-
బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల వేధింపులు ఆపాలి
సూర్యాపేట: జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల వేధింపులు ఆపాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కొంతమంది పోలీసు అధికారులు ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఒంటెద్దు నర్సింహారెడ్డి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, జటంగి వెంకటేశ్వర్లు, గోండ్రాల అశోక్, అయోధ్య పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ కళాశాల నుంచి పీఎస్ఆర్ సెంటర్ వరకు జరిగిన రోడ్డు విస్తరణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక శుక్రవారం పరిశీలించారు. పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి పనులను వెంటనే పూర్తిచేయించాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్, ఇఇజికెడి ప్రసాద్, డీఈ సత్యారావు, ఎఈలు సుమంత్, వరుణ్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి భానుపురి (సూర్యాపేట): విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే గిరిజన అభ్యర్థులకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్న నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం (ఎన్ఓఎస్)కు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్ గురువారం ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 31 తేదీలోపు https-://overseas.tri bal.gov.in వెబ్సైట్ను సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉప్పు అధికంగా వాడొద్దు సూర్యాపేట: ఉప్పు అధికంగా వాడడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం అన్నారు. సూర్యాపేటలోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వైద్య సిబ్బందికి బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తపోటుని తరచుగా పరీక్షించుకోవాలని, అధిక రక్తపోటు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. రోజుకు ఒక టీ స్పూన్కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపారు. జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ జయ శ్యాంసుందర్, సాంబశివరావు, అంజయ్య, శ్రీనివాస్, యమునా, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం భానుపురి (సూర్యాపేట): 2024–25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కీం కింద వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి (డే స్కాలర్స్), 5వ తరగతి (రెసిడెన్షియల్) ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకు ఎస్సీ బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. కుల, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రం (మీసేవ ద్వార పొందింది) రేషన్కార్డు, ఆధార్ కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనోఫైడ్, రెండు పాస్ ఫొటోలతో ఈనెల 18వ తేదీ నుంచి కలెక్టరేట్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది జూన్ 7వ తేదీ లోగా అందించాలని కోరారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదివితే వారికి అవకాశం ఉండదని తెలిపారు. అందిన దరఖాస్తులను జూన్ 11వ తేదీన కలెక్టరేట్ కాంప్లెక్స్లోని మీటింగ్ హాల్లో డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. -
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సూర్యాపేట టౌన్: ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్–7, 13, 17 విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. విజేతలకు కప్, మెడల్స్ ఇవ్వడంతో పాటు హైదరాబాద్లో జరిగే రాష్ట స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ఎల్.సతీష్కుమార్ సెల్ 8555008996, 9394753343 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
సూర్యాపేట: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు, యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరహాలో వారం రోజులు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా క్షేత్రంలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రుణమాఫీకి కసరత్తు !
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాల మాఫీకి కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ఆగస్టు 15లోగా రూ.2లక్షల లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తింపజేయాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు బ్యాంకుల వారీగా ఎంత మంది రుణాలు తీసుకున్నారు. వడ్డీ ఎంత, ప్రస్తుతం ఉన్న రుణం ఎంత తదితర వివరాలను క్రోడీకరిస్తున్నారు. అయితే రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి విధివిధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 2019 నుంచి రుణాలు పొందిన వారికి.. 2019 ఏప్రిల్ 1నుంచి 2023 డిసెంబర్ 10 మధ్య రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న, రెన్యూవల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం అర్హులైన జాబితా పంపాలని జిల్లా బ్యాంకర్లను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారం మేరకు జిల్లాలో సుమారుగా 1,42,786 మంది రైతులు రూ.2,135.96 కోట్ల పంట రుణాలను తీసుకున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల వారీగా ప్రభుత్వం అర్హుల వివరాలను సేకరిస్తోంది. అయితే ఒకే కుటుంబంలో ఒక్కరికే ఈ మాఫీ వర్తిస్తుందా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. రూ.2లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో లక్ష మంది వరకు రైతులు లబ్ధి పొందనున్నారు. రెన్యూవల్ చేయించకుంటే అనర్హులేనా..? గత ప్రభుత్వం నాలుగేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేసింది. మొదటగా రూ.25వేలు, రూ.50వేలు.. ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఈక్రమంలో రుణాలను సకాలంలో రెన్యూవల్ చేయని వారికి రూ.లక్ష లోపు రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేయలేదు. అయితే కొత్త ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వీరికి వర్తించనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కటాఫ్ తేదీల్లో వీరు రుణాలు తీసుకోకపోగా.. కనీసం రెన్యూవల్ సైతం చేయకపోవడమే కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం విడుదల చేసే రుణమాఫీ మార్గదర్శకాల్లో స్పష్టత రానుంది. ఫ ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటన ఫ బ్యాంకర్లను వివరాలు కోరిన ప్రభుత్వం ఫ జిల్లా రైతుల్లో చిగురిస్తున్న ఆశలు ఫ లక్ష మంది రైతులకు చేకూరనున్న లబ్ధి -
ప్రమాదాలకు చెక్!
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ వద్ద వీయూపీ పనులు65 – నేషనల్ హైవేపైసాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారిపై గతంలోనే గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆంథోల్ మైసమ్మ గుడి సమీపం నుంచి కృష్ణా జిల్లా ప్రారంభం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాల నివారణకు సర్వీసు రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఇదివరకే రూ.326 కోట్లు కేటాయించింది. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఆయా పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఎన్హెచ్ఏఐ చేపట్టే పనులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కోమటిరెడ్డి జాతీయ రహదారి విస్తరణ, రోడ్డు ప్రమాదాల నివారణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలోనే ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల వరకు భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిసి ఎన్హెచ్–65 ఆరు లేన్లుగా విస్తరణ, అభివృద్ధి, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పట్టుబట్టి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉండటంతో దీనిపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారి వెంట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో జిల్లా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే బ్లాక్ స్పాట్స్లో పనులను ప్రారంభించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రి వెంకట్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రహదారులు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా.. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, ఎస్వీ కాలేజ్ జనగాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ క్రాస్ రోడ్, కట్టకొమ్ముగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్రోడ్డు, నవాబ్పేట్ జంక్షన్ను బ్లాక్ స్పాట్స్గా గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వెహికిల్ అండర్ పాస్ (వీయూపీ) బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులను చేపట్టాలని నిర్ణయించింది. పనులను యుద్ధ ప్రాతిదికన చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యంగా సైన్ బోర్డుల ఏర్పాటు, హెవీ స్పీడ్ నిర్మూలన, అవసరమైన చోట్ల ఆరు లేన్లుగా రోడ్డు విస్తరణ వంటి పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. ఫ సర్వీసు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధిపై రప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఫ పూర్తయిన టెండర్ల ప్రక్రియ ఫ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష మరమ్మతులు చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ రోడ్లు జాతీయ రహదారిపై ఉన్న ఆయా బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సూచించారు. పనులను చేపట్టేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు సదుపాయం కల్పించి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో పనుల విషయంలో లోటుపాట్లు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు ఉన్నా స్పెషల్ సెక్రటరీ అనుమతి తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. మనుషుల ప్రాణాలు పోతుంటే.. అనుమతుల పేరిట ఆలస్యం చేయొద్దని స్పష్టం చేశారు. -
కేసులను సత్వరమే పరిష్కరించాలి
సూర్యాపేట: లోక్ అదాలత్లను సద్వినియోగ చేసుకుంటూ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు పోలీసులు కృషిచేయాలని జిల్లా ప్రధాన జడ్జి గోవర్ధన్రెడ్డి అన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ పోలీసు విభాగం చేపడుతున్న చర్యలను సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సూర్యాపేటలో జిల్లా జడ్జిని కలిసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేసి సకాలంలో కేసు అభియాగ పత్రాలను కోర్టుకు అందించాలన్నారు. అనంతరం పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్ పోలీసు సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నంబర్లు, వెడ్ సైట్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోలీసు స్టేషన్కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిశీలిస్తూ కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా చేసి బాధితులకు భరోసా కల్పించాలని సైబర్ సెక్యురిటీ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను చైతన్య పర్చాలని సిబ్బందికి సూచించారు. ఫ జిల్లా ప్రధాన జడ్జి గోవర్ధన్రెడ్డి -
యాదాద్రిలో ఊంజలి సేవ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధనలు, అభిషేకం నిర్వహించారు. -
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
సూర్యాపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది మాదిరిగానే వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో ఉచితంగా యూనిఫాం అందించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా పాఠశాలలు పునః ప్రారంభం నాటికి యూనిఫాం అందజేతలో జరుగుతున్న జాప్యాన్ని అధిగమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈసారి అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. జూన్ 12వ తేదీ నాటికి ఒక్కో జత యూనిఫాం పంపిణీ చేసేందు సిద్ధంగా ఉంచాలని లక్ష్యం నిర్ణయించుకున్నారు. జిల్లాకు వచ్చిన 1,16,160 మీటర్లు జిల్లాలో 904 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు తొమ్మిది మోడల్ స్కూళ్లు, 18 కేజీబీవీలు, ఒక టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాల ఉంది. వీటిలో బాలురు 25,984 మంది, బాలికలు 27,474 మందితో కలిపి మొత్తం 53,458 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరందరికీ పాఠశాలలు పునఃప్రారంభం నాటికే ఒక్కో జత యూనిఫాం ఇవ్వాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఇప్పటికే జిల్లాకు 1,16,160 మీటర్ల వస్త్రం వచ్చింది. ఈ వస్త్రాన్ని గురువారం నుంచి మండలాలకు పంపిస్తున్నారు. 63 కేంద్రాల్లో కుట్టేందుకు చర్యలు నాణ్యత, ఆకర్షణ, డిజైన్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థుల యూనిఫాం ఉండాలని విద్యా శాఖ తెలిపింది. బాలబాలికలకు వేర్వేరుగా వస్త్రాలను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఒక్కో జత కుట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు చేరిన వస్త్రాన్ని ఎంఈఓ, ఏపీఎంల ఆధ్వర్యంలో సరికొత్త డిజైన్లతో యూనిఫాం కుట్టే బాధ్యతను జిల్లాలోని 334 స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నారు. వీరు 23 మండలాల్లో ఏర్పాటు చేసిన 63 కేంద్రాల్లో యూనిఫాం కుట్టనున్నారు. రెండ్రోజుల్లోగా అధికారులు సంఘాలకు వస్త్రం అప్పగించనున్నారు. బాలికలకు ఫ్రాక్, చేతులకు పట్టీలు, చొక్కాకు రెండు జేబులతో డిజైన్ ఎంపిక చేశారు. కేజీబీవీ విద్యార్థినులకు పంజాబి డ్రెస్లు కుట్టిస్తారు. రెండు చేతులకు క్లిప్లు, డ్రెస్ ముందు భాగం రెండు గుండీలతో యు ఆకృతిలో ఉంటుంది. బాలుర చొక్కాలకు రెండు జేబులు, పట్టీలు కుడతారు. ప్యాంటు, నిక్కర్ గతంలో మాదిరిగానే ఉంటుంది. యూనిఫాం కుట్టినందుకు ఒక్కో జతకు రూ.50 ఇవ్వనున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫాం అందిస్తాం యూనిఫాంకు సంబంధించి జిల్లాకు చేరిన వస్త్రాన్ని గురువారం నుంచి మండలాలకు సరఫరా చేస్తున్నాం. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి అన్ని పాఠశాలలకు యూనిఫాంలు అందించాలని ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థికి ఒక్కో జత యూనిఫాం అందజేస్తాం. – అశోక్, డీఈఓ, సూర్యాపేట ఫ జిల్లాకు చేరిన 1.16లక్షల మీటర్ల వస్త్రం ఫ రెండు రోజుల నుంచి మండలాలకు చేరవేస్తున్న విద్యా శాఖ అధికారులు ఫ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక్కో జత ఇచ్చేలా ప్రణాళిక ఫ మొత్తం పాఠశాలలు 904 ఫ విద్యార్థులు 53,458 మంది -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
ఫ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూన్ 22 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లి కేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్.రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఏకలవ్య స్కూల్ రోడ్, శివాజీ నగర్, నల్లగొండ సెల్ : 96660 13544, 80747 42864రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఫీజు : రూ.3 వేలు వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. -
మామిడి పచ్చడి ప్రియం
సూర్యాపేటటౌన్: వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడికాయ (ఆవకాయ) పచ్చడి వైపు మళ్లుతుంది. ప్రతి ఏడాదిలాగానే పచ్చడి పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం మామిడి కాయల ధరలతో పాటు పచ్చడి సామగ్రి ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఈ ధరలు చూస్తే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో రూ.2 నుంచి రూ.3వరకు దొరికే మామిడి కాయలు ప్రస్తుతం ఒక్కో మామిడి కాయకు రూ.10 నుంచి రూ.30వరకు పలుకుతోంది. పచ్చడిలో ఉపయోగించే మిర్చి కిలో రూ.300, పల్లి నూనె రూ.160 నుంచి రూ.180, ఎల్లిగడ్డలు కిలో రూ.300 వరకు పెరిగాయి. వీటితో పాటు మెంతులు, ఉప్పు, ఆవాలు ఇలా దినుసుల రేట్లన్నీ అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది పచ్చడి పెట్టే పరిస్థితి లేదని సాధారణ ప్రజలు వాపోతున్నారు. కాత లేకపోవడంతో.. చాలా మంది ఇళ్లల్లో మామిడి పచ్చడి ఇష్టంగా తింటారు. ఉదయం కూలీలకు వెళ్లేవారు, ఉద్యోగులు విధులకు వెళ్లే వారి టిఫిన్ బాక్సుల్లో పచ్చడి తప్పక ఉండాల్సిందే. కానీ ఈ సారి మామిడి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది పచ్చడి మామిడికి ధరతో పాటు కొద్దిపాటి కాత ఉండగా గాలి దుమారానికి అది కూడా రాలింది. దీంతో మామిడి కాయల ధరలు పెరిగాయి. కొందరు పచ్చడి పెడుతున్నా 50కాయలు పెట్టే వారు 20కాయలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఫ మామిడి కాయలతో పాటు కారం, నూనెలకూ అధిక ధరలు ఫ బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు ధరలు చూస్తే భయమేస్తోంది ఈ ఏడాది మామిడి కాయ పచ్చడి పెట్టాలంటే అందులో వాడే సరుకుల ధరలు చూస్తే భయమేస్తోంది. ఈ సారి మామిడికాయల ధరే కాదు నూనె, కారం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రతి ఏడాది 50 కాయల వరకు పచ్చడి పెట్టే వాళ్లం. ఈ ఏడాది 15 నుంచి 20 కాయల వరకు పెడదామనుకుంటున్నాం. – లక్ష్మమ్మ, కేసారం -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
భువనగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ 2,4,6 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ పరిధిలో 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఉదయం జరిగే సెమిస్టర్ పరీక్షలకు 36,392 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2వ సెమిస్టర్లో 12,525, 4వ సెమిస్టర్లో 12,313, 6వ సెమిస్టర్లో 11,554 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం జరిగే బ్యాక్లాగ్ పరీక్షలకు 18,052 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్ సెమిస్టర్లో 6,923, 3వ సెమిస్టర్లో 6,050, 5వ సెమిస్టర్లో 5,079 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాశాలలు ఇలా.. యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 75 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 11, ఎయిడెడ్ 2. ప్రైవేట్ కాలేజీలు 62 ఉన్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 2,4,6 సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు 1,3,5 బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలి డిగ్రీ 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం నుంచి జూన్ 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే విద్యార్థులు కళాశాలల నుంచి హాల్ టికెట్లు పొందారు. పరీక్షలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలి. – ఉపేందర్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి, ఎంజీయూ -
పత్తి రైతుపై నకిలీ పడగ
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో పత్తి రైతులను నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. అనుమతి లేని బీటీ – 3 విత్తనాల కారణంగా దిగుబడులు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విత్తన ఎంపికపై అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఉద్దెర రూపంలో అంటగడుతున్న వ్యాపారులు అనుమతి లేని బీటీ – 3 పత్తి విత్తనాలు ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని జిల్లాలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వీటి విక్రయం అధికంగా జరుగుతోంది. మంచి దిగుబడి వచ్చే కొత్తరకం విత్తనాలు.. వీటికి కలుపుతీత లేకుండా మందులు పిచికారీ చేయొచ్చంటూ వ్యాపారులు రైతులను మభ్యపెడుతున్నారు. దీంతో రైతులు దిగుబడి పెరిగి.. శ్రమ తగ్గుతుందన్న ఆశతో కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఈ పంట వేసిన మరుసటి ఏడాది సైతం దిగుబడులపై ప్రభావం చూపుతోంది. ఈ నకిలీ విత్తనాల వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలనే టార్గెట్ చేసుకుని విక్రయాలు సాగిస్తున్నట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడం.. ఉద్దెరకు విత్తనాలు ఇస్తుండడంతో యాజమానులు చెప్పే వాటినే తీసుకుంటున్నారు. ఈ నెల చివరివారం నుంచే రైతాంగం పత్తి విత్తనాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఫ అనుమతిలేని బీటీ– 3 విత్తనాలను రైతులకు అంటగడుతున్న వ్యాపారులు ఫ కలుపుతీత లేకుండా మందులు పిచికారీ చేయొచ్చని మభ్యపెడుతున్న వైనం ఫ గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలనే టార్గెట్ చేసుకుని విక్రయాలు ఫ దిగుబడి పెరుగుతుందన్న ఆశతో కొనుగోలు చేసి నష్టపోతున్న రైతులు -
డెంగీని తరిమికొడదాం
సూర్యాపేట: డెంగీని తరిమికొడదామని, ఈ వ్యాధికి కారణమైన ఎడిస్ దోమ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం పాత డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏఎన్ఎంలతో కలిసి అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ నజియా, అంజయ్య, మోతీలాల్, శాబుద్దీన్, నర్సయ్య, శ్రీనివాస రాజు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట): ఈనెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. పోలింగ్ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి నోడల్ అధికారులు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఎన్నికల నిర్వహణకు 142 జంబో బ్యాలెట్ బాక్సులు శ్రీసత్య సాయి జిల్లా నుంచి తెప్పించడం జరుగుతుందని తెలిపారు. సూర్యాపేటలో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడలో 22, హుజూర్నగర్లో 18 పోలింగ్ కేంద్రాలు మొత్తం 71 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 51,497 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. గ్రూప్– 1 పరీక్షకు 40 సెంటర్లు జూన్ 9వ తేదీన జరిగే గ్రూప్– 1 పరీక్షలకు జిల్లాలో 40 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు. 9,744 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. ఎస్పీ రాహుల్హెగ్డే మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బందోబస్తుకు పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్లు వీవీ.అప్పారావు, సురేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, రూపేందర్ సింగ్, ఆర్డీఓ సురేష్ రెడ్డి, సతీష్ కుమార్, పద్మ, రమేష్ కుమార్, అధికారులు శ్యాంసుందర్ ప్రసాద్, లక్ష్మణ నాయక్, వెంకటరమణ, మాస్టర్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, వేణు, రమేష్, గ్రూప్ –1 పరీక్షల సూపరింటెండెంట్ పద్మారావు, కలెక్టరేట్ ఏఓ మందాడి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ వెంకటరావు -
మార్కెట్లోకి అనుమతి లేని విత్తనాలు
సూర్యాపేటలో ఆరేళ్ల క్రితం వరకు దాదాపు 2.50 లక్షల వరకు పత్తి సాగు జరిగేది. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నీటి వనరులు లేకపోవడంతో వర్షాధార పంటలను సాగు చేయగా.. ఇందులో పత్తి సాగే ఎక్కువగా ఉండేది. ఎస్సారెస్పీ జలాల రాకతో ఈ ప్రాంతంలో పంటల సాగులో మార్పు వచ్చాయి. ఈ నియోజకవర్గాల్లో వరి సాగు అధికం కాగా.. పత్తి రెండోస్థానంలో ఉంది. ఈ వానాకాలం 1.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను 475 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్లు 2.35 లక్షల వరకు అవసరం కానున్నాయి. గతంలో జోరుగా పత్తి సాగు జరిగిన ఈ ప్రాంతంలో నకిలీ విత్తనాల దందా అదే స్థాయిలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ కంపెనీలకు చెందిన అనుమతి లేని బీటీ – 3 విత్తనాలను వ్యాపారులు మార్కెట్లోకి విచ్చలవిడిగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. -
ప్రతిఒక్కరికీ ఉపాధి పని కల్పించాలి
పెన్పహాడ్: వేసవిలో ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని కల్పించాలని అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ చెరువు పూడిక తీత పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పని కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా పనులు జరిగే ప్రాంతంలో తాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన సమయంలోపే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన పనుల కొలతల మేరకు చెల్లింపులు జరగాలని తెలిపారు. మస్టర్లను పరిశీలించి గ్రూపుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. అదేవిధంగా గ్రామంలో మురుగు కాలువలను పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో కాలువలు శుభ్రపర్చాలని చెప్పారు. ఆమె వెంట పీడీ మధుసూదనరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ నరేష్, ఏపీఓ రవి, ఈసీ మహేష్, పంచాయతీ కార్యదర్శి శివ తదితరులున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి పెన్పహాడ్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో మురుగు కాల్వల పూడిక పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మురుగు కాల్వల్లో తీసిన పూడికను ఎత్తివేయాలని, గ్రామ పంచాయతీల్లో ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శులు శివ, అఖిల్ ఉన్నారు. బహుజన విప్లవోద్యమ నాయకుడు వీరన్న సూర్యాపేటటౌన్: దళిత, బహుజన విప్లవోద్యమ నాయకుడు మారోజు వీరన్న అని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యునిస్టు పార్టీ రెవల్యూషన్ ఆఫ్ మారోజు ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి నర్సయ్య అన్నారు. మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ చండ్ర పుల్లారెడ్డి పార్టీ రాష్ట్ర నాయకుడు బుద్ధ సత్యనారాయణ, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, కరీం, అయోధ్య, వీరన్న సోదరి దేవకమ్మ, సామాజిక తెలంగాణ మహాసభ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేటకు వీరన్న పేరు పెట్టాలి తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాకు వర్గకుల పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న పేరును పెట్టాలని సీపీయూఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న డిమాండ్ చేశారు. వీరన్న వర్ధంతి సందర్భంగా గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో సీపీయూఎస్ఐ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మారోజు వీరన్న సతీమణి చైతన్య, కూతురు దిశలతో కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీయూఎస్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మట్టపల్లి లింగయ్య, మిద్దె రాములు, లక్ష్మణ్, గడ్డం శరత్, దామెర మోగిలి, పిట్లల రాజమౌళి, మాచర్ల శ్రీనివాస్, మట్టపల్లి యాదన్న, ఎర్ర సత్యం పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అందిస్తున్న ఇంటర్మీడియట్ ఉచిత విద్య, వసతి సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. – లత, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, సూర్యాపేట నాగారం: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన నిరుపేద విద్యార్థులకు జిల్లా గ్రామీణావృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యాపథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎంపికై న వారికి ఆయా కళాశాలల్లో ఉచిత విద్య, వసతి సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పిస్తుంది. అదేవిధంగా ఒక్కో విద్యార్థికి ఫీజు కింద రూ.35,000, ఖర్చుల కింద ఏడాదికి రూ.3వేలు అందిస్తుంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి వార్షిక ఫలితాల్లో 7 జీపీఏ నుంచి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ జెడ్పీ, ఎయిడెడ్, కస్తూర్బా, ఆదర్శ, గురుకులాల్లో చదివిన విద్యార్థులంతా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత కార్పొరేట్ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు విధానం ఇలా.. ఆసక్తి గల విద్యార్థులు www.telanganaepass. cgg. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి వివరాలు, పదో తరగతి వార్షిక పరీక్షలో సాధించిన జీపీఏ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కుల, ఆదాయ, నివాస, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే ధ్రువీకరణ పత్రం జతచేయాలి. నాలుగు నుంచి పదోతరగతి వరకు చదివిన పాఠశాలలకు చెందిన బోనాఫైడ్ సర్టిఫికెట్లు, పాస్ఫొటో అప్లోడ్ చేయాలి. పదో తరగతిలో సాధించిన జీపీఏతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్–3న తొలి జాబితా ప్రకటిస్తారు. 6వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఫ ఇంటర్లో చేరే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఫ కార్పొరేట్ పథకం కింద ఫీజుల చెల్లింపు ఫ టెన్త్లో 7 జీపీఏ ఆపైన సాధించిన వారికి అవకాశం ఫ ఈనెల 30వరకు దరఖాస్తుల స్వీకరణ -
పట్టుదలతో పనిచేస్తే విజయం మనదే
సూర్యాపేట : నల్లగొండ– వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టుదలతో పనిచేస్తే విజయం మనదేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గురువారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయానికి కావాల్సి న సానుకూల వాతావరణం నియోజకవర్గంలో ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
సాగర్లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యటన
నాగార్జునసాగర్: వరంగల్– నల్లగొండ– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ గురువారం చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్, స్థానిక ఇంజనీర్లతో కలిసి నాగార్జునసాగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా డ్యాంను సందర్శించారు. సాగర్ కుడి కాల్వను సందర్శించడంతో పాటు డ్యాంకు ఇరు రాష్ట్రాల సరిహద్దులను అడిగి తెలుసుకున్నారు. నీటి మట్టం వివరాలు, మెయింటెనెన్స్ పనుల తీరుపై ఆరా తీశారు. టెయిల్పాండ్లో నీటి నిల్వలు, దిగువకు నీటి విడుదల అంశాలతో పాటు సాంకేతికపరమైన అంశాలను ఇంజనీర్లతో చర్చించారు. అనంతరం మోడల్ డ్యాం వద్దకు వచ్చి ఇక్కడ ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పాదన కేంద్రం, స్పిల్వే, గేట్ల వివరాలను ముందుగా నల్లగొండలో ఉన్న డ్యాం ఎస్ఈకి ఫోన్ చేసి అడిగారు. ఆయనకు సీఈతోపాటు డ్యాం జేఈఈ కృష్ణయ్య, జేఈలు సత్యనారాయణ, భిక్షమయ్య తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. -
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఫ మరొకరికి గాయాలు ఫ మృతుడు ఆంధ్రప్రదేశ్ వాసి చౌటుప్పల్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు స్నేహితులు సొంతూర్లకు వెళ్లారు. ఓటు వేసి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కొనికళ్ల దీపక్రాజ్(29), విశాఖపట్టణానికి చెందిన అనిరుధ్ స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్లోని కూకట్పల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను బస్సులో స్వగ్రామాలకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. కానీ టికెట్లు లభించకపోవడంతో బైక్పై వెళ్లారు. ఓటేసి బుధవారం తిరిగి హైదరాబాద్కు వస్తుండగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం స్టేజీ వద్ద రోడ్డుపై ఆగిన కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. అనిరుధ్కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవరెడ్డి తెలిపారు. -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
అబ్దుల్లాపూర్మెట్: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గండేటి తేజ(50) కొన్నేళ్ల క్రితం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని మజీద్పూర్ గ్రామానికి వలస వచ్చాడు. ఆయన తాటిచెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం బాటసింగారంలోని దొడ్డ శాంతికుమార్ వ్యవసాయ భూమిలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సంతోష ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం వాసి -
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
త్రిపురారం: మండల పరిధిలోని కంపాసాగర్లో గల కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో 24వ తేదీన వరి విత్తన మేళా నిర్వహించనున్నట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు, వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జేజీఎల్ 27356 (అతి చిన్న గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ.1100, కేఎన్ఎమ్ 118(దొడ్డు గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ.1100, జేజీఎల్ 24423 (దొడ్డు గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ.1100 ఉన్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు 7702544771, 9848430317 నంబర్లను సంప్రదించాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ ఆధ్వర్యంలో కేఎన్ఎమ్ 118 (దొడ్డు గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ.1100, ఎమ్టీయూ 1010 (దొడ్డు గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ.1100, కేపీఎస్ 2874 (సన్న గింజ రకం) 20 కేజీల బ్యాగ్ ధర రూ.1556, కేపీఎస్ 6521 (సన్న గింజ రకం) 25 కేజీల బ్యాగ్ ధర రూ. 1200గా ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99499301819, 9912534831 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
వేములపల్లి: చెరువు శిఖాన్ని ఆక్రమించి మట్టి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. వేములపల్లి మండలంలోని బుగ్గబావిగూడేనికి చెందిన కేతనపల్లి శ్రీనివాస్రెడ్డి, పుట్ట మహేష్ బుధవారం ఒక జేసీబీ, ఏడు ట్రాక్టర్లతో గ్రామ శివారులోని నియామల్కం (పెద్ద చెరువు)లోకి ప్రవేశించి చెరువు శిఖం హద్దులను తొలగించి మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈఈ ఎస్. సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని జేసీబీ, ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్రెడ్డి, మహేష్తో పాటు జేసీబీ, ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement