-
సదర్మాట్ను సందర్శించిన సీపీఎం నాయకులు
మామడ: మండలంలోని పొనకల్ గ్రామ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ మినీ బ్యారేజీని సీపీఎం జిల్లా బృందం పభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం నూతన్కుమార్ మాట్లాడుతూ.. సదర్మాట్ బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభమైనా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికై నా కాలయాపన చేయకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సదర్మాట్ను సందర్శించిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డాకుర్ తిరుపతి, నాయకులు నాగెల్లి నర్సయ్య, సుంచుల నారాయణ ఉన్నారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డినిర్మల్ఖిల్లా: విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూటీఎస్ కృషి చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టెట్ తో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే పదోన్నతులతో కూడిన బదిలీలు చేపడుతుందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 50 శాతం ఫిట్మెంట్ ఇచ్చే విధంగా పీఆర్సీ కమిటీకి ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు, మెరుగైన ఈహెచ్ఎస్ విధానం అమలు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వివరించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యావలంటీర్లు, స్కావెంజర్లు నియమించాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అనంతరం ఏప్రిల్, మే నెలలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, రమణారావు, కార్యవర్గ సభ్యులు నరసయ్య, గంజారాం, శిరీష్, మారెన్న, భూమారెడ్డి, వెంకటరమణ శ్రీనివాస్, పరమేశ్వర్రెడ్డి, కొబ్బయి శంకర్ సంజీవరావు, వెంకటేశ్వర్ లింగన్న, కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, రాఘవేందర్ రజనీకాంత్, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా పాఠశాల పనులు పూర్తి చేయాలి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్మల్చైన్గేట్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపడుతున్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఇతర అధికారులతో శుక్రవారం అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, పెండింగ్ ధరణి దరఖాస్తులు, సీఎం ప్రజా వాణి దరఖాస్తుల వివరాలు, వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సరఫరా ప్రక్రియ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు, మరమ్మతులు కొనసాగుతున్నాయని వివరించారు. జూన్ 5లోపు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీఎంఆర్ సరఫరాను వేగవంతం చేశామన్నారు. గడువులోపు ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పూర్తికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీఆర్వో భుజంగ్రావ్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
No Headline
సకాలంలో పాఠశాలల పనులు పూర్తి చేయాలి లక్ష్మణచాంద: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల పనులను సకా లంలో పూర్తి చేయాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అఽధికారులను ఆదేశించారు. మండలంలోని పీచ ర ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులను శుక్రవారం పరిశీలించారు. జూన్ 5 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణకు గ్రామంలోని మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రం పరిశీలించి, చిన్నారులు, గర్భిణుల వివరాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డీఈ వో రవీందర్రెడ్డి, పౌరసరఫరాల డీఎం శ్రీకళ, జిల్లా సహకార శాఖ అధికారి నర్సయ్య, ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ జానకి, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి ఎలక్షన్ బొనాంజా..!
● 14న రికార్డుస్థాయిలో ఆదాయం ● నిర్మల్, భైంసా డిపోలకు రూ.60.72 లక్షలుభైంసాటౌన్: ఓటర్లలో పెరిగిన చైతన్యంతో పోలింగ్ శాతం పెరగడమేకాదు.. ఆర్టీసీకి ఆదాయమూ గణనీయంగా తెచ్చిపెట్టింది. అదేంటి.. ఎన్నికలకు, ఆర్టీసీకి ఆదాయానికి సంబంధమేంటని అనుకుంటున్నారా.. అవునండి..! ఈనెల 13న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, నిజామాబాద్, ఇతర ప్రాంతాల్లో వృత్తిరీత్యా వలస వెళ్లినవారు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువత ఓటేసేందుకు స్వగ్రామాలకు చేరుకున్నారు. ఎన్నికల తేదీకి రెండు, మూడు రోజుల ముందే చేరుకోవడం, అనంతరం ఓటు హక్కును వినియోగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీకి ఎన్నికలు బంపర్ ఆదాయం తెలిచ్చిపెట్టింది. తిరుగు ప్రయాణం రోజైన 14న ఒక్కరోజే జిల్లా ఆర్టీసీకి రూ.60.72 లక్షల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరడంతో సంస్థ ఎండీ సజ్జనార్ ఉద్యోగులందరికీ స్వీట్లు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నిర్మల్, భైంసా డిపోల్లో ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుస్థాయిలో ఆదాయం.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని ఓటర్లు స్వగ్రామాలకు రావడం, తిరిగి 14న తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. 14వ తేదీ ఒక్కరోజే నిర్మల్ డిపోకు రూ.44.23 లక్షలు, భైంసా డిపోకు రూ.16.49 లక్షల ఆదాయం చేకూరింది. సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశాం. – ప్రతిమారెడ్డి, డీఎం, నిర్మల్/భైంసాఆర్టీసీ ఉద్యోగులకు మిఠాయిలు పంపిణీ భైంసాటౌన్:పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు శుక్రవారం మిఠాయిలు పంచారు. ఈనె ల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు కలిపి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.24.23 కోట్ల ఆ దాయం సమకూరింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ స్వీట్లు పంచాలని ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు డీఎం ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పనిచేసి సంస్థ ఆదాయం పెంపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఎఫ్ఎల్ చందు, సూపర్వైజర్స్ కేకే.రెడ్డి, గోపాల్, ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్మల్, భైంసా డిపోలకు ఆదాయమిలా(రూ.లక్షల్లో...) తేదీ నిర్మల్ భైంసా 10 39.20 15.43 11 41.12 16.45 12 39.00 15.65 13 33.00 13.05 14 44.23 16.49 -
ఓవర్ డోస్!
నిర్మల్శనివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2024ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి నిర్మల్చైన్గేట్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా రైతులకు సరిపడా టార్పాలిన్లు, ధాన్యం సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలు ఏరోజుకరోజు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్వో శ్రీకళ, సివిల్ సప్లయిస్ డీఎం నందిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, డీసీవో నర్సయ్య, ఏడీ మార్కెటింగ్ ఆష్పక, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: ‘సార్.. రెండ్రోజుల నుంచి జరం పరేషాన్ చేస్తోంది. జర.. ఏవన్న మంచి గోలీలో.. ఇంజక్షన్లో ఇయ్యుండ్రి సార్..’అని పేషంట్ అనడమే ఆలస్యం.. జిల్లాలో చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు, కొంతమంది వైద్యులు మోతాదుకు మించి మందులు ఇస్తున్నారు. దెబ్బకు జ్వరం ఒక్కరోజుకే తగ్గిపోతోంది. తొలిదశలోనే పేషెంట్ కోలుకోవాలన్న ఏకై క లక్ష్యంతో యాంటీబయాటిక్స్తోపాటు ఏకంగా స్టెరాయిడ్స్ ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి షాకింగ్ విషయాలన్నీ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ), తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ)చేపడుతున్న తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో మోతాదుకు మించి మందులు ఇస్తున్న పరిస్థితిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మోతాదుకు మించి వాడుతున్న మందులతో జిల్లాలో ఎన్నడూ లేనంతగా కిడ్నీ సంబంధిత, ఇతర వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదకరంగా.. జిల్లాలో ప్రధానంగా సరైన వైద్యఅవగాహన లేని ఆర్ఎంపీలు, పీఎంపీలు అందిస్తున్న వైద్యం ప్రమాదకరంగా ఉందని మెడికల్ కౌన్సిల్ బాధ్యులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలో తనిఖీలు చేసిన సందర్భంలో చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు, కొంతమంది వైద్యులు కూడా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటి కారణంగా జిల్లాలో చాలామంది కిడ్నీ, ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం అనుభవంతోనే.. అర్హత కలిగిన వైద్యులు తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఒక క్రమబద్ధమైన కోర్సును ఇచ్చి రోగం నయం చేస్తారు. వారు చదివిన చదువుతోపాటు అనుభవం, ప్రస్తుతం రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వారు ట్రీట్మెంట్ కొనసాగిస్తుంటారు. ఏ మందులు ఇస్తే.. ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత పేషెంట్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది.. అనే విషయాలనూ వారు పరిగణనలోకి తీసుకుంటూ చికిత్స కొనసాగిస్తారు. మందులనూ అదేవిధంగా ఇస్తుంటారు. కానీ.. కేవలం అనుభవం ఆధారంగా తెలిసిన వైద్యాన్ని ఆర్ఎంపీలు అందిస్తున్నారు. చాలామంది రేపొద్దున్న పేషెంట్ పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఆలోచించడం లేదని, ప్రస్తుతం రోగాన్ని నయం చేయడమే చూస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. రోగనిరోధకతకు దెబ్బ.. త్వరగా అనారోగ్యం, వ్యాధి నయం కావాలన్న తొందరలో అనుభవం/అర్హతలేని వైద్యులు, ఆర్ఎంపీలు ఏమేం మందులు ఇస్తున్నారో.. కూడా చాలామంది పేషెంట్లకు తెలియవు. అందులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా ఉంటున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల సంబంధిత రోగం త్వరగానే నయమవుతుంది. కానీ.. వాటి ప్రభావం దీర్ఘకాలం భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా మనిషి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. కిడ్నీతోపాటు వివిధ అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. జిల్లాలో గురువారం చేసిన తనిఖీల్లో చాలామంది అర్హతలేని వాళ్లు ఇలాంటి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అర్హతలు చూసి వెళ్లాలి.. పేషెంట్ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. కచ్చితంగా వైద్యం చేయించుకునే ముందు సదరు వైద్యుడు అర్హత కలిగినవారా..లేదా.. చూసుకుని వెళ్లాలి. అర్హత లేకుండా వైద్యం చేయడం చట్టప్రకారం నేరం. –డాక్టర్ మురళీధర్, అధ్యక్షుడు ఐఎంఏ నిర్మల్ఇష్టారీతిన మందులు.. నిర్మల్ జిల్లాలో చేసిన తనిఖీల్లో చాలామంది ఆర్ఎంపీలు, కొంతమంది వైద్యులు ఇష్టారీతిన మోతాదుకు మించి మందులు ఇస్తున్నట్లు వెల్లడైంది. కొంతమంది యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వాటిపై తనిఖీలు కొనసాగిస్తాం. చర్యలనూ తీసుకునేలా చేస్తాం. –డాక్టర్ శ్రీనివాస్యెగ్గన, టీఎస్ఎంసీ ఎథికల్ కమిటీ ఉమ్మడిజిల్లా చైర్మన్న్యూస్రీల్ మోతాదు మించుతున్న మందులు అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ ప్రాణాల మీదుకు తెస్తున్న స్టెరాయిడ్స్ క్రమంగా పడిపోతున్న రోగనిరోధక శక్తి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ, ఇతర బాధితులు అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు -
‘గుండేగాం’ కష్టం తీరేదెప్పుడో!
గుండేగాం ముంపు సమస్యకు పాలకులు ఇప్పటికీ పరిష్కారం చూపడంలేదు. వానాకాలం వస్తుందంటే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. 8లోu ఏకంగా హాస్పిటల్సే.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు ఏకంగా ఆస్పత్రులను నడుపుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ బాధ్యులు చెబుతున్నారు. కేవలం ఫస్ట్ఎయిడ్ సెంటర్గా ఉండాల్సిన చోట.. ఏకంగా బెడ్లు, మెడికల్, ల్యాబ్లతోసహా ఓ పెద్దాస్పత్రిలో ఉండే అన్నిసదుపాయాలు పెట్టి వైద్యం చేస్తున్నారని వెల్ల డించారు. ఇదంతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. జిల్లాకేంద్రంలో పలువురు ఆర్ఎంపీలు కలిసి ఏకంగా ఆస్పత్రులు పెట్టడం గమనార్హం. అందులో ఒకదాంట్లో వైద్యులు లేనప్పుడు సదరు ఆర్ఎంపీలే చికిత్స ఇస్తున్నట్లు వెల్ల డైంది. వీరికి ఓ వైద్యాధికారి అండ ఉందని మెడికల్ కౌన్సిల్ సభ్యులు పేర్కొనడం గమనార్హం. -
సిరాల ఇలా.. సాగునీరెలా?
● గత వానాకాలంలో కొట్టుకుపోయిన ప్రాజెక్టు ● ఏడాది కావస్తున్నా మరమ్మతుకు నోచుకోని వైనం.. ● నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు ● మరో 20 రోజుల్లో వర్షాలు ప్రారంభం ● ఆయకట్టుకు ఈసారి కూడా క్రాప్ హాలిడే? ● ఆందోళనలో అన్నదాతలు భైంసా: జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టుల్లో ఒకటైన సిరాల.. ఈసారి కూడా ఆయకట్టు నిరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది జూలై 27న కురిసిన భారీ వర్షంతో వచ్చిన వరదకు ప్రధాన కట్ట తెగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సిరాల బాట పట్టారు. అక్కడి వారిని కలిసి రైతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పటి కలెక్టర్ వరుణ్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు, వేణుగోపాలచారి బాధిత రైలును ఓదార్చారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ జనవరిలోనే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరాల ప్రాజెక్టును త్వరగా పునర్నిర్మించి వానాకాలంలో ఆయకట్టు రైతులకు సాగునీరందించాలని సూచించారు.అధికారులు ప్రాజెక్టు కట్ట నిర్మాంతోపాటు ఇతర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రాజెక్టుకు రూ.12.36 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ప్రారంభంకాలేదు. మరో 20 రోజుల్లో వర్షాకాలం ప్రారంభంకానుంది. ఈ సమయంలో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియడంలేదు. గతేడాది భారీ వర్షాలతో... గతేడాది కురిసిన భారీ వర్షాలకు సిరాల ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టు తెగి నీరంతా ఖాళీ అయ్యింది. గత జూలై 27న కట్ట పైనుంచి నీరు కిందికి రావడంతో గమనించిన గ్రామస్తులు పక్కనే ఉన్న మహాదేవ్ ఆలయానికిచేరుకున్నారు. పిల్లాపాపలతో ఊరంతా ఆలయంపైనే జాగరణచేశారు. సాయంత్రం దేవుని మందిరానికి అంతాచేరుకునేలోపే ప్రధాన తూము వద్ద కొంత భాగం గండిపడి నీటి శబ్దంవచ్చింది. మరో గంటకు కట్టపై ఉన్న రామస్వామి ఆలయం వద్ద ఇంకో గండి పడింది. అంతా చూస్తుండగానే రామస్వామి ఆలయం నీటిలోకొట్టుకుపోయింది. మరో గంటసేపటికి పాత తూము ప్రాంతం పెద్ద మొత్తంలోనే గండిపడింది. చూస్తుండగానే నీరంతా సిరాల చుట్టు ప్రవహిస్తూ పంటపొలాల్లోకి వెళ్లిపోయింది. ఎటుచూసిన నీరే కనిపించింది. ఊళ్లోకి వరద వచ్చే అవకాశం.. సిరాలవాసుల్లో మళ్లీ భయం కనిపిస్తుంది. ఈయేడు కూడా మళ్లీ వర్షాలు కురిస్తే గతంలో ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరంతా నేరుగా గ్రామాన్ని ముంచెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే మహారాష్ట్ర నుంచి సిరాల ప్రాజెక్టులోకి నీరుచేరుతుంది. కట్ట లేని కారణంగా వచ్చిన నీరు వచ్చినట్లే గ్రామంలోకి వెళ్లి పక్కనే ఉన్న పంటపొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు తెగడంతో ఇప్పటికే సిరాల ఆయకట్టు రైతులు రెండు పంటలు నష్టపోయారు. అంతా బండరాళ్లే... గతేడాది సిరాల ప్రాజెక్టు తెగిపోవడంతో పంట భూ ముల్లో పెద్ద పెద్ద బండరాళ్లు, ఇసుకమేటలు ఇప్పటి కీ కనిపిస్తున్నాయి. సిరాల, ఇలేగాం, దేగాం, వాలేగాం, కామోల్ వరకు ఈ ప్రాజెక్టు నీటిలో 800 ఎకరాల భూములు నీటమునిగాయి. 300 ఎకరాలు పూర్తిగా బండరాళ్లు, ఇసుకమేటలు వెలిశాయి. నీట మునిగిన పంటలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. నష్టపోయిన రైతుల భూములను ఇప్పటికీ బాగుచేసి ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన 4 కిలోమీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్ కొట్టుకుపోయింది. ప్రస్తుతం సీసీ కెనాల్ ఎక్కడికక్కడ తెగి ఉంది. వర్షాలు కురిస్తే నీరంతా సీసీ కెనాల్ కింద ఉండే పంటభూములను ముంచెత్తనుంది. త్వరలో పనులు ప్రారంభం.. గతేడాది భారీ వర్షాలకు సిరాల ప్రాజెక్టు ప్రధానకట్ట, తూము కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యింది. ఆ సమయంలో ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరిచేసింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. సిరాల ఆయకట్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. – అనిల్, ఇరిగేషన్ డీఈకనుమరుగైన చరిత్ర.... 1902లో సిరాల ప్రాజెక్టు నిర్మించారు. 121 ఏళ్ల కింద నిర్మించిన ఈ చెరువు ప్రధాన కట్టపైనే రా మస్వామి ఆలయం ఉంది. సిరాల ప్రాజెక్టు అప్ప ట్లో అతి తక్కువ ఖర్చుతో రెండు గుట్టల మధ్య నిర్మించారు. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఈ ప్రాజె క్టు ఎండిపోయింది. ఎప్పుడు నీటితో ఉండే ఈ ప్రాజెక్టు కింద అప్పట్లో ఏడు గ్రామాల్లోని 4 వేల ఎకరాలకు నీరందేది. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 1,400 ఎకరాలకే నీటిని అందిస్తుంది. 121 ఏళ్ల ఈ ప్రాజెక్టు గతేడాది భారీ వర్షాలకు పూర్తిగా కనుమరుగైపోయింది. -
రాష్ట్రస్థాయి శిక్షణలో జిల్లా తపస్ నేతలు
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్లోని శ్రీనీలకంఠ విద్యాపీఠంలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్రస్థాయి అభ్యాసవర్గంలో జిల్లాకు చెందిన పలువురు జిల్లాశాఖ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తపస్ నాయకులు పేర్కొన్నారు. ఇందులో జిల్లా బాధ్యులు టి.నవీన్కుమార్ జి.రాజేశ్వర్, అజయ్, ఆర్.రాజేశ్వర్, విఠల్రెడ్డి, దత్తురాం పటేల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కిక్బాక్సింగ్ క్రీడాకారిణికి ఆర్థికసాయం
ఖానాపూర్: మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేత యువతి కార్కురి నాగలక్ష్మి జాతీ యస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై ంది. పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తుంది. ఈ విషయం తె లుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బుక్యా జాన్సన్నాయక్ క్రీడాకారిణికి బాక్సింగ్ కిట్ కొనుగోలుకు కావాల్సిన రూ.10 వేలు అందజేశారు. ఈనెల 21న పుణెలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులతోపాటు గ్రామానికి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. -
గాలివాన బీభత్సం
గుడిహత్నూర్/ఇంద్రవెల్లి: మండల కేంద్రంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా వీచిన గాలితో రహదారిపై చెట్లు పడిపోగా, హనుమాన్ నగర్లోని పలు ఇళ్లు, దుకాణాల పైకప్పు రేకులు లేచి పోయి దూరంగా పడ్డాయి. దీంతో నిత్యావసర సరుకులు, సామగ్రి తడిసిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ అరుణ్ బాధిత ఇళ్లను సందర్శించి నష్టం అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మండలంలోని ఈశ్వర్నగర్ సమీపంలో ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో సుమారు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ ఎంపీ గోడం నగేష్ వాహనం కూడ ఆగిపోయింది. ఎస్సై దుబ్బక సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో చెట్టును తొలగించారు. -
ఉపాధికోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
క్లుప్తంగా
కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ఎదులాపురం: కుమారుడిపై తండ్రి ఫిర్యాదు చేసిన సంఘటన పట్టణంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై లాల్సింగ్ కథనం ప్రకారం పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన పవన్ అనుమానంతో భార్యపై చేయి చేసుకున్నాడు. కోడలిని ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకున్నాడు. దీంతో అతని తండ్రి నాగోరావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్యను వేధించిన కేసులో 18 నెలల జైలు కై లాస్నగర్: భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్రావు గురువారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి ఎం. గంగాసింగ్ తెలిపారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన మహిళ, మహారాష్ట్రలోని సరత్ తాలూకా ఘటంజి గ్రామానికి చెందిన సావాపురే దీక్షిత్ భార్యాభర్తలు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో దీక్షిత్పై జైనథ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పీసీఆర్ కోర్టులో విచారణ జరుపగా నిందితుడికి 18నెలల జైలు, రూ.2500 జరిమానా విఽధిస్తూ పీసీఆర్ కోర్టు తీర్పునిచ్చింది.పేకాట రాయుళ్ల అరెస్ట్ తానూరు: మండలంలోని హంగిర్గా గ్రామ శివారులో గురువారం పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వారి నుంచి రూ.11,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
● పలువురికి గాయాలుభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భైంసా ఆస్పత్రికి తరలించారు. -
కొనుగోలు కేంద్రాల పరిశీలన
సోన్: న్యూవెల్మల్, న్యూబొప్పారం గ్రామాల్లోని ఎఫ్ఎస్సీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ పరిశీలించారు. వర్షాలు పడే అవకాశమున్నందున త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీసీవో నర్సయ్య, ఏఈవో అంభాజీ, నిర్వాహకులు శ్రీనివాస్, సాయన్న, మహేందర్, సవిత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయినాథ్ తదితరులున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలిలోకేశ్వరం: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకళ ఆదేశించారు. గురువారం మండలంలోని మన్మద్, రాజూర గ్రామాల్లోని డీసీఎమ్మెస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం విక్రయించిన వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట సివిల్ సప్లయీస్ డీటీ రమేశ్, నిర్వాహకుడు గంగాధర్ పటేల్, రైతులున్నారు. -
డెంగీని నియంత్రించాలి
నిర్మల్చైన్గేట్: డెంగీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో ధనరాజు సూచించారు. జాతీ య డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగీ నియంత్రణ, నివారణ, లక్షణాలపై విస్తృతంగా అవగాహ న కల్పించాలని సూచించారు. ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతీ మంగళ, శుక్రవా రాలను ‘డ్రై డే‘గా పాటించి నీటి నిల్వలు తొలగించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేందర్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, సబ్ యూనిట్ అధికారులు, సూపర్వైజర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య సహాయకులు, ఆశ కార్యకర్తలున్నారు. డీఎంహెచ్వో ధనరాజు జిల్లా కేంద్రంలో ర్యాలీ -
సినిమా థియేటర్లకు విశ్రాంతి
● పది రోజులపాటు ప్రదర్శనల నిలిపివేతకు ఎగ్జిబిటర్ల నిర్ణయం ● చిన్న సినిమాలకు తగ్గుతున్న ప్రేక్షకాదరణ ● సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లు వెళ్లలేని పరిస్థితులు ● వేసవిలో విడుదలకు నోచుకోని అగ్రహీరోల సినిమాలు బెల్లంపల్లి: సామాన్య, సగటు ప్రేక్షకులకు అతి తక్కువ ధరలో వినోదం అందిస్తున్న సినిమా థియేటర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలోని పలు థియేటర్లు ప్రేక్షకులు రాక.. ఆటలు ప్రదర్శించే పరిస్థితులు లేక నష్టాలు చవి చూస్తున్నాయి. కాసులు రాబట్టుకునే సమయంలో ఈసారి కొత్త సమస్య ఎదుర్కొంటున్నాయి. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత వరుసగా అగ్రహీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల కావాల్సి ఉండగా ఈ దఫా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు మూడు నెలల నుంచి ప్రముఖ నటుల సినిమాలు కానరాకుండా పోగా, కొందరు హీరోల సినిమాలు నిర్మాణ దశల్లో, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నూతనంగా నిర్మిస్తున్న సినిమాల విడుదలకు ప్రతిబంధకాలు ఏర్పడగా థియేటర్లలో ప్రదర్శనలు జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో మంచిర్యాల, సీసీసీ, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్, జన్నారంలో మొత్తంగా 13 సినిమా థియేటర్లు ఉన్నాయి. మంచిర్యాలతోపాటు ఇతర ప్రాంతాల థియేటర్లలో సినిమాల ప్రదర్శలు సరిగా జరగక సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో కొన్నాళ్ల క్రితం నుంచే థియేటర్లు మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, సీసీసీ నస్పూర్, లక్సెట్టిపేట, మ్యాదరిపేటలో ఉన్న 8 థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకాదరణ లేక, లాభాలు రాకపోగా కనీసం సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు సైతం చెల్లించేందుకు ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తలెత్తి అనివార్యంగా మూసి వేశారు. వీటిలో కొన్నింటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చగా, మరికొన్ని వృథాగా మారి నాటి దర్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజా పరిస్థితుల ప్రభావం కొత్త సినిమాల జాడ లేకపోవడంతో తాజాగా పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చే యాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆయా థి యేటర్ల గేట్లకు తాళం పడనుంది. చిన్నాచితక సి నిమాలను ప్రదర్శించినా సరిగా కలెక్షన్లు రాక నష్టాలపాలయ్యే కన్నా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యాకనే తెరవాలని నిర్ణయం తీసుకుంది. సాంకేతికత పెరిగి.. సాంకేతిక రంగం విస్తరించి ఇళ్లలో ఓటీటీలు, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో సినిమా థియేటర్లకు ఆదరణ కరువవుతోంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి ముందే బెల్లంపల్లిలో ఓ ప్రముఖ సినిమా థియేటర్ గత వారం నుంచే ప్రదర్శనలు నిలిపివేసింది. చిన్న సినిమాలు నడవడం లేదు సినిమా టాకీసుల్లో చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండడం లేదు. సరైన కలెక్షన్లు రావడం లేదు. రోజుకు గరిష్టంగా కనీసం రూ.8 వేలకు తగ్గకుండా ఆదాయం రావాలి. కానీ రూ.5 వేలకు లోబడి వస్తున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించలేని, కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నాయి. కలెక్షన్లు లేక మా థియేటర్లో వారం రోజుల క్రితం నుంచి ప్రదర్శనలు నిలిపేశాం. డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీతో థియేటర్లకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బంది వీధిన పడకుండా ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అవకాశం కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – సయ్యద్ కమర్ పాషా, సినిమా థియేటర్ మేనేజర్, బెల్లంపల్లి కనీస ఖర్చులు రావడం లేదు సినిమా థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. రోజువారీగా సినిమా వేస్తే కనీస ఖర్చులు కూడా రావడం లేదు. లాభం రాకపోగా నష్టాలను చవి చూడాల్సి వస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షోలను నిలిపి వేయాల్సి వస్తోంది. నష్టాల బాట పట్టిన థియేటర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలి. – ఎర్ర సంపత్, రాఘవేంద్ర థియేటర్ యాజమాని, జన్నారం -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన అడిగం నగేష్ జాతీయ రహదారి పక్కనుంచి వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుబోథ్: మండలంలోని పొచ్చెర బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన ఆడె లక్ష్మణ్, విష్ణు బోథ్ మండలంలోని కంటెగాంలో ఓ పెళ్లి వేడుకకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో పొచ్చెర బ్రిడ్జి వద్ద కారును తప్పించబోయి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా బోథ్లోని ప్రధాన ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి కడెం: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మ్యాడరపు అనిల్ (25) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్ గ్రామానికి చెందిన అనిల్ లక్ష్మీపూర్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. బైక్పై గ్రామ శివారులోకి వచ్చిన అనిల్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
సీపీఎస్ను రద్దు చేయాలి
నిర్మల్ రూరల్: ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో అమలు చేసే పీఆర్సీలో సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు వై.సాయన్న విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్ శివశంకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2023 జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని కోరారు. 50శాతం ఫిట్మెంట్తో ఆనాటికి ఉన్న 33.67శాతం కరువు భత్యంతో కలిపి వేతన సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.25 లక్షలకు పెంచాలని కోరారు. ఉపాధ్యాయులకు సంవత్సరానికి 18 సంపాదిత సెలవులు, అర్ధవేతన సెలవులు 30కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగులకు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు శంకర్, చంద్రకాంత్ తదితరులున్నారు. -
సీఎంఆర్ పూర్తి చేయకుంటే చర్యలు
నిర్మల్చైన్గేట్: సకాలంలో సీఎంఆర్ సరఫరా పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. గురువారం క లెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా లక్ష్యం, పూర్తిచేసిన సరఫరా, నిల్వ ఉన్న ధాన్యం వివరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు రోజూ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ ప్రక్రియ, మిల్లులో ధాన్యం నిల్వ, సా మర్థ్యం, అన్ లోడింగ్ తదితర అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. వారం రోజులుగా సీఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో భుజంగ్రావు, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, డీఎస్వో నందిత, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీకళ, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సరఫరాపై అధికారులు, మిల్లర్లతో సమీక్ష -
స్విమ్మింగ్పూల్లో స్విచ్ల ధ్వంసం
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రి యదర్శిని క్రీడా మైదానంలో గల స్విమ్మింగ్ పూల్ కు విద్యుత్ సరఫరా చేసే బోర్డులను గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం మధ్యాహ్నం రేకుల తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు స్విమ్మింగ్ ఫూల్కు నీటిని సరఫరా చేసే మోటార్లకు అనుసంధానమైన స్విచ్ బోర్డులు, ప్యూజ్లను ధ్వంసం చేసి చెల్లాచెదురుగా పడేశారు. వైర్లను సైతం కత్తిరించారు. కాగా అక్కడి అధికారులు, సిబ్బంది దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై డీఎస్డీఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
శిక్షణ పూర్తి చేసుకున్న
నేను పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న. దరఖాస్తు పరిశీలన పూర్తి చేయడంతో నేను ఐదురోజుల శిక్షణకు ఎంపికై న. నిర్మల్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్న. ఐదురోజుల స్టైఫండ్ కూడా మంజూరైంది. ఎన్నికల కోడ్ కారణంగా నాకు టూల్ కిట్ ఇంకా అందలేదు. – ప్రత్యూష, టైలరింగ్, కల్లూర్‘కోడ్’ కారణంగానే జాప్యంపీఎం విశ్వకర్మ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మున్సిపల్, పంచాయతీ అధికారులకు అప్పగించాం. ఎన్నికల కోడ్కు ముందు గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశాం. జిల్లాలో 700 మందిని గుర్తించి శిక్షణ ఇచ్చాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాగా ప్రక్రియ నిలిచింది. కోడ్ తర్వాత ప్రక్రియ చేపడతాం. – నర్సింహారెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్అర్హులను గుర్తించాలిపీఎం విశ్వకర్మ పథకం కోసం జనవరిలోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న. ఐదునెలలైనా ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ అని సాకులు చెబుతున్నరు. ఎన్నికల కోడ్ తర్వాతనైనా ఎంపిక ప్రక్రియ త్వరగా చేపట్టి అర్హులను గుర్తించాలె. – సుమిత్ర, టైలర్, భైంసా -
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
గుడిహత్నూర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మన్నూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఇ మ్రాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మన్నూర్కు చెందిన బస్వంతె బ్రహ్మానంద్(38), అనిత దంపతులు బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నా రు. వివాహామై పదహారేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అనిత పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకొద్దామని బ్రహ్మానంద్ బుధవారం ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడలోని అత్తారింటికి వెళ్లాడు. రావడానికి నిరాకరించడంతో సా యంత్రం మన్నూర్కు వచ్చి మద్యం సేవించాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. స్థానికులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్యభైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతన్న(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతన్న గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోతన్నకు భార్య సావిత్ర, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సాకెరలో చోరీ బోథ్: మండలంలోని సాకెర గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాథోడ్ రాయల్ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..రాథోడ్ రాయల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న సారంగపూర్ మండలంలోని లింగాపూర్ వెళ్లాడు. గురువారం ఉదయం తాళం తీసి ఉండడాన్ని గమనించిన గ్రామానికి చెందిన రాథోడ్ రంజిత్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. గ్రామానికి చేరుకున్న రాయల్ ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న 8 గ్రాముల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు కనిపించలేదు. వెంటనే ఎస్సై రాముకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దేశీదారు పట్టివేతకౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ పట్టణంలోని సుభాష్ కాలనీలో గురువారం దేశీదారు మద్యం పట్టుకున్నామని కాగజ్నగర్ ఎకై ్సజ్ సీఐ వి.రవి తెలిపారు. సుభాస్ కాలనీలో కె.అరుణ్కుమార్ దేశీదారు మద్యం అమ్ముతుండడంతో 56 దేశీదారు 90 మి.లీ. బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరుణ్కుమార్పై కేసు నమోదు చేశామన్నారు. నలుగురు పాత నేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. -
4,28,612 మంది
● ప్రచారం కల్పించినా కదలని ఓటర్లు ● నిర్మల్ నియోజకవర్గంలోనే అత్యధికం ● ఓటేయని వారిలోనూ మహిళలే అధికం ● ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ తీరు కై లాస్నగర్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలక మే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతోమంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితుల ను సైతం చేసి ఇంటికి పరిమితం చేసింది. ఓటు అంతటి శక్తివంతమైనది కనుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈసీ విస్తృ త ప్రచారం కల్పిస్తోంది. ఓటరు బాధ్యతను గుర్తు చేసేలా ప్రముఖులతో వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో స్వీప్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఓటింగ్ రోజు వరకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. అయినా ఓటర్లు మాత్రం తమ నిర్లిప్తతను విడనాడలేదు. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకున్నారో లేక నాకేందకనే భావనతోనో తెలియదు కానీ చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదలలేదు. ఈ నెల 13న జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో 4,28,612 మంది ఓటర్లు ఓటు వేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కారణాలేవైనప్పటికీ ఓటర్ల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటేయకపోవడంలోనూ మహిళలదే రికార్డు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 16,50,175 మంది ఓటర్లున్నారు. ఇందులో సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,21,563 మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,04,875 మంది ఉండగా 5,99,108 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,05,767 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే 8,45,213 మంది మహిళా ఓటర్లుండగా 6,22,420 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,22,793 మంది ఓటేయలేదు. ఇతరులు 87 మంది ఉండగా 35 మంది ఓటు వేశారు. మరో 52 మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా 73 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోకపోగా, అత్యల్పంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 55 వేల మంది ఓటర్లు ఓటు వినియోగానికి ఆసక్తి చూపలేదు. కాగా పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండటంలోనూ రికార్డు నమోదు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17,026 మంది అధికంగా ఓటింగ్కు దూరంగా ఉండటం ఆఽశ్చర్యానికి గురిచేస్తోంది. అవగాహన కల్పించినా ఆసక్తి చూపలే.. ఓటుకున్న ప్రాధాన్యతను చాటుతూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనే బాధ్యతను గుర్తుచేసేలా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ర్యాలీలు, రంగోలిలు, యువత, వృద్ధులు, దివ్యాంగుల అవగాహన సదస్సులు, ప్రచార రథాలు వంటి అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వసతులను సైతం కల్పించింది. అయినా ఓటర్లు పట్టించుకోలేదు. కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోలేదు. పల్లెలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. నిరాక్షరాస్యులు, ఆదివాసీలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం 78 నుంచి 82 శాతం వరకు నమోదు కాగా విద్యావంతులు, చైతన్యం కలిగిన వారుండే పట్టణ ప్రాంతాల్లో 60 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. యువ ఓటర్లు సైతం ఓటరుగా పేర్ల నమోదుపై చూపుతున్న శ్రద్ధ తీరా ఓటుహక్కు వినియోగించుకోవడంపై చూపడం లేదు. 4 లక్షల మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉండటం రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగాన్ని సైతం ఆలోచింపజేసేలా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఇవే ఓట్లు ఐదు అభ్యర్థుల తలరాతలను మార్చగలవు. వజ్రాయుధంగా చెప్పుకునే ఓటుహక్కుకు ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లు దూరంగా ఉండటం నిజంగా విస్తుగొలిపే అంశంగానే భావించవచ్చు. మావల పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చున్న ఓటర్లు (ఫైల్) నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటు వేయనివారుసిర్పూర్ 2,29,101 1,63,944 65,157ఆసిఫాబాద్ 2,27,208 1,71,511 55,697ఖానాపూర్ 2,24,523 1,62,101 62,422ఆదిలాబాద్ 2,45,137 1,81,136 64001బోథ్ 2,11,313 1,65,157 46,156నిర్మల్ 2,58,314 1,85,168 73,146ముధోల్ 2,54,579 1,92,546 62,033 -
నిర్మల్
4,28,612 మంది ఓటెయ్యలె! ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 4,28,612 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 20248లోuకలెక్టర్కు సన్మానంనిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను గురువారం టీఎన్జీవోస్ యూని యన్ నాయకులు కలిశారు. పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందుకు మొ క్క అందజేసి అభినందించారు. జిల్లా అధ్యక్షు డు వీ ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీరా మ్ శ్రీనివాస్ జయం, సెక్రటరీ ఎస్.మోహన్రె డ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాములు, ని ర్మల్ టౌన్ కార్యదర్శి డీ శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్, అరుణ్, సుధాకర్ ఉన్నారు.నిర్మల్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్లపై ఒక్కసారిగా దాడులు జరగడం కలకలం రేపింది. ఎవరొచ్చారు.. ఎందుకు తనిఖీ లు చేస్తున్నారంటూ.. దొంగ దవాఖానలు నిర్వహిస్తున్న వాళ్లు కంగారుపడ్డారు. వాళ్లు అనుకున్నట్లుగా నే సదరు వైద్యాధికారులు పలువురిపై కేసులు వే యనున్నట్లు ప్రకటించారు. నేషనల్ మెడికల్ కౌన్సి ల్ (ఎన్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఆధ్వర్యంలో గురువారం వైద్యాధికా రుల బృందాలు ఈ దాడులు చేపట్టాయి. ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులు, ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులతోపాటు కొన్నిరోజులుగా ‘సాక్షి’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలూ ఇందుకు ప్రభావం చూపాయి. జిల్లా కేంద్రంపై ప్రధాన దృష్టి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న దాడుల్లో భాగంగా గురువారం జిల్లాలోనూ ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ వైద్యాధికారుల బృందాలు దాడులు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాకేంద్రంపై అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇందులో ఎవరు అసలో.. ఎవరు నకిలీ డాక్టరో తెలియని విధంగా వైద్యం అందిస్తున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలూ ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. ఇలాంటి పలు ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ తనిఖీలు చేపడుతోంది. నిర్మల్లో గురువారం నిర్వహించిన దాడుల్లో టీఎస్ఎంసీ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్కుమార్ తోట, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ యెగ్గన, డాక్టర్ నరేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫేక్ డాక్టర్స్.. డేంజర్ ట్రీట్మెంట్ జిల్లాలో పదుల సంఖ్యలో నకిలీ వైద్యులున్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ప్రధానంగా ఈ తనిఖీల ఉద్దేశం కూడా ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు నకిలీ వైద్యులు ప్రజలకు ప్రమాదకరంగా అందిస్తున్న ట్రీట్మెంట్ను అడ్డుకోవడమేనని సభ్యులు తెలిపారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి మోతాదుకు మించి మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. తమ చదువులకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఇష్టారీతిన బోర్డులు పెట్టి కొంతమంది డాక్టర్లుగా చలామణి అవుతున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాకేంద్రంలోనే పలు దవాఖానలు మల్టీస్పెషాలిటీ, ఈఎన్టీ తదితర పేర్లు పెట్టుకుని ఎంబీబీఎస్ వైద్యులతో నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ఆస్పత్రులను అసలు వైద్యులు లేకుండానే నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఎదుట గల ఓ చర్మవ్యాధుల ఆస్పత్రి తమ బోర్డుపై వైద్యుడి పేరు కూడా పెట్టలేదని గుర్తించారు. ఇలాంటి ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులు అసలా.. నకిలీనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపైనా చర్యలుంటాయని తనిఖీ అధికారులు తెలిపారు. ప్రాణాలతో చెలగాటం వైద్యాధికారుల తనిఖీల్లో వైద్యపరంగా పలు కీలక విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జిల్లాకేంద్రంలోనే ఎలాంటి విద్యార్హత లేకుండా విచ్చలవిడిగా రోగులకు యాంటిబయాటిక్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల అర్హత లేనివాళ్లు ఆపరేషన్లు చేస్తున్నట్లు, గర్భ విచ్ఛిత్తి టాబ్లెట్లు ఇస్తున్నట్లు నిర్ధారించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు, ఫేక్ వైద్యులు మోతాదుకు మించి ఇస్తున్న మందుగోలీల కారణంగా ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కిడ్నీ, షుగర్ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు చెప్పారు. వీటిని అరికట్టేందుకే తరచూ దాడులు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. న్యూస్రీల్ ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లపైనా.. ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ ఆధ్వర్యంలో జిల్లాలో వరుసగా హాస్పిటళ్ల తనిఖీ నకిలీ వైద్యులు.. ఆస్పత్రుల గుర్తింపు కేసులు పెడతామన్న అధికారులు ప్రభావం చూపిన ‘సాక్షి’ కథనాలు‘సాక్షి’ కథనాల ప్రభావంజిల్లాలో వైద్యం పేరిట వ్యాపారం చేస్తున్న తీరుపై ‘దుకాణాల్లా దవాఖానలు..’ శీర్షికన ఎన్నికలకు ముందు ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాష్ట్ర వైద్యశాఖ అధికా రుల వరకూ వెళ్లింది. అలాగే ఆర్ఎంపీల తీరుపైనా పలు కథనాలు ‘సాక్షి’ ప్రచురించింది. స్థానికంగా ఫేక్ దవాఖానలు, నకిలీ వైద్యులపై వస్తున్న ఫిర్యాదులకు ‘సాక్షి’ వరుస కథనాలు తోడవడంతో వైద్యాధికా రుల బృందాలు జిల్లాలోనూ జల్లెడ పడుతున్నాయి. ఈ తనిఖీలను ఇంతటితో ఆపబోమని, తరచూ కొనసాగిస్తామని తనిఖీ బృందంలోని అధికారులు చెబుతున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
తప్పక చదవండి
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement