-
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
సాక్షి, నల్గొండ: లోక్సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. -
వడ్డీ డబ్బులివ్వట్లే!
గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2024నల్లగొండ టూటౌన్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో గల స్వయం సహాయక పొదుపు సంఘాలకు కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు చెల్లించడం లేదు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నందికొండ, చండూరు, నకిరేకల్, హాలియా మున్సిపాలిటీల్లో పొదుపు సంఘాలకు 2019–20 సంవత్సరం నుంచి వడ్డీ రావాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానిది కూడా కలుపుకుంటే ఐదేళ్ల వడ్డీ రూ.6.82 కోట్ల బకాయి పేరుకుపోయింది. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంవత్సరం ఇటీవలే ముగిసినా కనీసం మూడేళ్ల వడ్డీ డబ్బులను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయలేదు. వడ్డీలేని రుణం (వీఎల్ఆర్) ఇస్తున్నామని చెబుతున్నారే తప్ప బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీని తిరిగి ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 6,575 పొదుపు సంఘాల మహిళలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కొత్త సంఘాల ఏర్పాటుపై వడ్డీ ఎఫెక్ట్.. ప్రతి సంవత్సరం మెప్మా ఆధ్వర్యంలోని సిబ్బంది కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సంఘం ఏర్పాటు చేయాలంటే 10 మంది మహిళలు ఉండాలి. ఒక్కో మహిళ రూ.100 చొప్పున బ్యాంకులో పొదుపు చేసిన తరువాత ఆరు నెలలకు రుణం ఇస్తారు. కానీ గత నాలుగేళ్లుగా పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ విడుదల చేయకపోవడంతో కొత్త సంఘాల ఏర్పాటుపై ప్రభావం చూపుతోంది. కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు ప్రతినెలా 10వ తేదీలోగా చెల్లించకుంటే అధిక వడ్డీ పడుతుందనే భయంతో ముందుకు రావట్లేదని తెలుస్తోంది. న్యూస్రీల్‘ఇంటర్ అడ్వాన్స్డ్’కు పటిష్ట బందోబస్తు : ఎస్పీ నల్లగొండ క్రైం: ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ అడ్వా న్స్డ్ పరీక్షలకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. నంబర్ ప్లేట్లులేని వాహనాలు నడపొద్దు నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నల్లగొండలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 25 వాహనదారులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎడ్సెట్కు నాలుగు కేంద్రాలు నల్లగొండ రూరల్: తెలంగాణ ఎడ్ సెట్–2024 నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 4పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్సెట్ చైర్మన్ గోపాల్రెడ్డి తెలిపారు. కోదాడలో మూడు, నల్లగొండలో ఒక కేంద్రంలో 1,100 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలిఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డిఫ పొదుపు సంఘాలకు అందని వడ్డీ నిధి ఫ ఐదేళ్ల నుంచి చెల్లించని ప్రభుత్వాలు ఫ ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.6.82 కోట్ల బకాయి ఫ ఎదురు చూపుల్లో 6,575 సంఘాల మహిళలు -
No Headline
నార్కట్పల్లి: బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగుల రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగట్ల జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం నార్కట్పల్లి పరిధిలోని వివేరా హోటల్లో నకిరేకల్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న నకిరేకల్కు మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు దుబ్బాక శ్రీధర్, వాజిద్, దోసపాటి విష్ణుమూర్తి, పసునూరి శ్రీను, పుల్లెంల మహేష్, నడింపల్లి నరేష్, రాజు, సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉత్సవాలు పరిసమాప్తం
యాదాద్రిలో ఈనెల 20న ప్రారంభమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారంతో ముగిశాయి. - 8లోఅధికారుల వద్దాలేని సమాచారం జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో పొదుపు సంఘాలకు రావల్సిన వడ్డీ బకాయిల డబ్బులుఎప్పుడు విడుదల చేస్తారని మహిళలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మున్సిపల్ కార్యాలయాల్లో మెప్మా సిబ్బందిని వడ్డీ గురించి అడుగుతున్నా వారి వద్ద కూడా ఎలాంటి సమాచారం ఉండడంలేదని, కనీసం మెప్మా జిల్లా అధికారుల వద్ద కూడా సమాచారం లేదని మహిళలు వాపోతున్నారు. -
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి
నల్లగొండ టూటౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి గెలుపునకు కృషిచేయాలన్నారు. బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్ 3లో ఉన్న రాకేష్రెడ్డి పేరు ఎదురుగా 1 నంబర్ అంకె వేసి ఓటేసేలా వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాషా, సింగం రామ్మోహన్, కాంచనపల్లి రవీందర్రావు., బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. స్కూళ్లకు సకాలంలో యునిఫాం అందించాలి చిట్యాల, కట్టంగూర్: మహిళా సంఘాలు కుట్టుపనిని త్వరగా పూర్తిచేసి సకాలంలో ప్రభుత్వ స్కూళ్లకు యూనిఫాం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ ఆదేశించారు. చిట్యాల, కట్టంగూర్లో మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూల్ యూనిఫాం కుట్టుపని కేంద్రాల (మహిళా శక్తి సెంటర్ల)ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సరైన కొలతలతో యూనిఫాం కుట్టాలని, పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, మెప్మా పీడీ కరుణాకర్, మెప్మా టీఎంసీ సరిత, కట్టంగూర్ ఎంపీడీఓ జ్ఞాన ప్రకాశరావు, పీడీ శైలజ, ఏపీఓ రాంమోహన్, ఏపీఎం సైదులు, జీడికల్లు, సీసీలు వెంకన్న, మల్లీశ్వరి, వీఓల సమాఖ్య మండల అధ్యక్షురాలు మంజుల, పద్మ, యామిని, శ్రీలత పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ -
632.80 అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 632.80 అడుగులకు చేరుకుంది. అకాల వర్షాలకు మూసీలోకి బుధవారం 732 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 632.80 అడుగులకు చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5 నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 618 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోగా, గత 48 రోజుల్లో 15 అడుగుల మేర నీరు చేరింది. గత ఏడాది ఇదేనెలలో నీటిమట్టం 642 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
బంగారం దొంగిలించిన మహిళ అరెస్ట్
కోదాడరూరల్: బస్టాండ్లో ప్రయాణికురాలి నుంచి బంగారం చోరీ చేసిన మహిళను కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 4వ తేదీన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన తిమ్మారెడ్డి వరమ్మ మునగాల నుంచి కోదాడకు వెళ్లింది. అక్కడి నుంచి చింత్రియాలకు వెళ్లేందుకు బస్టాండ్లో బస్సు ఎక్కి కూర్చున్న ఆమె కొద్దిసేపటి తర్వాత తన బ్యాగు చూసుకోగా అందులో ఉన్న రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే కోదాడ పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం కోదాడ పట్టణంలోని గోల్డ్షాప్ బజారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి మండలం బుడగుంట గ్రామానికి చెందిన కర్రెద్దుల లలితను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన బంగారంతో పాటు రూ.30వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆమైపె ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలో 50కి పైగా కేసులు ఉన్నాయని, పలుసార్లు జైలు జీవితం గడిపినట్లు పేర్కొన్నారు. నిందితురాలని పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన పట్టణ సీఐ రంజిత్రెడ్డి, సిబ్బంది సతీష్, యల్లారెడ్డిని సీఐ అభినందించారు. -
మైనర్ను గర్భవతిని చేసి నిమ్స్లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్పేషెంట్గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు
మిర్యాలగూడ: కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించిన 30వేల ఉద్యోగాలకు కేవలం కాల్ లెటర్ ఇచ్చి తామే ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పుకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎస్వీ గార్డెన్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు మంచి చెడు ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్, నోముల భగత్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాగర్ కర్నూల్, నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, ఇంతియాజ్అలీ, చింతరెడ్డి శ్రీనివా స్రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, నూకల సరళహన్మంతరెడ్డి, బాలాజీనాయక్, లలితహాతీరాంనాయక్, అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివా స్రెడ్డి, నారాయణరెడ్డ, మోసిన్అలీ, యూసుఫ్, ఎండి.కరీం పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం
నల్లగొండ టౌన్: ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగయ్య అన్నారు. మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన ఆ సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భా రాన్ని మోపిందని విమర్శించారు. ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుల్లో వేలాది మంది కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బొజ్జ చిన్న వెంకులు, నారి ఐలయ్య, దండంపల్లి సరోజ, కత్తుల లింగస్వామి, కంబాలపల్లి ఆనంద్, మన్నె భిక్షం, రాముడు, మారయ్య పాల్గొన్నారు. ఫ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య -
ముగిసిన నెల్లిబండ గట్టు జాతర
నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని గట్టుపై రెండు రోజులుగా కొనసాగుతున్న శ్రీలింగమంతుల స్వామి–సౌడమ్మ జాతర మంగళవారం రాత్రి ముగిసింది. సాయంత్రం 4:30 గంటలకు పసుపు కుంకుమలతో దేవుని పటం (చంద్రపట్నం) వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతరతో నెల్లిబండ గ్రామమంతా పండుగ వాతావరణం సందడి నెలకొంది. చివరి రోజు పూజల్లో ఆలయ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ బోయిళ్ల కిషోర్, డెరెక్టర్లు బాత్క లింగస్వామి, ఆడెపు సతీష్, బోయిళ్ల అశ్విన్, గుడుగుంట్ల శివశంకర్, వీరబోయిన అబ్బయ్యల పాల్గొన్నారు. -
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి
మునుగోడు: మండలంలోని ఊకొండి గ్రామానికి చెందిన గీతకార్మికుడు తాటిచెట్టు పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊకొండి గ్రామానికి చెందిన గీతకార్మికుడు నకరకంటి అంజయ్య(58) రోజువారిగా మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు గొలుసు తెగిపోవడంతో పట్టుతప్పి కిందపడిపోయాడు. పక్కనే మరో తాటిచెట్టు ఎక్కుతున్న మరొక గీతకార్మికుడు గమనించి అంజయ్య కుటుంబ సభ్యులకు సమచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి వచ్చి 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో హైదరబాద్కు తరలిస్తుడంగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిభువనగిరి క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. వివరాలు.. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన జిల్లాల రవీందర్(45) బైక్పై సోమవారం రాత్రి హైదరాబాద్కు వెళ్తుండగా.. భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ ఎదుట గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ అరుణ్కుమార్ తెలిపారు. టైరు పేలి కారు బోల్తా● నలుగురికి గాయాలు చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై మంగళవారం కారు టైరు పేలడంతో చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురుకి గాయాలయ్యాయి. వివరాలు.. కట్టంగూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వెలిమినేడు శివారులోనికి రాగానే టైరు పగిలిపోయింది. దీంతో కారు హైవే పక్కనే చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భాస్కర్, అతని భార్య సింధూరతో పాటు కారులో ప్రయాణిస్తున్న లక్ష్మి, పూజకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్లోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అని తెలిసింది. -
ఎంజీయూ ఇన్చార్జి వీసీగా నవీన్ మిట్టల్
నల్లగొండ రూరల్: ఎంజీయూ ఇన్చార్జి వీసీగా ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీసీగా ఉన్న గోపాల్రెడ్డి పదవీకాలం ముగిసింది. రెగ్యులర్ వీసీ వచ్చేంత వరకు మిట్టల్ ఇన్చార్జి వీసీగా కొనసాగుతారు. బుధవారం ఉదయం 11గంటలకు గోపాల్రెడ్డికి వీడ్కోలు సభ ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్ అల్వాల రవి తెలిపారు. 24న పాలిసెట్ రామగిరి(నల్లగొండ): ఈ నెల 24న పాలిసెట్–2024 పరీక్ష జరగనున్నట్లు నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను జిల్లా కేంద్రలో తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో మొత్తం 3,842 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నాని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఒక నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు మంచి ర్యాంకులు సాధించిన వారు మూడు సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులు చేసేందుకు అర్హులని తెలిపారు. రేపు బీజేపీ నేత లక్ష్మణ్ రాక నల్లగొండ టూటౌన్: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ గురువారం జిల్లా కేంద్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. నల్లగొండలోని చిన వెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అదే విధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ బుధవారం నల్లగొండ పట్టణానికి రానున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ: ఈ విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఐటీఐల కన్వీనర్, నల్లగొండ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.గోపాల్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో ప్రవేశానికి మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో జూన్ 10 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్ ఫొటోతో సహా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఆన్లైన్లోని వెబ్సైట్ iti.telangana.gov.i nకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో తప్పనిసరిగా మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశ వివరాలు పూర్తిగా వారి మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని తెలిపారు. సెలవుపై వెళ్లిన జీజీహెచ్ సూపరింటెండెంట్ నల్లగొండ టౌన్: నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద సెలవులపై వెళ్లారు. మంగళవారం నుంచి ఆయన నెల రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నట్టు తెలిసింది. దీంతో ఇన్చార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ రమణమూర్తిని డీఎంఈ నియమించారు. నిత్యానందం సెలవులపై వెళ్లడానికి వివిధ రకాల కారణాలు ఉన్నట్లు సమాచారం. బాలపురస్కార్కు దరఖాస్తులు చేసుకోండి నల్లగొండ: వివిధ రంగాల్లో ప్రతిభచాటిన 5 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికల నుంచి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2025 అవార్డుకు దరఖాస్తులు చేసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి బి.సక్కుబాయి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలు, సోషల్ సర్వీస్, ప్రకృతి, క్రీడలు, కళలు సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బాలబాలికలు మాత్రమే ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల బాలబాలికలు awards.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా జులై 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అనుమతి లేకుండా స్కూళ్లు నిర్వహించొద్దు నల్లగొండ: ప్రభుత్వ అనుమతి, గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో, కొండమల్లేపల్లిలో ఉన్న ఎస్పీఆర్ హైస్కూళ్లకు ప్రభుత్వ అనుమతి లేదని, ఆ పాఠశాలలో ఎటువంటి ప్రవేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తల్లిదండ్రులు గమనించాలని కోరారు. -
పత్తి విత్తనాలు సిద్ధం
నాణ్యమైన విత్తనాలు కొనాలి జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు అమ్మకాలు లేవు. అందరు వ్యాపారులు బోల్గార్డు–2 హైబ్రీడ్ రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు కూడా నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాలి. – జాలిపర్తి నాగేశ్వర్రావు, విత్తన దుకాణదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ తప్పకుండా రశీదు పొందాలి ఇప్పటికే జిల్లాలో 4లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాము. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం. రైతులు నాణ్యమైనవి ఎంపిక చేసుకుని కొనుగోలు చేసి రశీదులు తప్పక పొందాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండఫ అందుబాటులో 4లక్షల బీజీ–2 ప్యాకెట్లు ఫ ఈ సీజన్కు 15లక్షల ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా ఫ నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ఫ నాణ్యమైనవి కొని రశీదు తీసుకోవాలని సూచన నకిలీ విత్త్తనాలపై ప్రత్యేక నిఘా పత్తి విత్తనాలపై జిల్లా వ్యవసాయ శాఖతో పాటు జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. గతంలో అనేకసార్లు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోయి దిగుబడి రాక నష్టాల పాలైన సంఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. విత్తనాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ను పంపించనున్నారు. ఏమైనా విత్తనాల్లో తేడా ఉంటే వాటి అమ్మకాలను నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో పాటుగా బార్కోడ్ ఉన్న విత్తన ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పక రశీదు తీసుకుని సీజన్ ముగిసేంత వరకు రశీదులను భద్రపర్చుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. నల్లగొండ అగ్రికల్చర్: వానాకాలం సీజన్ పత్తి సాగుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ సారి రైతులకు పత్తి విత్తనాల కొరత లేకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ కంపెనీల డీలర్లతో సమావేశమైంది. అధికారుల ఆదేశాలతో డీలర్లు సైతం సుమారు 4 లక్షల వరకు బోల్గార్డు–2 (బీజీ– 2) హైబ్రీడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ముందస్తు సాగుకు అవకాశం ఉండడంతో.. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రాన్ని తాకి జూన్ మొదటి వారంలోనే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథం్యలో ఈ వానాకాలం సీజన్ ముందస్తుగానే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇటీవల జిల్లా వ్యాప్తంగా మూడు దఫాలుగా అకాల వర్షాలు కురవడంతో చాలా మండలాల్లో రైతులు గదుక్కులు దున్నుకొని పత్తిసాగుకు సిద్ధంగా ఉన్నారు. రోహిణీ కార్తె దాటిన తర్వాత వర్షాలు కురిస్తే పత్తి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. 5.40లక్షల ఎకరాల సాగు అంచనా జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 5లక్షల 40 వేల ఎకరాల్లో పత్తిని సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకుగాను సుమారు 15లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతామని అంచనాలు వేసి వివిధ కంపెనీల డీలర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీంతో తులసీ, నూజివీడు, రాశి, బయోసీడ్, రేవంత్, యూఎస్ అగ్రి, కర్నూల్, ప్రభ, ప్రవర్తన్, మైసీడ్, క్రిస్టల్, మైకో, కావేరి, శ్రీరాంబయో వంటి కంపెనీలకు చెందిన పత్తి విత్తనాల ప్యాకెట్లను జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని దేవరకొండ, చందంపేట, పీఏపల్లి, కొండమల్లెపల్లి, చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ, గుర్రంపోడు, కనగల్, మునుగోడు, చండూరు, నకిరేకల్, నార్కట్పల్లి, తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో అత్యధికంగా పత్తిపంటను రైతులు సాగు చేయనున్నారు. మరో వారంలో రోజుల్లో అన్నికంపెనీ పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఎంఆర్పీ ధర ఇలా.. బోల్గార్డు–2 పత్తి విత్తనాల ప్యాకెట్(475 గ్రాములు) ఎంఆర్పీ ధర రూ.864గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ కంపెనీ అయినా, ఏ పేరుతో ఉన్న విత్తనాలైనా ఎంఆర్పీ ధర రూ.864కే విక్రయించాల్సి ఉంటుంది. ఎంఆర్పీ ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. -
‘మహాలక్ష్మి’ల ఆగ్రహం !
మిర్యాలగూడ అర్బన్: బస్సు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు డ్రైవర్పై మహిళలు చేయి చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో చోటుకుంది. దేవరకొండ డిపోకు చెందిన బస్సు మిర్యాలగూడకు వస్తున్న సమయంలో అంగడిపేట స్టేజీ వద్ద కొంత మంది మహిళలు చెయ్యి ఎత్తి బస్సును ఆపారు. ఆ బస్సు డ్రైవర్ మహిళలు ఉన్న చోట కాకుండా కొద్ది దూరం వెళ్లి ఆపడంతో అక్కడ ఉన్న మహిళలు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కారు. ఈ లోగా బస్సును కదిలించడంతో బస్సు ఎక్కిన మహిళలు మావారు వస్తున్నారు.. బస్సు ఆపాలని డ్రైవర్తో అనగా .. వెనకాల మరో బస్సు వస్తుంది.. అంటూ డ్రైవర్ బస్సును నడపడంతో మేము కూడా దిగుతామని బస్సు ఆపాలని చెప్పడంతో బస్సు ఆపి వారందరు దిగిన తరువాత బస్సు వెళ్లిపోయింది. ఆ వెనకాలే వస్తున్న మరో బస్సులో అందరు మహిళలు ఎక్కి మిర్యాలగూడ బస్టాండ్కు చేరుకున్న అనంతరం బస్సునుంచి దిగిన మహిళలు ముందుగా వచ్చిన బస్సు డ్రైవర్ను బస్సు ఎందుకు ఆపలేదని చేయి చేసుకున్నారు. డ్యూటీలో ఉన్న తనను కొట్టారని సదరు డ్రైవర్ మహిళలపై కేసు పెట్టారు. విషయం తెలుసుకున్న మహిళలు .. ఆ డ్రైవర్ మా అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డ్రైవర్పై కేసు పెట్టారు. దీంతో అవాకై ్కన డ్రైవర్ చేసేది ఏమీ లేక పోలీసుల వద్ద తన గోడును వెల్లబోసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురితో చర్చించి రాజీకుదిర్చారు. బస్సు ఆపలేదని డ్రైవర్ని కొట్టిన మహిళలు మిర్యాలగూడ బస్టాండ్లో ఘటన -
ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి బలవన్మరణం
మోతె: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోతె మండల పరిధిలో ఉర్లుగొండ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన కంచెం కొమరయ్య(38), రమ భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొమరయ్య భార్య రమ వారం రోజుల క్రితం తన ముగ్గురు ఆడపిల్లలను తీసుకొని తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కొమరయ్య సోమవారం అర్థరాత్రి మోతె మండలం ఉర్లుగొండ గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. -
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
పోలింగ్, కౌంటింగ్కు సిద్ధం కావాలి
ఫ కలెక్టర్ హరిచందన నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, కౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 24వ తేదీన పీఓ, ఏపీఓ, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇవ్వాలని ఆ రోజునే ర్యాండమైజేషన్ చేయాలని పేర్కొన్నారు. జూన్ 5 వ తేదీ ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపునకు హాజరయ్యే సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్లు, దివ్యంగులకు వాహనాలు, వీల్ చైర్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఈనెల 20 నుంచి 25 వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజ్, నల్లగొండ ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో తప్పులు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రవణ్ తెలిపారు. సోమవారం నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కళాశాలలో పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన మొదటి విడత శిక్షణలో ఆయన మాట్లాడారు. 97 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 232 మంది పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా లింగస్వామి చిట్యాల: తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా, ఆ సంఘం ఐక్య గురుకులాల కన్వీనర్గా చిట్యాల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె లింగస్వామిని నియామితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పార్వతి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ తెలంగాణ పీఆర్టీయూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, గురుకులాల ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు. నేడు కేటీఆర్ పర్యటన నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నల్లగొండ, మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున సాగర్, సాయంత్రం 4.30 గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం 6 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశంలో పాల్గొననున్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 గంటలకు వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనుమతి లేకుండా ఔషధాలు విక్రయించొద్దు పెద్దఅడిశర్లపల్లి : మెడికల్ షాపుల్లో అనుమతలు లేకుండా ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఔషధ నియంత్రణ శాఖ మిర్యాలగూడ డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) అశ్విన్కుమార్ హెచ్చరించారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మాపురంలో అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఖమ్మం డీఐ అనీల్కుమార్తో కలిసి తనిఖీలు నిర్వహించగా అజ్మాపురం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడైన బండి సైదిరెడ్డి వద్ద రూ.70,900 విలువ చేసే 42 రకాల ఔషధాలను పట్టుకుని సీజ్ చేసి దేవరకొండ కోర్టులో డిపాజిట్ చేశారు. సైదిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులు ఉన్నారు. శివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట : యాదాద్రి ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం విశేష పూజలు చేపట్టారు. శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి సేవను ఆలయంలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం తదితర పర్వాలు చేపట్టారు. -
విద్యార్థులు ఉన్నత స్థానాలు పొందాలి
నల్లగొండ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానం పొందాలని కలెక్టర్ హరిచందన ఆకాక్షించారు. పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభినందించారు. వారికి ప్రశంస పత్రం, జ్ఞాపికలను అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ కష్టపడి చదివి 10/10 జీపీఏ సాధించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో మృతిచెందిన మునుగోడు తహసీల్దార్ సునంద పేరు మీద ఆమె భర్త లక్ష్మారెడ్డి 10/10 జీపీఏ సాధించిన ముగ్గురు ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ అబివృద్ధి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హరిచందన -
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
రామగిరి(నల్లగొండ): అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం నూకలవారిగూడేనికి చెందిన గుండెబోయిన నాగరాజుకు 2001లో గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన జ్యోతి(40)తో వివాహం అయ్యింది. వ్యవసాయం చేస్తున్న నాగరాజు మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఆదివారం మధ్యాహ్నం గేదెలను తోలుకొని జ్యోతి ఊరి చివరకు వెళ్లింది. అనుమానంతో భార్యను వెంబడించిన నాగరాజు గొడవకు దిగి కోపంతో జ్యోతి తలపై విచక్షణారహితంగా మోదాడు. దీంతో స్పృహ తప్పిన జ్యోతిని ఇంటికి తీసుకొచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిందని చుట్టుపక్కల వారికి చెప్పి అంబులెన్స్లో నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. జ్యోతి తలపై గాయాలను చూసిన ఆమె తండ్రి భైరవోని స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం పోస్టుమార్టం చేసి జ్యోతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా : అభ్యర్థి రాకేష్రెడ్డి
ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల .రాకేష్రెడ్డి కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం పార్టీ నేతలు కేటీఆర్ను సన్మానించారు. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎంపీ బడుగుల లింగం యాదవ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, కొల్పుల అమరేందర్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులుదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, జనగాం పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సుందరయ్య జీవితం.. ఆదర్శం
నల్లగొండ టౌన్: దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య తనకున్న వందల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. పార్లమెంట్కు, శాసన సభకు సైకిల్పై వెళ్లి తన నిరాడంబరతను చాటుకున్న మహానేత సుందరయ్య అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన త్యాగధనుడు పుచ్చలపల్లి అని గుర్తుచేశారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారి ఐలయ్య, సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండీ.సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సరోజ, భూతం అరుణకుమారి, మన్నె భిక్షం, బొల్లు రవీంద్రకుమార్, నర్సింహ, సైదాచారి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం
ఆన్లైన్లోనే అమ్మకాలు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలు పూర్తిగా ఆన్లైన్లోనే అమ్మకాలు ఉంటాయి. రైతులు విధిగా తమ భూమి పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకెళ్లి సంబంధిత కేంద్రాల్లో కొనుగోలు చేయాలి. ఆన్లైన్లో చేయకపోతే సబ్సిడీ వర్తించదు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండనల్లగొండ అగ్రికల్చర్: వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పచ్చిరొట్ట ఎరువుల కోసం జనుము, జీలుగ విత్తనాలు చల్లుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సిద్ధం చేసింది. వీటిని జిల్లాకేంద్రంలోని లతీఫ్సాబ్ గుట్ట వద్ద గల నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘంతోపాటు చిట్యాల, నార్కట్పల్లి, వేములపల్లి, దామరచర్ల ప్రాథమిక సహకార సంఘాలతో పాటు టీఎస్ సీడ్ కార్పొరేషన్ నిడమనూరు కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచారు. విక్రయానికి ఏర్పాట్లు ప్రస్తుతం ఆయా సంఘాల్లో 30కిలో బ్యాగులు 248 వరకు జీలుగ, 40 కిలోలవి 160 బ్యాగుల జనుము విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. రైతుల డిమాండ్ను బట్టి సోమవారం నుంచి అన్ని సహకార సంఘాల్లో వీటిని విక్రయించడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిని 50 శాతం సబ్సిడీపై విక్రయించనున్నారు. ఈ విత్తనాలను ఆయా సెంటర్లలో ఆన్లైన్లో విక్రయిస్తారు. ఫ 50 శాతం సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు ఫ వర్షాలు కురుస్తుండడంతో అందుబాటులో ఉంచిన వ్యవసాయ శాఖ ఫ నేటి నుంచి డీసీఎంఎస్, రైతు సహకార సంఘాల్లో విక్రయం విత్తనాల ధరలు ఇలా (రూపాయల్లో).. విత్తనం బ్యాగు(కేజీల్లో) పూర్తి ధర సబ్సిడీ రైతువాటా జీలుగ 30 2,790 1,674 1,116 జనుము 40 3,620 2,172 1,448 -
ప్రజావాణికి రావద్దు
నల్లగొండ: జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జూన్ 8 వరకు నల్లగొండ కలెక్టరేట్కు రావద్దని కోరారు. ప్రాథమిక స్థాయి నుంచే క్రీడలు అవసరం నల్లగొండ టూటౌన్: విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే క్రీడలు అవసరమని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనే ప్రోత్సహించాలని ఏఎస్పీ రాములునాయక్ అన్నారు. నల్లగొండలోని అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఆయన సందర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకుడు బొమ్మపాల గిరిబాబు, సీనియర్ క్రీడాకారుడు హబీబుద్దీన్, ఖాజా అన్వర్, కోచ్ మద్ది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జ్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్లను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జ్లుగా స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చౌర్మన్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులను ప్రకటించారు. దేవరకొండకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్ను ఇన్చార్జ్లుగా నియమించారు. మిర్యాలగూడకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, సీనియర్ నాయకుడు రాజీవ్సాగర్ను, మునుగోడుకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సీహెచ్.రాకేష్కుమార్ను నియమించారు. నాగార్జునసాగర్కు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, విజయుడు, నకిరేకల్కు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గువ్వల బాలరాజు, నల్లగొండకు కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, హుజూర్నగర్కు ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఇంతియాజ్, కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్, అంజయ్య యాదవ్, సూర్యాపేటకు ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, నవీన్ కుమార్ను నియమించారు. తుంగతుర్తికి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గోలి శ్రీనివాస్రెడ్డి, ఆలేరుకు గొంగిడి సునీత, గెల్లు శ్రీనివాస్యాదవ్, భువనగిరికి పైళ్ల శేఖర్రెడ్డి, ఎండీ ఇబ్రహీంను ఇన్చార్జ్లుగా ప్రకటించారు. 632 అడుగులకు మూసీ నీటిమట్టం కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 632 అడుగులకు చేరుకుంది. మూసీ ప్రాజెక్టు ఎగువన ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి ప్రస్తుతం అలుగు పోస్తున్నాయి. అలుగుల నుంచి వచ్చే నీరంతా ప్రస్తుతం మూసీ ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరం, మూసీ ఎగువన పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు మూసీలోకి వచ్చి చేరుతుంది. వారం రోజుల వరకు కేవలం ఆరేడు వందల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో ఆదివారం 3,700 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 632 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. యాదాద్రిలో లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు వివిధ పుష్పాలతో అర్చన చేశారు. ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో నిత్య కైంకర్యాలు గావించారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసవేశారు. లక్ష పుష్పార్చనలో ఈఓ భాస్కర్రావు, అర్చకులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి
ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్
స్టేజ్పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
బెంగాల్ గవర్నర్పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement