-
నేటినుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి సంవత్సరం 6,585, రెండో సంవత్సరం 3,719 మంది విద్యార్థులు కలిపి 10,304 మంది పరీక్ష రాయనున్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది, విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు జిరాక్సు సెంటర్లను మూసివేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు డీఐఈఓ కార్యాలయంలో కస్టోడియన్లు, స్క్వాడ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఐఈఓ శ్రీధర్సుమన్ మాట్లాడుతూ పరీక్షల్లో కాపీయింగ్కు ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 21 కేంద్రాల ఏర్పాటు.. హాజరు కానున్న 10,304 మంది విద్యార్థులు -
విత్తన మేళాకు వేళాయె
అందుబాటులో ఉన్న విత్తనాలు, వాటి ధరలు ఇలా.. విత్తనం రకం బస్తా కిలో ధర (కిలోల్లో) (రూ.లలో) వరి ఆర్ఎన్ఆర్–15048 15 50 వరి జేజీఎల్–24423 25 44 వరి కేఎన్ఎం–1638 20 48 వేరుశనగ విశిష్ట రకం 30 108 తెల్లజొన్న సీఎస్వీ–41 3 90 పచ్చజొన్న పీవైపీఎస్–2 3 150 కంది పీఆర్జీ–176, టీడీఆర్జీ–59 3 150 మినుము ఎంబీజీ–1070 6 150 పెసర ఎంజీజీ–385 6 140 సాక్షి, నాగర్కర్నూల్: రైతులకు నాణ్యమైన విత్తనాల ను అందించేందుకుగాను శుక్రవారం పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించనున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. రైతులు వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో వివిధ రకాల విత్తనాలతో పాటు నాసిరకం విత్తనాల బెడద పొంచి ఉంది. మేలైన విత్తనాల విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు, వారికి తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలను అందించాలనే లక్ష్యంతో విత్తన మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేవీకే శాస్త్రవేత్తల సూచనలు.. పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతులకు అవసరమైన వరి, వేరుశనగ, జొన్న, కంది, మినుము, పెసర విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. అందుకోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేయనున్నారు. కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆధునిక వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాలంలో పంటలను పట్టిపీడిస్తున్న చీడపీడలు, ఎరువుల వాడకం, సేంద్రియ సాగుపై సూచనలు అందిస్తారు. పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. 94904 09163, 63008 20238 నంబర్లను సంప్రదించి విత్తనాలను పొందవచ్చు. -
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..
ఆహార పదార్థాల కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా కల్తీ ఆహార నియంత్రణ అధికారులతోపాటు తూనికలు, కొలతల విభాగం సిబ్బంది కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నిల్వ చేసిన ఆహార పదార్థాలు, కల్తీ వంట నూనెలు, నెయ్యి పదార్థాలు పట్టుపడుతున్నాయి. ప్రధానంగా హోటళ్లు, కిరాణ దుకాణాలు, పాల తయారీ కేంద్రాలు, నూనె తయారీ కేంద్రాలు, పాస్ట్ఫుడ్ సెంటర్లను పరిశీలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తున్న వస్తువులపై ఆరా తీశారు. తనిఖీలు చేసిన తర్వాత ఆయా కేంద్రాల్లో పట్టుబడిన కల్తీ పదార్థాలకు సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్కు తరలించారు. జిల్లాలో మూకుముడిగా కల్తీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేయడంతో వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తారుమారు చేసే సమయం ఇవ్వకుండా అధికారులు రంగప్రవేశంతో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 16 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. 40 చోట్ల శాంపిల్స్ సేకరించారు. దీంతోపాటు నాలుగు కేసులు నమోదు చేశారు. -
తెలంగాణ క్రికెట్ లీగ్లో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ లీగ్లో జిల్లా జట్టు మెరుగైన ఆటను ప్రదర్శించి విజేతగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో తెలంగాణ టీ–20 లీగ్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు గురువారం తరలివెళ్లింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇటీవలే వేసవి క్రికెట్ సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లీగ్లో పాల్గొంటున్న జిల్లా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్సీఏ ఆధ్వర్యంలో టీ–20 లీగ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. లీగ్లో 7 జట్లు పాల్గొంటాయని, తొలిమ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు ఖమ్మంతో తలపడతుందన్నారు. గతంలో జరిగిన తెలంగాణ టీ–20 లీగ్లో జిల్లా జట్టు రన్నరప్గా నిలిచిందని, ఈసారి సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ జిల్లా జట్టుకు క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కృష్ణమూర్తి, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు.. గణేష్ (కెప్టెన్), హర్షవర్ధన్, డేవిడ్, అబ్దుల్రాఫె (వికెట్ కీపర్), శ్రీకాంత్యాదవ్, ముఖిత్, అద్నాన్, జి.శశాంక్, మనోజ్, అరుణ్ (వైస్ కెప్టెన్), ఖయ్యూం, జయసింహ, అరవింద్, శ్రీకాంత్, అనిల్, కె.శ్రీకాంత్, అభినవ్, బురాన్, జట్టుకు బ్యాటింగ్ కోచ్గా అబ్దుల్లా బిన్ అహ్మద్, ఫీల్డింగ్ కోచ్గా బి.శ్రీనివాస్, హెడ్కోచ్గా గోపాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. -
భయం గుప్పిట్లో తూడుకుర్తివాసులు
నాగర్కర్నూల్: మండలంలోని తూడుకుర్తి పరిసర ప్రాంతాలలో బుధవారం చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఆందోళనకు గురురయ్యారు. కంగారం గ్రామ ప్రజలు పంట పొలాల్లోకి వెళ్లి వస్తున్న సందర్భంలో జింకను తరుముతూ చిరుతపులి కనిపించిందని తూడుకుర్తి పరిసర ప్రాంతాలలోకి వెళ్లిందని ఆ గ్రామ రైతులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రజలు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. అయితే బుద్దారం అడవి ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో జింకలు ఉండడం వల్ల చిరుత వాటిని వెంబడిస్తూ ఇటుగా వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై నాగర్కర్నూల్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వేష్అహ్మద్ విషయం తెలుసుకుని సిబ్బందిని గ్రామానికి పంపించారని అయితే అక్కడ చిరుతకు సంబంధించిన జాడలు, కదలికలు కనిపించలేదని తెలిపారు. అడవి ప్రాంతంలో సోలార్ బోర్ల వద్దకు జింకలు గుంపులు ఎక్కువగా వస్తుంటాయని వాటి కోసం చిరుతలు సంచరించి ఉండొచ్చని, తూడుకుర్తి ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి వెనకభాగంలో గల గుట్టల్లోకి ఈ చిరుత వెళ్లిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఒంటరిగా రైతులు, మహిళలు పొలాల్లోకి వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి ఈ విషయమై తూడుకుర్తి గ్రామస్తులు గ్రామంలో చాటింపు వేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. చిరుత సంచరించడంతో భయందోళన -
ఫారెస్ట్ కందకంలో పడి మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: ప్రమాదవశాత్తు ఫారెస్ట్ కందకంలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్దిన్నెలో చోటుచోటుచేసుకుంది. ఎస్ఐ సతీష్ వివరాల మేరకు.. దేవినేనిపల్లికి చెందిన కల్మూరు మంజుల (30)కు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. గురువారం స్వగ్రామం నుంచి మారేడుమాన్దిన్నెకు బయల్దేరిన ఆమె.. మార్గమధ్యంలో ఉన్న ఫారెస్ట్ కందకంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలికి భర్త రామకృష్ణ, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతురాలి తండ్రి మాసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చిన్నారులపై కుక్క దాడి శాంతినగర్: మండలంలోని బుడమర్సు చెందిన ఆరుగురు చిన్నారులు నవీన్, విజయ్, ఆరీఫ్, ప్రవీణ్, మస్తాన్, రామాంజనేయులును పిచ్చికుక్క కరిచిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. పిచ్చికుక్కలను అరికట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు. వృద్ధురాలి బలవన్మరణం ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజుపల్లిలో ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాచర్ల చంద్రమ్మ (75) ఒంటరితనంతో బాధపడటంతో పాటు కుమార్తెలు, కుమారుల మధ్య భూ తగాదాలతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరేసుకుంది. గురువారం ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరువుపొరుగు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కుమారుడు అల్లాజి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. విద్యుత్ మోటార్ల కేబుల్ చోరీ వంగూరు: మండలంలోని తిప్పారెడ్డిపల్లి శివారులో బోరుమోటార్ల కేబుల్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుధవారం రాత్రి దాదాపు 50 మంది రైతులు వ్యవసాయ పొలాల్లో బోరుమోటార్ల సర్వీస్ వైరును ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మహేందర్ తెలిపారు. -
వైభవంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందు మైదానంలో పూల అలంకరణతో తయా రు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు కొనసాగింది. సంప్రదాయబద్ధంగా.. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ జరిపించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాలు పోశారు. ఈ సందర్భంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య దేవతామూర్తుల దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించి పునీతులయ్యారు. కల్యాణోత్సవం అనంతరం దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలామంది దేవస్థానంలో కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాశ్రీ, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోటకదిర మాజీ సర్పంచ్ రమ్య, నాయకులు వెంకటస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీపై ఉక్కుపాదం
ప్రజారోగ్యానికి పెనుముప్పు అధికారుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. ఆహార కల్తీల నియంత్రణపై అలసత్వం ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. తినుబండారాలు, ఆహార పదార్థాల అమ్మకాల్లో వ్యాపారులు ప్రమాణాలు పాటించని కారణంగా ప్రజలకు నాణ్యత లేని, నాసిరకం ఆహారం అందుతోంది. అదికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. పట్టణంలో సుమారు 70పైగా హోటళ్లు ఉండగా, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు, టిఫన్ సెంటర్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు వంద వరకు ఉంటాయి. చూసేందుకు ఏసీలతో అందంగా ముస్తాబై ఉన్న హోటళ్లు ఆహారం విషయంలో నాణ్యత పాటించడం లేదు. ఆహారాన్ని ఫ్రిజ్లలో నిల్వ ఉంచి మళ్లీ వేడి చేసి అమ్ముతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. నెల రోజుల క్రితం ఓ కిరాణ వ్యాపారి కల్తీ నూనె ప్యాకెట్ విక్రయించాడని పెద్ద గొడవే జరిగింది. ఆహార భద్రత అధికారులతోపాటు మున్సిపల్ అధికారులు హోటళ్లు, కిరాణ దుకాణాల తనిఖీ విషయమై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాల కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో వారం రోజులుగా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ.. శాంపిళ్లు సేకరించడం, నిర్వాహకులకు నోటీసులు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని పరిశ్రమల ఏరియాలో గురువారం జిల్లా ఆహార భద్రత అధికారి మనోజ్కుమార్ ఆధ్వర్యంలో చిప్స్ తయారీ కేంద్రాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం ఆహార వస్తువుల తయారీ డేట్, కాలం చెల్లిన తేదీ లేకపోవడం, సరైన పదార్థాలు వాడకపోవడం గుర్తించారు. మొత్తం ఐదు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అలాగే చిప్స్ తయారు చేసే రెండు ఫ్యాక్టరీల నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. వంట నూనె తయారు.. జిల్లాకేంద్రంలో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కల్తీ నూనె సరఫరా జరుగుతోందని ఆరోపణలున్నాయి. ప్యాకింగ్లో విక్రయించే వంట నూనెలపై తయారు చేసిస సంస్థ పేరు, ఎప్పుడు తయారు చేశారు.. దాని ధర వంటి వివరాలు ముద్రించాల్సి ఉండగా ఇక్కడ ఏ వివరాలు కనిపించవు. జిల్లా కేంద్రంలో ఇంత దందా జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. జిల్లాలో ముమ్మరంగా తూనికలు, కొలతల శాఖ దాడులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు అధిక స్థాయిలో నిల్వ ఉన్న ఆహారం వెలుగులోకి.. పలుచోట్ల శాంపిళ్ల సేకరణ, నోటీసుల అందజేత ఆకస్మిక తనిఖీలతో బెంబేలెత్తుతున్న నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆదేశాలతోపాటు ఇటీవల రెస్టారెంట్, హోటళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఆహార తయారీ కేంద్రాలు, పండ్ల విక్రయ కేంద్రాలు, కిరాణ స్టోర్లు ప్రతి వాటిపై తనిఖీలు ముమ్మరం చేశాం. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం తయారు చేస్తున్నారా.. లేదా విక్రయాలు చేస్తున్నారా అనేది చూస్తున్నాం. నాణ్యత తీరు, కాలం చెల్లిన వస్తువులు ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. – మనోజ్కుమార్, జిల్లా ఆహార భద్రత అధికారి -
జోగుళాంబ ఆలయంలో భక్తజన సందోహం
జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలు గురువారం భక్తులతో కిక్కిరిశాయి. వైశాఖ మాసం అందులో పౌర్ణమి కలిసిరావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ తగ్గలేదు. బాల్రబహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అమ్మవారి ఆలయంలో ఉదయం సాయంత్రం కుంకుమార్చనలు, త్రిశతి, ఖడ్గమాల వంటి అర్చనలు చేశారు. ఆలయంలో చండీహోమాలు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్తుల చేత సామూహిక చండీహోమాలు చేయిస్తుంటారు. గురువారం వైశాఖ పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యల తరలివచ్చారు. 114 మంది ఈ హోమాలలో పాల్గొన్నట్టు ఈఓ పురేందర్కుమార్ తెలిపారు. చండీహోమాల ద్వారా ఆలయానికి రూ.1.14లక్షల ఆదాయం చేకూరినట్లు దేవస్థానం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు ఆలయాలను పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి భవాని, గద్వాల అదనపు కలెక్టర్ మాసాని వెంకటేశ్వర్లు, నంద్యాల అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రథాప్రెడ్డి, రాయచూరు ఎమ్మెల్యే బసన్నగౌడ దద్దాల్, ప్రముఖ సింగర్ మంగ్లి ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు చండీహోమానికి హాజరైన భక్తులు -
పటిష్ట నిఘా : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల దగ్గర 24 గంటలపాటు మూడు అంచెల భద్రతతో కూడిన నిఘా కొనసాగాలని, సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించి భద్రతను తనిఖీ చేశారు. యూనివర్సిటీ సమీప పరిధిలో అనుమతి లేని వ్యక్తులు ఎవరూ రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా ఉండేలా సదరు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వారి వెంట ఏఎస్పీ సురేష్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులున్నారు. నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం పాలిసెట్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు హాల్టికెట్, బాల్ పెన్ మాత్రమే తేవాలని, పరీక్ష 11 గంటలకు ప్రారంభమవుతుందని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు పరిశీలించారు. స్వయం ఉపాధి కల్పనకు తోడ్పాటు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్బీఐ– ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ, యువకులు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడతాయని కలెక్టర్ రవినాయక్ అన్నారు. బండమీదిపల్లిలోని సంస్థను గురువారం పరిశీలించి మాట్లాడారు. నెలరోజులపాటు నిర్వహించే టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం కోర్సులతో స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. ప్రైవేట్ రంగంలో కొత్తగా వ్యాపారం ఆరంభించాలనుకున్నా నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ వివిధ కోర్సులలో శిక్షణ పొందిన వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న క్వింటాలు రూ.2,301 జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మొక్కజొన్న గరిష్టంగా రూ.2,301, కనిష్టంగా రూ.1,910 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు రూ.5,517, వేరుశనగ రూ.3,109, ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,519, కనిష్టంగా రూ.1,929, హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,191 చొప్పున వచ్చాయి. సోనామసూరి ధర రూ.2,449 దేవరకద్ర మార్కెట్ యార్డులో గురువారం జరిగిన ఈనామ్ టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,449, కనిష్టంగా రూ.2,369 ధరలు నమోదయ్యాయి. ఆముదాల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.5,470, కనిష్టంగా రూ.5,450 లభించాయి. మార్కెట్కు 200 బస్తాల ధాన్యం, 200 బస్తాల ఆముదాలు అమ్మకానికి వచ్చాయి. -
నిజాయితీ చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
కల్వకుర్తి టౌన్: బస్సులో ఓ ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు అప్పగించి, నిజాయితీ చాటారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన ఫాతిమా బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్లేందుకు కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎక్కింది. మహబూబ్నగర్లో బస్సు దిగే క్రమంలో తన బ్యాగ్ను బస్సులోనే మరిచిపోయింది. గమనించిన కండక్టర్ ఫర్జానా, డ్రైవర్ కృష్ణలు సంబంధిత బ్యాగ్ను భద్రపర్చి, డీఎం సుభాషిణికి అందజేశారు. ఈక్రమంలో ప్రయాణికురాలు ఫాతిమా అదే రోజు రాత్రి మహబూబ్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు డిపో మేనేజర్ను సంప్రదించగా.. బ్యాగ్ డిపోలోనే ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో బాధితురాలు డిపోకు చేరుకోగా.. బ్యాగ్తో పాటు అందులో ఉన్న రూ. 4 లక్షల విలువగల 6 తులాల బంగారం ఆభరణాలను అందజేశారు. కార్యక్రమంలో డిపో ఉద్యోగి సుందర్ పాల్గొన్నారు. -
అవినీతి.. చేతివాటం.. మోసాలు
బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడంతో చాలా ఆలయాల్లో ఉద్యోగులు అవినీతి, చేతివాటం, మోసాలకు పాల్పడిన ఘటనలున్నాయి. తమను కదిలించే నాథుడే లేడంటూ కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొందరు ఉద్యోగులు ఆలయాల భూములను బహిరంగ వేలంలో కౌలుకు ఇవ్వకుండా గుట్టుచప్పుడు తమ అనుచరులకు ఇచ్చుకున్నారు. ఈ విషయం పత్రికల్లో వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. రికార్డుల్లో దొంగ లెక్కలు, టికెట్లు, రశీదు పుస్తకాలు సొంతంగా ప్రింట్ చేయించుకొని అవినీతికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలకు సంబంధించి రశీదులు సైతం ఇవ్వడం లేదు. హుండీలోని మిశ్రమ బంగారు, అలాగే ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్ చేయించడం లేదు. ఓ ప్రముఖ ఆలయంలోని ఓ ఉద్యోగి ఏకంగా హైందవ భక్తురాలిని ఇతర వర్గానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసేందుకు గట్టి ప్రయత్నం చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆలయ అధికారులు, వీహెచ్పీ, హైందవ సంఘాలను ఆశ్రయించడంతో వారు వచ్చి దేవదాయశాఖ ఉన్నతాధికారులను నిలదీయడంతో సదరు ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి తిరిగి ఇదే జిల్లాలోని మరో ఆలయానికి డిప్యూటేషన్పై పంపించారు. ఇలా చెబుతూపోతే అనేక అవినీతి, మోసాలు జరిగాయి. -
మార్మోగిన అంజన్న నామస్మరణ
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి పుణ్యక్షేత్రంలో గురువారం అంజన్న నామస్మరణ మార్మోగింది. అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన సీతారాముల కల్యాణం, హనుమాన్ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఆలయంలో ప్రధాన అర్చకులు అభయాంజనేయస్వామికి పంచామృతాభిషేకం, వ్యాసపూజ చేశారు. మధ్యాహ్నం సీతారామస్వామి కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణ వేడుక జరిపించారు. అనంతరం బలిహరణం నిర్వహించారు. సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం పూజల అనంతరం స్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీరగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈసందర్భంగా జై హనుమాన్ స్మరణ మార్మోగింది. అంజన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పలువురు భక్తులు దాసంగాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మిఠాయి, బొమ్మలు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా బైక్, బొలెరో ఢీ
● ఒకరి దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు కొల్లాపూర్ రూరల్/ పెంట్లవెల్లి: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనం, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పెంట్లవెల్లి ప్రధాన రహదారిలో సోమశిల క్రాస్రోడ్డు దగ్గర గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ హృషికేష్ కథనం ప్రకారం.. మంచాలకట్ట గ్రామానికి చెందిన మాసుం బొలెరోలో కొల్లాపూర్ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అలాగే కొండూరుకు చెందిన ఏదుల రామకృష్ణ(40) స్వగ్రామం నుంచి తన కుమారులతో కలిసి తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ వెళ్లడానికి కొల్లాపూర్ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమశిల క్రాస్రోడ్డు దగ్గర ఎదురెదురుగా వస్తున్న సమయంలో బొలెరో, బైక్ ఢీకొనడంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతిచెందగా.. కుమారులు అభిషేక్, కార్తీక్లకు ఇద్దరికి కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులకు కొల్లాపూర్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రామకృష్ణ భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బావిలో దూకి మహిళ బలవన్మరణం లింగాల: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లికి చెందిన పార్వతమ్మ (42)కు గోపాల్పేట మండలం రేవల్లికి చెందిన ఆనంద్తో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్ భాగ్యలక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా ఆనంద్ అయిదేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి పార్వతమ్మ, భాగ్యలక్ష్మి తరచూ గొడవపడేవారు. ఇదే క్రమంలో పార్వతమ్మ గురువారం అంబట్పల్లికి వచ్చిన ఆమె తనకు ఇల్లు కట్టించాలని అన్నను కోరగా కొన్నిరోజుల తర్వాత కట్టిస్తానని తెలిపారు. పుట్టింట, మెట్టినింట న్యాయం జరగడం లేదని మనస్థాపానికి గురై క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఉరేసుకుని వ్యక్తి.. కొత్తకోట రూరల్: భార్యాభర్తల మధ్య గొడవ, ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిసై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆంజనేయలు (35)కు వనపర్తిలోని రాయిగడ్డకాలనీకి చెందిన సుజాతతో 2010లో వివాహాం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా ఆంజనేయులు వనపర్తిలోనే నివాసం ఉంటూ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల తాగుడుకు బానిసకావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. బుధవారం జగత్పల్లికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆంజనేయులు గురువారం ఉదయం గ్రామశివారులో చెట్టుకు వేలాడుతూ మృతిచెంది గ్రామస్తులకు కనిపించాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలు అచ్చంపేట రూరల్: మండలంలోని భోగ మహేశ్వరం వద్ద గురువారం ఆటో బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం తాడూరు, అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన కొందరు భక్తులు ఆటోలో ఉమామహేశ్వరంలోని శివుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో భోగ మహేశ్వరం వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు మహిళలు, వృద్ధులు, చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ 108 వాహనంలో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిపై దాడి: కేసు నమోదు శాంతినగర్: వ్యక్తిపై తీవ్రంగా దాడికి పాల్పడిన ఘటన శాంతినగర్లో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా, గోనెగండ్ల మండలం, పెద్దమాదురి చెందిన మహ్మద్ ఇలియాస్ శాంతినగర్లోని చికెన్ సెంటర్లో పని చేస్తున్నాడు. రాత్రి సమయంలో కోళ్లఫారంలోనే పడుకునేవాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి కటిక ఖాజావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శాంతినగర్ పోలీసులు తెలిపారు. -
ఎకై ్సజ్ అధికారుల దాడులు
కల్వకుర్తిరూరల్: ఎకై ్సజ్ సిబ్బంది విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించినట్లు సీఐ వెంకట్రెడ్డి గురువారం తెలిపారు. ఈ దాడులలో సారా, పటిక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వంగూరు మండలం, కిస్టియన్పల్లి తండాలో 19 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, రెండు కేసులు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కొట్ర చౌరస్తాలో డిండి మండలం, చెరుకుపల్లి చెందిన కృష్ణ, అమ్రాబాద్కు చెందిన రవి, తర్నికల్కు చెందిన జగన్ కర్ణాటకలోని బీదర్ నుంచి నల్లబెల్లం తీసుకువస్తుండగా పట్టుబడ్డారని చెప్పారు. ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేశామన్నారు. దాడులలో సీఐ శారద, ఎస్టీఎఫ్ ఎస్ఐ సాయికిరణ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
బదిలీలు జరిగేనా..?
ఉద్యోగులను బదిలీ చేయాలి.. దీర్ఘకాలంగా ఒకే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలి. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. స్థానిక నేతల నుంచి ఉద్యోగులపై ఒత్తిడులు కూడా తగ్గుతాయి. మరింత ఉత్సాహంగా పని చేస్తారు. – జయపాల్రెడ్డి, అధ్యక్షుడు, మహబూబ్నగర్ జిల్లా ఆలయ ఉద్యోగుల సంఘం ప్రక్షాళన జరగాలంటే.. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగి పని చేస్తుంటూ అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. అన్నిశాఖల్లాగే దేవాదాయశాఖలోనూ ఉద్యోగుల బదిలీలు జరగాలి. చాలా ఏళ్లుగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ల బదిలీలు కావడం లేదు. వారిని కూడా బదిలీ చేయాలి. – టి.రాజశేఖరశర్మ, భక్తుడు జోగుళాంబ శక్తిపీఠం: దేవాదాయశాఖలోని పరిపాలన ఉద్యోగులకు 22 ఏళ్లుగా బదిలీలు కావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 6– ఏ, బీ, సీ, డీ కింద 50 ఆలయాలు ఉండగా.. ఇందులో రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు ఇలా మొత్తం సుమారు 90 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో బదిలీల విషయంలో జీఓ నంబర్ 888లోని కొన్ని నిబంధనలు అడ్డొచ్చేవి. అయితే 2019లో ఆలయ ఉద్యోగులను బదిలీ చేసే అంశంలో వెసులుబాటు కల్పిస్తూ మరో జీఓను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీల విషయంలో రెండేళ్ల కిందట ఆర్థికశాఖ నుంచి అనుమతులు, మార్గదర్శకాలు పూర్తయ్యాయి. ఇప్పుడైనా.. సమాచారశాఖ కమిషనర్గా ఉన్న ఎం.హనుమంతరావు ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతూ అటు ఏసీలు, ఇటు ఈఓలకు ముచ్చెమటలు పట్టిస్తూ పరిపాలన విభాగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి సందర్భంగా అన్ని ఆలయాల్లో చలువ పందిళ్లు, భక్తులకు తాగునీరు, అన్నదానం, దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్ సౌకర్యం, దాతలకు సముచిత గౌరవం, ఆలయ భూముల సంరక్షణ ఇలా అనేక అంశాలపై దృష్టిసారించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. మరి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపడతారా? లేదా? వేచి చూడాలి మరి. దేవాదాయశాఖలో 22 ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులు ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్న వైనం దొంగ లెక్కలు, టికెట్లు, రశీదుల ప్రింటింగ్తో చేతివాటం కొత్త కమిషనర్ అయినా దృష్టి సారించాలని విజ్ఞప్తి -
జూరాలలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా వస్తున్న వరదతో నీటిమట్టం పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వచ్చి చేరుతున్న స్వల్ప ఇన్ఫ్లోతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. ఈ క్రమంలో గురువారం జూరాల ప్రాజెక్టుకు 134 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెకు ్ట పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.732 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొద్దిమేర నీటిమట్టం పెరగడంతో మిషన్ భగీరథ తాగునీటికి గండం గట్టెక్కినట్లయ్యింది. ప్రాజెక్టు నుంచి 134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. -
కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాగా, కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి హత్యపై హరీష్ రావు స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా హరీష్ రావు..‘కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బి.ఆర్.ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బి.ఆర్.ఎస్ నాయకులు హత్యకు గురికావడం,… https://t.co/zyNPsWtIvr— Harish Rao Thanneeru (@BRSHarish) May 23, 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ నేత దారుణ హత్య
సాక్షి, కొల్లాపూర్: తెలంగాణలో ఎన్నికల వేళ దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కాగా, శ్రీధర్ రెడ్డి బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి హత్య చేశారు. ఇక, శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు.ఈ హత్య కేసు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, శ్రీధర్ రెడ్డి హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ (సీఆర్ఓ) సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కిరాణ షాపులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా న్యూటౌన్లోని హాష్మీ కిరాణం, జనరల్ స్టోర్స్లో కొన్ని నిత్యావసర వస్తువుల ప్యాకేజీలపై మ్యానుఫ్యాక్చరింగ్ చిరునామా, బరువు, ఎంఆర్పీ, తయారు తేదీ, కన్జూమర్ కేర్ నంబర్ తదితర వివరాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పది కిలోల కాజును స్వాధీనపరుచుకున్నారు. అలాగే పోస్టాఫీసు వెనుక భాగం విశాల్ మార్ట్లోని వేయింగ్ మిషన్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా అటవీశాఖ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రిలయన్స్, జిల్లా జైలు వద్ద ఉన్న పెట్రోల్ బంక్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పూర్తి వివరాలు ముద్రించి ఉండాలని, లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో సీఆర్ఓ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు చందు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల వారీగావివరాలు
అప్పట్లో ఎల్ఆర్ఎస్ కింద ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి 31,144 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు కేవలం 2,211 మాత్రమే పరిష్కారాానికి నోచుకున్నాయి. ఇందులో 129 మంది మాత్రమే రూ.67,52,678 చెల్లించారు. ● అచ్చంపేటలో 11,971 దరఖాస్తులు రాగా 434 పరిష్కరించారు. ఇక్కడ 92 మంది రూ.20,97,790 చెల్లించారు. ● నాగర్కర్నూల్లో 16,011 రాగా, 2,105 పరిష్కారమయ్యాయి. కాగా 12 మంది మాత్రమే రూ.2,95,627 చెల్లించారు. ● గద్వాలలో 14,317 రాగా.. 1,244 పరిష్కారమయ్యాయి. కాగా 37 మంది మాత్రమే రూ.17,22,261 చెల్లించారు. ● కల్వకుర్తిలో 11,443 రాగా, 3,390 పరిష్కరించారు. ఇందులో 41 మంది రూ.11,54,244 చెల్లించారు. ● నారాయణపేటలో 6,962 దరఖాస్తులు రాగా.. 6,959 పరిష్కారం అయ్యాయి. 32 మంది మాత్రమే రూ.10,51,875 చెల్లించారు. ● జడ్చర్లలో 17,564 రాగా.. 235 పరిష్కారం అయ్యాయి. ఇందులో 16 మంది మాత్రమే రూ.8,27,834 చెల్లించారు. ● వనపర్తిలో 28,941 రాగా.. 294 పరిష్కారమయ్యాయి. కాగా 21 మంది మాత్రమే రూ.3,88,435 చెల్లించారు. ● భూత్పూర్లో 5,999 దరఖాస్తులకు గాను 1,021 పరిష్కరించారు. ఇందులో 21 మంది మాత్రమే రూ.4,56,852 చెల్లించారు. ● కొల్లాపూర్లో 4,565 రాగా, 417 పరిష్కరించారు. ఇందులో 17 మంది రూ.3,32,574 చెల్లించారు. ● అమరచింతలో 438 రాగా 436 పరిష్కరించగా కేవలం నలుగురు మాత్రమే రూ.2,77,216 చెల్లించారు. ● అయిజలో 9,767 రాగా, 750 పరిష్కారం అయ్యాయి. ఇక్కడ తొమ్మిది మంది మాత్రమే రూ.1,93,592 చెల్లించారు. ● మక్తల్లో 10,498 రాగా 7,115 పరిష్కరించారు. కాగా ఒక్కరు మాత్రమే రూ.90,467 చెల్లించారు. ● కోస్గిలో 3,909 రాగా 3,878 పరిష్కారం కాగా నలుగురు మాత్రమే రూ.97,849 చెల్లించారు. -
గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దు
భూత్పూర్: వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని జెడ్పీ సీఈఓ రాఘవేంద్రరావు అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో డీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ నర్సింహులుతో కలిసి గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓవర్హెడ్ ట్యాంకులు, మంచినీటి బోర్లు, వాటి పనితీరు, మిషన్ భగీరథ నీటి సరఫరా, గ్రామ పంచాయతీల్లో నర్సరీలో మొక్కల పెంపకం, వాటికి నీటి సరఫరా తదితర అంశాల గురించి గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామాలు, అనుబంధ పల్లెలు, తండాల్లో నీటి సరఫరాపై వివరాలు సేకరించాలని, సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీలో మొక్కలు ఎండకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా నర్సరీలు, ఉపాధి హామీ కూలీలు, ఈజీఎస్ ద్వారా చేపట్టే పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపు వివరాలను ఈజీఎస్ ఏపీఓను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రభాకర్, ఎంపీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
భాగ్యరెడ్డివర్మ జీవితం ఆచరణీయం
పాలమూరు: దళిత వైతాళికులు, సంఘ సంస్కర్త ఎంవీ భాగ్యరెడ్డివర్మ జీవితం అనుసరణీయమని కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ కాన్ఫరెన్సు హాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని, సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రవికుమార్, ఎస్సీ అభివృద్ధి అధికారి పాండు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మిడ్జిల్: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పశువైద్య కేంద్రం సమీపంలో చికెన్ గన్యా, మలేరియా జ్వరాల బారిన పడడంతో జిల్లా వైద్యాధికారి కృష్ణ మలేరియా అధికారి భాస్కర్తో కలిసి ఇంటింటికి తిరిగి పరిశీలించారు. వైద్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేయాలన్నారు. నీటి నిల్వ ఉండటం వల్ల దోమలతో ఈ కాలనీలో ఎక్కువ శాతం జ్వరాల బారినపడినట్లు గుర్తించామని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహించి వెంటనే అవసరమైన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. వారి వెంట వైద్యాధికారి శివకాంత్ తదితరులున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీదే గెలుపు!
ముగిసిన తెప్పోత్సవాలు
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
తిమ్మాపురంలో విజయ్ దేవరకొండ సందడి
అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ
ఫ్లైఓవర్పై లారీ బోల్తా
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
కమనీయం.. కల్యాణోత్సవం
తప్పక చదవండి
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముందంటే..
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement