-
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ రాదు
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అలా ఏం రాదు. వెంటనే బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలి. పిడుగుల సమయంలో విద్యుత్ పరికరాల కనెక్షన్ తీసివేయడం మంచిది. – సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, జగిత్యాలసూర్యుని కన్నా ఎక్కువ వేడి సూర్యుని ఉపరితలంపై 5 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, పిడుగు పడినప్పుడు 29 వేల డిగ్రీలు ఉత్పత్తి అవుతుంది. పిడుగుకు సూర్యుని ప్రభావం కంటే 5 రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది. మేఘాల్లో ఎలక్ట్రికల్ చార్జ్ జరగడంతో పిడుగు పడుతుంది. – డాక్టర్ శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస పరిశోధన స్థానం -
● వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతున్న వడ్ల కుప్పలు ● లారీలు రాక.. తూకం వేయక ● కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ● ఆందోళనలో రైతులు
సిరిసిల్ల: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. పంటను కోసి, తేమ వచ్చి రెండు, మూడు వారాలు గడుస్తున్నా తూకం వేయడం లేదు. లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నాలుగో వారంలో తూకం వేయం మొదలుపెట్టారు. ఫలితంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కేంద్రాల్లోనే ఆరబోస్తున్న రైతులు జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాఘం చేస్తున్నాయి. మే నెలలో ఇప్పటికి మూడు సార్లు వర్షాలు పడడంతో ఎండిన వడ్లు తడిసిపోయాయి. రైతులు మళ్లీ కేంద్రాల్లోనే ఆరబోస్తున్నారు. లారీల కొరతతో తూకం వేసి బస్తాలు సైతం కేంద్రాల్లోనే ఉంటున్నాయి. ప్రైవేటు కొనుగోళ్ల జోరు ప్రభుత్వం వడ్లకు మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించగా.. ప్రైవేటు వ్యాపారులు నేరుగా పచ్చి రూ.1800 నుంచి రూ.1900లకు క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం, వడ్లను శుద్ధి చేయాలనే నిబంధనలు ఉండడంతో చాలా మంది రైతులు నేరుగా వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నా రు. కొందరు రైతులు శుద్ధిచేసి కొనుగోలు కేంద్రాల్లో ఉంచితే.. ఇలా అకాల వర్షాలతో ఇబ్బందులు తప్ప డం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.కొనుగోలు కేంద్రాలు: 259కొనుగోళ్లు ప్రారంభించినవి : 249కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు : 61ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం : 2,03,225.280 మెట్రిక్ టన్నులు అమ్మిన రైతులు : 30,564ధాన్యం విలువ : రూ.447.71 కోట్లు వరి సాగు విస్తీర్ణం : 1.73 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా: 3.81 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు డబ్బులు పొందిన రైతులు : 26,574రైతులు పొందిన డబ్బులు : రూ.331.30 కోట్లుఇతను కోనరావుపేటకు చెందిన కస్తూరి సంజీవరెడ్డి. ఇతనికి ఐదెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి, కొనుగోలు కేంద్రంలో పోశాడు. 300 బస్తాల వడ్లు అయితయి. లారీలు రాకపోవడంతో తూకం వేయడం లేదు. ఫలితంగా సంజీవరెడ్డి వడ్లు ఎప్పుడు జోకుతారోనని నిరీక్షిస్తున్నాడు... ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు వడ్లను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.వడ్లకుప్ప వద్ద ఉన్న ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజ భూమయ్య. ఇతనికి ఎకరం భూమి ఉంది. నెల రోజుల కిందటే పంట కోసి వడ్లను కొనుగోలు కేంద్రంలో కుప్పపోశాడు. 20 రోజుల కిందటే తేమశాతం వచ్చినా లారీలు లేక, గన్నీ సంచుల కొరతతో తూకం వేయలేదు. వడ్లు తడిసిపోకుండా కవర్లు కప్పి కాపాడుకుంటున్నాడు. నెల రోజులు అయితంది పంట కోసి నెల రోజులు అయితంది. అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినం. కాంటా పెట్టి 10 రోజులు గడుస్తుంది. లారీలు రాకపోవడంతో బస్తాలను తీసుకుపోవడం లేదు. వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి. వడ్లు లాకలు వస్తే మళ్లీ కోత పెడుతరు. వెంటనే లారీల్లో ధాన్యం తరలించాలి. – ఊషయ్య, నాంపల్లి కాంటా పెట్టిండ్రు అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసినం. నెల రోజులుగా వడ్లు పోతలేవు. లారీల కొరత అంటున్నారు. కాంటా వేసి కేంద్రాల్లోనే బస్తాలు పెట్టిండ్రు. నావి 800 బస్తాల వడ్లు అట్లనే ఉన్నయి. అకాల వర్షాలకు బస్తాలు తడుస్తున్నాయి. అధికారులు స్పందించి లారీలను పంపించాలే. – నాగరాజు, సంకెపల్లి -
కేంద్రాల్లోనే ధాన్యం
వడ్ల బస్తాల ముందు నిల్చున్న ఈమె మైలారం పద్మ. కోనరావుపేట మండలం ధర్మారం. పద్మకు రెండెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి వడ్లను ఆరబోశారు. తేమ శాతం వచ్చింది. రెండుసార్లు వడ్లను భర్త శంకర్తో కలిసి బోర్లించారు. 130 బస్తాల వరకు వడ్లు అయ్యాయి. తూకం వేసిన బస్తాలను తీసుకుపోయేందుకు లారీలు రాకపోవడంతో ఇలా వర్షానికి తడిసిపోయాయి. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మహిళా రైతు చెవుల గౌరవ్వకు చెందిన వడ్లు. పది రోజుల కిందట నాలుగు ఎకరాల్లోని పంట కోసి బైపాస్రోడ్డులో ఆరబోశారు. తేమశాతం 17 వచ్చింది. వడ్లను కాంటా పెట్టాల్సి ఉండగా.. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో తడిసినయి. ఇక చేసేదేమీ లేక గౌరవ్వ, మల్లేశం కుటుంబ సభ్యులు ఇలా శుక్రవారం వడ్లను ఆరబోశారు. ధాన్యం కొనుగోళ్ల స్వరూపం -
రోడ్డెక్కిన రైతులు
వేములవాడఅర్బన్: ధాన్యం కాంటా పెట్టి పది రోజులు గడుస్తున్నా తరలించడం లేదంటూ వేములవాడ మండలం అనుపురంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ వరిధాన్యం కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు దాటుతున్నా తూకం వేయడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల బస్తాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడారు. పోలీసుశాఖపై అవగాహన సిరిసిల్లక్రైం: పోలీస్శాఖపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సర్ధాపూర్పూర్లోని 17వ బెటాలియన్లో పోలీస్శాఖకు సంబంధించిన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలపై అవగాహన కల్పించారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు కోరారు. మండలంలోని ధర్మారం, సుద్దాల, కొలనూర్, మామిడిపల్లి, నిజామాబాద్, వట్టిమల్ల గ్రామాల్లో చెవి, ముక్కు, గొంతు, దంతవైద్యశిబిరాలు నిర్వహించారు. వైద్యాధికారులు వేణుమాధవ్, శ్రీనివాస్, సుష్మా, శివరామకృష్ణ, ప్రీతి, అఖిల్, వెంకటేశ్, సూపర్వైజర్లు శ్రీదేవి, రషీద్ పాల్గొన్నారు. బిల్లుల కోసం జీపీ కార్యాలయానికి తాళం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలో మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు బిల్లుల కోసం శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన నూతన జీపీ భవనానికి సంబంధించిన బిల్లులు, గ్రామాభివృద్ధికి వెచ్చించిన రూ.8లక్షలు రావాల్సి ఉందన్నారు. సర్పంచులకు ప్రభుత్వం అందించే రూ.6వేల గౌరవ వేతనం మూడేళ్లుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు అందించాలని కోరారు. చెక్డ్యామ్ పనులు పరిశీలన వేములవాడరూరల్: రెండు రోజుల్లో చెక్డ్యాం పనులు ప్రారంభించాలని, లేకుంటే కేసులు న మోదు చేస్తామని ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ను హెచ్చరించారు. వేములవాడరూరల్ మండలం మూలవాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులను శుక్రవారం పరిశీలించారు. బొల్లారం, జయవరం గామాల్లోని మూలవా గుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈఈ అమరేందర్రెడ్డి, ఏఈ రాజు, కాంట్రాక్టర్ వంశీ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రైతులు అధికారులను నిలదీసినట్లు తెలిసింది. గత వర్షాకాలంలో చెక్డ్యామ్ తెగి పంటలు నష్టపోయామని, ఈసారి పనులు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ అనురాగ్ జయంతి ● ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో పర్యటన ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, అల్మాస్పూర్, వీర్నపల్లి మండలం కంచర్ల, గర్జనపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో చేపట్టిన పనులను శుక్రవారం పరిశీలించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యు త్ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అమ్మ ఆద ర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగుదొడ్లను మరమ్మతు చేయించాలన్నారు. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా తాగునీటి వసతి కల్పించాలని, తరగతిగదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 31 లోగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలన్నా రు. అదనపు కలెక్టర్ గౌతమి, డీఈవో రమేశ్కుమార్, మండల ప్రత్యేకాధికారి గీత, ఎంపీడీవో సత్త య్య, ఏఈలు అశోక్రావు, శ్రీకాంత్, వీర్నపల్లి తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నరేశ్కుమార్, ఆర్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
స్కూళ్లు తెరిచే నాటికి వసతులు
● జూన్ 10లోగా పనులు పూర్తి చేయండి ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిసిరిసిల్ల: స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల కు టాయిలెట్లు ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ వేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్స్ బట్ట జిల్లాలకు చేరుతుందని, అనుభవం గల స్వశక్తి సంఘాలకు కుట్టే ఆర్డర్లు ఇవ్వాలన్నారు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సీఎస్ సూచించారు. మార్చి 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 1.15లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, లోక్సభ ఎన్నికలు ముగిసినందున మరోసారి ధరణి దరఖాస్తులను పరిశీలించి మే చివరి నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి మళ్లీ ప్రారంభించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, డీఎస్వో జితేందర్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మేనేజర్ జితేంద్రప్రసాద్, మార్కెటింగ్ శాఖ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి, డీఈవో రమేశ్కుమార్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పిడుగులు పడుతున్నయ్.. జాగ్రత్త
● మేఘాల్లోని పాజిటివ్, నెగెటివ్ కణాల వల్లే.. ● వర్షం పడుతుంటే చెట్ల కిందకు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దు ● మెరుపులను చూసేందుకు ప్రయత్నించొద్దు జగిత్యాల అగ్రికల్చర్: ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో వాన పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు వచ్చి, పెద్ద శబ్ధాలతో పడిగులు పడతాయి. వీటికి బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. అందుకే మనుషులతోపాటు జంతువులు చనిపోతాయి. పిడుగుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం కాలిపోతుంటాయి. ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులే ఇలా మృతిచెందుతున్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పిడుగులు పడి, తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లెకు చెందిన కంబోళ్ల శ్రీనివాస్ అనే రైతులు, మూడు పశువులు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగు అంటే.. ఎలా పడుతుంది? మేఘాల్లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చిన్న చిన్న మంచు కణాలుగా విడిపోతుంది. అయితే, విపరీతమైన గాలులు వచ్చినప్పుడు వాటి మధ్య రాపిడి జరిగి, ఒక ఎలక్ట్రికల్ చార్జ్ విడుదలవుతుంది. ఇందులోని పాజిటివ్ కణాలు తేలికగా ఉండటం వల్ల మేఘాల పైకి వెళ్తుంటే, నెగటివ్ కణాలు బరువుగా ఉండి మేఘం కిందికి వెళ్తుంటాయి. అయస్కాంతంలో ఉత్తర, దక్షిణ ధృవాలు ఆకర్షించుకున్నట్లుగానే రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు పాజిటివ్, నెగెటివ్ కణాలు ఆకర్షించుకొని, ఆకాశంలో మెరుపులు వస్తాయి. ఈ సమయంలో మేఘంలోని నెగెటివ్ కణాలు, భూమిలోని పాజిటివ్ కణాలను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు భూమిపై ఎత్తుగా ఉండే చెట్లు, గుట్టలు, మనుషుల ద్వారా ఈ బాండింగ్ జరిగి, మెరుపుతో కూడిన పిడుగు పడుతుంది. అప్రమత్తంగా ఉండాలి.. వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లొద్దు. పిడుగు పడే సమయంలో ఆకాశంలోని మెరుపులు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి, ఆ వెలుతురును చూసేందుకు ప్రయత్నించొవద్దు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే సమయస్ఫూర్తితో వ్యవహరించి, మోకాళ్లపై చేతులు, తలపెట్టి, దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. దీనివల్ల, సమీపంలో పిడుగు పడినా అందులోని విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి, బతికేందుకు అవకాశాలు ఉంటాయి. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాలును భూమి మీద పూర్తిగా ఆనించొద్దు. కాలి వేళ్ల మీద ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యుత్ పరికరాలకు నష్టం.. పిడుగు పడినప్పుడు విద్యుత్ పరికరాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులు వస్తుంటే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలైన టీవీ, రిఫ్రిజిరేటర్, సెల్ఫోన్ వంటి వాటిని వినియోగించకపోవడం ఉత్తమం. అలాగే, మెరుపులు వస్తున్నప్పుడు ఆరుబయట స్నానం చేయడం, వంట పాత్రలు కడగడం చేయవద్దు. లోహపు వస్తువుల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
రైతు సమస్యలపై బీజేపీ రణభేరి
● నేడు ధాన్యం కల్లాల సందర్శన ● 20న తహసీల్దార్, కలెక్టర్లకు వినతిపత్రాలు ● 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు ● బీజేపీ నేతలతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి మోగించింది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు తమ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ శుక్రవారం రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందన్నారు. ఈక్రమంలోనే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా శ నివారం బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని సూచించారు. 19న అన్ని మండల, ని యోజకవర్గకేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతులు పడుతున్న బాధలు వివరించాలన్నారు. 20న తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలని, 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుదీక్షలు చేపట్టాలని కోరారు. -
6న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నిక కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈమేరకు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర సహకార ఎన్నికల అఽధికారి శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 30న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితా ప్రకారం ఈనెల 31వ తేదీన గుర్తులు ప్రకటిస్తారు. జూన్ 1వ తేదీన ఎన్నికల ప్రచారం, జూన్ 6న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి, సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటిస్తారు. -
గాలివాన బీభత్సం
సిరిసిల్ల/వేములవాడ/వేములవాడఅర్బన్/ రుద్రంగి/ముస్తాబాద్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సిరిసిల్ల లో 37.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. రుద్రంగిలో 2.8, చందుర్తిలో 9.8, వేములవాడలో 23.2, వేములవాడరూరల్లో 4.8, బోయినపల్లిలో 17.7, కోనరావుపేటలో 7.9, వీర్నపల్లిలో 6.4, ఎల్లారెడ్డిపేటలో 4.6, గంభీరావుపేటలో 4.8, ముస్తాబాద్లో 26.6, తంగళ్లపల్లిలో 12.8, ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్ల వర్షం పడిందని సీపీవో పీబీ శ్రీనివాస్ తెలిపారు. తడిసిన ధాన్యం రుద్రంగి, ముస్తాబాద్, వేములవాడఅర్బన్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. బస్తాల్లో నింపిన ధాన్యాన్ని రైతులు ఆరబోస్తూ కనిపించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట, ముస్తాబాద్, పోతుగల్, నామాపూర్, చీకోడు గ్రామాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తుమ్మచెట్టు గాలివానకు రోడ్డుపై పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి విరిగిన చెట్టును పక్కకు తొలగించారు. అత్యధికంగా సిరిసిల్లలో 37.3 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్లు రుద్రంగి, ముస్తాబాద్లలో తడిసిన ధాన్యం -
‘పెద్దపల్లి బైపాస్’ చకచకా
● ఊపందుకున్న రైల్వేస్టేషన్ పనులు ● చీకురాయి వద్ద స్టేషన్, ట్రాక్ కోసం భూమి చదును ● పెద్దపల్లి–నిజామాబాద్–కాజీపేట రూట్లో తగ్గనున్న దూరభారం ● తిరుపతి ప్రయాణికులకు సమయం ఆదా ● రైల్వేలైన్ పూర్తయితే మధ్యలో ఆగకుండా కాజీపేట వెళ్లే అవకాశంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్ మార్గంలో పెద్దపల్లి బైపాస్ స్టేషన్ పనులు ఊపందుకున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉండగా గతేడాది మోక్షం లభించిన విషయం విధితమే. ప్రస్తుతం చీకురాయి వద్ద ట్రాక్, స్టేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ట్రాక్ వచ్చే రైల్వే బడ్జెట్ నాటికి అందుబాటులోకి రావొచ్చని నిపుణుల అంచనా. అప్పుడు పెద్దపల్లి–నిజామాబాద్ రూట్ నుంచి కాజీపేట మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఎక్కడా ఆగే అవసరం ఉండదు. ఎక్కడ నిర్మిస్తున్నారు? 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్కు శంకుస్థాపన చేశారు. అది దాదాపు మూడు దశాబ్దాలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ముంబై నుంచి కాజీపేటను కలిపే రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గం నుంచి కాజీపేటకు వెళ్లాల్సి న రైళ్లు పెద్దపల్లి వెళ్లాలి. ఇలా దాదాపు 40 నుంచి 60 నిమిషాలకు పైగా వేచి చూడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా పెద్దపల్లి–బల్లార్షా–కాజీ పేట లైన్ను పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంతో అనుసంధానించాలని నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చీకురాయి సమీ పంలో స్థలాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. తొలుత ఈ మార్గంలో సర్వేలు చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు మధ్య పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ నిర్మించ తలపెట్టారు. దాంతో రెండు మార్గాలను కలపాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు రెండు గ్రామాల పరిధిలో గతేడాది భూసేకరణకు స్థాని కులను ఒప్పించారు. గత ఆగస్టులో బైపాస్లైన్లో ఎలరక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. తగ్గనున్న దూరభారం, సమయం ఈ స్టేషన్, రెండు కిలోమీటర్ల బైపాస్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ మీదుగా కాజీపేట వెళ్లాల్సిన రైళ్లు పెద్దపల్లిలో ఆగాల్సిన అవసరం లేదు. అవి నేరుగా కాజీపేట వెళ్లే వీలుంటుంది. ప్రస్తుతం తిరుపతి–కరీంనగర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ గురువారం, ఆదివారం కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తోంది. ఈక్రమంలో కాజీపేటకు సిగ్న ల్ దొరికేందుకు దాదాపు 40 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతుంది. త్వరలో బైపాస్ స్టేషన్, ట్రాక్ పూర్తయితే తిరుపతి ప్రయాణంలో ఒక గంట కలిసి వస్తుంది. ఇదే రైలు తిరిగి వచ్చే క్రమంలోనూ మరో గంట సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నా రు. ఈ మార్గం పూర్తయితే విజయవాడతోపాటు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్ మార్గాల్లో దూరభారం, సమయం తగ్గనున్నాయి. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మా ర్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గంలో వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీని వల్ల చాలా ఇంధనం, సమ యం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూ ట్కు డిమాండ్ పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధి కంగా ఆదాయం తీసుకొచ్చే రైల్వే మార్గాల్లో పె ద్దపల్లి–నిజామాబాద్ మార్గం ఒకటిగా నిలిచింది. ఏఎంఆర్యూటీ పథకం కింద నిధులు మంజూరు ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్(డెమూ, మెమూ) ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాజీపేట నుంచి దాదర్ ముంబయి వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ఇటీవల నిలిపివేశారు. తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రమే రెగ్యులర్గా నడుస్తోంది. ఈ రైల్వే మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలున్నాయి. భవిష్యత్తులో ఈ మార్గం డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు ప్రయాణికుల రైళ్లు పెరిగే అవకాశాలున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మి షన్(ఏఎంఆర్యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు రూ.26.60కోట్లు, రామగుండం రూ.26.50కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్, రామగుండం పనులు త్వరలో పూర్తికానుండగా, పెద్దపల్లిలోనూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సంతోషంగా ఉంది చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య రైల్వేస్టేషన్ నిర్మిస్తారని తెలిసినప్పటి నుంచి సంతో షంగా ఉంది. ఇటీవల పనులు మొదలయ్యాయి. ఇక్కడ స్టేషన్ కడితే.. పెద్దపల్లి పట్టణం మరో పక్క నుంచి అభివృద్ధి మొదలవుతుంది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి సమయం, దూరభారం తగ్గుతాయి. – మేకల శ్రీనివాస్ -
ఉరుములు.. మెరుపులు
● ఈదురుగాలులతో వాన ● పిడుగులు పడి ఇద్దరి మృతి ● నేలకూలిన విద్యుత్ స్తంభాలు ● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంసిరిసిల్ల/సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగులు పడి ఇద్దరు మృత్యువాత పడగా.. స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు, సంజీవయ్యనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. రాకపోకలకు వరద నీటిలో స్థానికులు అవస్థలు పడ్డారు. నాలాలు కనిపించకుండా రోడ్లపై వరదనీరు పొంగిపొర్లింది. వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజ్పల్లికి చెందిన కంబళ్ల శ్రీనివాస్(30) పిడుగుపాటుకు మృత్యువాత పడగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వేములవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ శివారులోని భగత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య పిడుగుపాటుతో మరణించారు. కూలిన శిలాఫలకం సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గోడకు ఉన్న శిలాఫలకం కూలి, ముక్కలైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. ఆఫీస్ శిలాఫలకం కూలిన విషయాన్ని సబ్రిజిస్ట్రార్ పార్థసారధి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం విశేషం. వేములవాడలో ఇంటిపై పిడుగుపాటు వేములవాడ: స్థానిక ఉప్పుగడ్డవీధిలోని ఖమర్ ఇంటిపై పిడుగుపడింది. పై అంతస్తు గోడపై పడడంతో పైపు, గోడ పగుళ్లు చూపింది. సమీప పది గృహాల్లోని టీవీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రానికి వస్తువులు పాడైనట్లు కాలనీవాసులు తెలిపారు. పల్లెల్లో పరేషాన్ ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/వేములవాడఅర్బన్: ముస్తాబాద్ మండలంలో తెర్లుమద్దిలో పిడుగుపాటుకు చాకలి యాదగిరికి చెందిన గేదె మృతి చెందింది. రూ.50వేల విలువైన గేదె మృతి చెందిందని బాధిత మహిళా రైతు రోదించింది. ముస్తాబాద్కు చెందిన చెవుల గోపాల్ గొర్రెల మందపై విద్యుత్ తీగలు తెగి పడడంతో రెండు గొర్రెలు చనిపోయాయి. గతంలోనూ విద్యుత్ తీగలు తెగిపడ్డ ఘటనలో గోపాల్కు చెందిన రెండు గొర్రెలు చనిపోయాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మండల కేంద్రంతోపాటు నారాయణపూర్, సింగారం, బండలింగంపల్లి, రాగట్లపల్లి గ్రా మాల్లో రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో మామిడిచెట్టు నేలకొరిగింది. వేములవాడఅర్బన్ మండలంలోని కేంద్రాల్లో ధాన్యం తడిసింది. బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలా సాగర్ సబ్స్టేషన్కు వెళ్లే మర్లపేట 33 కేవీఏ లైన్ రెండు స్తంభాలు వంగిపోయాయి. దేశాయిపల్లిలో విద్యుత్స్తంభం నేలవాలింది. బోయినపల్లి నుంచి దేశాయిపల్లి వెళ్లే మార్గంలో పెద్ద వృక్షం నేలకూలింది. ఈదురు గాలుకు మర్లపేటలోని పర్లపల్లి అంజయ్యకు చెందిన కోళ్ల ఫారం రేకులు లేచిపోయాయి.రూ.1.50లక్షలు నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్షపాతం ఇలా..(మి.మీ) సిరిసిల్ల 30.8 ముస్తాబాద్ 28.3 బోయినపల్లి 14.8 కోనరావుపేట 18.5 ఇల్లంతకుంట 1.5 గంభీరావుపేట 2.0 వీర్నపల్లి 0.8 వేములవాడరూరల్ 4.0 -
జాతీయస్థాయి డాడ్జిబాల్ పోటీలు ప్రారంభం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): తెలంగాణ ప్రాంతంలో తొలిసారిగా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాం స్డేడియంలో గురువారం జాతీయస్థాయి డాడ్జిబాల్ ఫెడరల్ కప్– 24 పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో గుజరాత్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు చెందిన 24 మహిళ, పురుషుల జట్లు పాల్గొన్నాయి. డాడ్జిబాల్లో 12 మంది క్రీడాకారులతో 20 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఈ క్రీడ ఆసక్తికరంగా కొనసాగుతుంది. రెండురోజుల పాటు నిర్వహించే పోటీల్లో అత్యంత ప్రతిభచూపిన రెండు జట్లను ఎంపిక చేసి ఆగస్టులో 11 నుంచి 17 వరకు ఆస్ట్రియా దేశంలో నిర్వహించే అంతర్జాతీయస్థాయి పోటీలకు పంపిస్తారు. హాజరైన 12 రాష్ట్రాల క్రీడాకారులు రెండు రోజుల పాటు నిర్వహణ -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి
సిరిసిల్లటౌన్/వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వం వ్య వహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడల్లో గురువారం దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి దోఖా ఇచ్చారన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు సన్నాలకే ఇస్తామని యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా రూ.15వేలు ఏమైందని ప్రశ్నించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, వెంగల శ్రీనివాస్, గజభీంకార్ రాజన్న, సురేందర్రావు, అందె సుభాశ్, కుంభాల మల్లారెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మినర్సింహారావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి, గోస్కుల రవి, మల్యాల దేవ య్య, కందుల క్రాంతికుమార్, ఏనుగు తిరుపతి రెడ్డి, బండ నర్సయ్యయాదవ్, రామ్మోహన్రావు, చంద్రయ్యగౌడ్, మారం కుమార్, నిమ్మశెట్టి విజ య్, గోలి మహేశ్, గడ్డం హన్మండ్లు పాల్గొన్నారు. రూ.500 బోనస్పై యూటర్న్ సిగ్గుచేటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య -
సమాన హక్కులు కల్పించాలి
జ్యోతినగర్(రామగుండం): చాలా ఏళ్ల నుంచి ఐదో షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ని వాసముంటున్న ఎస్సీలకు ఎస్టీలతో సమా న హక్కులు కల్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్కు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేశ్ విన్నవించారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్ జ్యోతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఏజెన్సీ ఐదో షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో జన్మించిన ఎస్సీలకు భూమిపై హక్కులు, రాజకీయ రిజర్వేషన్ లేక, జీవో 3తో ఉద్యోగ అవకాశాలు రాక ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టం, జీవో 3 తీసుకువచ్చి ఏజెన్సీ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5వ, 6వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న దళితుల జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి ఎస్టీలతో ఎస్సీలకు సమాన హక్కులు కల్పించాలని కోరారు. నేతకాని ఎస్సీ కులస్తుల కుల ధ్రువీకరణ పత్రం రాష్ట్ర గెజిట్లో నేత్కాని, కేంద్ర జాబితాలో నేతానిగా స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందని, నేతకానిగా వచ్చేలా కృషి చేయాలని కోరగా, రాంచందర్ సానుకూలంగా స్పందించి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కమ్మగిరి శ్రీకాంత్ పలువురు ఉన్నారు. -
రైల్వేలైన్ భూసేకరణ పూర్తి చేయండి
● కలెక్టర్ అనురాగ్ జయంతిసిరిసిల్ల: జిల్లా పరిధిలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి భూసేకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం రైల్వేలైన్ భూసేకరణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ, అనుపురం, కొడుముంజ, నాంపల్లి గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఎఫ్వో బాలమణి, రైల్వేశాఖ సీఈ, సిరిసిల్ల ఆర్డీవో రమేశ్, ఏడీ సర్వే శ్రీనివాస్, ఆర్అండ్బీ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలి జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. కలెక్టరేట్లో స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధిపై సమీక్షించారు. నూతన ఆలోచనలతో మహిళలు వివిధ వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందజేయాలన్నారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు అవసరమైన శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ పి.గౌతమి, రాష్ట్ర మెప్మా కో–ఆర్డినేటర్లు పద్మ, ప్రమోద్కుమార్, శరత్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అవినాశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
కిడ్నీ బీకేర్ఫుల్
● జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోగులు ● పెయిన్కిల్లర్స్ వినియోగంతో సమస్య ● జిల్లా వ్యాప్తంగా 116 మంది డయాలసిస్ బాధితులు ● సిరిసిల్ల పట్టణంలోనే అత్యధికం ● ఇష్టారీతిగా మందులు వాడొద్దని వైద్యుల సూచనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సంతోషంగా బతకాలంటే మన శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా ఉండాలి. శరీరంలో ఒక్క భాగానికి సమస్య వచ్చినా అది మన జీవన విధానాన్ని మార్చివేస్తుంది. అందరి మాదిరిగా హాయిగా ఉండాలనుకుంటున్నా కొందరిని మూత్రపిండాల వ్యాధి వెంటాడుతోంది. డయాలసిస్ చేయించుకుంటేనే బతికే పరిస్థితికి చేరిపోయారు. ఇలాంటి వారు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 116 మంది ఉన్నారు. వీరంతా కష్టాలతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. మూత్రపిండాల(కిడ్నీలు) సమస్యను వైద్యులు తీవ్రంగా పరిగణిస్తారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలమీదికొస్తుంది. జిల్లాలో 116 మంది బాధితులు జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు 116 మంది ఉన్నారు. వీరంతా రికార్డుల ప్రకారమే.. కానీ వ్యాధి నిర్ధారణ చేయించుకోని వారు పల్లెల్లో ఇంతకుమించి ఉంటారనేది వైద్యుల అంచనా. డయాలసిస్ బాధితులకు వైద్యసేవలు ఎప్పుడెప్పుడు అందించాలో చూసుకునే బాధ్యత జిల్లా వైద్యశాఖలో పనిచేస్తున్న 13 మంది ఆరోగ్యమిత్రలది. కొత్త కేసులను గుర్తించడం, పాత వారిని క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకునేలా ఫాలోఅప్ చేస్తుంటారు. వేములవాడ ప్రాంతంలో 30 మంది, సిరిసిల్ల ఏరియాలో 86 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో 10 డయాలసిస్ మిషన్లు, వేములవాడలో 5 మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లతోనే వీరంతా చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి వారంలో రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో అధికం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనే అత్యధికంగా 86 డయాలసిస్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్కువగా కార్మికులు ఉండడం, వారికి చదువు కూడా అంతంతే ఉండడంతో అవగాహన లేక అనారోగ్యానికి గురవుతున్నారు. అవగాహన లేకుండా పేయిన్కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడడం, కలుషిత నీరు తాగడం, మరికొందరైతే తక్కువ నీరు తీసుకోవడంతో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా కష్టాన్ని మరిచిపోయేందుకు చీప్లిక్కర్ సేవించడం ప్రధాన సమస్యగా వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన కల్పించని వైద్యశాఖ జిల్లాలో ఇంత మంది కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే వ్యాధి నివారణకు వైద్యశాఖ కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. పల్లె, పట్టణాల్లోని హమాలీలు, కూలీల అడ్డాల వద్ద కనీసం అవగాహన సదస్సులు పెడితే ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా హైడోస్ పెయిన్కిల్లర్స్ రాసే ప్రైవేట్ వైద్యులపై చర్యలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతను కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన భూక్య నిమ్యానాయక్. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షలు చేసిన వైద్యులు మూత్రపిండాల సమస్య ఉందని గుర్తించారు. కొద్దికాలం వైద్యుల సూచనలతో వ్యాధి నివారణకు మందులు వాడాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సిరిసిల్లలోని ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇలా 116 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.వ్యాధికి కారణాలు ఇవే.. రోజులో ఒక వ్యక్తి కనీసం ఐదు లీటర్ల నీటిని తాగితే కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కానీ జిల్లాలో చాలా మంది 2 నుంచి 3 లీటర్లే తాగుతున్నట్లు వైద్యశాఖ సర్వేలో తేలింది. గ్రామాల్లో కలుషిత నీటిని తాగడం ద్వారా కూడా మూత్రపిండాలు దెబ్బతింటున్నట్లు వైద్యులు తెలిపారు. పలు సందర్భాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షించిన సందర్భాల్లో కొన్ని ఖనిజాలు అధికంగా ఉన్నట్లు తేలింది. కాచి వడబోసిన నీటిని లేదా శుద్ధనీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో ప్రధానమైన సమస్య.. జిల్లాలోని పల్లెల్లో కూలీలు, రైతులు, హమాలీలు చిన్నపాటి సమస్యకే హైడోస్ పెయిన్కిల్లర్స్ వాడుతుండడంతో కిడ్నీలు పాడవుతున్నాయని జిల్లా వైద్యులు పేర్కొంటున్నారు. హైడోస్ పెయిన్కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని సూచిస్తున్నారు.పలు కారణాలతోనే.. మూత్రపిండాల వ్యాధి బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన నీటిని తాగకపోవడం, మోతాదుకు మించి పేయిన్కిల్లర్స్ వాడడం, శరీరానికి సరిపడ నీరు తీసుకోకపోవడంతోనే కిడ్నీలు పాడవుతున్నాయి. అనుమానం వచ్చిన గ్రామాల్లోకి వెళ్లి నీటిశాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నాం. సమస్య ఉందని తెలిస్తే ఆ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నాం. – సుమన్మోహన్రావు, డీఎంహెచ్వో -
ప్రజాచైతన్యంతోనే డెంగీ నివారణ
● డీఎంహెచ్వో సుమన్మోహన్రావుసిరిసిల్లటౌన్: ప్రజాచైతన్యంతోనే డెంగీని నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్రావు పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. డ్రైడే పాటించా లని సూచించారు. జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్జాన్, వైద్యులు లక్ష్మీప్రసన్న, ఉమాదేవి, హెచ్ఈవో బాలయ్య, ఎస్యూవో మోహన్, హెచ్ఎస్ భూమయ్య పాల్గొన్నారు. పది శాతం యారన్ సబ్సిడీ కొనసాగించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): పవర్లూమ్ కార్మికులకు అందిస్తున్న 10 శాతం యారన్ సబ్సిడీని ప్రభుత్వం, అధికారులు తగ్గించాలని చూస్తున్నారని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆరోపించారు. ఎప్పటిలాగే పది శాతం సబ్సిడీ కొనసాగించాలని కోరారు. తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో గురువా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి చెల్లించా ల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అందించినట్లుగానే సబ్సిడీని కొనసాగించకుంటే చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు కూచన శంకర్, అన్నల్దాస్ గణేశ్, అక్కల శ్రీ నివాస్, జెల్ల సదానందం, ఆడెపు శుభశేఖర్, రాజ మల్లు, శ్రీనివాస్, నరేశ్, శ్రీకాంత్, వెంకటేశ్, సంపత్, ఆంజనేయులు, రాజశేఖర్, ర మేశ్, రాజు, శంకర్, అంబదాస్ పాల్గొన్నారు. ‘సీఎం వ్యాఖ్యలను వక్రీకరించారు’ సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యా ఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించి, ఉనికి కోసం దొంగ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ కోకన్వీనర్ కనిమేని చక్రధర్రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఛీత్కరించారని, పార్లమెంటు ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుండడంతో ఆ పార్టీ నాయకులు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గొల్లపల్లి పర్శరాములు, నక్క నర్సయ్య, అన్నల్దాస్ భాను, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, తిరుపతి పాల్గొన్నారు. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ డ్రామాలు● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి(వేములవాడ): పదేళ్లు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే రైతులపై కపట ప్రేమ చూపుతూ డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. చందుర్తిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గతంలో ధాన్యం బస్తాకు 44 కిలోలు తూకం వేసి దోసుకున్న సంగతి రైతులు మరిచిపోలేదన్నారు. ప్రస్తుతం బస్తాకు 41.600 కిలోలు తూకం వేస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోతామనే బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. జెడ్పీటీసీ నాగం కుమార్, మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు దారం చంద్రం, పులి సత్తయ్య, గొట్టె ప్రభాకర్, చిలుక భూమేశ్, డిష్ రవి తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో జీపీ కార్మికురాలు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మేజర్ గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు లింగం సూరవ్వ(58) బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది. సూరవ్వ తంగళ్లపల్లి గ్రామపంచాయతీలో 20 ఏళ్లుగా పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమెకు భర్త నర్సయ్య, కొడుకు ఉన్నారు. సూరవ్వ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. మూడు నెలలుగా వేతనం పెండింగ్లో ఉందని, సమయానికి వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూని యన్ మండలాధ్యక్షుడు బుర్ర శ్రీని వాస్, కార్యదర్శి లింగంపల్లి కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు రవీందర్, నాయకులు అన్నల్దాస్ గణేశ్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం భోజన్నపేటకు చెందిన చిట్యాల బన్నీ (19) వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై లక్ష్మణ్రావు వివరాల ప్రకారం.. గత నెల 23న బన్నీ హన్మంతునిపేట శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. వడదెబ్బతో రైతు మృతి శంకరపట్నం(మానకొండూర్): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన రైతు గొల్లపల్లి రాజయ్య(55) గురువారం వడదెబ్బతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రాజయ్య మధ్యాహ్నం ఇంటికి వచ్చి అస్వస్థకు గురై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందాడు. యువకుడి ఆత్మహత్య కోరుట్ల: పట్టణానికి చెందిన ఇందూరి నరసింహాచారి (25) యాసిడ్ తా గి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సుల కథనం ప్రకారం ఇందూరి వెంకటరమణ, విజయ దంపతుల కుమారుడు నరసింహా కంసాలి పనిచేస్తున్నాడు. కొంతకాలంగా సరైన పని దొ రకడం లేదు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక రాంనగర్ ఏరియాలో యాసిడ్ తాగాడు. స్థానికులు అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య వెల్గటూర్: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వ్యక్తి క్రి మిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘ టన ఎండపల్లి మండలం అంబరిపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె రాయలింగయ్య (80) కొద్ది నెలలుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తితో గురువారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
అంతర్జాతీయ ప్రదర్శనకు అల్ఫోర్స్ విద్యార్థిని
కొత్తపల్లి(కరీంనగర్)/సుల్తానాబాద్: జపాన్లోని సకురలో ఈ నెల 25వ తేదీ వరకు ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఇన్స్పైర్ అవార్ుడ్సలో ‘వీల్ ఆక్సిల్ కెమెరా’ నమూనా ప్రదర్శించేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ విద్యార్థిని ఎం.పూజశ్రీ వెళ్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. జపాన్ వెళ్తున్న సందర్భంగా పూజశ్రీని గురువారం అభినందించిన ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డులో పూజశ్రీ ప్రదర్శించిన వీల్ ఆక్సిల్ కెమెరా నమూనా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రశంసలు అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. జపాన్లో నమూనాను ప్రదర్శించేందుకు వెళ్తున్న అల్ఫోర్స్ విద్యార్థి పూజశ్రీ తెలంగాణ నుంచి రెండో విద్యార్థిని కావడం విశేషమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సైతం సత్తాచాటి ఉత్తమ నమూనాగా ఎంపిక కావాలని అకాంక్షించారు. పూజశ్రీని పెద్దపల్లి డీఈవో మాధవి, డీఎస్వో రవినందన్రావు, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
స్కాన్ చేయండి.. కథలు చదవండి
జ్యోతినగర్: వేసవి కాలం చిన్నారులకు సెలవుల కాలం.. ఎండలు మండిపోతున్నాయి. పిల్లలు బయటకు వెళ్లకుండా చూసేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వేసవి సెలవులను సద్విని యోగం చేసుకునేలా ఫోన్ చేసి నవలలు, కథలు వినేలా రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్, విద్యాశాఖ సహకారంతో టోల్ ఫ్రీ నంబర్ 040–452–09722ను అందుబాటులోకి తెచ్చింది. కాల్ చేసి కథలు వినండి పేరిట ప్రత్యేక కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టింది. తాజాగా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా నవలలు, కథలను చిత్రాలను చూస్తూ చదివించేందుకు చర్యలు చేపట్టింది. దీనివల్ల పిల్లలు చదవడం, రాయడం, మాతృభాషలో స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుందని భావిస్తోంది. పిల్లలు బయట ఆడుకోకుండా.. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రతిఒక్కరూ వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. పిల్లలు బయట ఆడుకోకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దో హదపడనుంది. చా లామంది సెల్ఫోన్లో ఆటలు, ఇతర బొమ్మలు చూస్తూ ఉండిపోతున్నారు. అలాగే, టీవీ దగ్గర నుంచి కదలకుండా ఉంటున్నారు. ఇదివరకు పిల్లలు క్రికెట్, కోతికొమ్మచ్చి, కబడ్డీ, సిర్రగోనెతోపాటు పలు ఆటలు ఆడేవారు. నేడు వాటిని మరిచిపోయి ఇంట్లో ఫోన్లతో ఆటలు ఆడుకుంటున్నారు. దీంతో విద్యాశాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. లిటరసీ క్లౌడ్ క్యూర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి, కథలు, నవలలు, సందేశాత్మక చిత్రాలను చూడొచ్చు, చదవొచ్చు. //htt p iterac yc o ud.or-f-/sot-r-ier? a nf uafe= te uf u& rhort new-%20ar-riva r లింక్ ద్వారానూ సమాచారం తెలుసుకోవచ్చు. అందుబాటులోకి క్యూఆర్ కోడ్ గతంలో టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి, వినే కార్యక్రమానికి శ్రీకారం విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచన -
పాతపెన్షన్ విధానం అమలు చేయాలి
● ఎస్జీటీ యూనియన్ కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం(ఎస్జీటీ యూనియన్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కరివేద మహిపాల్రెడ్డి, అరికెల వెంకటేశం అన్నారు. గురువారం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని హైదరాబాద్లోని వేతన సవరణ కమిటీ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమికస్థాయిలో బోధించే టీచర్లకు అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రతిపాదిత ఎస్జీటీ ఉపాధ్యాయుల వేతన స్కేలు రూ.71500 నుంచి రూ.2.20,770గా ఉండాలని కోరారు. పెరిగిన నిత్యావసరాల ధరలను అనుసరించి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన పీఆర్సీ 43శాతానికి తగ్గకుండా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 శాతంగా వార్షిక వేతన హెచ్చింపు ఇంక్రిమెంట్ ఇస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం మూడుశాతం ఇవ్వాలని కోరారు. మాస్టర్ స్కేలు విధానాన్ని 80 స్టేజీలు, 32 గ్రేడ్లతో ఉండాలని, 2023 జూలై నాటికి గల డీఏ 33.76 శాతం, 43 శాతం ఫిట్మెంట్తో కలిపి మొత్తం 73.67 శాతం మాస్టర్ స్కేలు ప్రతిపాదించాలన్నారు. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.16 లక్షలుగా ఉండగా, రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు 5 నుంచి 8కి పెంచాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) అలవెన్సును పునరుద్ధరిస్తూ ఒక్కో ఉపాధ్యాయుడికి టీఎల్ఎం అలవెన్సుగా రూ. 2 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నామమాత్ర వడ్డీతో రూ.50 లక్షల వరకు గృహరుణాలు మంజూరు చేయాలన్నారు. ఏడాదికి 12రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించాలని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పడుతున్న అనారోగ్య సమస్యల వలన అర్ధవేతన సెలవులు 20 రోజుల నుంచి 30రోజులకు పెంచాలన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. -
జగిత్యాలలో హైటెక్ వ్యభిచారం
● శివారు ఇళ్లలో నిత్యకృత్యం ● వాట్సాప్ స్టేటస్ల్లో యువతుల ఫొటోలు ● ఐదునెలల్లో ఐదుగురిపై కేసులు ● జగిత్యాల జిల్లాకేంద్రం నడిబొడ్డున ఇటీవల వ్యభిచారం చేస్తూ కోదాడకు చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. ● జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో మూడు నెలలుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ● మల్యాల మండలం నూకపల్లి అర్బన్హౌసింగ్ కాలనీ సమీపంలో ఓ ఇంట్లో గత కొద్దిరోజులుగా జోరుగా వ్యభిచారం జరుగుతోంది. పలువురు పోలీసులకు సమాచారం అందించినా నిర్వాహకులు చాకచక్యంగా తప్పించుకుంటూ.. అక్కడే ఇళ్లను మార్చుతున్నారు. జగిత్యాలక్రైం: జిల్లాలో కొద్దికాలంగా వ్యభిచారం జోరుగా సాగుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల, కొండగట్టు, బీర్పూర్లలో పరిచయం ఉన్న వ్యక్తులకు వివిధ ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకొచ్చి వారి ఫొటోలు పంపిస్తూ రేటు కుదుర్చుకుని వ్యభి చారం చేయిస్తున్నారు. ఇలా జిల్లాలో 2023లో 10 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురిపై రెండు కేసులు నమోదు చేశారు. యువతులతో ఎర కొంతమంది ప్రముఖులకు అందమైన యువతులను వారు కోరిన చోటకు (ఫాంహౌస్లు, గెస్ట్హౌస్లు, ఇళ్లకు) పంపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు ప్రముఖులు యువతుల కోసం వాహనాలు సమకూర్చుతుండడం గమనార్హం. నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, వైజాగ్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, కోదాడ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తూ యువకులకు వాట్సాప్ స్టేటస్ల ద్వారా పంపిస్తున్నారు. నచ్చిన యువతికి ఫోన్లోనే రేటు కుదుర్చుకుంటున్నారు. ఫోన్పే, గూగుల్పే ద్వారా డబ్బులు పంపించాక వారు చెప్పిన అడ్రస్కు పంపిస్తున్నారు. నిఘా పటిష్టం చేశాం జిల్లాలో వ్యభిచారం అరికట్టేందుకు నిఘా పటిష్టం చేశాం. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో నిఘా పెడుతున్నారు. దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. – సన్ప్రీత్సింగ్, జగిత్యాల ఎస్పీ -
మళ్లీ అమ్మహస్తం
● రేషన్ దుకాణాల్లో పెరగనున్న సరుకులు ● సీఎం ప్రకటనతో కార్డుదారుల్లో హర్షం ● డీలర్లకు, హమాలీలకు ప్రయోజనం కరీంనగర్ అర్బన్: రేషన్ దుకాణం మళ్లీ పూర్వఽశోభను సంతరించుకోనుందా.. నిత్యవసర సరుకుల భారం తప్పనుందా.. సీఎం ప్రకటనతో అదే నిజమనిపిస్తోంది. వీలైనంత త్వరగా రేషన్ దుకాణాల్లో సరుకుల సంఖ్య పెంచుతామని బుధవారం జరిగిన సమీక్షలో సీఎం ప్రకటించడంతో మళ్లీ అమ్మహస్తం తెరపైకొచ్చింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో అమ్మహస్తం పథకం కింద 8రకాల సరుకులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుండగా డీలర్లు, హమాలీలకు ఉపాధి దొరకనుంది. కార్డుదారులపై తగ్గనున్న కోట్ల భారం పదేళ్ల క్రితం ఎనిమిది రకాల సరుకులు ఇవ్వగా ఒక్కో సరుకుకు కోత పెడుతుండటంతో నిరుపేద కుటుంబాలపై నెలకు రూ.27కోట్ల భారం పడుతుండగా ఏటా రూ.328కోట్లను కార్డుదారులు అదనంగా ఖర్చు చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా మలుస్తామని చెప్పగా ప్రస్తుతం ప్రభుత్వం మారడం సరుకుల సంఖ్యను పెంచుతామని ప్రకటించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వపరంగా నిత్యవసర సరుకులు ఇవ్వాలనే లక్ష్యంతో 1975–80 కాలంలో చౌక ధరల దుకాణాలను తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి పేదల నిత్యవసర వస్తువులను చేర్చుతూ పంపిణీ చేసేది. పండుగలు వచ్చినపుడు కోటా పెంచడం జరిగేది. సామాన్యులకు భారం కాకూడదనే భావనతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.185కే 8 రకాల సరుకులు పంపిణీ చేసింది. 2014 వరకు ఒడిదుడుకుల మధ్య ఇదే విధానం సాగగా ప్రస్తుతం పరిస్థితి డోలయమానంలో పడింది. గతంలో ప్రతీకార్డుదారుకు అరకిలో చొప్పున చక్కెర, కిలో కందిపప్పు, రెండు కిలోల గోధుమలు, గోధుమపిండి, పసుపు, ఉప్పు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండే సరుకులు కార్డుదారులకు సరుకుల సంఖ్య ఏటేటా తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. తొలుత పామాయిల్ తదుపరి కందిపప్పు అనంతరం గోధుమలు, ప్రస్తు తం చక్కెర సరుకులకు మంగళం పాడటంతో ఇక రేషన్ దుకాణాలు ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 2,080 రేషన్ దుకాణా లు ండగా 10.93లక్షల కార్డుదారులున్నారు. ఇందులో ఆహారభద్రత కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెలా 20,139 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుండగా కేవలం అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకే చక్కర సరఫరా చేస్తున్నారు. డీలర్లకు ఉపాధి దెబ్బ వాస్తవానికి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న క్రమంలో రేషన్ దుకాణాల్లో అవసరమున్న సరుకులు అందుబాటులో ఉంచాల్సి ఉండగా తదనుగుణంగా చర్యలు కరవయ్యాయి. 1984లో నిర్ణయించిన కమీషనే నేటివరకు కొనసాగుతుండగా ప్రస్తుతం వస్తున్న సరుకులతో క్వింటాల్ బియ్యాన్ని ఇచ్చేది రూ.75, ఖాళీ సంచుల ద్వారా మరో రూ.1800 వస్తుండగా నెలకు ఒక్కొ డీలర్కు సగటున వచ్చే ఆదాయం అరకొరే. అద్దె, ఇతరత్రా ఖర్చులు పెరుగుతుండగా మిగిలేది శూన్యం. సీఎం ప్రకటనతో మళ్లీ పాత రోజులు వస్తాయని, ఉపాధి మెండుగా ఉంటుందని డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రేషన్ దుకాణాలు: 2080 మొత్తం కార్డులు: 10,93,674 ఆహారభద్రత కార్డులు: 10,25,692 అంత్యోదయ కార్డులు: 67,317 అన్నపూర్ణ కార్డులు: 665 తగ్గిన సరుకులతో నెలకు భారం: రూ.27కోట్లు ప్రస్తుతం సరఫరా అవుతున్న సరుకులు ప్రతీనెలా బియ్యం సరఫరా: 20,139మెట్రిక్ టన్నులు చక్కర: 67,982కిలోలు(అంత్యోదయకే) -
ధాన్యం కొనుగోలు చేయాలి
కోనరావుపేట/చందుర్తి(వేములవాడ): ధాన్యం కొనడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించడం లేదంటూ కోనరావుపేట మండల కేంద్రం, చందుర్తి మండలం జోగాపూర్లో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ కోనరావుపేటలోని కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా లారీలు రావడం లేదన్నారు. తూకం వేసిన బస్తాలు ఇప్పటికే 3వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చందుర్తి మండలం జోగాపూర్లో నెల రోజులు లారీలు రాక ధాన్యాన్ని కాంటా పెట్టడం లేదన్నారు. ధర్నాలో రైతులు చల్ల వెంకట్రెడ్డి, గంగసాని రమణారెడ్డి, రత్నాకర్, యాస రాజం, మాందాల శ్రీనివాస్, సదానందం, జోగాపూర్లో మాజీ సర్పంచ్ మ్యాకల పర్శరాములుతోపాటు 30 మంది రైతులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement