-
అటవీ అధికారులతో రైతుల వాగ్వాదం
భీమారం: మండలంలోని అంకూసాపూర్ శివారు 140 సర్వేనంబర్లోని వివాదాస్పద భూముల్లో కందకాలు తీసేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. బుధవారం అధికారులు పోలీసుల సహకారంతో కందకాలు తీసే పనులు చేపట్టారు. గత 50 ఏళ్ల నుంచి తాము ఈ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తవ్వకాలు ఎలా చేపడుతారని అటవీశాఖ అధికారులను రైతులు నిలదీశారు. మంచిర్యాల రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ మాట్లాడుతూ అటవీశాఖ భూములు కాబట్టే పనులు చేపట్టామని, అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని తెలిపారు. తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, గతంలో జరిగిన సభల్లో దరఖాస్తులు ఇచ్చామని రైతులు తెలిపారు. అనంతరం ఎస్సై రాములు నేతృత్వంలో పోలీసు బందోబస్తు మధ్య కందకాలు తీసే పనులు చేపట్టారు. కాగా, 10 ఎకరాల్లో వరి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారని రైతులు దర్శనాల రాజేశ్వరి, మధూకర్ ఆరోపించారు. -
బాలిక విద్యకు భాగ్యరెడ్డివర్మ కృషి
మంచిర్యాలఅగ్రికల్చర్: దళిత వైతాళికుడు, సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ దళిత బాలికల పాఠశాలలను స్థాపించి బాలిక విద్యకు చేసిన కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో బుధవారం భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించి దళిత బాలికలకు విద్యనందించేందుకు 26 దళిత బాలికల పాఠశాలలు స్థాపించారని అన్నారు. వివిధ సంఘాలు, మండలిలను స్థాపించి సంఘ సంస్కరణ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పోటు రవీందర్రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అనిత, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, సీ సెక్షన్ పర్యవేక్షణ అధికారులు సంతోష్ పాల్గొన్నారు. -
● జంగ్ సిపాయి భూములపై విచారణకు పట్టు ● కోర్టులో కేసు వేసేందుకు బాధితుల యత్నం ● బయటపడనున్న అందుగులపేట సోలార్ పవర్ ప్లాంటు భూ బాగోతం
రికార్డులకెక్కని వివరాలుసౌర విద్యుత్ కంపెనీకి సంబంధించిన భూమి వివరాలు ఇప్పటికీ పూర్థి స్థాయిలో రికార్డులకు ఎక్కలేదు. వ్యవసాయేతర(నాలా) భూములుగా నమోదు చేయాల్సి ఉన్నా, ఇంకా ధరణిలో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి. పట్టాదారుల వివరాలు అసంపూర్తిగా ఉండడంతోపాటు పాస్బుక్లు పెండింగ్లో ఉన్నట్లు పోర్టల్లో చూపిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండడంతో భూములు కారు చౌకగా కాజేసిన ఆ దొరతోపాటు కొనుగోలు చేసిన సోలార్ కంపెనీ యాజమాన్యం మధ్య జరిగిన లావాదేవీలు తేలితే భూముల వ్యవహారం పూర్తిగా బయటపడనుంది. జంగ్ సిపాయి కాకుండానే ఆ గ్రామవాసుల అసైన్డ్ భూములు, పట్టదారులు సైతం కొందరు సోలార్ కంపెనీపై పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నారు. తమ గ్రామ శివారులో ఉన్న భూమిని తెలివిగా బదలాయింపు జరిగిన తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై గ్రామస్తులు కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సైతం ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం అందుగులపేట శివారులోని జంగ్సిపాయి భూములపై బాధితులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తగిన ఆధారాలు, రెవెన్యూ రికార్డులతో హైకోర్టులో కేసు వేసి న్యాయం కోసం కొట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మందమర్రి మండలం అందుగులపేట శివారు జంగ్సిపాయి భూముల్లో ఓ కార్పొరేట్ కంపెనీ సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసింది. అయితే.. బ్రిటిష్ ఇండియా సమయంలో నిజాం సర్కారు అప్పటి సైనికులకు ఈ భూములు కేటాయించింది. అప్పటి నుంచి భూములు ప్లాంటుకు అమ్మేసే వరకు ఆ భూముల్లో నిజ వారసులు ఎవరూ మోఖా మీద లేరు. ఈ భూములపై కన్నేసిన ఓ దొర కీలకంగా వ్యవహరించి తన పరం చేసుకుని తర్వాత సోలార్ కంపెనీ నిర్వాహకులకు అమ్మేశారు. భూ అక్రమాలపై ‘సాక్షి’ గత మార్చిలోనే కథనాలు ప్రచురించడంతో ఇంటెలిజెన్స్, రెవెన్యూ వర్గాలు విచారణ చేపట్టాయి. ఇప్పటికే ఈ భూ వ్యవహారంలో నివేదికలు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో కోర్టు వైపు నుంచి కూడా పోరాడితే తమకు న్యాయం జరుగుతుందనే కోణంలో భూ బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సౌర విద్యుత్ ప్లాంటు నిర్మించిన భూముల వ్యవహారం మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు వారసులెవరు? అందుగులపేట శివారులోని జంగ్సిపాయి భూములు 60ఎకరాలు వాస్తవ వారసులకు తెలియకుండానే అన్యాక్రాంతం అయ్యాయి. తెరపైకి వచ్చిన వారసుల్లో నిజ వారసులు ఎవరనేది తేలాల్సి ఉంది. 103 సర్వేనంబర్లలో ఐదుగురు సిపాయిలకు 60 ఎకరాల చొప్పున ఇచ్చిన 300ఎకరాలు ఉండేవి. ఈ భూములను కబ్జాలో ఉన్న వారి నుంచి అగ్గువకు కొట్టేసి, అవే భూములను సోలార్ కంపెనీకి అమ్మి భారీగా సొమ్ము చేసుకున్నారు. వీరిలో కొంత భూ మిని వాస్తవ వారసులతో కొనుగోలు చేయగా, ఇదే భూమిని మరొకరు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో వి వాదం మొదలైంది. గ్రామస్తులకు సైతం ఈ భూ ములపై స్పష్టత లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇక కొందరు భూ అక్రమదారులకు మద్ద తు తెలపడంతో పట్టించుకునేవారే కరువయ్యారు. అసలు వారసులెవరనేది తెలియకుండా క్రయ విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నెలకొల్పిన కార్పొరేట్ కంపెనీ ఈ భూమి వివరాలు పూర్తిగా తెలిసీ కొనుగోలు చేసిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ భూములపై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలైతే ప్రస్తుతం సోలార్ కంపెనీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. -
స్ట్రాంగ్ రూంల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఎన్నికల అధికారి సంతోష్బస్సుల ఆదాయం ఇలా..లహరి ఏసీ బస్సులు : 4 నెల కిలోమీటరు ఆదాయం ఈపీకే ఓఆర్ఫిబ్రవరి 61,686 35,56342 57.65 51 మార్చి 64,428 రూ.35,39,584 54.94 49 ఏప్రిల్ 61452 రూ.43,00,782 69.99 62 మే(18వరకు) 36,438 రూ.25,20,906 69.18 62 నాన్ ఏసీ : 4ఫిబ్రవరి 64281 రూ.35,89,978 55.88 65 మార్చి 70,430 రూ.35,63,214 50.59 59 ఏప్రిల్ 65,578 రూ.33,38,136 50.90 56 మే(18వరకు) 40627 రూ.19,62,272 48.30 56 మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ శివారులోని ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం పరిసరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం లెక్కింపు కేంద్రం పరిసరాలు, భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించి లెక్కింపు కేంద్రం పరిసరాలను బైనాక్యులర్తో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లతోపాటు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, మాక్ పోల్ ధ్రువప్రతాలు, పీఓ డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చగా వాటి రక్షణకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి చెన్నూర్రూరల్: వరిధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మండలంలోని ఎర్రగుంటపల్లి, ఒతుకులపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. రైతుల వద్ద ధాన్యం కొన్న తర్వాత వారి వివరాలను ట్యాబ్లలో నమోదు చేయాలని సూచించారు. ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపేలా నిర్వాహకులు చూడాలని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సనత్కుమార్, ఆర్ఐ రంజిత్కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనమంచిర్యాలఅగ్రికల్చర్: గోవాలో ఈ నెల 19న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా కేంద్రంలోని జెన్ శిటోరియ కరాటే స్కూల్ విద్యార్థులను కలెక్టర్ బి.సంతోష్ అభినందించారు. కలెక్టర్ చాంబర్లో మాట్లాడుతూ విద్యార్థులు బహుమతులు సాధించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు కే.నిహారిక, కే.శ్రీదేవి, జోష్మిత, అనందన బంగారు పతకాలు, ఏ.గౌతమ్, బి.సాయి, రోహన్, మనీష్, వెండి పతకాలు సాధించారని మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు. -
నెలాఖరులోగా యూనిఫాంలు అందించాలి
మందమర్రిరూరల్: నెలాఖరులోగా విద్యార్థుల యూనిఫాంలు అందించే విధంగా కుట్టు మిషన్ కేంద్రాల నిర్వాహకులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. బుధవారం పట్టణంలోని రెండవ జోన్లో కుట్టు మిషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాజేశ్వర్లతో కలిసి సందర్శించారు. యూనిఫాంల తయారీ ఎక్కడి వరకు వచ్చిందని నిర్వాహకురాలు విజయనిర్మలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సారంగపల్లి, చిర్రకుంట గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని, రంగులు వేసి కొత్త హంగులతో కనిపించే విధంగా చూడాలని ఎంపీడీవో రాజేశ్వర్, అమ్మ ఆదర్శ కమిటీలకు సూచించారు. -
ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫించన్ పెంచి ఆదుకోవాలన్నారు. ఆర్టీసీ విశ్రాంత కార్మిక సంఘం నూ తన కమిటీ ఎన్నిక నిర్వహించారు. రీజినల్ గౌరవ అధ్యక్షుడిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, అధ్యక్షుడిగా గుండా చంద్రమాణిక్యం, కార్యదర్శిగా కేఎంఎస్ రెడ్డి, కోశాధికారిగా ఏబీ.ముబారక్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రకాష్లను ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పాల్గొన్నారు. -
లహరి.. లాభాల ప్రయాణం
● బస్సులకు ప్రయాణికుల ఆదరణ ● జిల్లాలో ఎనిమిది బస్సులుమంచిర్యాలఅర్బన్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఏసీ స్లీపర్ లహరి బస్సులకు ఆదరణ లభిస్తోంది. మూడు నెలల క్రితం మంచిర్యాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా పరిచయం చేసింది. ప్రైవేటు బస్సులకు దీటుగా రూపొందించిన నాలుగు ఏసీ స్లీపర్, నాలుగు నాన్ ఏసీ స్లీపర్, రాజధాని మంచిర్యాల డిపోకు వచ్చాయి. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి, అమ్మ ఒడి అనుభూతిగా నామకరణం చేసింది. వేసవి నేపథ్యంలో మంచిర్యాల–హైదరాబాద్కు ఎనిమిది బస్సులు నడిపిస్తుండగా ఏసీ బస్సులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో లాభాల బాట పడుతున్నాయి. లగ్జరీ బస్సుల కంటే కాస్త టికెట్ ధరలు ఎక్కువైనప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రయాణికులు ఆదరిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో టికెట్ ధరలు చూడకుండా ప్రయాణం చేస్తున్నారు. లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 33 సీటింగ్, అప్పర్తో 15బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతీ బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్లు ఏర్పాటు చేశారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు నాక్ బటన్ సదుపాయం కల్పించారు. ప్రతీ బస్సులో (కేబీన్, బస్సులోపల) రెండు సీసీ కెమెరాలు అమర్చారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులతోపాటు పలు సౌకర్యాలున్నాయి. నాన్ ఏసీ బస్సుల కంటే ఏసీ బస్సులకు డిమాండ్ పెరుగుతోంది. వేసవి కావడం.. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో లహరి బస్సులకు మంచి ఆదరణ ఉందని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. -
న్యాయ నిర్ణేతలుగా ఎంపిక
బెల్లంపల్లి: గద్వాల్ పట్టణంలో ఈ నెల 19నుంచి 21వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతల సెమినార్ నిర్వహించారు. సెమినార్కు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 10 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బుచ్చి రామారావు, జిల్లపల్లి వెంకటస్వామి తెలిపారు. జాతీయ న్యాయ నిర్ణేతగా 12 ఏళ్ల జిల్లపల్లి జై చంద్రప్రసాద్ ఎంపికై రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఎంపికై న తైక్వాండో క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్రెడ్డి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజులాల్, రాజ్మహ్మద్ తదితరులు అభినందించారు. -
ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూడాలి
జైపూర్: వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఓసీపీలు, సంపు ఏరియాల్లోని బొగ్గును వీలైనంత త్వరగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని, ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ప్రాజెక్ట్ను బుధవారం శ్రీరాంపూర్ జీఎం బీ సంజీవరెడ్డితో కలిసి వెంకటేశ్వర్రెడ్డి ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఓసీపీ ప్రాజెక్ట్ను వారు సందర్శించి పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతను సాధించాలని సూచించారు. ఇందుకు ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని చెప్పారు. రోజువారీ వోబీ ఉత్పత్తి లక్ష్యాన్పి తప్పనిసరిగా సాధించాలని, వోబీ ఎంత ఎక్కువగా తీస్తే బొగ్గు అంతా ఎక్కువ ఉత్పత్తి రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సంబంఽధిత కాంట్రాక్టర్లు పలు ఆదేశాలు ఇచ్చారు. ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్, గని మేనేజర్ రవికుమార్ తదితరులున్నారు. -
మౌలిక వసతులు మెరుగుపరచాలి
శ్రీరాంపూర్: సింగరేణి గనులపై మౌలిక వసతులు మెరుగుపరచాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ సీతారామయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆర్కే–5 గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనులపై రెస్ట్హాల్స్, సైకిల్ షెడ్లు, భోజనశాలను ఆధునీకరించాలని కోరారు. నాణ్యమైన పనిముట్లు అందించాలని, కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను తొలగించాలని, వాటి స్థానంలో కొత్త యంత్రాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్డీఎల్ యంత్రాల్లో వాడే నాసిరకం ఆయిల్తో అవి పాడవుతున్నాయని, నాణ్యమైన ఆయిల్ను వినియోగించాలని సూచించారు. పని స్థలాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సీఎంపీఎఫ్ రుణాల క్లైమ్లను వెంటనే సెటిల్ చేయాలని కోరారు. సమస్యలు యాజమాన్యానికి వివరించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, నాయకులు ప్రసాద్రెడ్డి, బుచ్చిప్రసాద్, నర్సింగరావు, మురళి చౌదరి, సంఘం సదానందం, అఫ్రోజ్ఖాన్, సత్తిరెడ్డి, భోగా మదనయ్య పాల్గొన్నారు. -
వివాహిత అదృశ్యం
వాంకిడి: భర్తతో గొడ వ పడిన ఓ మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై సాగర్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం చీచ్పల్లి గ్రామానికి చెందిన గేడం కాంతారావుకు పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని రా జురకు చెందిన మేస్రం సీమతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొద్ది ోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో సీమ తన పుట్టింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. అదేరోజు సాయంత్రం కాంతారావు సీమ తల్లి దండ్రులకు ఫోన్ చేసి అడగగా, ఆమె పుట్టింటికి వెళ్లలేదని తెలి సింది. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా జాడ లభించలేదు. దీంతో కాంతారావు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశాడు. సీమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు గులాబీ రంగు చీర ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. -
భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
చింతలమానెపల్లి: మండలంలోని గూడెం వద్ద మహారాష్ట్రకు తరలిస్తున్న 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతా ప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూ డెం నుంచి మహారాష్ట్రకు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మంగళవా రం రాత్రి సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో గూడెం నుంచి మోటార్సైకిల్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించారు. తమ వద్ద ఉన్న సంచులను పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఒకరు పోలీసులకు చిక్కారు. అనంతరం విచారించగా పట్టుబడిన వ్యక్తి మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలె వినోద్గా గుర్తించారు. పారిపోయిన వారు గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలె పురుషోత్తం, సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లబోయిన అశోక్, బొల్లబోయిన కృష్ణగా నిర్ధారించారు. పట్టుబడిన చా పిలె వినోద్ను చింతలమానెపల్లి పోలీస్స్టేషన్కు త రలించి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. చాపిలె వినోద్, మిగతా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల ధర సుమారు రూ.1.50లక్షలు ఉంటుందని వివరించా రు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై వెంకటేశ్, పోలీస్ సిబ్బంది మధు, రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. -
పలు రైళ్ల హాల్టింగులు రద్దు
తాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్లో పలు రైళ్ల హాల్టింగులను జూన్ 30వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం రోడ్–విజయవాడ (ట్రైన్ నంబర్ 07278/ 07979), సికింద్రాబాద్–వరంగల్ (ట్రైన్ నంబర్ 07462/07463), కాజీపేట్–బల్లార్షా (ట్రైన్ నంబర్ 17035/17036), సిర్పూర్ టౌన్–కరీంనగర్ (ట్రైన్ నంబర్ 07766/ 07765), కరీంనగర్–బోధన్ (ట్రైన్ నంబర్ 07894/ 07893) రైళ్లు అప్ అండ్ డౌన్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేతనాలు చెల్లించాలిరామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ సీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న 16 మంది కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టీయూ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు బుధవారం సీహెచ్పీలో ఆందోళన చేపట్టారు. షేల్ పికింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఐదునెలలుగా వేతనాలు చెల్లించకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం, గజ్జి మల్లేశ్, మహేశ్వర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యాప్ సరే.. అవగాహనేది?
● ఓపీ నమోదుకు కొత్త యాప్ ● ఆస్పత్రిలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు ● అవగాహన లేక రోగుల ఇబ్బందులు మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ(ఔట్ పేషెంట్లు) నమోదుకు అమలు చేస్తున్న యాప్పై అవగాహన లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు వరుసలో ఎక్కువ సేపు నిలబడి ఉండకుండా ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఓపీ కోసం వచ్చే రోగులు ‘అబా’ యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకుని టోకెన్ పొందేలా వారం రోజులుగా అమలు చేస్తోంది. బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, క్యూఆర్ కోడ్, యాప్ ఇన్స్టాల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తమైంది. రోగుల్లో పేదవారే ఉండడం, సాంకేతికతపై సరైన అవగాహన లేకపోవడం, క్యూఆర్ కోడ్ వినియోగం తెలియకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అవగాహన కల్పించేందుకు ఇద్దరు ఉద్యోగులను ఏర్పాటు చేసినా వచ్చిన రోగులందరికీ అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో ఓపీ వద్ద రోగుల తోపులాట పెరగడం, తమకు యాప్ ఇన్స్టాల్ చేయాలంటూ ఒకేసారి అందరూ కోరడంతో బుధవారం గందరగోళం ఏర్పడింది. ప్రతీ రోజు 400కు పైగా రోగులు వస్తుండడంతో మరింత మందిని నియమించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇబ్బందులు తీర్చేందుకే.. ప్రస్తుతం ఆస్పత్రికి ప్రతీ రోజు 400కు పైగా ఔట్పేషెంట్లు వస్తుండగా, మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)కు 200కు పైగా వస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగి ఆ సంఖ్య 900పైగా ఉంటుంది. రోగులకు టోకెన్లు ఇచ్చి వైద్య పరీక్షలకు పంపిస్తుండగా గంటల తరబడి వరుసలో ఉండాల్సి వస్తోంది. దీంతో రోగుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేసి టోకెన్ ఇచ్చేందుకు సమయం వృథా అవుతుండడం, రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఓపీ నమోదు కాగితం ఇచ్చేందుకు సమయం ఎక్కువగా పడుతుండడాన్ని అరికట్టేందుకు ఓపీ టోకెన్ ఇచ్చేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. డౌన్లోడ్ ఇలా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ నుంచి ఏబీహెచ్ఏ(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆస్పత్రిలో ఓపీ నమోదుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్నంబరు లేదా ఆధార్నంబరు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. మొబైల్ నంబరుకు వచ్చిన టోకెన్ నంబరును ఆస్పత్రి కౌంటర్లో చూపిస్తే ఓపీ చీటి డౌన్లోడ్ చేసి ఇస్తారు. అవగాహన కల్పిస్తున్నాం ఆస్పత్రిలో యాప్తో పాటు క్యూఆర్ కోడ్ను రోగుల ఫోన్లలో ఇన్స్టాల్ చేసి వివరించేందుకు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఎంసీహెచ్లోనూ క్యూఆర్ కోడ్ అమలులోకి తీసుకొచ్చాం. రోగులు స్వయంగా క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ టోకెన్ ఎలా పొందాలనే దానిపై అవగాహన కల్పించేలా చూస్తున్నాం. ప్రజలందరికీ అవగాహన వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తరువాత క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండానే క్యూఆర్ కోడ్, యాప్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ఫోన్తోపాటు వారి ఆధార్కార్డుకు లింక్ చేసి ఉన్న మొబైల్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. – డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
No Headline
జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలు జిల్లా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జీపీలు వార్డు సభ్యులు ఆదిలాబాద్ 158 17 17 467 3,840 మంచిర్యాల 130 16 16 311 2,730కుమురంభీం 123 15 15 334 2,874నిర్మల్ 156 18 18 396 3,336మొత్తం 567 66 66 1,508 12,780 -
No Headline
సిద్ధంగా ఉండాలని ఆదేశాలు గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకోసం యంత్రాంగం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా అధికారులు గ్రామపంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఎన్ని ఉన్నాయనే వివరాలు కూడా తెలియజేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చుకోవాలని నిర్మల్ జిల్లాకు ఆదేశాలు అందాయి. -
రికార్డులను డిజిటలైజేషన్ చేయాలి
శ్రీరాంపూర్: కంపెనీలో ఉద్యోగుల రికార్డులన్నీ డి జిటలైజేషన్ చేయాలని సింగరేణి డైరెక్టర్లు తెలి పారు. బుధవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్ (ఆపరేషన్), జీ వెంకటేశ్వర్రెడ్డి (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) ఏరియా జీఎం సంజీవరెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఇక్కడి నుంచే ఐటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగుల పర్సనల్ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని, వారి కుటుంబ సభ్యుల ఫొటోలనూ అందులో చేర్చాలన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల క్వార్టర్ అలాట్మెంట్ లెటర్లు కూడా డిజిటలైజేషన్లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసులు ఇంకా ఇతర ఉద్యోగులకు సంబంధించిన వైద్య సదుపాయాలు, వైద్య చికిత్సకు సంబంధించినవి కూడా నమోదు చేయాలని సూచించారు. ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, ఎంపీటీసీ మేనేజర్ రామారావు, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి, ఐటీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వానలు ఆటంకం కారాదు రాబోయే వానాకాలంలో వర్షాలతో ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగరాదని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏరియా జీఎం సంజీవరెడ్డితో కలిసి శ్రీరాంపూర్, ఇందారం ఓపెన్ కాస్ట్ గనులను సందర్శించారు. వ్యూపాయింట్ నుంచి పని ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. వానాకాలానికి ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ఏరియాలోని బొగ్గు నిల్వలను వెంటనే వెలికి తీసి ఉపరితలానికి రవాణా చేయాలని సూచించారు. వర్షపునీరు బయట నుంచి క్వారీలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓబీ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. రక్షణతో ఉద్యోగులు పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ అధికారి టీ శ్రీనివాస్, ఇందారం ఓపెన్ కాస్ట్ అధికారి ఎం.శ్రీనివాస్, మేనేజర్లు బ్రహ్మాజీ, రవికుమార్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్యఆసిఫాబాద్అర్బన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సందీప్నగర్ గోండుగూడాలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసముంటున్న క్రుసంగే సాయికుమార్ (21) కొంతకాలంగా ఏ పనీ చేయకుండా మ ద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. ఇదే క్ర మంలో మంగళవారం రాత్రి తాగి వచ్చిన సాయికుమార్ను అతడి తల్లి గంగుబాయి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్య కేసులో ఒకరి రిమాండ్కాగజ్నగర్ రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన గుర్లె చంద్రశేఖర్ను హత్య చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన గుర్లె సురేశ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఈజ్గాం ఎస్సై రామన్కుమార్ తెలిపారు. తాగిన మైకంలో చంద్రశేఖర్ తలపై సురేశ్ ఇటుకతో బాదడంతో తీవ్ర గాయాలపాలై చంద్రశేఖర్ మృతిచెందాడని పేర్కొన్నారు. విచారణ చేపట్టి సురేశ్ను అరెస్ట్ చేశామని తెలిపారు. -
కంపోస్టు ఎరువు ఉపయోగించాలి
జైపూర్: కంపోస్ట్ పిట్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, వాటి ద్వారా వచ్చే ఎరువులను నర్సరీలు, పల్లెప్రకృతి వనంలో మొక్కలకు అందించాలని డీపీవో వెంకటేశ్వర్రావు తెలిపారు. మండలంలోని ముదిగుంట, జైపూర్ గ్రామ పంచాయతీలను బుధవారం ఆయన సందర్శించారు. సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి కంపోస్ట్ ఎ రువుల తయారీపై పలు సూచనలు చేశారు. రోడ్లు, డ్రెయినేజీలు నిరంతరం శుభ్రం చేయాలని, ప్రతీ రోజు ఇంటింటికీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వా రా చెత్త సేకరించాలని తెలిపారు. ఎంపీవో అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉదయ్, సురేశ్, సిబ్బంది ఉన్నారు. -
గడ్డి కట్టలు దగ్ధం
జన్నారం: మండలలోని రేండ్లగూడ గ్రా మంలో గడ్డి కట్టలను ట్రాక్టర్పై తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కట్టలు మినీ ట్రాన్స్ఫార్మర్పై పడి మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుఽ దవారం రేండ్లగూడకు చెందిన కుతుబు వే రేచోట 90 గడ్డి కట్టలు కొనుగోలు చేసి ట్రా క్టర్ ద్వారా ఇంటికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కట్టలు మినీ ట్రాన్స్ఫార్మర్పై పడగా మంటలు చెలరేగాయి. గడ్డి కట్టలు కాలుతుండగా గ్రామస్తులు వాటిని కిందికి తోసేసి ట్రాక్టర్ను అక్కడి నుంచి తొలగించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వాహనంతో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.20 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు కుతుబు తెలిపారు. -
ఇక ‘స్థానిక’ సమరం!
● జూలైలో ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ● కులగణన చేపడితే మరింత జాప్యం ● ముగిసిన సర్పంచుల పదవీ కాలం ● గ్రామపంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు గ్రామపంచాయతీల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. సర్పంచులను నేరుగా ఎన్నుకోనుండగా, ఉపసర్పంచ్ను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల కోసం ప్రతీ వార్డుకు ఒక పోలింగ్స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరుగా తెలుపు, గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులుండవు. ముందుగానే ముగ్గురు, నలుగురు పేర్లతో కూడిన నమూనా బ్యాలెట్ పేపర్లను మూడు, నాలుగు విధాలుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.నేరడిగొండ/నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న లెక్కింపు నిర్వహించనున్నారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి వెల్లడించిన విషయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నా యి. లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్ని కలు ఉంటాయని సూత్రప్రాయంగా సీఎం తెలపడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియగా.. 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై పల్లెల్లో నాయకులు, ఆశావహుల సందడి మొదలైంది. ఈసారి అన్ని ఎన్నికలు ఒకేసారి! సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను గతంలో మూడు దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియగా, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వరకు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 5 వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి మూడు విభాగాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కులగణనకు ఉత్తర్వులు జారీ.. గత ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రెండు నెలలు పట్టే అవకాశముంది. అయితే కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సమరంలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయమై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. 200 మందికో పోలింగ్ కేంద్రం ప్రతీ 200 మందికో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ అధికారి ఉంటారు. అంతకుమించి ఓటర్లు ఆ వార్డులో 200 నుంచి 400మంది ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు సహాయ అధికారులను నియమిస్తారు. 400 నుంచి 650 మంది ఓటర్లుంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బుధవారం పట్టణంలోని పాలచెట్టు ఏరియా సమీపంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సాక్షులను విచారించారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని సారంగపల్లి గ్రామానికి చెందిన అక్కపాక శంకర్, చంద్రకళ పాలచెట్టు ఏరియా సమీపంలో గొడవపడ్డారు. శంకర్ను చంద్రకళ కులం పేరిట దూషించినట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సాక్షులను విచారించారు. నిజానిజాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. -
నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ
● ఐటీఐ విద్యార్థులకు డ్యూయల్ ట్రైనింగ్ ● మంచిర్యాల ఆర్టీసీ డిపోలో అప్రెంటీస్షిప్మంచిర్యాలఅర్బన్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటీస్షిప్ కోసం వివిధ పరిశ్రమల్లో చేరుతారు. ఉపాధితో పాటు నేర్చుకున్న కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటీస్షిప్ పేరుతో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వీరికి స్టైఫండ్ అందజేస్తారు. ప్రస్తుతం ఆర్టీసీలో అప్రెంటీస్షిప్తో పాటు ఐటీఐలో సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు డ్యూయల్ ట్రెనింగ్ సిస్టమ్ (డీఎస్టీ) అమలు చేస్తున్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోగాత్మకంగా ఆయా కో ర్సుల్లో మూడునెలల పాటు శిక్షణ పొందుతున్నా రు. మరోవైపు అన్జాబ్ ట్రెనింగ్ సిస్టమ్తో వివిధ పరిశ్రమలు విద్యార్థులకు ఆరునెలల శిక్షణతో పాటుస్టైఫండ్ చెల్లిస్తున్నాయి. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో దాదాపు 80 మంది విద్యార్థులు మోటార్మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో డ్యూయల్ ట్రెనింగ్ సిస్టమ్ ద్వారా శిక్షణ పొందారు. నైపుణ్యం పెంపొందించేందుకు.. ఆర్టీసీలో చాలా రోజులుగా నియామకాలు లేవు. సిబ్బంది కొరతతో డిపోలో బస్సులు మరమ్మతు చేయటానికి కష్టాలు తప్పటం లేదు. చాలీచాలని సిబ్బందికి విధి నిర్వహణ భారమవుతోంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటీస్షిప్, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డ్యూయల్ ట్రెనింగ్ సిస్టమ్లో తీసుకుని పనిచేయిస్తున్నారు. దీంతో వారిలో నైపుణ్యం పెరుగుతోంది. అప్రెంటీస్షిప్ పూర్తి చేసిన వారు ఎన్సీటీవీ జారీ చేసే ధ్రువపత్రాలు, స్టైఫండ్ పొందుతున్నారు. డ్యూయల్ ట్రెనింగ్తో చదువుతోపాటు కోర్సుల్లో నైపుణ్యం, శిక్షణ పొందటంతో ఉపాధికి రక్షణగా నిలుస్తుంది. -
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
మంచిర్యాల టౌన్: జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలను తెరవకపోవడంతో ‘సాక్షి’లో మంగళవారం ‘అంగన్వాడీ కేంద్రాలు బంద్’ శీర్షికన ప్రచురించిన కథనానికి జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు స్పందించారు. పలు అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో, సూపర్వైజర్లు తనఖీ చేశారు. కేంద్రాలు తెరవని ఆయాలకు మెమోలు జారీ చేసినట్లు మంచిర్యాల సీడీపీవో విజయలక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ ఇస్లాంపుర–1, మారుతీనగర్, ఒడ్డెర కాలనీ, నేతాజీనగర్, ఎల్ఐసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల ఆయాలకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏసీసీ ఐసీడీఎస్ సూపర్వైజర్కు కూడా బుధవారం మెమో జారీ చేస్తామని తెలిపారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీ ఐఈవో శైలజ సూచించారు. మంగళవారం మంచిర్యాల డీఐఈవో కార్యాలయంలో సీఎస్, డీవో, కళాశాలల ప్రిన్సిపాల్, కస్టోడియన్లతో పరీక్షలపై నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 24నుంచి జూన్ 1వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో హా ల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించా రు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30నుంచి 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతీ సెంటర్లో ఏఎన్ఎంలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. పరీ క్షల నిర్వహణ, విధుల గురించి వివరించారు. సమీక్షా సమావేశంలో సీఎస్లు, డీవోలు, కస్టోడియన్లు, ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement