరులోని మార్కెట్యార్డులో సుమారు రెండు వేల క్వింటాళ్లు, సూగూరులో 600 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి కేంద్రాలకు తీసుకొచ్చామని.. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకు చూపి నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయలేదని రైతులు ఆరోపించారు. కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. – పెబ్బేరు రూరల్ -
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
వనపర్తి: విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తేజస్ పవార్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎస్ శాంతకుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అమ్మ ఆదర్శ పాఠశాల, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 537 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 183 పాఠశాలల్లో మన ఊరు–మన బడి కార్యక్రమంలో సదుపాయాలు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో 317 పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులు గుర్తించి పనులు చేపడుతున్నట్లు వివరించారు. విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు అవసరమైన మేర వస్తం వచ్చిందని.. ఇతర సామగ్రి కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా కుట్టించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 42,681 విద్యార్థులకు యూనిఫాం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి యూనిఫాంలు సిద్ధం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అకాల వర్షాలకు తడిచి నష్టపోకుండా ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎంఆర్ సేకరణకు మిల్లర్లతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ పవార్ -
ఈ–శ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తిటౌన్: అసంఘటిత కార్మికులు ఈ–శ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. శుక్రవారం కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ–శ్రామ్ పోర్టల్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 16 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేసీ్త్రలు, ప్లంబింగ్, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, ఇటుక, చేనేత, కుమ్మరి, కమ్మరి, క్షౌ రవృత్తుల ఇలా ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు అర్హులని పేర్కొన్నారు. అనంతరం పోర్టల్కు సంబంధించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి.శ్రీలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.మోహన్ కుమార్ యాదవ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.బాలనాగయ్య, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రాజీయే రాజమార్గం.. రాజీయే రాజ మార్గమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో వచ్చే నెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై శుక్రవారం న్యాయవాదులు, పోలీసులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలని, సివిల్, ప్రీలిటిగేషన్, చెక్ బౌన్స్, బ్యాంకు, యాక్సిడెంట్, ఇన్స్యూరెన్స్, చిన్న చిన్న తగాదా కేసులపై దృష్టి సారించాని కోరారు. కార్యక్రమంలో ప్రధాన సివిల్ కోర్టు న్యాయమూర్తి వి.రజని, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి.శ్రీలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.మోహన్కుమార్యాదవ్, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన ఓట్ల పండుగ
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల సమయంలో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం వచ్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో సంస్థకు భారీ ఆదాయం సమకూరింది. చాలామంది ప్రజలు ఓట్లు వేయడానికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. సిబ్బందికి స్వీట్లు పంపిణీ లక్షే లక్ష్యంలో భాగంగా ఆర్టీసీ రీజియన్ అధిక ఆదాయం సాధించడంతో శుక్రవారం రీజియన్లోని డిపోల ఉద్యోగులు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి పాల్గొని ఉద్యోగులకు స్వీట్లు అందజేసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్షే లక్ష్యంలో ఈ నెల 14న అధిక ఆదాయం రావడంతో మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశామన్నారు. కార్మికుల కృషి ఫలితమే రీజియన్ మంచి ఆదాయం సాధించిందని, భవిష్యత్లో మరింత స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మీదుర్గ, శ్యామల, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. డిపోల వారీగా వచ్చిన ఆదాయం ఇలా.. (రూ.లలో) డిపో ఆదాయం మహబూబ్నగర్ 2,05,17,341 వనపర్తి 1,75,92,078 గద్వాల 1,48,22,933 కల్వకుర్తి 1,43,12,034 నారాయణపేట 1,32,16,980 నాగర్కర్నూల్ 1,31,58,317 అచ్చంపేట 1,29,87,379 షాద్నగర్ 1,22,27,375 కొల్లాపూర్ 1,05,87,464 కోస్గి 17,63,092 ఎన్నికల వేళ ప్రతిరోజు రూ.2 కోట్లకుపైగా ఆదాయం తిరుగు ప్రయాణంలో మరింత పెరిగిన రాబడి సిబ్బందికి అభినందనలు తెలిపిన ఆర్ఎం -
వేసవి శిక్షణకు గ్రహణం
జిల్లాలోని 6 మండలాల్లో కనిపించని క్రీడా శిబిరాలు వనపర్తి: జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుపై నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఈ నెల ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు నెలరోజుల పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లోని విద్యార్థులు, యువకుల ఆసక్తి మేరకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేసేందుకు శాట్ అనుమతించింది. అధికారులు ఎన్నికల హడావుడి పేరుతో చొరవ చూపకపోవటంతో రేవల్లి, పాన్గల్, వీపనండ్ల, చిన్నంబావి, కొత్తకోట, అమరచింత మండలాల్లో శిబిరాలు ఏర్పాటు కాలేదు. గతేడాది కలెక్టర్ తేజస్ పవార్ చొరవతో 17 వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటుకాగా.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సాకు చూపి అరకొరగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా.. కేవలం 8 మండలాల్లో శిబిరాలు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. శిబిరాలు ఏర్పాటు చేసిన మండలాల్లోనూ నేటికీ ఎలాంటి క్రీడా సామగ్రి పంపిణీ చేయలేదని క్రీడాకారులు చెబుతున్నారు. మంత్రి ఇలాఖాలోనూ.. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మూడు మండలాల్లోనూ ఒక్క వేసవి శిబిరం ఏర్పాటు చేయకపోవటం గమనార్హం. ఈ ప్రాంత క్రీడాకారులు కనీసం మాకు సమాచారం కూడా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 55 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదుగురు ఫిజికల్ డైరెక్టర్లు, 12 మంది ఆర్వీఎం కాంట్రాక్టు పీఈటీలు ఉన్నారు. జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. కేవలం 8 మాత్రమే వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేయటం శోచనీయం. ఇవీ నిబంధనలు.. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. శాట్ ద్వారా కోచ్కు గౌరవ వేతనం రూ.4 వేలు, శిబిరం నిర్వహించే మైదానం సిద్ధం చేసేందుకు రూ.వెయ్యి, క్రీడాకారులు గాయపడితే ఔషదాల కొనుగోలుకు రూ.500 చెల్లిస్తారు. మంత్రి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ.. దరఖాస్తులు రాలేదంటున్న అధికారులు దరఖాస్తులు రాలేదు.. జిల్లావ్యాప్తంగా వేసవి శిబిరాలు ఏర్పాటు చేశాం. రేవల్లి, పాన్గల్, వీపనండ్ల, చిన్నంబావి, కొత్తకోట, అమరచింత మండలాల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో ఏర్పాటు చేయలేదు. శిబిరాల నిర్వహణకు శాట్ నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. శిబిరాల నిర్వహణకు క్రీడా సామగ్రిని నిర్వాహకులే కొనుగోలు చేస్తే.. బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. గతేడాది కలెక్టర్ చొరవతో 17 శిబిరాలు ఏర్పాటుచేసిన మాట వాస్తవమే. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశాలకుగాను ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి (డే స్కాలర్స్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలకు జిల్లావాసులైన విద్యార్థులు అర్హులని, గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకూడదని వెల్లడించారు. 1వ తరగతిలో ప్రవేశాలకు 2018, జూన్ 1 నుంచి 2019, మే 31 మధ్యలో జన్మించిన వారై ఉండాలని.. జూన్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కార్యలయంలో సంప్రదించాలని సూచించారు. -
పుర ఖజానా ఖాళీ : చైర్మన్
వనపర్తిటౌన్: పురపాలికలో ఏ చిన్న పని చేద్దామన్నా.. ఖాజానాలో డబ్బులు లేవని స్థానిక పుర చైర్మన్ పుట్టపాగ మహేశ్ తెలిపారు. శుక్రవారం పుర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత చైర్మన్ గట్టుయాదవ్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని.. ఏ దస్త్రం ముట్టుకున్నా అవినీతి మరకే కనిపిస్తుందని ఆరోపించారు. లింగిరెడ్డికుంట షాపింగ్ కాంప్లెక్స్లో డబ్బాల ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారని.. లక్షాధికారులు, కార్లున్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి పేదలను విస్మరించారని మండిపడ్డారు. దుకాణదారులకు ఎందుకు ఇళ్లు కేటాయించారని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాకుండా అన్నింటికీ మున్సిపల్ నిధులు వాడి దొడ్డిదారిన సీఆర్లు ఇచ్చి బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
● నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాల్లో 2,36,094 మంది ఓటర్లు ఉండగా.. 1,60,394 మంది ఓటేశారు. 75,700 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 67.94 శాతం పోలింగ్ నమోదైంది. ● అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 339 పోలింగ్ కేంద్రాల్లో 2,47,729 మంది ఓటర్లు ఉండగా.. 1,61,301 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంకా 86,428 మంది ఓటుకు దూరంగా ఉండిపోవడంతో 65.11 శాతంగా నమోదైంది. ● కల్వకుర్తి అసెంబ్లీ పరిఽధిలో 271 పోలింగ్ కేంద్రాల్లో 2,44,405 మంది ఓటర్లు ఉండగా.. 1,77,226 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 67,179 మంది ఓట్లకు దూరంగా ఉన్నారు. 72.51శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ● కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 282 పోలింగ్ కేంద్రాల్లో 2,39,463 మంది ఓటర్లుండగా.. 1,55,917 మంది ఓటింగ్ వేశారు. 83,546 మంది ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ఇక్కడ 65.11శాతం నమోదైంది. ● వనపర్తిలో 307 పోలింగ్ కేంద్రాల్లో 2,73,863 మంది ఓటర్లుకు గాను 1,82,552 ఓట్లు పోల్ అయ్యాయి. 91,311 మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. 66.66శాతం నమైదెంది. ● అలంపూర్లో 291 పోలింగ్ కేంద్రాల్లో 2,40,063 మంది ఓటర్లకు గాను 1,77,780 మంది తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోగా.. 62,283 మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. దీంతో అక్కడ 74.06శాతం నమోదైంది. ● గద్వాల నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాల్లో 2,56,637 మంది ఓటర్లకు 1,92,300 మంది ఓటు వేశారు. ఇంకా 64,337 మంది ఓట్లు వేయలేదు. 74.93 శాతం నమోదు కావడంతో పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. ● మధ్య వయస్కులు, వృద్ధుల కంటే యువతే తక్కువగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. అంతే కాక గ్రామీణ, గిరిజన తండాల్లో ఓటర్లు అధికంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో తగ్గింది. పట్టణ ఓటర్లలో చాలా మంది ఓటేసేందకు ఇష్టపడలేదు. దీంతో పట్టణ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు గెలుపుపై ప్రభావం చూపనుంది. తగ్గిన పోలింగ్ ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అసక్తి నెలకొంది. -
జూరాలకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు కురవడంతో పాటు, ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నుంచి 125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డిబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. -
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది. -
మాటమార్చితే.. సహించం
వనపర్తి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వరిధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. సన్నాలకే ఇస్తామని మాట మార్చితే.. ఊరుకునేది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ విషయంపై స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తారని.. కొద్దిపాటి సన్నాలు సాగుచేసే రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ పాలకులు కొత్తరాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజకొంటామని, వరికి రూ.500, మక్కలకు రూ.330, చెరుకుకు రూ.850, పప్పుధాన్యాలకు రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్ ఇస్తామని, రైతుల ఓట్లు దండుకుని గెద్దెనెక్కిన తర్వాత కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో కలిసి నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్, బండారు కృష్ణ, నాయకులు ఆవుల రమేష్, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రణాళిక ఏదీ..?
మూడేళ్లుగా అంచనాలు లేకుండానే పంటల సాగు ● విత్తన రాయితీ ఎత్తివేయడంతో ప్రణాళికలు తయారు చేయని వ్యవసాయశాఖ ● ప్రభుత్వం మారినా.. దృష్టి సారించని వైనం ● విత్తనాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ విత్తన సంస్థలు ● ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయాలు రాష్ట్రస్థాయిలో కొనసాగుతోంది.. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంతో పాటు పంటల సాగులో సమతుల్యతకు సాగు ప్రణాళికలు దోహదపడేది. ప్రస్తుతం ప్రణాళికలు వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయంలోనే చేస్తున్నారు. మెట్ట పంటల సాగు తగ్గడానికి ప్రధాన కారణం సాగునీటి లభ్యత పెరగడం. తక్కువ శ్రమతో సాగయ్యే పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. – చంద్రశేఖర్, ఇన్చార్జ్ డీఏఓ, వనపర్తి వనపర్తి: దశాబ్దాలుగా కొనసాగుతున్న సాగు ప్రణాళికలకు వ్యవసాయశాఖ చెల్లుచీటి ఇచ్చేసింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేసిన నాటి నుంచి విత్తన రాయితీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించిన వ్యవసాయశాఖ జిల్లాల వారీగా ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో తయారు చేయాల్సిన సాగు ప్రణాళిక (పంటల వారీగా సాగుచేసే అంచనా వివరాలు)కు నీళ్లొదిలింది. దీంతో జిల్లాకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా.. వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వరంగ విత్తనాభివృద్ధి సంస్థలు గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లో సాగైన పంటల ఆధారంగా విత్తనాలు సిద్ధం చేయడం.. ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతోపాటు ఆర్కేవీవై లాంటి రైతులకు వ్యవసాయ సామగ్రి ఇచ్చే పథకానికి రైతుబంధు పథకం అమలుతో చెక్ పడినట్లయింది. ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పథకం నిధులు సైతం ఆగిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆర్నెల్లు గడుస్తున్నా.. ఈ విషయంపై పాలకులు దృష్టి సారించకపోవడంతో ప్రస్తుత వానాకాలం సీజన్లోనూ సాగు ప్రణాళిక తయారు చేయలేదని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో నాలుగేళ్లుగా వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది పంటలు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతేడాది 2.39 లక్షల ఎకరాలు.. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.39 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ ఇదివరకే గణాంకాలు వెల్లడించింది. ఇందులో వరి 1.83 లక్షలు, మొక్కజొన్న 12,077, జొన్న 1,455, పత్తి 20,989, కంది 6,190, ఆముదం 8,87, చెరుకు 1,347 ఎకరాలు సాగు చేయగా.. మిగిలిన విస్తీర్ణంలో వేరే రకాల పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు.. జిల్లాలో ప్రతి ఏటా మెట్టపంటల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. నూనె, పప్పుగింజల పంటల సాగు తగ్గడం, వాటి స్థానంలో వరి సాగు పెరుగుతుండటం గమనార్హం. అన్ని రకాల పంటల సాగుపై ఏటా రైతులకు అవగాహన కల్పించే రైతు చైతన్య సదస్సులు సైతం నిర్వహించకపోవటం గమనార్హం. -
విద్యార్థులకు కలెక్టర్ అభినందన
వనపర్తి: షెడ్యూల్డు కులాల వసతిగృహాల్లో ఉంటూ.. పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అభినందించారు. ఫలితాలు వెల్లడైన సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఒత్తిడిలో విద్యార్థులను ప్రోత్సహించలేకపోయానని భావించిన కలెక్టర్, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకించి పిలిపించుకుని తన ఛాంబర్లో అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కొనసాగించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో పాటు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుషిత, సిబ్బంది పాల్గొన్నారు. స్కాలర్షిప్కు దరఖాస్తుల స్వీకరణ వనపర్తిటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్స్, పీహెచ్డీ రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31వ, తేదీలోగా overseas.triba l.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన అవగాహనతోనే డెంగీ నివారణ వనపర్తి: సరైన అవగాహన ఉంటేనే డెంగీ నివారణ సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు. గురువారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డెంగీని పారదోలేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు వాడే వారు ఎప్పటికప్పుడు అందులో నీటిని మారుస్తూ.. శుభ్రపరుచుకోవాలని చెప్పారు. పగటి పూట కుట్టే దోమలతోనే డెంగీ వచ్చే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
దాహం తీరినట్లే..!
నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలుప్రభుత్వం చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసింది. వేసవిలో ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి ఇబ్బందులు కలుగకుండా జూరాలలో నీటి నిల్వను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం జూన్ చివరి నాటికి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ అమరచింత: ఉమ్మడి పాలమూర్ జిల్లా వ్యాప్తంగా తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు జలాశయం రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అడిగిన రెండు టీఎంసీల నీటిని ఇవ్వలేమని, ప్రస్తుతానికి 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. దీంతో ఐదు రోజుల నుంచి నెమ్మదిగా జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటితో రోజురోజుకు ఇన్ఫ్లో పెరిగిపోతుండటంతో ఇక వేసవిలో తాగునీటి కష్టాలు గట్టెక్కినట్లేనని అధికారులు తెలియజేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు తాగునీటితో పాటు సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అందించే ప్రాజెక్టుగా పేరుగాంచింది. కాని వరదలు వచ్చినప్పుడు అత్యధికంగా నీటిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కేవలం 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితులు దాపురించాయి. జూరాలపై ఆధారపడిన తాగునీటి పథకాలు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. రామన్పాడ్ రిజర్వాయర్తో పాటు జూరాల ప్రాజెక్టుతో మొత్తంగా 17 తాగునీటి పథకాలకు నిత్యం నీటిని అందిస్తున్నారు. ఆత్మకూర్, అమరచింత, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, షాద్నగర్కు తాగునీటిని అందించే పథకాలను వీటిపై ఏర్పాటు చేశారు. ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు జూరాల నుంచి ఆయకట్టుకు కేవలం వారబంది ద్వారా పంటల సాగుకు నీటిని అందిస్తున్నారు. గతేడాది వర్షాలు అనుకున్న విధంగా కురవకపోవడంతో యాసంగిలో జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినా తాగునీటిని వేసవి పూర్తినాటికి అందిచలేమని గ్రహించిన ప్రాజెక్టు అధికారులు, విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎగువన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు తాగునీటి అవసరాలకు నీటిని నారాయణపూర్ డ్యాం ద్వారా విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు వేసవి కాలం పూర్తయ్యే నాటికి నీటిని అందించాలనే ఉద్దేశంతో సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమస్యను నివేదించాం. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా.. 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మక్తల్ ప్రభుత్వం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక నారాయణపూర్ నుంచి జూరాలకు 1.9 టీఎంసీల నీటి విడుదల జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో -
ఓటుకు దూరం
5,30,783 మంది..సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట: ప్రజాస్వామ్యానికి ఓటే ఆక్సిజన్.. సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవడంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటింది. ఎంతటి మహామహులనైనా, ఎంతటి రాజకీయ అనుభవం కలవారైనా.. ప్రజలకు నచ్చకుంటే వారి తిరస్కారానికి గురికాక తప్పదు. అంతటి విలువైన ఓటు హక్కును చాలా మంది ఓటర్లు పలు కారణాలతో వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం ఐదు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. లోక్సభ ఎన్నికల నాటికి సుమారు పదిశాతం మేర ఓటింగ్ తగ్గడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో ఓటువేయని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్పంచ్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓటర్లు, లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఎన్నికల సంఘం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఓటుహక్కు వినియోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 69.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇంకా 30.54 శాతం మంది ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు సోమవారం జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 11శాతం మేర పోలింగ్ తగ్గింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,057 పోలింగ్ కేంద్రాల్లో 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం జరిగిన పోలింగ్లో 12,07,471 మంది ఓటింగ్లో పాల్గొనగా.. ఇందులో 6,13,085(70శాతం) మంది పురుఘులు, 5,94,367(68.06శాతం) మంది మహిళలు, 19 మంది ఇతరులు ఉన్నారు. మిగతా 5,30,783 మంది ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఓట్ల శాతం ఇలా.. నియోజకవర్గం 2018 2019 2023 2024 అసెంబ్లీ లోక్సభ అసెంబ్లీ లోక్సభ నాగర్కర్నూల్ 75.62 61.78 78.66 67.94 అచ్చంపేట 74.96 58.92 80.03 65.11 కల్వకుర్తి 84.05 66.60 83.26 72.51 కొల్లాపూర్ 70.15 56.16 81.42 65.11 వనపర్తి 80.83 60.91 77.72 66.66 అలంపూర్ 72.16 66.98 82.80 74.06 గద్వాల 71.95 66.30 83.12 74.93 చేరుకోని లక్ష్యం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో 70 నుంచి 80శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసినా లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తం ఓటర్లు 17,38,254, ఓటేసింది 12,07,471 మంది ఐదు నెలల వ్యవధిలోనే అనాసక్తి 2023 అసెంబ్లీ ఎన్నిలతో పోలిస్తే 11 శాతానికి పైగా తగ్గిన పోలింగ్ -
పీయూ భవనాల పనుల్లో వేగం పెంచాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో చేపట్టిన భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐడబ్ల్యూఐడీసీ డైరెక్టర్, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు ఆదేశించారు. బుధవారం పీయూలో జిల్లా ఈడబ్ల్యూఐడీసీ, విద్యాశాఖ, పీయూ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పీయూలో చేపట్టిన భవనాల నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అగ్రిమెంట్ ప్రకారం భవనాలను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాల్సిందేనని తెలిపారు. భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులకు ఎటువంటి ఇబ్బందులు లేవని.. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారని.. త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో భవనాల పనులను పూర్తిచేసి, పీయూ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ప్రతిపాదనలపై సమీక్ష చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని.. నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీటీగుట్ట పాఠశాలలో చేపట్టిన ‘మనబస్తీ – మనబడి’ పనులను పరిశీలించారు. మూత్రశాలలు, తరగతి గదుల నిర్మాణంతో పాటు గతంలో కాంట్రాక్టర్లు నిర్మించకుండా వదిలేసిన వాటిని కలెక్టర్ అనుమతితో అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలోకి మార్చాలని డీఈఓ రవీందర్కు సూచించారు. ● పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు నిధుల విషయంలో సహకారం అందిస్తున్నామని.. సకాలంలో భవనాలు పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ పరంగానూ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భవనాల పనులను సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ అనిల్, రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఐడబ్ల్యూఐడీసీ, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు -
నేటినుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పీయూ పరిధిలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 2వ సెమిస్టర్లో 25,575 మంది, 4వ సెమిస్టర్లో 16,902 మంది, 6వ సెమిస్టర్లో 13,751 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని.. నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. -
కొలతల ప్రకారం పనులు చేయాలి
పాన్గల్: కొలతల ప్రకారం పనులు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందని ఏపీడీ సయ్యద్ సుల్తాన్ అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీల హాజరు, పని ప్రదేశంలో వసతులు, కూలి చెల్లింపు తదితర వివరాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచాలని, రైతులకు ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 వరకు పనులకు వచ్చి మధ్యాహ్నం 12 లోపు ముగించాలని సూచించారు. అలాగే నర్సరీల్లోని మొక్కలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా రోజు నీటిని అందించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు తండాలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఆయన వెంట టీఏ సునీత, పంచాయతీ కార్యదర్శి నర్మద, ఫీల్ట్ అసిస్టెంట్ సోమ్లా ఉన్నారు. ఉల్లి క్వింటా రూ. 2,600 దేవరకద్ర: కొన్ని రోజుల కిందటి వరకు రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు ఉన్న ఉల్లి ధరలు.. రెండు వారాల నుంచి ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం దిగుబడులు తగ్గి, సీజన్ ముగుస్తున్న క్రమంలో ఉల్లి ధరలు రెండింతలు పెరిగాయి. దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వ్యాపారులు వేలం లేకుండానే నేరుగా కొనుగోలుచేశారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ. 2,600, కనిష్టంగా రూ. 2,200 ధర పలికింది. తూకం చేసిన ఉల్లిని అప్పటికప్పుడు 45 కేజీల బస్తాల్లో నింపి, రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు విక్రయాలు సాగించారు. ఇక చిన్నపేడు ఉల్లి బస్తాలను రూ. 600 నుంచి రూ. 500 వరకు విక్రయించారు. కాగా, కొందరు రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలను పెట్టుకొని అమ్ముకున్నారు. నాణ్యమైన ఉల్లి బస్తా ధర రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు అమ్మకాలు సాగించారు. రూ. 2,319 పలికిన సోనామసూరి ధాన్యం దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 2,319, కనిష్టంగా రూ. 2,062 ధర పలికింది. మార్కెట్కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
దోస్త్ అడ్మిషన్లు షురూ..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2024–25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకుగాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈ మేరకు ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు మొదటి దశ వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 92 డిగ్రీ కళాశాలలు ఉండగా.. 31,090 సీట్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల అనంతరం మొదటి దశ సీట్ల అలాట్మెంట్ జూన్ 6వ తేదీన చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకుగాను మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు దరఖాస్తుకు గడువు పలు ప్రభుత్వ కళాశాలల్లో కొత్త కోర్సులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం ఎంవీఎస్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పీయూ పరిధిలో 92 కళాశాలలు.. 31,090 సీట్ల భర్తీకి అనుమతి జాగ్రత్తలు పాటించాలి.. దోస్త్ అడ్మిషన్ తీసుకునే క్రమంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీసేవ కేంద్రాల నిర్వాహకులపై పూర్తిగా ఆధారపడవద్దు. ఆప్షన్ ఇచ్చుకునే కళాశాల, కోర్సుల విషయంలో అవగాహన ఉండాలి. విద్యార్థి తన ఫోన్ నంబర్ను మాత్రమే ఎంటర్చేసే విధంగా చూసుకోవాలి. కొత్త కోర్సులను ఉపాధి ఆధారితంగా ఉండేవిధంగా ప్రభుత్వం రూపొందించింది. – మధుసూదన్రెడ్డి, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ -
No Headline
కొల్లాపూర్: కృష్ణానదిలో మత్స్యసంపద దోపిడీకి గురవుతోంది. నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో నిషేధిత అలవి వలలతో చేప పిల్లలను పట్టే మత్స్యకారులు రంగంలోకి దిగారు. నదిలో యథేచ్ఛగా అలవి వలలతో అక్రమ వేట సాగిస్తూ మత్స్యసంపదను లూటీ చేస్తున్నారు. బీచుపల్లిదిగువ నుంచి చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఈసారి నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో వ్యాపారులు నిషేధిత అలవి వలలతో వేట ప్రారంభించారు. అందుకోసం చిన్నంబావి మండల పరిధిలో ఒకచోట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి సమీప ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అలవి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదని.. తమ జీవనోపాధి దెబ్బతింటోందని సంప్రదాయ మత్స్యకారులు వాపోతున్నారు. సరిహద్దులు మారుతూ చేపల వేట.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. నదికి ఓవైపు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి, మరోవైపు ఏపీ పరిధిలోకి వస్తుంది. దీన్ని వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తెలంగాణ అధికారులు దాడులకు వచ్చినప్పుడు ఏపీ వైపు.. అక్కడి అధికారులు దాడులకు వచ్చినప్పుడు తెలంగాణ వైపు తమ గుడారాలను మార్చేస్తున్నారు. ఉదయం ఓవైపు, సాయంత్రం మరోవైపు వలలను లాగుతున్నారు. -
సాయుధ బలగాల పనితీరు భేష్
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు చక్కటి పనితీరు కనబర్చాయని ఎస్పీ రక్షిత కె.మూర్తి కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేంద్ర బలగాల అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి మాట్లాడారు. స్థానిక పోలీసులతో కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేయడంతో జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు పూర్తి చేశామన్నారు. బందోబస్తు విధులు నిర్వహించిన ఐటీబీపీ, ఇంటలిజెన్స్ అధికారులు, సిబ్బంది రాముకుమార్, చంద్రకాంట బిస్వాస్, స్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమములో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, ఏఆర్ సీఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రక్షిత కె.మూర్తి -
కొత్త కోర్సులు...
పీయూ పరిధిలో సుమారు 31 వేల సీట్ల భర్తీకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనుమతి ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. గత సంవత్సరం 50 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. ఈక్రమంలో సీట్ల భర్తీని పెంచేందుకుగాను ప్రభుత్వం వృత్తి ఆధారిత కోర్సులను తీసుకువచ్చింది. అందులో భాగంగా మహబూబ్నగర్ ఎంవీఎస్, ఎన్టీఆర్ కళాశాలలతో పాటు జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఏ (హెచ్ఈపీ) స్పెషల్ కోర్సులో జర్నలిజం, అంతర్జాతీయ రాజకీయాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సిలబస్లో మార్పులు తెచ్చారు. ఇక బీఎస్సీలో ఫార్మారంగంలో సేల్స్, మార్కెటింగ్లో సులభంగా ఉద్యోగాలు పొందేవిధంగా కొత్త కోర్సు ఉంది. బీకాం విభాగంలో ఫైనాన్స్ కోర్సు తీసుకువచ్చారు. బీబీఏలో రీటేయిల్ ఆపరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో వారానికి మూడు రోజుల పాటు విద్యాబోధన, మూడు రోజులు ఇంటర్న్షిప్ ఉండనుంది. -
అలివిని అరికట్టాలి..
సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది సంఖ్యలో చేపపిల్లలను నదిలో వదిలిపెడుతుంది. ఆరు నెలలు తిరగకముందే అలవి వలలతో చేపలన్నింటిని పట్టడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలవిని అరికట్టాలని అధికారులను కోరుతున్నాం. మత్స్యకారులు అప్రమత్తమై అలవిని అడ్డుకోవాలి. – వాకిటి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం తనిఖీలు చేపడతాం.. కృష్ణా పరివాహక తీరం వెంట అలవి వలల వినియోగం కొనసాగుతున్న విషయం తెలియదు. స్థానిక అధికారులతో తనిఖీలు చేయిస్తాం. అలవి వినియోగం చట్టరీత్యా నేరం. అలవి వలల వినియోగం ఎక్కడైనా జరిగితే సమాచారం ఇవ్వండి. అలవి వలలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రహమాన్, మత్స్యశాఖ ఏడీ ●
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement