-
పునరావాస ప్రాంతంలో డంపింగ్ యార్డా?
మంథని: బిట్టుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న రచ్చపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో మంథని మున్సిపల్ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని డీఏవో రవీందర్కు వినతిపత్రం అందజేశారు. ప్రశాంతమైన పల్లెవాతావరణంలో నివసించే తాము.. సింగరేణి విస్తరణకు తమ పొలాలు ధారాదత్తం చేశామని అందులో పేర్కొన్నారు. పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కాలనీలో మున్సిపాలిటీ చెత్తడంపింగ్పు యార్డుకు స్థలం కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిద్వారా తాము అనారోగ్యం పాలవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమ ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జనగామ నర్సింగారావు, గ్రామస్థులు ఉన్నారు. కాగా కాలనీలో దోబీఘాట్కు కేటాయించిన స్థలంలో గ్రామప్రత్యేకాధికారి, గ్రామ కార్యదర్శికి సమాచారం లేకుండా మంథని మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా చెత్త తీసుకురావడాన్ని నిలిపివేసినట్లు మాజీ సర్పంచ్ కనవేన శ్రీనివాస్ తెలిపారు. దానిని వెంటనే ఆపేయండి డీఏవోకు విన్నవించిన బిట్టుపల్లి గ్రామస్తులు -
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ..
● స్థానిక సంస్థలకు పాత రిజర్వేషన్ల పద్ధతిన ఎన్నికలు నిర్వహించడమా? అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణ చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించడమా?అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కులగణన కోసం ఇంటింటి సర్వే చేపట్టి బీసీల వివరాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి అందజేయాడినికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదికను సర్కారు ఆమోదించి, రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలాసమయం పడుతుంది. మరోవైపు.. ప్రస్తుత రిజర్వేషన్లు పెంచి బీసీలకు 50శాతం ఇవ్వాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వివరాలు అందజేత స్థానిక సంస్థలకు మూడు పర్యాయాలు అమలు చేసిన రిజర్వేషన్ల వివరాలతో పాటు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ తదితర వివరాలను పంచాయతీరాజ్శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇటీవల అందజేశారు. అయితే, ఎన్నికల నిర్వహణపై తమకు ఆదేశాలు రాలేదని, ఆదేశాలు వస్తే నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. -
పోరుబాటలో ఆరోగ్య మిషన్ ఉద్యోగులు
● మూడు నెలలుగా అందని వేతనాలు ● 24న హైదరాబాద్లో ధర్నాకు సన్నద్ధంజ్యోతినగర్(రామగుండం): ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో అగ్రభాగాన నిలుస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. కుటుంబ పోషణ భారమై వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిన వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బకాయిల కోసం ఈనెల 24న హైదరాబాద్లో ధర్నా నిర్వహంచేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు జిల్లా నుంచి భారీసంఖ్యలో రాష్ట్ర రాజధానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీగా వేతన బకాయిలు.. ● రాష్ట్రంలోని ఎన్హెచ్ఎంలో పనిచేసే ఉద్యోగుల కు వేతన బకాయిలు, పీఆర్సీ ఎరియర్స్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ● రాష్ట్రంలోని 78 క్యాడర్లలో సుమారు 17వేల మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన వివిధ విభాగాల్లో పేషెంట్లకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారు. ● అయినా, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంలేదు. ● ఆర్థికంగా సమస్యలు ఎదురై వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ● మూడు నెలలుగా వేతనాలు అందక దయనీయ పరిస్థితి దుర్కొంటున్నాయి. ● ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కుటుంబపోషణ ఎలా? అని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ● వేతనాల కోసం ఇప్పటికే సంబంధిత శాఖ కమిషనర్ కార్యాలయం, జిల్లా అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేకుండాపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఉద్యోగులు.. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగులు పేషెంట్లకు నిత్యం వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో ఏఎన్ఎంలు, ఆర్బీఎస్కే డాక్టర్లు, ఎంఎల్ హెచ్పీలు, అర్బన్ హెల్త్ సెంటర్ లోని సీవో, అకౌంటెంట్, ఎంఎన్వో, వాచ్మెన్, స్వీపర్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, డీఈవో, కంటిజెంట్ వర్కర్లాంటి ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఇవి.. ● ప్రతీనెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి ● పెండింగ్లోని మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి.24న ధర్నా చేస్తాం ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఈనెల 23వ తేదీ సాయంత్రం వరకు వేతనాలు అందించాలి. లేనిపక్షంలో హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ఎదుట ఈనెల 24న ధర్నా చేస్తాం. ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఇందుకోసం సిద్ధం కావాలి. – లావుడ్య సురేశ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు, ఎన్హెచ్ఎం -
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ప్రయాణం
● ప్రమాదకరంగా ఫైవింక్లయిన్ – సెంటినరీకాలనీ రోడ్డు ● శిథిలమైన రహదారి.. అడుగుకోగుంత ● తరచూ ప్రమాదాలు.. గాయాలపాలవుతున్న కార్మికులు గోదావరిఖని: నిత్యం వందలాది ప్రయాణికులు, కార్మికులు ప్రయాణించే సింగరేణి కోల్కారిడార్ రో డ్డు ప్రమాదకరంగా మారింది. గోదావరిఖని ఫైవింక్లయిన్ నుంచి సెంటినరీకాలనీ వరకు సుమారు 20 కిలోమీటర్ల పొడవైన రహదారిని దశాబ్దం క్రితం సింగరేణి యాజమాన్యం నిర్మించింది. వివిధ ప్రాంతాల్లోని కార్మికులు ఈ రోడ్డుగుండా ప్రయాణించి విధులకు హాజరవుతారు. అయితే, షిఫ్టువేళల్లో ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికమవుతోంది. సు మారు పదేళ్లక్రితం నిర్మించిన కోల్కారిడార్ రోడ్డుకు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. దీంతో చాలా చోట్ల తారు లేచిపోయింది. గుంతలు పడి వాహ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్నవారు వాటిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. విధులకు వెళ్లేందుకు ఇదే మార్గం.. ● రామగుండం రీజియన్లోని ఆర్జీ–1, 2, 3, ఏపీఏ సింగరేణి కార్మికులు విధులకు వెళ్లడం, తిరిగి ఇంటికి రావడానికి కోల్కారిడార్ రోడ్డు కీలకంగా మారింది. ● ఓసీపీల విస్తరణ నేపథ్యంలో గతంలోని రోడ్లను మూసివేసిన సింగరేణి యాజమాన్యం.. కోల్కారిడార్ పేరిట అన్ని గనులు, కార్మికవాడలను కలుపుతూ రోడ్డు నిర్మించింది. ● అయితే, కోల్కారిడార్ రోడ్డుకు మరమ్మతులు చేయడం, వీధిదీపాలు బిగించడం బాధ్యత కూడా యాజమాన్యమే చూస్తోంది. ● అయితే, నిర్వహణ లేక రెండు రోజుల క్రితం ఓసీపీ–3 ఓల్డ్సైటాఫీస్ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఓ సింగరేణి కార్మికుడు గాయపడ్డాడు. ● ఇలాంటి సంఘటనలు ఈ మార్గంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. రెడ్జోన్గా పోతనకాలనీ రోడ్డు.. సింగరేణి కోల్కారిడార్ రోడ్డు పోతనకాలనీ వద్ద ఇరుకుగా మారింది. రోడ్డుకు ఓపక్క పోతనకాలనీ క్వార్టర్ల ప్రహరీ, మరోపక్క ఎన్టీపీసీ రైల్వేలైన్ ఉన్నాయి. దీంతో కోల్కారిడార్ రహదారి ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. జాడలేని వీధిదీపాలు.. కోల్కారిడార్ రోడ్డు నిర్మాణ సమయంలోనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. మాట ప్రకారం చాలావరకు విశాలమైన రహదారి నిర్మించిన యాజమాన్యం.. స్థలాభావంతో పోతనకాలనీవంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తరించలేకపోయింది. దీనికితోడు రహదారి వెంట ఎక్కడా వీధిదీపాలు ఏర్పాటు చేయలేదు. చిమ్మచీకట్లో వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని వారు కోరుతున్నారు. -
పకడ్బందీగా గ్రూప్–1 ప్రిలిమినరీ
సాక్షి, పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా జూన్ 9న చేపట్టే గ్రూప్ – 1 ప్రిలిమినరీకి అన్నిఏర్పాటు పూర్తిచేసి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు గ్రూప్ – 1 ప్రిలిమినరీ నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 6,098మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరికోసం 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష హాల్లో ఫర్నీచర్, టాయిలెట్లు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రశ్నాపత్రాలు రెండు సెట్లు పరీక్షకు రెండు రోజుల ముందు జిల్లాకు వస్తాయని, వాటిని వేర్వేరుగా పోలీస్స్టేషన్లలోని స్ట్రాంగ్రూముల్లో భద్రపరచాలన్నారు. పరీక్షరోజు ఉదయం ఒకసెట్ నిర్ణయించి రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. బయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 9గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రలోకి అనుమతిస్తారని ఆయన వివరించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు హనుమా నాయక్, గంగయ్య, ఏసీపీ కృష్ణ, డీఈవో మాధవి, అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అక్రమ మైనింగ్కు పాల్పడితే కఠిన చర్యలు జిల్లాలో అక్రమంగా ఇసుక, ఇతర గనుల్లో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ హెచ్చరించారు. అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, ఇతర సహజ వనరులు తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మైనింగ్, నీటి పారుదల తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అక్రమంగా రవాణా చేస్తే 79950 70699 ఫోన్నంబరుకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి
సాక్షి, పెద్దపల్లి/ధర్మారం(ధర్మపురి): కొనుగో లు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆదేశించారు. నందిమేడా రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రైతులతో మా ట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు చేర్చాలని సూచించారు. కోత లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ రజిత, రెవె న్యూ ఇన్స్పెక్టర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మల్లన్నకు పట్నాలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జునస్వామి, సీతరామచంద్రస్వామి, ఖండలరాయుడు, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అడుగంటిన ‘ఎల్లంపల్లి’ రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అడుగంటింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 అడుగులుకాగా, నీటి నిల్వసామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 140.49 అడుగులు ఉండగా, నీటి నిల్వలు 5.47 టీఎంసీలకు పడిపోయాయి. గతేడాది ఇ దేరోజు 145.38 మీటర్ల నీటిమట్టం ఉండ గా, 13.48 టీఎంసీల నీరు నిల్వఉంది. ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి 126 క్యూసెక్కులు, హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 331 క్యూ సెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 136 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని నీటిపారు దల శాఖ అధికారులు బుధవారం తెలిపారు. కాలుష్య రహిత గ్రామాల ఎంపిక ఓదెల(పెద్దపల్లి): అబ్బిడిపల్లె, లంబాడితండా కాలుష్య రహిత గ్రామాలుగా ఎంపికై నట్లు ఎంపీవో భాస్కర్ బుధవారం తెలిపారు. వందశా తం పచ్చదనం, వాతావరణ సమతుల్యత సాధించడంతో కాలుష్యరహిత గ్రామాలుగా ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి 2024–25 సంవత్సరానికి ఉత్తమ పంచాయతీలుగా ఎంపికవుతాయని సమాచారం. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో శుక్రవారం జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూ ర్తిచేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధి కారి కల్పన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 3,196 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,314 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. వీరికోసం మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. మంథనివాసికి పురస్కారం మంథని: పట్టణానికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఖాజామొయినొద్దీన్ మహా మయూర పురస్కారం అందుకున్నారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లైవ్ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా తెలుగులో 188 నిమిషాల పాటు అనర్గళంగా ప్రసంగించారు. దీంతో హైదరాబాద్ మౌలాలిలోని సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్లో టీవీ, త్రీడీ ఆర్టిస్ట్ సింగారపు శివరామకృష్ణ, ఎస్ఎస్ ఆర్కే అకాడమీ సంయక్తంగా ఏర్పాటు కార్యక్రమంలో ఖాజా ఈ అవార్డు అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు. -
గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు హర్షణీయం
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేశ్రెడ్డి సాక్షి, పెద్దపల్లి: అధికార దాహంతో మానేరు నుంచి ఇసుక అక్రమంగా తరలించి రూ.వేల కోట్లు దోచుకున్న గత ప్రభుత్వానికి చెన్నయ్ హరిత ట్రిబ్యునల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చెంప పెట్టులాంటిదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేశ్రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి ఇసుక మానిటరింగ్ కమిటీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంతో బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేశ్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా మానేరు తీరంలో 19 ఇసుక రీచ్లకు అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టిందని పేర్కొన్నారు. అవినీతికి బాధ్యులను చేస్తూ ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు రూ.50కోట్ల జరిమానా విధించిందని, ఆ సొ మ్మును మూడు నెలల్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఖాతాల్లో జమచేయాలని ట్రిబ్యునల్ సూచించిందన్నారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్లను వెంటనే ముసివేయాలని, అవినీతిపరులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మూడేళ్లుగా ప్రాణాలకు తెగించి తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన రైతులు, ప్రజలకు కృతజ్ఞాతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు శిలారపు పర్వతాలు, సత్యనారాయణ, శంకర్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై నిఘా
● అనుమతి లేకుండా సహజ వనరులు తరలిస్తే చర్యలు ● మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి హనుమా నాయక్ రామగిరి(మంథని): డివిజన్లోని మానేరు పరీవాహక ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఇసుక, ఇతర సహజ వనరులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ఆర్డీవో హనుమా నాయక్ హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని రెవెన్యూ, పోలీసు, మైనింగ్, పంచాయతీరాజ్, నీటి పారుదల తదితర శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. మానేరులో తవ్వకాలు, రవాణాపై నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా సహజ వనరులు తరలిపోవడానికి కారణమైనా, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినా చర్యలు తప్పవని అధికారులను కూడా హెచ్చరించారు. అక్రమ మైనింగ్, ఇసుక రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే 79950 70699 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగిరి, మంథని, ముత్తారం తహసీల్దార్లు రాంచందర్రావు, రాజయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ సందడి
సాక్షి, పెద్దపల్లి: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కష్టపడిన వారిని గుర్తించి వారి విజయానికి సాయపడతామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డితోపాటు స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు స్థానిక నాయకులను ఆకర్షించేందుకు హామీలిచ్చారు. వాటికి అనుగుణంగా కోడ్ ముగిశాక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. పల్లెలో మరోసారి రాజకీయ హడావుడి మొదలు కానుంది. ఇందుకు గ్రామస్థాయి నాయకులు కూడా పోటీకి సై అంటున్నారు. ఆశావహుల సన్నద్ధం.. ● పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం, అభ్యర్థుల గెలుపు కోసం చేసిన కృషి గురించి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు వివరించి స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలని ఆశావాహులు సిద్ధమవుతున్నారు. ● సర్పంచుల పదవీకాలం గత ఫ్రిబవరిలోనే ముగిసింది. ● మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం వచ్చేజూలై 3వ తేదీతో ముగియనుంది. ● ఈలోగా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రత్యేకాధికారులను నియమించాల్సి వస్తుంది. ● గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. స్పష్టత కరువు.. సందడి మొదలు పంచాతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, 1 ఫిబ్రవరి 2024తో ఆ పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రాదేశిక సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియక ముందే.. అంటే.. 2019 మే15న ఎన్నికల పక్రియ పూర్తిచేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. దీని ప్రకారం రెండు పర్యాయాలు ఒకేరిజర్వేషన్ విధానం అమలులో ఉంటుంది. దీనికితోడు జిల్లాలో కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలు వేరే జిల్లాల్లో విలీనమయ్యాయి. మున్సిపాలిటీల్లో వీలినమైన పల్లెలు పంచాయతీలుగా అప్గ్రేడ్ సాధించాయి. వాటికీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈక్రమంలో వీటికి వర్తింపజేసే రిజర్వేషన్ ఏమిటనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదేమీ రాకుండానే ఆశావహులు గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ చేశారు. తమ మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు.జిల్లా సమాచారం గ్రామపంచాయతీలు 267 వార్డులు 2,270 ఎంపీటీసీలు 138 ఎంపీపీలు 13 జెడ్పీటీసీలు 13 పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ కుల గణన, బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ -
టాస్క్ భవనానికి కార్పొరేట్ లుక్
● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సాక్షి, పెద్దపల్లి: కార్పొరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునికీకరణకు ప్రతిపాదనలు రివైజ్ చేసి సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, గ్లాస్డోర్, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం ప్రవేశ ద్వారం వద్ద టాస్క్ చిహ్నంతో కూడిన గ్లాస్డోర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు నాణ్యతతో కూడిన ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులను వినియోగించాలని, భవనం ప్రాంగణాన్ని నిర్దేశించుకొని కాంపౌండ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కాంపౌండ్ ఫెన్సింగ్ లోపల టాస్క్ భవన ప్రాంగణంలో గార్డెనింగ్, టాయిలెట్లు నిర్మించాలని అన్నారు. బయట ఉడెన్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ఉడెన్ టేబుల్స్ శిక్షణ తరగతుల నిర్వహణకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా వాటిని వినియోగిస్తూ ఆధునికీకరించేలా కొత్తడోర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగాప్రసాద్, పీఆర్ శంకరయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి లక్ష్యం వంద మిలియన్ టన్నులు
● ఏటా 10శాతం వృద్ధి సాధించాల్సిందే.. ● అధికారులకు సంస్థ డైరెక్టర్ల దిశానిర్దేశం గోదావరిఖని: రాబోయే ఐదేళ్లలో ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే దిశగా అధికారులు సన్నద్ధం కావాలని సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్లో మంగళవారం వచ్చే ఐదేళ్లలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాల్లో వృద్ధి, వివిధ రంగాల్లో సంస్థ విస్తరణ తదితర అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. అన్ని రంగాల్లో 10శాతం వృద్ధి సాధించి 2029–30 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదు చేయాలని డైరెక్టర్లు అన్నారు. దేశ విద్యుత్, బొగ్గు అవసరాల దృష్ట్యా సింగరేణి నిర్దేశిత లక్ష్యం సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా థర్మల్, సౌర, జియో ఉత్పత్తిలోనూ వృద్ధి సాధించాలని సూచించారు. లక్ష్య సాధనకు ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలన్నారు. ఉద్యోగుల హాజరు శాతం పెంచడం, కొత్త బొగ్గు గనులు ప్రారంభించడం, ఓబీ(ఓవర్ బర్డెన్) వెలికితీత పెంచడం, రవాణా, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించడం, వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం, ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దడం లాంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఆర్జీ – 1, 2, 3, ఏపీఏ జీఎంలు చింతల శ్రీనివాస్, ఎల్వీ సూర్యనారాయణ, ఎన్.సుధాకర్రావు, కె.వెంకటేశ్వర్లు, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీకాంరపూర్ జీఎంలు హబీబ్హుస్సేన్, డి.రవిప్రసాద్, బి.సంజీవరెడ్డి, మనోహ ర్, కార్పొరేట్ అధికారులు పాల్గొన్నారు. -
కార్మిక కుటుంబాలకు మురుగునీరు
● ఆ నీళ్లు తాగితే వ్యాధులు రావా? ● టీబీజీకేఎస్ నాయకుల ఆగ్రహం గోదావరిఖని: నగరం నుంచి వెలుడే మురుగునీరు సమీప గోదావరినదిలో కలుస్తోందని, అదేనీటిని పంపుల ద్వారా సింగరేణి కార్మిక కాలనీలకు సరఫరా చేస్తున్నారని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు. ఆ నీటిని తాగితే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు వ్యాధుల బారినపడరా? అని ప్రశ్నించారు. మంగళవారం గోదావరినదిలోని నీటిని, ఫిల్టర్బెడ్కు చేరిన నీటిని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. గోదావరిఖనిలో నివసిస్తున్న సింగరేణి కార్మిక కుటుంబాలు.. నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని తాగవద్దన్నారు. విషంతో సమానమైన నీటిని సరఫరా చేస్తున్న సింగరేణి యాజమాన్యం తీరు సరికాదన్నారు. గోదావరినదిలో సింగరేణి యాజమాన్యం నిర్మించిన ఫిల్టర్ల వద్ద చుక్కనీటి ప్రవాహం లేదన్నారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి వస్తున్న డ్రైనేజీ నేరుగా గోదావరినదిలో కలుస్తోందని తెలిపారు. ఈ నీటినే పంపుల ద్వారా ఇన్టెక్వెల్ నుంచి ఫిల్టర్బెడ్లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. గంగానగర్ ఫిల్టర్బెడ్లో కూడా నీటిని సక్రమంగా శుద్ధి చేయడం లేదని ఆరోపించారు. గోదావరిఖనికి రోజూ 24ఎంఎల్డీలు అవసరం ఉందన్నారు. నీటి అవసరాలకు తగ్గట్లు ఫిల్టర్బెడ్ల నిర్మాణం లేదన్నారు. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీకి గోదావరినది నుంచి నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిసినా.. యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. సింగరేణి యాజమాన్యం సత్వరమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కార్మికవాడలకు ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, చల్ల రవీందర్రెడ్డి, రొడ్డ సంపత్, ఉప్పులేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన వేసవి శిక్షణ శిబిరం
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: స్థానిక జీఎం కా లనీ మైదానంలో నెల రోజుపాటు కొనసాగిన క్రికె ట్ వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గో దావరి బ్లూస్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత శిక్షణ శి బిరం నిర్వహించింది. చిన్నారులకు బౌలింగ్, బ్యా టింగ్, ఫీల్డింగ్ తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చింది. శిక్షణ పొందిన 250మందికి హెచ్సీఏ జిల్లా అ ధ్యక్షుడు వి.ఆగమరావు సర్టిఫికెట్లు అందజేశారు. క్యాంప్ కో ఆర్డినేటర్లు కిరణ్కుమార్, సురేశ్, రవి, శ్రీనాథ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం వాయిదా
సాక్షి, పెద్దపల్లి: జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం వాయిదా పడింది. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో చేపట్టిన స మావేశానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్తో పాటు పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో నరేందర్ ప్రకటించారు. అధికారి కుటుంబానికి అండగా ఉంటాంగోదావరిఖని: ఇటీవ ల ఆత్మహ త్య చేసుకు న్న మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మ ల్ విద్యుత్ ప్లాంట్ యువ ఇంజినీర్ కిరీటి కుటుంబానికి అండగా ఉంటా మని సీఎండీ బలరాం పేర్కొన్నారు. మంగళవారం మృతుడి తండ్రి రఘురామాచారితో ఆయన ఫోన్లో మాట్లాడారు. సంస్థ యువ ఇంజినీర్ను కోల్పోవడం బాధాకరమన్నారు. మృతికి దారితీసిన అంశాలపై శాఖాపరమైన ధర్యాప్తు చేపడతామని తెలిపారు. సంస్థపరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలు సకాలంలో అందించేలా చూస్తామన్నారు. మరోవైపు.. సింగరేణి డైరెక్టర్లు గోదావరిఖనిలోని ఆ అధికారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారుడి ఎంపిక రామగుండం: పట్టణానికి చెందిన పల్లె శ్రీకర్ నిజామాబాద్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఉషూ పోటీలు సండ(ఫైటింగ్) 70కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జూలై 27న కర్ణాటక రాష్ట్రంలో జరిగే పోటీలకు శ్రీకర్ హాజరవుతాడని విక్టరీ షొటోకాన్ కరాటే ప్రతినిధి వడ్డెపల్లి సురేశ్ మంగళవారం తెలిపారు. శ్రీకర్ను కరాటే ప్రతినిధులు ముక్కెర శేఖర్, బోయపోతు రాము తదితరులు అభినందించారు. నేటినుంచి నీటి సరఫరాకు అంతరాయం సాక్షి, పెద్దపల్లి: పట్టణంలో బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పురపాలక సంఘం కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గాం మండలం ముర్మూర్లోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద ఏర్పడిన పైప్లైన్ లీకే జీతో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ప ట్టణవాసులు గమనించాలని ఆయన కోరారు. -
విద్యార్థులే వైద్యులు
మంథని: జిల్లాలో వెనుకబడిన ప్రాంతం మంథని. ఇక్కడి సర్కారు దవాఖానపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పేదలకు వై ద్య సేవలు నామమాత్రమే అయ్యాయ. ప్రతినెలా సర్కారు నుంచి వేతనాలు తీసుకునే డాక్టర్లు, సిబ్బంది తమకు బదులు వైద్యవిద్యార్థులు, ప్రైవేట్ డాక్టర్లను నియమించుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఒకరికి బదులు మరొకరు.. ● స్థానిక సామాజిక వైద్యశాలలో కాంట్రాక్టు, రె గ్యులర్ ప్రాతిపదికన వైద్యులు పనిచేస్తున్నారు. ● కొందరు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకావడంలేదు. ● వీరికి బదులు వైద్య కళాశాలల్లో పనిచేసే తృతీయ, ఫైనలియర్ వైద్య విద్యార్థులను నియమించుకుంటున్నారు. ● రెండేళ్ల క్రితం కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ డాక్టర్ ఇక్కడి వైద్యుడికి బదులు విధులు నిర్వర్తించారు. ● మీడియా రంగప్రవేశం చేయడంతో అప్పటి వైద్యుడికి షోకాజ్ నోటీస్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ● అంతేకాదు.. ప్రభుత్వ వైద్యుడికి బదులు సేవలు అందించిన ఆ ప్రైవేట్ డాక్టర్.. పేషెంట్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ● పేషెంట్ల బంధువుల ఆందోళనతో విషయం బయటకు పొక్కింది. ● దీంతో ఉన్నతాధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ● తాజాగా.. వారం క్రితం ఓ వైద్యురాలికి బదులు కరీంనగర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యవిద్యార్థి విధుల్లోకి వచ్చారు. ● ఈ విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయట పెట్టింది. ● ఇప్పడూ నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు. విధుల్లో ఒకరిద్దరే.. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన మంథని సామాజిక వైద్యశాల ముత్తారం, రామగిరి, కమాన్పూర్, మంథని మండలాలు, జయశంకర్ భూపాలపల్లి జి ల్లా మల్హర్ మండల ప్రజలకు పెద్దదిక్కుగా ఉంది. ఇక్కడ ప్రైవేట్ ఆస్పత్రులు కూడా లేవు. పేరుకే 50 పడకల ఆస్పత్రి. సౌకర్యాలు అంతంత మాత్రమే. ఐదుగురు కాంట్రాక్ట్, మరో ఆరుగురు రెగ్యులర్ వై ద్యులు ఉన్నారు. కానీ, ఓపీ విధుల్లో నిత్యం ఒకరు లేదా ఇద్దరే అందుబాటులో ఉంటారని పేషెంట్లు చెబుతున్నారు. ఓపీ తర్వాత డ్యూటీ డాక్టర్ ఓ గది లో విశ్రాంతి తీసుకునేందుకే పరిమితమవుతారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. వంతుల వారీ గా విధులకు హాజరవ్వడం ఇక్కడి వైద్యుల ప్రత్యే కత. నర్సింగ్ సిబ్బందిలో 56 మందికి మూడు షిఫ్టుల్లో.. ఉదయం నుంచి రాత్రివరకు 17 మంది నుంచి 18 మంది ఉన్నట్లు డ్యూటీ షార్ట్పై పేర్లు నమో దు చేస్తున్నారు. కానీ, ఇందులో సగం మంది కూడా విధుల్లో కనిపించరని విమర్శలు వస్తున్నాయి. పేషెంట్లపై నిర్లక్ష్యం.. ● కొందరు వైద్యులు, సిబ్బంది పేషెంట్లను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని, మరికొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శులు ఉన్నాయి. ● చిన్నసమస్యతో బాధపడుతూ వచ్చినా.. ప్రథమ చికిత్స చేసి పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్ ఆస్పత్రులకు రెఫర్ చేయడం తప్ప పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ● మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారని పేషెంట్లు ధ్వజమెత్తుతున్నారు. అధికారుల తీరుపై అనుమానాలు మంథని సర్కారు ఆస్పత్రి తీరు ఇది అప్గ్రేడ్కు సన్నాహాలు వైద్యవిద్య కాలేజీ ఏర్పాటులో భాగంగా మంథని సర్కారు ఆస్పత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం మంత్రి శ్రీధర్బాబు ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రాంత ప్రజలకు మొరుగైన వైద్యం అందించాలనే మంత్రి లక్ష్యానికి అధికారులు, సిబ్బంది తీరు తూ ట్లు పొడుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో పరిస్థితిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్కు పలువురు ఫిర్యాదు చేశారు. షోకాజ్ నోటీస్ జారీచేశాం మంథని ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్కు బదులు మరొకరు విధుల్లో ఉన్న విషయంలో ఓ వైద్యురాలికి షోకాజ్ నోటీస్ జారీచేసి వివరణ కోరాం. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన బయటి వ్యక్తిని మందలించాం. – రమాకాంత్, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా అధికారి, పెద్దపల్లి -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశం సుల్తానాబాద్రూరల్: నిర్దేశిత లక్ష్యం మేరకు ధా న్యం కొనుగోలు చేయడంతోపాటు వేగవంతంగా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గర్రెపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఉన్నారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ, అకాల వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో యాసంగి ధా న్యం కొనుగోళ్లను త్వరగతిన పూర్తిచేయాలని సూ చించారు. అకాలవర్షాలతో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం
● అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ పెద్దపల్లిరూరల్: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు. మనదేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లాలో స్వర్ణోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ను కలెక్టరేట్లో పలువురు శాస్త్రవేత్తలు కలుసుకుని స్వర్ణోత్సవాల టార్చ్ అందించారు. డాక్టర్ మోహన్సింగ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు తొలిసారి పాండిచ్చేరిలో 1974 మార్చి 21న కృషి విజ్ఞాన కేంద్రం స్థాపించారని అదనపు కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు మనదేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పంటల దిగుబడిలోనే కాకుండా రైతుల సాంఘిక, ఆర్థికాభివృద్ధికి అవి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. నూతన వంగడాలను సృష్టించడం, క్షేత్ర పరిశీలనలు, శిక్షణ, వివిధ మాధ్యమాల ద్వారా సలహాలు, సూచనలు అందించడంలో రైతులకు కీలకంగా మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఖిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, శాస్త్రవేత్తలు వై.వెంకన్న, భాస్కరరావు, వినోద్కుమార్, కిరణ్, నవ్య, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలేబుల్’ లో ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాల కో సం గిరిజన విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మి ల్ఖాన్ తెలిపారు. జిల్లాకు 5 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఐదో తరగతిలో గోండు బాలురకు ఒకటి, ఎనిమిదో తరగతిలో లంబా డ బాలికలకు ఒక సీటు కేటాయించినట్లు వివరించారు. జూన్ 12న లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారన్నారు. పూర్తివివరాలకు 96521 18867 నంబరులో సంప్రదించాలని సూచించారు. 31లోగా దరఖాస్తు చేయండి పెద్దపల్లిరూరల్: ప్రధానమంత్రి రాష్ట్రీయ బా లపురస్కార్ కోసం ఆసక్తిగల బాల,బాలికలు జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేయాలని జి ల్లా సంక్షేమశాఖ అధికారి రవూఫ్ఖాన్ కోరారు. మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోందన్నారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీ డలు, కళలు, సంస్కృతి, సైన్స్ టెక్నాలజీ, తదితర రంగాల్లో ప్రతిభ చూపిన ఆసక్తిగల 18 ఏళ్లలోపు బాల, బాలికలు పురస్కారాలకు అర్హుల ని వివరించారు. వివరాలకు 90324 27241 నంబరులో సంప్రదించాలని సూచించారు. 3నుంచి ‘అగ్నివీర్’ ర్యాలీ పెద్దపల్లిరూరల్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జూలై 3 నుంచి 12వ తదీ వరకు అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారని, ఆసక్తిగలవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి రావు తెలిపారు. అవివాహితలు అగ్నివీర్ వా యు (సంగీతకారుడు) కోసం రిజిస్ట్రేషన్ ఆధా రిత రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోందని పే ర్కొన్నారు. అగ్నిపథ్ పథకం ప్రవేశంతో క్లరిక ల్, టెక్నికల్ కేడర్లో ఉద్యోగావకాశాలు నాలు గేళ్లకు పరిమితమయ్యాయన్నారు. 25శాతం మందికే శాశ్వత ప్రవేశం ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ఈనెల 21న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 1, 2, 4, 7వ స్థాయీ సంఘం సమావేశాలు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అధ్యక్షతన జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 3, 5, 6వ స్థాయీ సంఘం సమావేశాలు ఆయా కమిటీల అధ్యక్షులతో నిర్వహిస్తారని వివరించారు. ‘టెట్’ ప్రశాంతంరామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్) సోమవారం ప్రశాంతగా జరిగింది. రెండు సెషన్స్లో నిర్వహించిన పరీక్షకు 200 మందికి 155 మంది హా జరైనట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శ్రీధర్రెడ్డి తెలిపారు. ఉదయం ఒక అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. డీఈవో మాధవి పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు. ప్లాస్టిక్ను నిర్మూలించాలి గోదావరిఖని: జీవన విధానాన్ని దెబ్బతీస్తున్న సింగిల్యూజ్డ్ ప్లాస్టిక్ వస్తుసామగ్రిని పూ ర్తిగా నిర్మూలించాలని ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూ ర్యనారాయణ సూచించారు. సోమవారం తన కార్యాలయంలో మిషన్లైఫ్ కార్యక్రమం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ, స్థిరమైన ఆ హార వ్యవస్థను అనుసరించాలని, నీటిని పొ దుపుగా వాడుకోవాలన్నారు. చెత్తను తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని కోరారు. ఈవేస్ట్ను పూర్తిగా తగ్గించాలన్నారు. ప్రతిఒక్కరూ ఈకార్యక్రమంలో భాగ స్వామ్యులై భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలని కోరారు. ఈసందర్భంగా మిషన్లైఫ్ ఎన్విరాన్మెంట్పై 7అంశాలతో రూపొందించిన పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఉద్యోగులతో పర్యావరణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్రావు, రవీందర్, రాజేంద్రప్రసాద్, ధనుంజయ, మురళీకృష్ణ, సురేశ్బాబు, షరీఫ్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ‘ఈసెట్’లో విద్యార్థిని ప్రతిభ మంథని: నాగారం గ్రామానికి చెందిన రాం సుస్మిత ఈసెట్ లో సత్తా చాటింది. సో మవారం వెలువ డిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంక్, సివిల్ బ్రాంచ్ విభాగంలో 7వ ర్యాంక్ సాధించింది. వరంగల్ ప్రభుత్వ పాలి టెక్నిక్లో సుస్మిత పాలిటెక్నిక్ పూర్తిచేసింది. -
కనీస వేతనాల కోసం ఉద్యమం
● ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకన్న గోదావరిఖని: కనీస వేతనాల అమలు, చట్టబద్ధ హక్కుల కోసం కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కా వాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. వెంకన్న కోరారు. స్థానిక గాంధీనగర్లోని యూని యన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలన లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్పరం అ య్యాయన్నారు. కార్మికవర్గం సాధించుకున్న 44 కా ర్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా చేశా రని అన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వా లని 2016లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, దీనిని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టిందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల జీవోలను అమ లు చేయకుండా వారి జీవితాలతో ప్రభుత్వాలు, యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయని ధ్వ జమెత్తారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సోలార్, సింగరేణి పరిశ్రమల్లోని యాజమాన్యాలు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, మౌలిక సదుపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కృష్ణ, అశోక్, చిలుక శంకర్, కోండ్ర మొగిలి, దుర్గయ్య, బుచ్చయ్య, ఎల్లయ్య, లింగమూర్తి, రవికుమార్, రాజేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి
● బీజేపీ నేత గోమాసె శ్రీనివాస్ గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని బీజేపీ నేత, ఎంపీ అభ్యర్థి గో మాసె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖని లోని బల్మూరి అమరేందర్రావు నివాసంతోపాటు ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో సోమవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ల నుంచి 100శాతం ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని బేషరతుగా సేకరించాలని కోరారు. ప్రజలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. మంత్రి శ్రీధర్బాబు దళిత ద్రోహిగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. నాయకులు గుండెబోయిన లక్ష్మణ్, బల్మూరి అమరేందర్రావు, సోమారపు లావణ్య, గాండ్ల స్వరూప, సప్ప నాగరాజు, దబ్బెట కమలాకర్, నరేశ్ పాల్గొన్నారు. రైతు సంక్షేమం పట్టదా? పెద్దపల్లిరూరల్: బీఆర్ఎస్ అరాచక పాలన అంతంకాగా, కాంగ్రెస్ మోసాల పాలన మొదలైందని గోమాసె శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని, రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. మోదీ సారథ్యంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగురుతుంద ని అన్నారు. నాయకులు వెంకటేశ్, దాడి సంతోష్, రాజ్గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్యాదవ్, తంగెడ రా జేశ్వర్రావు, పోల్సాని సంపత్రావు, రాజం మహంత, రాకేశ్, రమేశ్, సతీశ్, పిట్ట వినయ్, కుమారస్వా మి, హరీశ్, మధుకర్, రాజేందర్ పాల్గొన్నారు. -
విజి‘లెన్స్’ దుమారం
● అధికారుల దూకుడుపై తీవ్రవిమర్శలు ● యువ అధికారి ఆత్మహత్యపై నిరసన వెల్లువ ● ప్రక్షాళన చేయాలని డిమాండ్ ● సింగరేణి బొగ్గు గనుల్లో చర్చనీయాంశం గోదావరిఖని: సింగరేణి విజి‘లెన్స్’ గురితప్పుతోందా? ఇందులోని అధికారులు, సిబ్బంది ధీర్ఘకాలంగా తిష్టవేశారా? అవినీతి, అక్రమాలపై నిబంధనలు అతిక్రమించి విచారణ జరుపుతున్నారా? మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ప్లాంట్లో యువ అధికారి కిరీటి(37) ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ నోట్లో విజిలెన్స్ తీరు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. సింగరేణి సీఎండీకి జీఎంల ద్వారా అధికారుల సంఘం నాయకులు ఇటీవల ఫిర్యాదు కూడా చేశారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో అహర్నిశలు శ్రమిస్తున్న తమకు విజిలెన్స్ తీరు మనోధైర్యం దెబ్బతీస్తోందని అందులో పేర్కొన్నారు. సింగరేణి విజిలెన్స్కు మంచిపేరు.. ● అక్రమార్కుల భరతం పట్టే సింగరేణి విజిలెన్స్ విభాగానికి ప్రత్యేక పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. ● అధికారులు, కార్మికులనే తేడా లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలకు సిఫారసు చేసింది. ● విజిలెన్స్ వరకు వెళ్తే.. కచ్చితమైన చర్యలుంటాయనే భయం అందరిలోనూ ఉన్నాయి. ● అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అక్రమార్కుల తీరుపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించడంలో ఏనాడూ వెనక్కి తగ్గలేదు. ● అయితే, జైపూర్ ఎస్ట్టీపీపీలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారగడం సింగరేణిలో చర్చకు దారితీస్తోంది. ● అక్కడి యువ అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో అధికారులు నిరసనబాట పట్టారు. ● ప్రధానంగా విజిలెన్స్ అధికారుల తీరును సూసైడ్ నోట్లో ఆ అధికారి ప్రస్తావించడంపై ఆందోళన చెందుతున్నారు. సుదీర్ఘకాలం తిష్టవేయడంతోనే.. నిఘా విభాగంలోని అధికారులు, సిబ్బంది కొంద రు సుధీర్ఘకాలంగా ఒకేప్రాంతంలో తిష్టవేయడం విమర్శలకు తావిస్తోంది. విజిలెన్స్ విభాగం ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. బెల్లంపల్లి, రామగుండం రీజియన్ కోసం జైపూర్ సింగరేణి థర్మల్పవర్ ప్రాజెక్టులో ఇంకో కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే, ఇందులో కొందరు అధికారులు, సిబ్బంది సుదీర్ఘకాలం పనిచేస్తున్నారని, వారితీరు వివాదంగా మారుతోందని సీఎండీ బలరాంకు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఇలాంటి అధికారుల వివరాలను సేకరించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాక విజిలెన్స్ విభాగంలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించిన క్రమంలోనే ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగింది? ● జైపూర్ సింగరేణి థర్మల్ వపర్ ప్రాజెక్టులో ఆపరేషన్ పనులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన కొనసాగుతున్నాయి. ● సింగరేణి యాజమాన్యం ప్రాజెక్టుకు అవసరమయ్యే మెటీయల్ అందిస్తోంది. ● అయితే, బాయిలర్ విభాగంలో ఎస్ఈగా పనిచేస్తున్న కిరీటిని విజిలెన్స్ అధికారులు ఇటీవల విచారణ జరిపారు. ● ఎస్టీపీపీలోని స్టోర్స్ నిర్వహణపై విచారణ సాగుతోందని, ఈక్రమంలోనే కిరీటిని స్టోర్స్ మెటీరియల్ పర్చేజ్, నిల్వలపై ఆరా తీశారని తెలుస్తోంది. ● అయితే, పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణతో కిరీటి తనువు చాలించడం అధికారుల్లో ఆందోళనకు కారణమైంది. ● మరోవైపు.. విజిలెన్స్ విభాగంలో ఏళ్లపాటు తిష్టవేసిన అధికారుల వివరాలు సేకరించి, వారిపై చర్యలు తీసుకునేందుకు సింగరేణి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ● పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాక చర్యలు ఉంటాయని చెబుతున్నారు. -
విద్యుత్ బకాయిలు చెల్లించాలి
గోదావరిఖని: సింగరేణికి రావాల్సిన రూ.25వేల కోట్ల విద్యుత్ బకాయిలు వెంటనే విడుదల చేయా లని సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కామె ర గట్టయ్య కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎండీ బలరాంను కలిసి వినతిపత్రం అందజేశా రు. సింగరేణిలో నూతన ఓసీపీల ఏర్పాటు మానుకొని భూగర్భగనులు ఏర్పాటు చేయాలన్నారు. లా భాల్లో 45శాతం వాటా కార్మికులకు చెల్లించాలన్నా రు. కార్మికుల సొంతింటికోసం 300గజాల స్థలం కేటాయించాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ. 20లక్షలు వడ్డీలేని రుణం ఇప్పించాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.10లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింప జేయాలని విన్నవించారు. నాయకులు రత్నం కిరణ్, కుమారస్వా మి, సత్యం, కనకయ్య, జైపాల్సింగ్ ఉన్నారు. -
ఐటీఐలో దరఖాస్తుల స్వీకరణ షురూ
రామగుండం: పట్టణంలోని ఇండస్ట్రియల్ ట్రెయి నింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ)లో 2024– 25వ విద్యా సంవత్సరంలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ సురేందర్ సోమవారం తెలిపారు. ఎలక్ట్రిషీయన్–20, ఫిట్టర్–20, డ్రాఫ్ట్మెన్ సివిల్–24, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్–24, డీజిల్ మెకానిక్–24 సీట్లు ఉన్నాయని, ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం iti.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని ఆయన కోరారు. -
కిరీటి మృతి కలచివేసింది
విజిలెన్స్ విచారణ నేపథ్యంలో అధికారి కిరీటి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. ఇందుకు పురిగొల్పిన అంశాలు, అధికారుల్లోని అసంతృప్తిని సీఎండీ దృష్టికి తీసుకెళ్లాం. సుదీర్ఘకాలంగా విజిలెన్స్లో కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని విన్నవించాం. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. మా ఫిర్యాదుపై సీఎండీ బలరామ్ సానుకూలంగా స్పందించారు. – లక్ష్మీపతిగౌడ్, అధికారుల సంఘం అధ్యక్షుడు విచారణ సాగుతోంది సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని అన్ని విభాగాల్లో యంత్ర, సామగ్రి కొనుగోళ్లు, నిల్వలు, వినియోగంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మిగతా అధికారుల మాదిరిగానే కిరీటి నుంచి సమాచారం సేకరించారు. కానీ, ఆయనను బాధ్యుడిగా చేసి చార్జిషీట్ ఇవ్వలేదు. దీనిపైనా అంతర్గత విచారణకు ఆదేశించాం. విజిలెన్స్లో ధీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారుల బదిలీకి చర్యలు తీసుకుంటాం. కిరీటి కుటుంబాన్ని ఆదుకుంటాం. – బలరాం, సింగరేణి సీఎండీ -
రవాణా, విక్రయాలపై నిఘా
గోదావరిఖని: వానాకాలం పంటల సాగుకు రైతు లు సన్నద్ధమవుతున్నారని, వారికి నకిలీ విత్తనాలు అంటగట్టి మోసం చేస్తే పీడీయాక్టు అమలు చే స్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదివారం హెచ్చరించారు. చేశారు. ధనార్జనే ధ్యే యంగా అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ ల పేరుతో నకిలీ విత్తనాలను అంటగటి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చే సి కొత్తవిగా నమ్మిస్తూ అంటగడితే.. దిగు బడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలురకం విత్తనాలు విక్రయించేలా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ టీంలు ఏర్పాటు చేస్తున్నామ ని వెల్లడించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు అంటగడితే పీడీయాక్ట్ పర్యవేక్షణ, తనిఖీల కోసం టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు రామగుండం సీపీ శ్రీనివాస్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- పేటీఎంకు పెరిగిన నష్టాలు
- Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
- విమానంలో స్టాండింగ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- సన్న విత్తనాలు సిద్ధం
- Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement