-
రైతు కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ
తాండూరు టౌన్: పిడుగుపాటుకు మృతి చెందిన రైతుల కుటుంబాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సోమవారం పరామర్శించారు. యాలాల మండలానికి చెందిన వెంకప్ప, శ్రీనివాస్, లక్ష్మప్ప అనే రైతులు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఉదయం వారిని తాండూరు జిల్లా ఆస్పత్రి ఆవరణలో పరామర్శించారు. వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి రూ.6లక్షల పరిహారం త్వరగా అందేలా చూస్తానన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాల పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించి పరిహారం ఆలస్యం కాకుండా చూడాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్రావును ఫోన్లో ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ తనవంతు ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట నాయకులు సిద్రాల శ్రీనివాస్, అబ్దుల్ రజాక్, బిర్కట్ రఘు తదితరులున్నారు. ఉద్యమకారుడి కుటుంబానికి భరోసా.. అనారోగ్యంతో పట్టణానికి చెందిన ఉద్యమకారుడు మైలారం సంగమేశ్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన సంగమేష్ మృతి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, శ్రీనివాస్, లింగదల్లి రవి, భగవాన్ తదితరులున్నారు. -
ఆ ఆకతాయిలు దొరికారు
మహేశ్వరం: గుర్రం పందేలు నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా బైక్లు నడిపి ఆర్టీసీ బస్సుపై దాడిచేసిన ఎనిమిది నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి రెండు గుర్రాలు, మూడు బైక్లు, కత్తి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమా మదీనా కాలనీకి చెందిన కలీముద్దీన్ తౌసిఫ్, బహదూర్పురా కిషన్ బాగ్కు చెందిన మహ్మద్ ఆసిఫ్ కందుకూరు మండలం గ్రీన్ ఫార్మాసిటీ రోడ్డులో గుర్రం రేసింగ్ నిర్వహిస్తున్నట్లు ఇన్స్ట్రాగాం వేదికగా పోస్ట్ చేశారు. పోస్టును చూసిన సుమారు 50 మంది బెట్టింగ్లో పాల్గొనేందుకు బైక్లపై వచ్చారు. ఈ నెల 16న ఉదయం 5.30 గంటల సమయంలో గుర్రాలతో పాతబస్తీ నుంచి గ్రీన్ఫార్మాసిటీ రోడ్డుకు చేరకున్నారు. ఆరు కిలోమీటర్లు ఎంచుకుని పందెం నిర్వహించారు. తిరిగి శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్లపై అదేపనిగా హారన్లు కొడుతూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా సైడ్ ఇవ్వలేదంటూ రాచలూరుగేట్ సమీపంలో ఆపి సయ్యద్ అహ్మద్ హస్మీ, మహ్మద్ వజహాత్ హుస్సేన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కల్వకుర్తి ప్రయాణికుడు చీకొండ నాగరాజు చేతికి గాయాలయ్యాయి. ఈ మేరకు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి ఆదేశాల మేరకు సయ్యద్ అహ్మద్, మహ్మద్ వజహత్, ముసా కలీముద్దీన్ తౌసిఫ్, మహ్మద్ ఆసిఫ్, సయ్యద్ జునైద్ అలీ, కాషిఫ్ రజీద్దీన్, అబ్బసాయిలు, మహ్మద్ గౌస్, మహ్మద్ మజార్ను అరెస్టు చేశారు. వారి నుంచి గుర్రాలు, బైక్లు, కత్తి, ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ సునీతారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో కందుకూరు సీఐ మక్బూల్ జానీ, మహేశ్వరం ఎస్ఐలు వెంకట్రెడ్డి, రవీందర్, క్రైమ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బస్సు ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు ఎనిమిది మంది నిందితులకు రిమాండ్ -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
డీసీఓ ఈశ్వరయ్య మోమిన్పేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీఓ ఈశ్వరయ్య అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని మేకవనంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. అడిగిన రైతులందరికీ గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను అడిగి తూకంలో ఇబ్బందులున్నాయా అని తెలుసుకున్నారు. జొన్నలను సైతం విధిగా కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం ఎక్కువగా పండిచిన రైతులుంటే ఆ గ్రామాల్లోకే వెళ్లి కొనుగోలు చేయాలన్నారు. టార్పాలిన్లు కప్పి ధాన్యం తడవకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట సీఈఓలు బాలకిష్టయ్య, శేఖర్, రైతులున్నారు. -
పెద్ద చెరువు తడారిపోతోంది
కొడంగల్: కొడంగల్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. 550 ఎకరాల ఆయకట్టుతో మండలంలో పెద్ద చెరువుగా పేరుగాంచింది. సుమారు 250 మంది రైతులకు ఈ చెరువు కింద భూములు ఉన్నాయి. చెరువు పూడికతీత, మరమ్మతులు చేపట్టక సాగునీరు అందడం లేదు. దీంతో పంటలు దిగుబడి రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చెరువలో కంప చెట్లు పెరిగాయి. కట్టకు పగుళ్లు వచ్చి అధ్వానంగా మారింది. పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. తగ్గుతున్న ఆయకట్టు నియోజకవర్గంలో ప్రతీ ఏడాది ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. కొడంగల్ చెరువుతో పాటు 950 ఎకరాల ఆయకట్టు ఉన్న హస్నాబాద్ చెరువు, పెద్ద నందిగామ చెరువు, అంగడిరాయిచూర్ చెరువు, పర్సాపూర్ నోటిఫైడ్ చెరువులదీ ఇదే పరిస్థితి ఉంది. కేవలం వర్షంపై ఆధార పడి ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే చెరువులు నిండి సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. వందల ఎకరాల్లో ఆయకట్టు ఉంటే రెవెన్యూ అధికారులు తైబంది నిర్వహించి నాలుగో వంతు ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం లేదని రైతులు వాపోతున్నారు. చెరువులకు మరమ్మత్తులు చేసి సాగు విస్తీర్ణం పెంచాలని కోరుతున్నారు. ఆయకట్టుకు అందని జలాలు బీడుగా మారుతునర్న పంటపొలాలు మరమ్మతులు చేపట్టాలని రైతుల వినతి కట్ట మరమ్మతులు చేయాలి పాత కొడంగల్, పాత కొడంగల్ తండా నుంచి కొడంగల్కు రాకపోకలు సాగించాలంటే చెరువుపై నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చెరువు కట్టపై పగుళ్లు రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి. అధికారులు చెరువు కట్టను పరిశీలించి మరమ్మతులు చేయాలి. – శంకర్ నాయక్, పాత కొడంగల్ -
పిడుగుపాటుకు మూగజీవాలు మృత్యువాత
దౌల్తాబాద్: మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ బంగ్లాతండాలో పిడుగుపాటుకు ఓగేదె మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మానాయక్ ఇటీవల రూ.80వేలు వెచ్చించి గేదెను కొనుగోలు చేశాడు. సోమవారం పొలంలో మేపుతుండగా పిడుగుపడడంతో గేదె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని భాధితుడు కోరుతున్నాడు. హాజీపూర్లో ఐదు మేకలు యాలాల: మండల పరిధిలోని హాజీపూర్లో సోమవారం పిడుగుపడి ఐదు మేకలు మృత్యువాత పడ్డాయి. బాధితుడు తెలిపిన ప్రకారం..గ్రామానికి చెందిన మొగులయ్య ఐదు మేకలను గ్రామ శివారులో మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో మేకలు ఓ చెట్టు కిందకు చేరాయి. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో ఐదు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మండల ౖపశువెద్యాధికారి శ్రీకర్రెడ్డి గ్రామానికి వెళ్లి మేకలను పరిశీలించి పిడుగుపాటుకు మృతి చెందినట్లు ధృవీకరించారు. జీవనాధారమైన మేకలు మృతి చెందడంతో రైతు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
మలేషియాలో మనోళ్ల సత్తా
హుడాకాంప్లెక్స్: మలేషియాలో నిర్వహించిన కరా టే పోటీల్లో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఇటీవల గోజురియో హైపోసిటీ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో సరూర్నగర్ మండలం విజయపురికాలనీ, డాక్టర్స్కాలనీలకు చెందిన ఎన్.జైకార్తీకేయన్, ఎస్.తమన్, ఏ.ఎస్.ఎన్.గౌతంలు కట్టాస్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వీరు రజత పతకాన్ని సాధించి దేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. సీనియర్ కటాస్ విభాగంలో వైఆర్ శివకుమార్ స్వర్ణ పతకాన్ని సా ధించాడు. ఫైటింగ్ విభాగంలో జైకార్తీకేయన్ రజతం, తమన్, గౌతంలు కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. చిన్నారులను జపాన్ షోటోకాన్ అసోసియేషన్ సీకో కరాటే డూ కోచ్ వై.ఆర్.శివకుమార్ అభినందించారు. కరాటే పోటీల్లో పతకాలు సాధించిన చిన్నారులు -
ప్రమాద వివరాల సేకరణ
తాండూరు రూరల్: మండల పరిధిలోని గుంతబాసుపల్లి శివారులో అగ్ని ప్రమాదానికి గురైన జిప్సం ఫ్యాక్టరీని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. రెండు రోజుల క్రితం విద్యుదాఘాతంతో ఇండస్కేమ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ మేరకు సోమవారం డీఎస్పీ తన సిబ్బందితో కలిసి వెళ్లి ప్రమాద వివరాలు సేకరించారు. యాజమాన్యంతో మాట్లాడి ఆస్తి నష్టం అంచనా వేశారు. ఆయన వెంట రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం ఆయిల్, రాగి తీగ చోరీ యాలాల: గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్కో సిబ్బంది తెలిపిన ప్రకారం.. యాలాల–దేవనూరు మార్గంలో ప్రధాన రహదారి పక్కన పంట పొలాల మోటార్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి 50లీటర్ల ఆయిల్, రాగి తీగను ఎత్తుకెళ్లారు. ఉదయం విషయం తెలుసుకున్న ట్రాన్స్కో సిబ్బంది యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. విద్యుదాఘాతంతో ఆవు మృతి యాలాల: విద్యుదాఘాతంతో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని ముకుందాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సిరెలి నర్సింహులుకు చెందిన ఓ ఆవు మేత మేస్తూ గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఎర్తింగ్ వైర్ తగలడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ సుమారు రూ.30 వేల విలువ ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం బొంరాస్పేట: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ ఎండీ రవూఫ్ తెలిపిన ప్రకారం.. నాందార్పూర్ సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు బాటసారులు సమాచారం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. శవం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించారన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. గ్రామాల్లో అధికారుల తనిఖీలు ఇన్చార్జి ఎంపీఓ రమేశ్ పెద్దేముల్: కంపోస్టు షెడ్లలో తప్పక ఎరువుల తయారీ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారని పెద్దేముల్ ఇన్చార్జి ఎంపీఓ రమేశ్ అన్నారు. సోమవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారుల తనిఖీలుంటాయని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు కాల్వలు, పైప్లైన్ లీకేజీలు సరిచేయాలన్నారు. పంచాయతీ రాజ్కు సంబంధించిన ఆన్లైన్ డేటా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. తనిఖీల సమయంలో రికార్డులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రస్తుతం సర్పంచ్లు లేనందున పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. వ్యక్తి అదృశ్యం కొత్తూరు: ఇంట్లో చెప్పకుండా వెళ్లిన తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. పట్టణంలో నివసిస్తున్న ఊర్మిలాదేవి కుమారుడు బికాశ్సింగ్(34) ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఊర్మిలాదేవి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
హయత్నగర్: ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ రవీందర్దత్త తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పసుమాముల సర్వే నెంబర్ 422లో సుమారు 2,000 గజాల స్థలంలో ఓ షెడ్డును నిర్మించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు జేసీబీ సాయంతో షెడ్డును తొలగించారు. కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ప్రహరీ కూల్చివేత కొందుర్గు: ఆలయ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఎండోమెంట్ ఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన 89 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలేవీ ?
బండ్లగూడ: భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. గతంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యేవి. ప్రస్తుతం అత్యధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అడుగంటిపోతున్నాయి. ఈ భూగర్భ జలాలు ప్రమాద స్థాయికి చేరకముందే భూగర్భ జలాల స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాల్లో నిర్లక్ష్యం.. కార్పొరేషన్ పరిధి భూగర్భ జలాలు అడుగంటే పలు కాలనీల్లో ఇంకుడు గుంతలు, వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టాలి. కానీ ఇక్కడ పట్టించుకునేవారే కరవయ్యారు. కార్పొరేషన్ పరిధిలో అప్పట్లో 200 అడుగు లోతుల్లోనే పుష్కలంగా నీరు ఉండేది. ప్రస్తుతం 1000 అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. ప్రతి ఇంట్లో నిత్యావసరాలకు ఉపయోగించే నీటికంటే వృథాగా పోయే నీరే ఎక్కువ. వృథాగా పోయే నీటిని ఒక చోటికి చేర్చితే భవిష్యత్తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందని పలువురు మేధావులు చెబుతున్నారు. వ్యక్తి గతంగానే కాకుండా ప్రతి ఒక్కరూ సామాజికపరంగా ప్రజల్లో అవగాహన చేపట్టి భారీఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టగలిగే ప్రయత్నం చేస్తే సరైనా ప్రతిఫలం పొందగల్గుతామని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిబంధన ఉన్నా.. ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే ముందు ఇంకుడుగుంత నిర్మించాలనే నిబంధన ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు చూసీచూడనట్లుగా ఉండటంతోనే నిర్మాణదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. వర్షపునీరు వచ్చే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాల్లో ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పెరుగుతున్న నిర్మాణాలు.. నగరానికి అత్యంత చేరువలో ఉండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది బిల్డర్లు మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. నిర్మాణ సమయంలోనే ఇంకుడుగుంత నిర్మించాలనే నిబంధనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఇంకుడుగుంతల నిర్మాణాలు నిర్మించాలనే నిబంధనను సరిగ్గా అమలు చేయకపోతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. నాలుగింటితో సరి ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200లకు పైగా కాలనీలు, 1.50 లక్షల జనాభా ఉన్నట్టు అంచనా. ఆయా కాలనీల్లో నిర్మాణాల జాతర పెద్దఎత్తున సాగుతున్నాయి. అధికారులు ఎందుకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు అధికారులు ప్రభుత్వ స్థలంలో నాలుగే ఇంకుడు గుంతలు నిర్మించడం ఆలోచించాల్సిన విషయం. పార్కుల దగ్గర కనిపించని ఇంకుడు గుంతలు రోడ్లపైనే పారుతున్న వరదనీరు నిబంధనలు పాటించేలా చూస్తాం నూతన నిర్మాణాలు చేపట్టే చోట ఇంకుడు గుంత తప్పకుండా నిర్మించాలి. లేదంటే తగిన చర్యలు చేపడతాం. నిర్మాణదారులకు ఇంకుడు గుంతలపై టౌన్ప్లానింగ్ టీపీఎస్ విజయలక్ష్మి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత్తం 6 ఇంకుడు గుంతలకు ప్రపోజల్ పెట్టాం. మరిన్ని ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తాం. – శరత్చంద్ర, కమిషనర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ -
కష్టపడేవారికే పోటీ చేసే అవకాశం
యాచారం: పార్టీ బలోపేతం కోసం కష్టపడే వారికే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశాన్ని కల్పిస్తామని.. మోజార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పనిచేసేవారి సమాచారం తన వద్ద ఉందని కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసేవారిని పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే ఎంపిక చేస్తామన్నారు. అనంతరం యూత్కాంగ్రెస్లో మండల పదవులు వరించిన శ్రీకాంత్, రమేశ్, జహంగీర్, నర్సింహ, రాజు, అర్జున్, అంజయ్య తదితరులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గౌరారం వెంకట్రెడ్డి, మోటె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతగిరి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి శంకర్నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. వికారాబాద్లో 6, తాండూరులో 4, పరిగిలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నవాబుపేట్, పెద్దేముల్, మార్పల్లి, మొమిన్పేట్, దోమ, కొడంగల్, కూల్కచెర్ల మండల కేంద్రాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 4,621 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షకు 3210 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని తెలిపారు. అత్యవసర మందులు, ఏఎన్ఎం అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారికి సూచించారు. పరీక్ష సమయాలను బట్టి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ భిక్షు నాయక్, పోస్టల్ అధికారి పద్మారావు, విద్యుత్ శాఖ ఏడీ రామచంద్రయ్య, డీఏఓ గోవిందమ్మ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 24నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు డీఐఓ శంకర్నాయక్ ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేటి వరకు (మంగళవారం) గడువు పెంచినట్లు శంకర్ తెలిపారు. విద్యార్థులు రూ. 2వేల అపరాధ రుసుంతో వారివారి కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి: డీఎల్పీఓ
కుల్కచర్ల: ప్రత్యేక పాలనలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎల్పీఓ సంధ్యారాణి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సరీల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు అవసరం ఉన్న వారి వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖరీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 24న పాలిసెట్ అనంతగిరి: పాలిటెక్నిక్ కళాశాలల్లో 2024 – 25 సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 24న పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నట్లు పరీక్షల జిల్లా సమన్వయకర్త ఎం పరమేశ్వర్ సోమవారం తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. వికారాబాద్లో 3 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,321 అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. పట్టణంలోని కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, భృంగి ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు కేంద్రానికి చేరుకోవాలని, 11 గంటలు దాటితే అనుమతి ఉండదని తెలిపారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతగిరి: ఐటీఐలో ప్రవేశాలకు మొదటి విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024 – 25 – 26 విద్యా సంవత్సరాలకు గాను దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఐటీఐ.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ నందు ఆన్లైన్లో మే 21 నుంచి జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని 10, 8వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ల 9177472488, 8555865421లో సంప్రదించాలని సూచించారు. రేపటి నుంచి యోగా శిక్షణ తరగతులు హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ హుడాకాంప్లెక్స్లోని లోటస్ల్యాప్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు స్వధర్మయోగి ఇస్మాయిల్ గురూజీ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బ్రోచర్లను సోమవారం గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన డ్రిల్ మాన్క్రాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ గురూజీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెంచి వారికి నైతిక విలువలతో కూడినటువంటి యోగా విద్యను అందజేయాలనే ఉద్దేశంతో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు బాలల వ్యక్తిత్వ వికాస యోగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం రకరకాల మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్న విద్యార్థులకు వాటిని అధిగమించడానికి కావాల్సిన యోగా శిక్షణ సాధన పద్ధతులు నేర్పిస్తామన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని, ఇత వివరాలకు 96032 56572 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
అంతా ‘గ్యాసే’నా?
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్లరేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంటగ్యాస్ ధర భారంగా తయారైంది. మూడు నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రారంభభమైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పథకాలకు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహా నగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్లరేషన్కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. రూ.500కు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్గా అర్హత సాధించినా వంటగ్యాస్పై సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.855కు సిలిండర్.. మహా నగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమచేస్తూ వస్తోంది. తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికి వర్తిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ. 40.71లు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ.40.71లు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. పదేళ్ల క్రితం వరకు సబ్సిడీపై రూ.414కు మాత్రమే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్కు నగదు బదిలీ పథకం వర్తింపుజేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్ను మార్కెట్ ధర ప్రకారం రూ. 697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65 నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా.. సబ్సిడీ మాత్రం ఒక స్లాబ్కు పరిమితమైంది. వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్ జిల్లా 13.22లక్షలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 15.96 లక్షలు రూ.500కు సిలిండర్ కొందరికే విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ వర్తించని పరిస్థితి గ్యాస్ ఏజెన్సీలకు సైతం స్పష్టత కరువు బీపీఎల్ వినియోగదారులపై భారం -
ఆటలాడుతూ.. అనంత లోకాలకు
షాద్నగర్రూరల్: తోటి స్నేహితులతో కలిసి ఆ చిన్నారి సరదాగా ఇంటి ముందు ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు గేటు దిమ్మెకూలి తలపై పడటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఫరూఖ్నగర్ మండలం మధురాపూర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పినమోని మల్లేశ్, రమాదేవి దంపతుల చిన్న కుమార్తె సాక్షి (5) సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. ఆడుతూఆడుతూ ఎదురింటి ప్రహరీ వద్దకు వెళ్లారు. సాక్షి శిథిలావస్థకు చేరిన గేటు దిమ్మెను పట్టుకోగానే అది అమాంతం తలపై పడింది. దీంతో చిన్నారి మెదడు పూర్తిగా చిట్లిపోయి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. స్నేహితులు వెంటనే విషయాన్ని సాక్షి తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటివరకు సరదాగా ఆడుకుంటున్న తమ చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడం చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గేటు దిమ్మె కూలి చిన్నారి దుర్మరణం -
పైసా పట్టుకోలేదు!
వికారాబాద్: లోక్సభ పోరు ముగిసింది. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదు మొత్తం ప్రజలు, వ్యాపారులదే.. దీన్నిబట్టి చూస్తే నేతలు ఎంత పకడ్బందీగా డబ్బు రవాణా, పంపిణీ చేశారో ఇట్టే తెలిసిపోతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు, రెవెన్యూ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులో ఒక్కపైసా కూడా ఎన్నికల కోసం తరలిస్తున్నది కాకపోవడం గమనార్హం. అధికారులు కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని తోకను కూడా పట్టుకోలేకపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. మార్చి 20 నుంచి మే 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల తనిఖీలు నిర్వహించారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తే అందుకు సంబంధించి ధ్రువపత్రాలు చూపించాలి. చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేసిన భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం రోజువారీ అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బే అని తేలింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు విచ్ఛలవిడిగా నగదు ఖర్చు చేశాయి. పోలింగ్కు ముందు యథేచ్ఛగా నగదు పంపకాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కోట్లలో డబ్బులు తరలించారనే ప్రచారం జరిగింది. అయితే నేతల డబ్బులు మాత్రం ఎక్కడా పట్టుబడిన సంఘటనలు కనిపించలేదు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు వివిధ పనుల కోసం వ్యాపారులు, ప్రజలు తరలిస్తున్నదే కావడం విషేశం. దీంతో తనిఖీల ఉద్దేశం నెరవేరినట్టేనా..? అనే అనుమానం తలెత్తుతోంది. ఉద్దేశం నెరవేరినట్టేనా..? ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే ఎన్నికల కమిషన్ ఉద్దేశం. నగదు, మద్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు జిల్లాలోని అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా ఎన్నికల కమిషన్ లక్ష్యం నెరవేరినట్టు కనిపించలేదు. పోటీలో ఉన్న అభ్యర్థులు రూ. కోట్లు ఖర్చు చేశారన్నది బహిరంగ రహస్యమే. అయితే వారికి సంబంధించిన డబ్బు ఎక్కడా పట్టుబడలేదు. అది అధికారుల వైఫల్యమా..? నేతల చాకచక్యమా అనే అనుమానం రాక తప్పదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో ఒకరు కారు కొనుగోలు చేసేందుకు తీసుకెళుతున్నది కాగా.. మరి కొందరు పెళ్లిళ్లు ఇతర శుభ కార్యాలకు బంగారం కొనుగోలు చేసేందుకు వెళుతున్న వారు ఉన్నారు. బిల్లులు లేకుండా తీసుకువెళ్లిన కంది పప్పు, చీరలు, టీ షర్టులను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల వ్యాపారాల నిర్వహణ కోసం, భూములు విక్రయించగా వచ్చిన డబ్బు తీసుకెళుతుండగా స్వాధీనం చేసుకున్నారు. అంటే దాదాపు పోలీసులు స్వాధీనం చేసుకున్నది వంద శాతం ప్రజల డబ్బే తప్ప నాయకుల పైసలు కాదని తేలిపోయింది. పోలీసుల తనిఖీలతో ఎన్నికల డబ్బు దొరక్కపోగా ఇటు ప్రజలు, అటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఎన్నికల కోడ్పై అవగాహన లేక అధిక మొత్తం డబ్బు రవాణా చేసి కేసుల పాలయ్యారు. ఎన్నికల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం ప్రజలదే రోజువారి అవసరాల కోసం తరలిస్తున్నదే యథేచ్ఛగా నగదు పంపకాలు జరిగినా ఫలితం శూన్యం జిల్లాలో పట్టుబడిన నగదు రూ.2,18,07,351 నమోదైన కేసులు 145 నగదు మొత్తం రిలీజ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై మోడల్ కోడ్ అమల్లోకి వచ్చాక చెక్పోస్టులు ఏర్పాటు చేసిన జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల నగదు, మద్యం, బంగారం, వెండి తదితర వస్తువులు పట్టుబడ్డాయి. పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా 53 రోజుల పాటు తనిఖీలు చేశారు. రూ.2,18,07,351 నగదును స్వాధీనం చేసుకొని 145 కేసులు నమోదు చేశారు. నగదు తోపాటు బంగారం, చీరలు, టీ షర్టులు, కంది పప్పు, గంజాయి పట్టుబడింది. అయితే విచారణలో స్వాధీ నం చేసుకున్న డబ్బు రోజువారీ అవసరాల కోసం తరలిస్తున్నదని తేలడంతో పోలింగ్ అనంతరం రిలీజ్ చేశారు. దీంతో పట్టుబడిన నగదులో ఒక్క రూపాయి కూడా ఎన్నికల కోసం తరలిస్తున్నది కాదని తేలిపోయింది. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
వామ్మో కుక్కలు! రోడ్లపై తిరగాలంటే గ్రామ సింహాలు హడలెత్తిస్తున్నాయి. వీధుల గుండా వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.9లోuఅనంతగిరి: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు గిరిజన బాలబాలికలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సూచించారు. జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు 2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 64 సీట్లు ఖాళీగా ఉన్నాయని, 3వ తరగతిలో 32 ఉండగా లంబాడ బాలురకు 18 సీట్లు, బాలికలకు 11 సీట్లు, చెంచులకు కేటాయించిన 3 సీట్లలో ఒకటి బాలురకు, రెండు బాలికలకు కేటాయించినట్లు వివరించారు. 5వ తరగతిలో 16 సీట్లు ఉండగా 10 లంబాడ బాలురకు, 4 బాలికలకు, చెంచు బాలబాలికలకు ఒక్కో సీటు కేటాయించినట్లు తెలిపారు. 8వ తరగతిలో 16 ఖాళీలు ఉండగా లంబాడ బాలురకు 11, బాలికలకు 4, ఒక చెంచు బాలికకు అవకాశం ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి రూ. లక్షా 50 వేల లోపు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. కుల, ఆదాయ, నివాసం, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనఫైడ్ తోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు చేయాలని సూచించారు. మే 21 నుంచి జూన్ 6వ తేదీ వరకు కలెక్టరేట్లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. జూన్ 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు. జూన్ 12న లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికై న విద్యార్థుల జాబితా జూన్ 13న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అవకాశం వచ్చిన వారు జూన్ 14న పాఠశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9948663053లో సంప్రదించాలన్నారు. నేటి నుంచి అప్లికేషన్ల పంపిణీ కలెక్టర్ నారాయణరెడ్డి -
విద్య.. మిథ్య
కంప్యూటర్ ఇన్ముల్నర్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ల పరిస్థితి సర్కార్ బడులకు నిర్లక్ష్యపు జబ్బు కొత్తూరు: ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో మరింత నైపుణ్యాన్ని పొంపొందించడానికి ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే శిక్షణ ఇస్తున్నారు. పదోతరగతి పూర్తి చేసే సరికే వారు కంప్యూటర్ విద్యలో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఈ తరహా విద్యను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2008లో కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టింది. మొదట్లో పథకం బాగానే అమలైనప్పటికీ రానురాను నిర్వహణలో నిర్లక్ష్యం పెరిగింది. అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో మూడేళ్లలోనే పథకం కాస్తా అటకెక్కింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. నిర్వహణ లేక నీరుగారి.. కంప్యూటర్లను పంపిణీ చేసిన ప్రభుత్వం పాఠాలు బోధించే ఉపాధ్యాయులను నియమించడం మాత్రం మరిచిపోయింది. కంప్యూటర్లను పంపిణీ చేసిన ఏడాది తర్వాత ఉపాధ్యాయులు.. విద్యార్థుల నుంచి ఒత్తిడి రావడంతో మొదటగా కొన్ని నెలలు కంట్రాక్ట్ పద్ధతిన ట్రైనర్స్ను నియమించి పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత వారికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం.. కంప్యూటర్ల నిర్వహణ పట్టించుకోకపోవడంతో చాలా పాఠశాలల్లో అవి మూలకు చేరాయి. పలు పాఠశాలల్లో కంప్యూటర్ తరగతుల నిర్వహణకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటి వరకు వాటిని సక్రమంగా ఉపయోగించింది లేదు. ఈ ఏడాదైనా కొనసాగేనా..? వచ్చే నెల 13వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికై నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలల నిర్వహణ, కంప్యూటర్ విద్యతో పాటు పలు మార్పులు తీసుకురావాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని.. విద్యార్థులు చేరడం కష్టమని చెబుతున్నాయి. ఈ దిశగా అధికారులు, పాలకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో మూలన పడ్డ కంప్యూటర్లు కలగా మారిన సాంకేతిక విద్య విద్యార్థులకు అందని పరిజ్ఞానం చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన నీలం మధు, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్నగర్లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
మర్పల్లి: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 58 పోలింగ్ కేంద్రాలలో 44,610 మంది ఓటర్లు ఉండగా ఇందులో 31,795 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 71.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తహసీల్దార్ గణేష్ తెలిపారు. మండల కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఓటు హక్కు వినియోగించుకోగా మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్రెడ్డి ఓటు వేశారు. తాండూరులో 67 శాతం పోలింగ్ తాండూరు: తాండూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తాండూరు అసెంబ్లీ పరిధిలో మొత్తం 67శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ పరిధిలో మొత్తం 2,43,192 ఓటర్లు ఉండగా అందులో 1,63,769 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకున్న వారిలో 81,248 మంది పురుషులు, 82,518 మంది మహిళలు, థర్డ్ జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ ప్రసాద్కుమార్ -
అకాల వర్షం.. రైతన్నకు కష్టం
యాలాల: మండల పరిధిలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో బెన్నూరు గ్రామ శివారులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసింది. కొందరు రైతులు కవర్లు కప్పి ఉంచినప్పటికీ, ధాన్యం రాశుల కిందకు వరదనీరు చేరింది. దీంతో ఆ నీటిని దిగువకు పారించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బెన్నూరు కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం -
ఎవరి ధీమా వారిదే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ కన్పిస్తోంది. నేనే గెలవబోతున్నానని ఒకరు అంటే..కాదు నేనే గెలుస్తానంటూ మరొకరు దీమాగా ఉన్నారు. మైనార్టీల, మహిళల ఓట్లు గంపగుత్తగా తమకే పడ్డాయని.. ఈ ఓట్లు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ చెబుతుండగా, ఐటీ ఉద్యోగులు, యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు, పట్టణ ఓటర్లు కమలం వైపు మొగ్గుచూపినట్లు ఆ పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్ ఓటుబ్యాంకు కూడా బీజేపీ వైపు మళ్లిందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత అంశం సహా ఆరు గ్యారంటీల హామీ, సీఎం రేవంత్రెడ్డి సుడిగాలి పర్యటనలు కాంగ్రెస్కు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. దీనికితోడు చివరి నిమిషంలో నిర్వహించిన పోల్మేనేజ్మెంట్ కూడా ఇందుకు దోహదం చేస్తుందని వారు దీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత రెండు ఎన్నికల్లోనూ హవా కొనసాగించిన బీఆర్ఎస్ ఆఖరి నిమిషంలో చేతులెత్తేసింది. బీసీ కార్డు ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా, మెజార్టీ మండలాల్లో బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి డైవర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలోని షాద్నగర్లోనూ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. షాద్నగర్ పట్టణం సహా గ్రామీణ ప్రాంతాలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి లోక్సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన క్యామ మల్లేశ్ జిల్లా వాసి అయినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన కూడా చేతులెత్తేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కేడర్లో చీలిక వచ్చి.. కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా, మరికొంత మంది బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలోని ఎల్బీనగర్లోని మెజార్టీ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఈటల రాజేందర్ గెలుపు దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలోని కల్వకుర్తిలోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పోటీ నెల కొంది. ఇక్కడ ఎవరికి వారు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ! చివరి నిమిషంలో చేతులెత్తేసిన బీఆర్ఎస్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిపై ఆరా.. -
షాద్నగర్.. పోలింగ్ ప్రశాంతం
● కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు షాద్నగర్, షాద్నగర్రూరల్: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్నగర్, నందిగామ నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంతో పాటుగా పలు గ్రామాల్లో ఉదయం 6.30 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అధికారులు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన గేట్లను మూసి వేశారు. పోలింగ్ కేంద్రానికి సమయానికి వచ్చిన వారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఆలస్యంగా పోలింగ్ ఫరూఖ్నగర్ మండల పరిధిలోని పీర్లగూడ, ఎలికట్ట, షాద్నగర్ పట్టణంలోని 247 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. పీర్లగూడలో ఈవీఎం మొరాయిచడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అదేవిధంగా ఎలికట్టలో పోలింగ్ మధ్యలోనే ఈవీఎం మొరాయించడంతో ఓట్లు వేసేందుకు వచ్చిన వారు కొందరు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. దీంతో సుమారు 40 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. అనంతరం అధికారులు ఈవీఎంలను సరి చేశారు. ప్రముఖుల సందడి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి తన స్వగ్రామమైన దూసకల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్నగర్ పట్టణంలోని వెంకటేశ్వర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశీలించిన డీసీపీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాప్లింగం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్నగర్ ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. -
పోల్.. కూల్
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతం వికారాబాద్: చెదురుమదురు సంఘటనలుమినహా జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ధారూరు మండలం అల్లీపూర్లో మధ్యాహ్నం ఈవీఎం మొరాయించగా సరి చేశారు. గంట తర్వాత పోలింగ్ మళ్లీ ప్రారంభమయ్యింది. సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్తో సహా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారివారి ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికలు ముగిసే సమయానికి 68 శాతం ఓటింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్నవారందరూ ఓటు వేసేలా చేస్తామని అధికారులు తెలిపారు.కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఓటు వేసిన ప్రముఖులు జిల్లాలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి కు టుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు వేశా రు. మర్పల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఓటేశారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాలాల మండలం దౌలాపూర్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఓటు వేశారు. దోమ మండలం శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్(వికారాబాద్లో), మహేశ్రెడ్డి(పరిగిలో) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 9,83,740 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4,85,748, మహిళలు 4,97,957, ట్రాన్స్ జెండర్లు 35 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,148 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని వీడియో రికార్డింగ్ చేశారు. పోలింగ్ సరళి పరిశీలన అనంతగిరి: జిల్లాలో ఓటింగ్ సరళిని వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్లో ఓటింగ్ను పరిశీలించారు. 68 శాతం పోలింగ్ ధారూరు మండలం అల్లీపూర్లో మొరాయించిన ఈవీఎం గంట తర్వాత మళ్లీ ప్రారంభం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు కొడంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం రేవంత్రెడ్డి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలో 68 శాతం పోలింగ్ నమో దైంది. పరిగిలో 66 శాతం, వికారాబాద్లో 70 శాతం, తాండూరులో 67.30శాతం, కొడంగల్లో 70శాతం పోలింగ్ నమోదైంది.వేసవి కావడంతో ఉదయమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్నాహ్నం అవుతున్న కొద్దీ కాస్త నెమ్మదించింది. సోమవారం ఎండ కాస్త తక్కువగానే ఉండటంతో జనాలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7నుంచి 9గంటల వరకు 11శాతం, 11గంటల వరకు 26 శాతం, ఒంటి గంటవరకు 45 శాతం, 3గంటల వరకు 56శాతం, సాయంత్రం 5గంటల వరకు 64.44 శాతం ఓటింగ్ నమోదవ్వగా పోలింగ్ ముగిసే సమయానికి 68శాతం నమోదైంది. -
వృద్ధురాలు కింద పడ్డారని..
అద్దె బస్సు అద్దం ధ్వంసం చేసిన స్థానికులు యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్లో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు డిపో నుంచి ఓ ఆర్టీసీ అద్దె బస్సు మహబూబ్నగర్కు వెళుతుంది. లక్ష్మీనారాయణపూర్ సమీపంలోకి రాగానే ఓ వృద్ధురాలు బస్సు దిగేందుకు యత్నిస్తుండగా కిందపడింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు బస్సు ముందు అద్దాన్ని పగులగొట్టారు. కాగా అదే మార్గంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళుతున్న రూరల్ సీఐ అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణను సద్దుమణిగించారు. -
బార్డర్ దాటారంటూ..
పర్వేద పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప లాఠీచార్జి చేవెళ్ల: శంకర్పల్లి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో 72.14శాతం పోలింగ్ నమోదైంది. మాసానిగూడలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ గ్రామస్తులతో కలిసి ఓటు వేశారు. అక్కడే గ్రామస్తులతో కలిసి ఓటింగ్ తీరును చర్చించారు. మండలంలోని పర్వేద పోలింగ్ కేంద్రం వద్ద పలు రాజకీయ పార్టీల నాయకులు ఒక్కసారిగా గుమ్మిగూడి పోలీసులు నిర్ధేశించిన బార్డర్ దాటి వచ్చారు. దీంతో పోలీసులు వారిని దూరంగా పోవాలని చెప్పినా వినకపోవటంతో శంకర్పల్లి డీఐ ఇన్ప్సెక్టర్ నాగరాజు సిబ్బందితో కలిసి లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో వారంతా ఆందోళన చేశారు. దీంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని దీనిని ఎవరు అతిక్రమించవద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని చెప్పకుండా పోలీసులు లాఠీచార్జి చేయటం సరైనది కాదని మండిపడ్డారు. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలింగ్ కోసమే వచ్చామని ఇలా కొట్టడమేమిటని ప్రశ్నించారు. పలువురు నాయకులు, పోలీసులు సర్ది చెప్పటంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. ఓటు వేసిన మాజీ మంత్రి తుక్కుగూడ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ హోంశాఖ మంత్రి తూళ్ల దేవేందర్గౌడ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేసి.. తల్లి అంతిమయాత్ర నిర్వహించి తాండూరు: తల్లి ఇంట్లో విగత జీవిగా మారింది. మరికాసేపట్లో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. కానీ ఓ కొడుకు ఓటు హక్కును వినియోగించి అనంతరం తల్లికి అంత్యక్రియలు చేశారు. తాండూరు మున్సిపల్ పరిఽధిలోని 11వ వార్డుకు చెందిన మాసప్ప తల్లి ఆదివారం రాత్రి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి తరలి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే ప్రభుత్వ నంబర్–1 పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాసప్ప తన కొడుకుతో కలిసి వచ్చి ఓటు వేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు తల్లి మృతదేహాన్ని అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ విషయం తాండూరు పట్టణంలో చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరో ఇద్దరికి గాయాలు దౌల్తాబాద్: మండలంలోని బిచ్చాల గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్గౌడ్(20), భాస్కర్, రవిలు ఓకే బైక్పై కోస్గి పట్టణానికి స్విమ్మింగ్ఫూల్కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ముష్రీఫా గ్రామ సమీపాన బైక్ అదుపుతప్పి ఓ చెట్టుకు ఢీకొట్టడంతో విష్ణువర్ధన్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేస్తుండేవారు. రెండు నెలలుగా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటిపోయాయి. బైక్పై ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోస్గి ఆస్పత్రికి తరలించారు. ఈవీఎంల మొరాయింపు బడంగ్పేట్ పరిధిలో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ బడంగ్పేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భాగంగా సోమవారం బడంగ్పేట మున్సిపాలిటీలోని 235, 237 పోలింగ్ బూతులను స్థానికంగా ఉన్న శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలు మొరాయించడంతో రెండు చోట్ల 50 నిమిషా లు ఆలస్యంగా మొదలయ్యాయి. టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసేవరకు ఓటర్లు క్యూలైన్లోనే పడిగాపులు కాశారు. అనంతరం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలాపూర్ మండలంలోని అల్మాస్గూడ, బాలాపూ ర్, నాదర్గుల్, వెంకటాపూర్, మామిడిపల్లిలో పరిధిల్లోని పోలింగ్ బూత్ల్లో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
హీరామండి సిరీస్లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
తప్పక చదవండి
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement