-
అంకితభావంతో సేవలందించాలి
నెహ్రూసెంటర్: వైద్యారోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బంది అంకితభావంతో వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. జిల్లా కేంద్రంలోని పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సాధారణ కాన్పుల వల్ల జరిగే ప్రయోజనాలను గిర్భిణులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులకు వివరించాలన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. కాగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి సొంత భవనం నిర్మించాలని స్థానికులు కోరగా.. రెవెన్యూ, మున్సిపల్, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఎంహెచ్ఓ తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆశ నోడల్ పర్సన్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను ఆరోగ్య కార్యక్రమాల్లో ముందుంచాలన్నారు. మాతృ, శిశు మరణాలు జరగకుండా చూడాలని, గర్భస్రావాలపై నిఘా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బిందుశ్రీ, జిల్లా ఉపమాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, ఎన్హెచ్ఎం డీపీఎంఓ రుక్ముద్దీన్ పాల్గొన్నారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా నయవంచన
తొర్రూరు: దొడ్డు వడ్డకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నయ వంచనకు పాల్పడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేవలం సన్నరకం వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10శాతం పండే సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామనడం రైతులను మోసగించడమేనన్నారు. బ్లాక్ మెయిల్ దందాలు, క్రిమినల్ కేసులు ఉన్న తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మచ్చలేని వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్రెడ్డిని బరిలో నిలిపామని, ఆయన గెలిస్తే పట్టభద్రుల పక్షాన ప్రశ్నిస్తాడన్నారు. ఈ నెల 23న తొర్రూరు శివారు పీఎస్ఆర్ పాఠశాల ఆవరణలో పట్టభద్రుల సన్నాహక సభ జరగనుందని, పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్, నాయకులు సోమేశ్వర్రావు, ప్రదీప్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ మంత్రి దయాకర్రావు -
ఏర్పాట్లు వేగవంతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం సోషల్ వెల్ఫేర్ జూనియర్ బాలికల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, విద్యు త్, వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవాలని, ప్రత్నామ్నాయంగా జనరేటర్ను అందుబాటులో ఉంచాలన్నారు. -
గంజాయి స్వాధీనం
తొర్రూరు రూరల్: తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామ శివారు కస్నాతండలో గంజాయి ప్యాకెట్లు, డమ్మీ పిస్తోల్, నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కస్నాతండకు చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో గంజాయి ప్యాకెట్లు పాతి పెట్టి ఉన్నాయని అదే తండాకు చెందిన మరో వ్యక్తి తొర్రూరు ఎకై ్సజ్శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు భూమిలో పాతిపెట్టిన 30గంజాయి ప్యాకెట్లు, డమ్మీ పిస్తోల్, నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు సంబంధిత ఇంటి యజమానిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని, మీరు ఎలాంటి శిక్ష విధించిన సిద్ధమేనని.. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు చెప్పాలని రోధించాడు. దీంతో ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇచ్చిన సదరు వ్యక్తికి తిరిగి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. కాగా, ఈ కేసులో చాలామంది పాత్ర ఉంటుందని అనుమానించిన ఎకై ్సజ్శాఖ అధికారులు వెంటనే తొర్రూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
తొర్రూరు రూరల్: ప్రభుత్వ కళాశాలల్లోనే విలువలు, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని అమ్మాపురం, గుర్తూరు, చీకటాయపాలెం, నాంచారిమడూరు గ్రామాల్లో విద్యార్థుల ప్రవేశం కోసం ఇంటింటా ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉప్పలయ్య, సువర్ణ, నర్సయ్య, మల్లయ్య, శివరామకృష్ణ, అలీ, రాజేష్ పాల్గొన్నారు. రేపు లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణంనర్సింహులపేట: మండల కేంద్రంలోని కపిలగిరి పర్వంతంపై వెలిసిన లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణం గురువారం రాత్రి 7గంటలకు జరగనుంది. శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి తొళక్కంతో ప్రారంభమయ్యాయి. కాగా గురువారం స్వామివారి కల్యాణం, శనివారం బండ్లు తిరిగే కార్యక్రమం నిర్వహించనున్నట్లు సేవా సమితి నిర్వాహకులు, ప్రధాన అర్చకులు కుమారచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఓపీ ప్రారంభంనెహ్రూసెంటర్: మానుకోట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఓపీ, వైద్య సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాగా అధిక సంఖ్యలో ట్రాన్స్జెండర్లు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి మంగళవారం తమకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని, ఇది వరకు వైద్య సేవల కోసం ఖమ్మం, వరంగల్ వెళ్లాల్సి వచ్చేదని ట్రాన్స్జెండరు హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో యూనిఫాంలు అందించాలి కేసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందించాలని డీఈఓ రామారావు ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కేసముద్రం, ఇనుగుర్తి మండలాల వి ద్యార్థులకు అందించే యూనిఫాంలకు సంబంధించిన వివరాలను ఎంఐఎస్ కోఆర్డినేటర్ షేక్ ఖాదర్ను అడిగి తెలుసుకున్నారు. అనంత రం కేసముద్రంస్టేషన్లోని యూనిఫాంలు కుట్టే కేంద్రాన్ని సందర్శించి, టైలర్లకు సూచనలు చేశారు. జూన్ 5వ తేదీలోగా విద్యార్థులకు యూనిఫాంలు అందించాలన్నారు. కాగా కేసముద్రం మండంలో 3,496 మంది, ఇనుగుర్తి మండలంలో 1,498 మంది విద్యార్థులకు దుస్తులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కేసముద్రంవిలేజ్ హైస్కూల్లోని జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను డీఈఓ పరిశీ లించారు. ట్రాన్స్పోర్ట్ ద్వారా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను అందించేలా చూడాలని జిల్లా మేనేజర్ కొత్త జగన్మోహన్రెడ్డికి సూచించారు. బడులను తెరిపించాలి మహబూబాబాద్ అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో మూతబడిన అన్ని ప్రభుత్వ బడులను తెరిపించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీశైలం అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు వచ్చే బడులను మాత్రమే తెరిపిస్తామని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక కమిటీలు వేసి మూతపడిన బడులను సందర్శించి, గ్రామస్తులతో అధికారిక సమావేశాలు నిర్వహించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, జిల్లా కార్యదర్శులు విష్ణువర్ధన్, ఉపేందర్, నాయకులు శ్రీనివాస్, కార్తీక్, రమేష్, సుధాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ విద్య
కళాశాలలు ఇవే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీవికాస్ జూనియర్ కళాశాల, ఖమ్మం జిల్లాలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల, రెజోనెన్స్(ప్రతిధ్వని) జూనియర్ కళాశాల, శ్రీచైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సీవీ రమణ జూనియర్ కళాశాల, హైదరాబాద్లోని అక్షర జూనియర్ కళాశాల–బీఎన్రెడ్డి నగర్, కృష్ణవేణి జూనియర్ కళాశాల–బీఎన్రెడ్డి నగర్, న్యూ శ్రీచైతన్య జూనియర్ కళాశాల–హయత్నగర్, శ్రీవివేకానంద రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల–ఇబ్రహింపట్నం వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన పేద విద్యార్థులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈమేరకు రిజర్వేషన్ ఆధారంగా కేటాయించిన సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈనెల 30 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కార్పొరేట్ కళాశాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశం పొందిన ఒక్కో విద్యార్థికి రూ.35 వేల ఫీజు, ఏడాదికి రూ. 3వేల ప్యాకెట్ మనీ అందిస్తుంది. కాగా ప్రవేశం పొందిన కళాశాలలోనే విద్యతో పాటుఉచిత భోజన వసతిని కల్పిస్తుంది. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ కూడా ఇస్తున్నారు. దరఖాస్తులు ఇలా.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి, 7జీపీఏకు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు అర్హులు. కాగా ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈపాస్ వెబ్సైట్లో కార్పొరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తులో అన్ని వివరాలు పూర్తి చేయాలి. విద్యార్థుల కులం, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో వతరగతి మెమో, ఆధార్కార్డు, వసతి గృహాల్లో 8, 9, 10వ తరగతి చదివితే హాస్టల్ ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యారుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ. 2లక్షలకు మించొద్దు. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కార్పొరేట్ ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు అవకాశం 7జీపీఏకు పైగా మార్కులు సాధించిన వారు అర్హులు.. ఈనెల 30వరకు దరఖాస్తుకు చాన్స్అర్హులు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్, కేజీబీవీల్లో పదో తరగతి చదివి 7.0 జీపీఏ పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది జిల్లా నుంచి 71 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారు వివిధ కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటున్నారు. – ఆర్. బాలరాజు, జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ ఇన్చార్జ్ అధికారి -
పచ్చిరొట్టతో అనేక ప్రయోజనాలు
పెద్దవంగర: పచ్చిరొట్ట సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ సంచాలకులు గోపి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అవుతాపురం గ్రామంలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. అదే సమయంలో సబ్సిడీపై వచ్చిన జీలుగ విత్తనాలను దిగుమతి చేశారు. ఈక్రమంలో ఆగ్రోస్ నిర్వాహకులు ఎరువులను ఆయన చేతుల మీదుగా పలువురు రైతులకు అందజేసి వారితో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద తగ్గడంతో భూమికి సేంద్రియ ఎరువులు అందడం లేదన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు భూసారం పెంపునకు వాడాలని సూచించారు. ప్రభుత్వం కూడా రాయితీపై అందజేస్తుందన్నారు. వ్యవసాయాధికారులు పచ్చిరొట్ట సాగుపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. 470 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏఈఓ ప్రవళిక వివరిచారు. 1,000 బస్తాలు కేంద్రంలో ఉన్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. రైతులు అధైర్యపడొద్దు చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఎగుమతి చేసిన ధాన్యం డబ్బులు త్వరగా పడేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, డీఏఓ అభిమన్యు, డీహెచ్ఎస్ఓ మరియన్న, డీఎం కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి రాజేందర్, ఏడీఓ శోభన్బాబు, లక్ష్మీనారాయణ, ఏఓ కుమార్ యాదవ్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ఎం డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు సిబ్బంది నియమించాలన్నారు. సిబ్బంది పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోనికి ప్రవేశమార్గాలు, సూచికల బోర్డ్లు ఏర్పాటు చేయాలన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి ఈనెల 27న జరుగనున్న వరంగల్, ఖమ్మం, నల్ల గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పొలింగ్కు జిల్లాలోని 34,933 ఓటర్లకు గాను 36 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. సెక్టార్ అధికారులు ప్రతీ పోలింగ్ స్టేషన్ తనిఖీ చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని 58 బ్యాలెట్ బాక్స్లను పోలింగ్కు సిద్ధం చేయాలన్నారు. తొర్రూర్ జెడ్పీహెచ్ఎస్, మానుకోట పాతిమా హైస్కూల్లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు అలివేలు, నర్సింహరావు, డిప్యూటీ సీఈఓ నర్మద, అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
గింజల దోపిడీ ఆగేదెన్నడు?
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో పనిచేసే కూలీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కూలీలు చెప్పిందే వేదం అన్నట్లుగా, వారు అడిగిన కాడికి గింజలు ఇస్తేనే రైతులను ఏమి అనకుండా వదిలేస్తున్నారు..లేదంటే తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు ప్రతీరోజు జరుగుతున్నప్పటికీ ఏఎంసీ పాలకవర్గం, మార్కెట్ అధికారులు పట్టించుకోవటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కూలీలకు, హమాలీలకు దానధర్మాల పేరిట ఎలాంటి గింజలు పెట్టకూడదని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రాసిన బోర్డులు నిరుపయోగంగా మారాయి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు కురవి, బయ్యారం, మరిపెడ, సీరోలు, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇతర మండలాల నుంచి రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. ఈ క్రమంలో వారు పత్తి, ధాన్యం, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, కందులు, బొబ్బెర్లు, వేరుశనగ, పచ్చజొన్న పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకురాగా బస్తాలు నింపటం, కాంటా పెట్టే క్రమంలో మోసాలు జరుగుతున్నాయి. కూలీలు బస్తాలు నింపే సమయంలో రైతుల వద్ద నుంచి దానధర్మాల పేరిట గింజలను అడుగుతున్నారు. రైతులు ఇచ్చిన వరకు సరిపెట్టుకోకుండా అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పైగా ఒకానొక సందర్భంలో రైతుల కళ్లు గప్పి గింజలను చోరీ చేస్తూ బస్తాల్లో నింపుకుంటున్నారు. ఇదేమి దోపిడని రైతులు అడిగితే వారిని దబాయిస్తున్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో కూలీల గింజల దోపిడీ ఆగడాలకు చెక్ పెట్టకుంటే రైతులు మార్కెట్కు రావటం బంద్ చేస్తారని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కొందరు కూలీలు వ్యవసాయ మార్కెట్కు రావాలంటే భయపడుతున్న రైతులు నిరుపయోగంగా ప్రచార బోర్డులు -
దేవాదాయ భూములను రక్షించుకోవాలి
మరిపెడ రూరల్: దేవాదాయ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదేనని ఎండోమెంట్ శాఖ పరిశీలకురాలు నందనం కవిత అన్నారు. సోమవారం మరిపెడ మండలం అగస్థేశ్వర ఆలయ భూముల కౌలు వేలంపాటకు ఆమె హాజరయ్యారు. ముందుగా కొండపై గల స్వయంభుగా వెలిసిన అగస్థేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ శాఖ ఆధ్వర్యంలో భూముల కౌలు వేలంపాట నిర్వహించారు. అబ్బాయిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 285లో 14.25 ఎకరాలు, 290 సర్వేలో 7 ఎకరాలు, 291లో 7.5 ఎకరాలు, 292, 294, 295,296 సర్వే నంబర్లలో 6.2 ఎకరాల మొత్తంగా 27 ఎకరాల వ్యవసాయ భూమి దేవుడి మాణ్యం కింద కలిగి ఉందన్నారు. ఆయా ఆలయ భూమిలో తవ్వకాలు, ఆక్రమణలు జరిగితే దేవాదాయ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు 27 ఎకరాల దేవుని భూములను కౌలు వేలం వేయగా రూ.1.18 లక్షలకు గ్రామానికి చెందిన పలువురు రైతులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ వేణగోపాల్, జూనియర్ అసిస్టెంట్ మార్క్ శేఖర్, అర్చుకులు ప్రసాద్శర్మ, గ్రామ పెద్దలు వంటికొమ్ము సుధాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, చంద్రారెడ్డి, తల్లాడ వెంకటరామారావు, రావుల వెంకట్రెడ్డి, కురియాల రాములు, జినక వీరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ రికార్డుల పరిశీలన
కేసముద్రం: మండల కేంద్రంలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి ఉత్తమ వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలీవరీ జరిగేలా చూడాలన్నారు. అనంతరం తాళ్లపూసపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించగా, ఆస్పత్రికి ప్రహరీ గోడ నిర్మించాలని డీఎంహెచ్ఓను, ఆ గ్రామ సీపీఎం నాయకుడు వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ కృష్ణార్జున, ఎస్యూఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ నంబికిషోర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్లో ఒకటవ, ఐదవ తరగతుల్లో 2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశం కొరకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇన్చార్జ్ అధికారి ఆర్. బాలరాజు సోమవారం తెలిపారు. 1వ తరగతి విద్యార్థుల వయస్సు 5 నుంచి 6 సంవత్సరాల లోపు, 5వ తరగతి విద్యార్థులకు 01–09–2014 నుంచి 31–08–2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఐదవ తరగతి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉందన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాల వారికి రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలు వార్షిక ఆదాయం ఉండాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థుల ఎంపిక చేయబడుతుందన్నారు. దరఖాస్తులు జూన్ 7వ తేదీలోపు జిల్లా షెడ్యూల్ కులాల కార్యాలయంలో అందజేయాలన్నారు. ఆయిల్పామ్ సాగు పెంచాలిమహబూబాబాద్ రూరల్: జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ సాగు పెంచే విధంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి కొర్స అభిమన్యుడు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరూ ఆయిల్ పామ్ సాగు చేయాలని, పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ పంట వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో వ్యవసా య సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ, శోభన్ బాబు, రాజనరేందర్ పాల్గొన్నారు. టీఎస్ఈసెట్లో 8వ ర్యాంకుకురవి: మండలంలోని నేరడ గ్రామానికి చెందిన విద్యార్థి మొగిలిచర్ల కార్తీక్కు టీఎస్ ఈసెట్లో 8వ ర్యాంకు సాధించాడు. సోమవారం విడుదల చేసిన టీఎస్ ఈసెట్(ట్రిపుల్ఈ)లో కార్తీక్కు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ట్రిపుల్ఈ విభాగంలో 200 మార్కులకుగాను 112 మార్కులు సాధించాడు. రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. 24న మల్యాల కేవీకేలో విత్తనమేళామహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24వ తేదీ శుక్రవారం విత్తనమేళా నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విత్తన మేళాలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన వివిధ పంటల రకాలు, వాటి సౌలభ్యత గురించి సమాచారం అందిస్తామన్నారు.అలాగే నాణ్యమైన రకాలు,పంటకాలం దిగుబడి, ఇతర విషయాల సమాచారాన్ని శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తారన్నారు. ప్రస్తుతం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో వరిలో వరంగల్ సిద్ధి సాంబ (డబ్ల్యూజీఎల్ 44)ఫౌండేషన్ విత్తనం అందుబాటులో ఉందన్నారు. సన్న రకం 145రోజుల పంటకా లం కలిగి ఉండి, మంచి దిగుబడి వస్తుందన్నారు. కునారం (కేఎన్ఎం) సన్నాలు (దొడ్డు గింజరకం) స్వల్పకాలిక రకం, 120 రోజుల పంట కాలం కలిగి ఉంటుందన్నారు. డబ్ల్యూజీఎల్ 962 రకం 130 రోజుల నుంచి 135 రోజుల పంట కాలం మధ్యస్థ గింజ రకం అందుబాటులో ఉన్నాయన్నారు. -
పార్టీనే నమ్ముకొని..
జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్తోపాటు ములుగు, ఇల్లెందు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు అయ్యాయి. పాలకుర్తి జనరల్ స్థానమైనా.. అక్కడే వైవిధ్యమైన పోటీ నెలకొంది. ఈ పరిస్థితిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయనే ఆశతో ఉన్నారు. మొదటి నుంచి మహబూబాబాద్ జిల్లాపై పట్టున్న నాయకుడిగా పేరున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్రెడ్డి రిజర్వేషన్ కలిసి రాక ఎమ్మెల్యేగా పోటీచేయలేక పోయారు. అయితే తండ్రి జనార్దన్రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆయన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గెలుపులో కీలక భూమిక పోషించారు. దీంతో ఆయనకు కార్పొరేషన్ పదవులు కాకుండా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం శ్రీకాంత్రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్గా వెళ్లారు. అన్నీతానై యశస్వినిరెడ్డి గెలుపుకోసం పనిచేశారు. రాజకీయ ఉద్దండుగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించడంలో కీలక భూమిక పోషించిన శ్రీకాంత్రెడ్డికి మొదటి విడతనే నామినేటెడ్ పదవి వస్తుందని భావించినా.. చివరి నిమిషంలో పదవి వరించలేదు. దీంతో ఈసారి నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు
మహబూబాబాద్ అర్బన్: ప్రతిభకు, చదువుకు పేదరికం అడ్డుకాదని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రా మారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రాంగణంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభా పురస్కారాలు సొమవారం నిర్వహించగా డీఈఓ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చది వే విద్యార్థులు పేదరికం నుంచి ఉన్న వారు కష్టపడి చదివి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. పదో తరగతి ఫలితాల్లో 22వ స్థానం నుంచి 12వ స్థానంలో నిలిచి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలబిందెల మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు భువనగిరి రవీందర్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఆకుల సాంబ య్య, కోశాధికారి తండ సదానందం పాల్గొన్నారు. పునఃప్రారంభానికి ముందే యూనిఫాం అందించాలి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల రిసోర్స్ సెంటర్ను సోమవారం డీఈఓ సందర్శించి మాట్లాడారు. ఎంఈఓలు, ఎంఎన్ఓలు, ఏపీఎంలు, మెప్మా మెంబర్స్ ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేసే వరకు ప్రతీఒక్కరి భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ, రాజేశ్వర్, అజాద్ చంద్రశేఖర్, మహిళ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తరగతుల పరిశీలనకేసముద్రం: కేసముద్రంస్టేషన్ జెడ్పీహైస్కూల్లో టెన్త్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు(2023–24) నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డీఈఓ రామారావు సోమవారం ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు. తరగతుల నిర్వహణ ఎలా ఉందనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సందేహాలను తీర్చాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కొత్త జగన్మోహన్రెడ్డి, హెచ్ఎం రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ రామారావు -
ప్రశ్నించే గొంతుకనవుతా..
మహబూబాబాద్ అర్బన్: పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్వీ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల సమావేశానికి గుజ్జుల హాజరై మాట్లాడుతూ.. హామీలిచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే అన్నారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సీరియల్ నంబర్ 1లో ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డిలు మాట్లాడారు. ప్రేమేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి -
చంపక్హిల్స్ విద్యుత్ సబ్స్టేషన్ అప్గ్రేడ్
జనగామ: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అనుసంఽధానమైన జనగామ పరిధిలోని చంపక్హిల్స్ విద్యుత్ సబ్స్టేషన్ సామర్థ్యం పెంపుతో ఐదు జిల్లాలకు లోవోల్టేజీ విద్యుత్ సరఫరా సమస్యకు పరిష్కారం కానున్నది. జనగామ జిల్లాలోని పసరమడ్ల శివారులోని చంపక్హిల్స్ విద్యుత్ సబ్స్టేషన్లో టీజీఎన్పీడీసీఎల్ జనగామ జిల్లా ఎస్ఈ టి.వేణుమాధవ్, కన్స్ట్రక్షన్ సీఈ పుల్లయ్య, శ్రీరామ్కుమార్ తదితరుల పర్యవేక్షణలో 125 ఎంఆర్ఎఆర్ రియాక్టర్ను 400 కేవీ బస్గా చార్జ్ చేశారు. ఈ విషయమై ఎస్ఈ మాట్లాడుతూ రియాక్టర్ ఉపయోగం లైన్లలో వోల్టేజీని నియంత్రించడం, అన్ని పరిస్థితుల్లో ఎల్లప్పుడూ 400 కేవీని మెయింటైన్ చేయడం, వాతావరణ లోపాలతో పాటు వ్యవసాయ సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ టైమింగ్ల సమయంలో లోడ్ హెచ్చు తగ్గుల కారణంగా సిస్టమ్లోని వోల్టేజ్ హై లేదా లోగా మారుతూ ఉంటుందన్నారు. ఇలాంటి జఠిలసమస్యలను సమతుల్యం చేసేలా పెంచిన సబ్స్టేషన్ సామర్థ్యం కీలకంగా దోహదపడుతుందన్నారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్కు కేటీపీఎస్ జూలూరుపాడు, ఎన్టీపీసీ రామగుండం నుంచి (ఇన్కమింగ్) 400 కేవీ విద్యుత్ సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి (అవుట్గోయింగ్) 220 కేవీ సామర్ధ్యం కలిగిన వడ్లకొండ, భువనగిరి, వడ్డేకొత్తపల్లి, షాపూర్, దేవన్నపేట విద్యుత్ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. వీటి ద్వారా జనగామ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర హైవోల్టేజీ విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. కార్యక్రమంలో కనస్ట్రక్షన్, ఓఎంసీ వరంగల్ ఎస్ఈలు సున్నిబాబు, బి.చంద్రశేఖర్, ఈఈ సత్యనారాయణ, ఎంఆర్టీ, కన్స్ట్రక్షన్, ఓఎంసీ వరంగల్ డీఇలు సంపత్రావు, రవీంద్ర, కె.శ్రీనివాస్, ట్రాన్స్కో పెంబర్తి ఏఈ కనకయ్య, ఎం.పరుశరాములు పాల్గొన్నారు. 125కేవీ ఎంఎవీఆర్ నుంచి 400 కేవీకి సామర్థ్యం పెంపు ఐదు జిల్లాలకు మెరుగుకానున్న లోవోల్టేజీ సమస్య -
No Headline
బచ్చన్నపేట : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరా చేసుకుని క్షణాల్లో డబ్బును మాయం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మండలంలోని నారాయణపురంలో రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండం మధు జనగామలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెల రుణవాయిదా చెల్లించడానికి తన ఖాతాలో డబ్బు జమ చేస్తున్నాడు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఖాతాదారుడు దరఖాస్తు చేసుకోకుండానే ఏప్రిల్14న క్రెడిట్ కార్డును పోస్టులో ఇంటికి పంపించి ఆ కార్డును యాక్టివ్ చేసుకోవడానికి బ్యాంకుకు రావాలని పలుమార్లు ఫోన్ చేశారు. కానీ ఖాతాదారుడు మధుకు ఆ కార్డు ఇష్టం లేక బ్యాంకుకు వెళ్లలేదు. అదే నెల 24వ తేదీన మళ్లీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని క్రెడిట్ కార్డును యాక్టివ్ చేయడానికి ఓటీపీ పంపించామని తెలుపమని కోరగా మధు ఫోన్లో ఆ ఓటీపీ చెప్పాడు. ఈ నెల 14న ‘మీరు క్రెడిట్ కార్డు ద్వారా రూ.28,500 విలువైన షాపింగ్ చేశారని, ఆ డబ్బును సకాలంలో చెల్లించాలని’ మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ బ్యాంకు అధికారులు తమకేమీ తెలియదంటూ సమాధానం ఇవ్వగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
విద్యారణ్యపురి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎర్రగట్టుగుట్ట వద్ద గల ఐయాన్ డిజిటల్ జోన్, నోబెల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, మోక్షిత కంప్యూటర్స్ పరీక్ష కేంద్రాల్లో టెట్ పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 245మంది అభ్యర్థులకు గాను 214 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 29మంది గైర్హాజరయ్యారు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రం, మోక్షిత కంప్యూటర్స్ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. నోబెల్ పరీక్ష కేంద్రంలో ఉదయం 190మందికి 172 మంది హాజరయ్యారు. 18మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 190మందికి గాను 163 మంది హాజరు కాగా 27మంది గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్హై పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారని సమాచారం. ఈనెల 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్–2 పరీక్షలు కొనసాగుతాయి. ఈనెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో పేపర్–1 పరీక్షలు నిర్వహిస్తారు. -
అందుబాటులో వరి విత్తనాలు..
హన్మకొండ: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వానాకాలం సాగుకు సంబంధించి వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రాంతీయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావాల్సిన రైతులు 9949317565 ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. స్వల్ప కాలిక రకాలు.. డబ్ల్యూజీఎల్–1119: ఈ రకం పంట కాలం 115–120 రోజులు. మధ్యస్థ సన్న గింజ కలిగి ఉంటుంది. వివిధ రకాల ఉల్లికోడ్ బయోటైప్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కొంత వరకు పొట్టకుళ్లు తెగులు, మెడవిరుపు తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 24–26 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డబ్ల్యూజీఎల్–962: ఇది సాంబమసూరి (బీపీటీ–5204)కి ప్రత్యామ్నాయ సన్నగింజ రకం. స్వల్ప కాలిక రకం. 1200125 రోజుల్లో కోతకు వస్తుంది. మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటుంది. కొంత వరకు అగ్గి తెగులు, మెడ విరుపు తెగులు తట్టుకుంటుంది. అన్నం నాణ్యతగా ఉంటుంది. ఎకరానికి 26–28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డబ్ల్యూజీఎల్–1246: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న స్వల్పకాలిక రకం. 125–130 రోజుల్లో కోతకు వచ్చే సన్న గింజ రకం. ఈ రకం మెడ విరుపు తెగులు, సుడి దోమను కొంత వరకు తట్టుకుంటుంది. పొట్టకుళ్లు, కంకినల్లి, గింజమచ్చ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. అన్నం నాణ్యతగా ఉంటుంది. ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మధ్యకాలిక రకాలు.. డబ్ల్యూజీఎల్–1487: ఈ రకాన్ని జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా రూపొందించారు. దీని పంట కాలం 135 రోజులు. ఇది జన్యు పెరుగుల ద్వారా తక్కువ భాస్వరం కలిగిన నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం. తక్కువ భాస్వరం కలిగిన నేలల్లో కూడా అధిక దిగుబడి ఇస్తుంది. సుడి దోమ, అగ్గి తెగులును కొంత మేరకు తట్టుకుంటుంది. ఎకరానికి 26–28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అన్నం నాణ్యతగా ఉంటుంది. సన్నగింజ రకం. డబ్ల్యూజీఎల్–915: ఈ రకం వానాకాలం సాగుకు అనుకూలమైన మధ్యకాలిక రకం. 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దొడ్డు గింజ రకం. సుడిదోమ, అగ్గి తెగులు టుంగో వైరస్ తెగులును కొంత మేరకు తట్టుకుంటుంది. డ్రమ్ అటుకులు, మరమరాల తయారీకి అనుకూలం. ఎకరానికి 30–32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీర్ఘకాలిక రకం.. డబ్ల్యూజీఎల్–44: అధిక దిగుబడి, ఎకరానికి 28–30 క్వింటాళ్ల ఇచ్చే సన్న గింజ రకం. 140 నుంచి 145 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఉల్లికోడ్ (బయోటైప్–1)ను తట్టుకుంటోంది. కొంత వరకు చౌడును తట్టుకుంటుంది. గింజ, అన్నం నాణ్యతగా ఉంటుంది. సాంబమసూరి కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఆ పంట కంటే వారం రోజుల ముందు కోతకు వస్తుంది. ప్రాంతీయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి -
వరంగల్లో రంజీ మ్యాచ్లు
వరంగల్ స్పోర్ట్స్ : అధునాతన హంగులతో వరంగల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామని, దీనిపై త్వరలోనే అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు ఎ.జగన్మోహన్రావు అన్నారు. నగరంలోని ఎల్బీ కళాశాల మైదానంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు సోమవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇక నుంచి వరంగల్లో రంజీ మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రతిభ కలిగిన కీడాకారులు ఉన్నారని, వారిని గుర్తించి సానపెడతామని తెలిపారు. ఇందుకోసమే భారీ స్థాయిలో సమ్మర్ క్యాంపులు నిర్వహించామన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్కుమార్గౌడ్, హెచ్సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్ ధల్జిత్ సింగ్, కార్యదర్శి ఆర్.దేవరాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జస్వరాజు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బాధ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉదయభానురావు, అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు పోగుల అశోక్, సీనియర్ క్రీడాకారులు మట్టెడ కుమార్, తదితరులు పాల్గొన్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు -
నగరంలో డ్రగ్స్ కలకలం..
రామన్నపేట: గ్రేటర్ వరంగల్లో డ్రగ్ కలకలం రేపింది. అతి ప్రమాదకరమైన హశిష్ మత్తు మందు స్మగ్లింగ్కు పాల్ప డుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్ల డించారు. ఏపీలోని కాకినాడ జిల్లా ఏళేశ్వరం ఎర్రవరానికి చెందిన చింత వెంకటరాజు అలియాస్ బాబీ ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థంతో హంటర్ రోడ్డులోని ఏడు మోరీల ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మట్టెవాడ పోలీసులు.. నార్కొటిక్ అనాలసిస్ విభాగం అధికారులతో కలిసి చింత వెంకటరాజును తనిఖీ చేయగా నిషేధిత మత్తు ప దార్థం హశిష్ లభించింది. దీంతో రూ. 4.50 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, నిందితుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో ఈ పదార్థాన్ని కొనుగోలు చేసి ఢిల్లీ వెళ్లే క్రమంలో వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి హంటర్ రోడ్డు రైల్వే ట్రాక్ వద్ద అనుమానానాస్పందగా తారసపడిన క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి, నార్కొట్ ఇన్స్పెక్టర్ రాజేశ్, ఎస్సై విఠల్, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. హశిష్ మత్తు పదార్థంతో పట్టుబడిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరాంనాయక్ -
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా
గార్ల: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇస్లావత్ అశోక్ మృతదేహంతో స్థానిక సీహెచ్సీ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సోమ వారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గార్ల సమీపంలోని బుద్దారం రైల్వే అండర్బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై కొనఊపిరితో ఉన్న ఇస్లావత్ అశోక్ను సీహెచ్సీకి తీసుకొచ్చారన్నారు. ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేరన్నారు. సమయానికి డాక్టర్ ఉంటే అశోక్ బతికేవాడన్నారు. పేరుకే 30 పడకల ఆస్పత్రి కాని రాత్రి వేళలో ఒక్క డాక్టర్ ఉండరని, దీంతో అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులకు వైద్యం అందక పలువురు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఆస్పత్రికి గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ చేరుకుని మృతుడి బంధువులతో జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్తో మాట్లాడించి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళలో డ్యూటీ డాక్టర్ను నియమించాలి అధికారుల హామీతో ఆందోళన విరమించిన మృతుడి బంధువులు -
ఉపాధి చట్టం పరిరక్షణకు ఉద్యమించాలి
మరిపెడ రూరల్: కాంమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పోరాట స్ఫూర్తితో ఉపాధి కూలీ చట్టం పరిరక్షణకు ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కా ర్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శ అలువాల వీరయ్య అన్నారు. మరిపెడ మండలం తండధర్మారం, బాల్నిధర్మారం ఉపాధి పని ప్రదేశాలలో కూలీలతో కలిసి పు చ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా వీర య్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10ఏళ్ల కాలంలో ఉపాధి చట్టానికి బడ్జె ట్లో నిధులు తగ్గించి అనేక సవరణలు చేసి ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉపాధి చట్టాన్ని పరిరక్షించుకునేందుకు మే31న జిల్లా వ్యా ప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న, కుమ్మరికుంట్ల వెంకన్న, శోభన్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
కొడకండ్ల : మాయదారి మృత్యువు మాటు వేసి కాటు వేసింది. కర్రీ తెచ్చుకునేందుకు వె ళ్లిన అన్నదమ్ములను కారు రూపంలో అ మాంతం బలితీసుకుంది. ఈ ప్రమాదం హై దరాబాద్లో జరగగా.. కొడకండ్ల మండలం రామవరంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు, రాజేశ్వరి దంపతులకు ము గ్గురు కుమారులు. పెద్ద కుమారుడి కి వివాహమై కూకట్పల్లిలో నివా సం ఉంటున్నాడు. రెండో కుమారుడు శ్రావణ్ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పీర్జాదిగూడలో నివాసం ఉంటుండగా చిన్నకుమారుడు శివ ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో పనిచేస్తూ ఆదివారం అన్న శ్రావణ్ నివాసముంటున్న పీర్జాదిగూడకు వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో కర్రీ తెచ్చుకునేందుకు ఇద్దరు బైక్పై వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కారు.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా శ్రావణ్ ను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, ఎదిగిన ఇద్దరు కొడుకులు రో డ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టం అనంత రం మృతదేహాలను సోమవారం గ్రామానికి తీసుకురాగా కడసారి చూసేందుకు వచ్చిన గ్రామస్తులు బోరున విలపించారు. మేడిపల్లిలో మరొకరు.. కాటారం: కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి కృష్ణకాలనీకి చెందిన కోదాది శ్యామ్కుమార్(30) తన స్నేహితుడు ఠాకూర్ పృథ్వీతో కలిసి ద్విచక్రవాహనంపై మరో స్నేహితుడిని దింపడానికి మండలంలోని బయ్యారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో పృథ్వీ బైక్ నడుపుతుండగా శ్యామ్కుమార్ వెనుక కూర్చున్నాడు. మేడిపల్లి అటవీ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో శ్యామ్కుమార్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ సమయంలో భూపాలపల్లి నుంచి కాటారం వైపునకు వెళ్తున్న ఏపీ 36టీబీ 4672 నంబర్ గల తుఫాన్ వాహనం శ్యామ్కుమార్ను గమనించక అతడి పైనుంచి వెళ్లింది. దీంతో శ్యామ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పృథ్వీకి గాయాలు కావడంతో భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దివ్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శివదర్శనం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. అన్నాసాగరంలో రిటైర్డ్ ఉద్యోగి.. హసన్పర్తి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ రిటైర్డ్ ఉ ద్యోగి మృతి చెందాడు. హసన్పర్తి మండలం అన్నాసాగరం బీసీ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అన్నాసాగరానికి చెందిన గడ్డం కొమురయ్య(70) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ప్రస్తుతం కాజీపేట డీజిల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం వ్యక్తిగత పని నిమిత్తం అదే ప్రాంతంలో ఉంటున్న తన సోదరుడి సదా నందంతో కలిసి అన్నాసాగరానికి బయలు దేరారు. సదానందం బైక్ నడుపుతుండగా కొ మురయ్య వెనుక కూర్చున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీకి చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న బైక్.. వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొమురయ్యకు తీవ్రగా యాలయ్యాయి. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. ఆది, సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన ఇద్దరు, కాటారం మండలం మేడిపల్లిలో ఒకరు, హసన్పర్తి మండలం అన్నాసాగరం వద్ద మరొకరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నీ వెంటే నేను..
● గుండెపోటుతో భర్తమృతి... తట్టుకోలేక భార్య కన్నుమూత మహాముత్తారం: భర్తతో ఏళ్ల జీవితాన్ని పంచుకున్న భార్య.. ఆయన హఠాన్మరణంతో కుంగిపోయి తను కూడా తనువు చాలించింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మరణించారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన లింగమల్ల నాగయ్య (65) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. నాగయ్య మరణాన్ని తట్టుకోలేక భార్య లక్ష్మి (60) ఏడుస్తూ సోమవారం ఉదయం ప్రాణం విడిచింది. ఇద్దరు ఒకేసారి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారికి ముగ్గురు కుమారులు. అందరికీ పెళ్లిళ్లు అయి స్థిరపడ్డారు. -
డీఈఓ వేధింపులకు పాల్పడుతున్నాడు..
● మహిళ ఉద్యోగి నిరసనమహబూబాబాద్ అర్బన్: డీఈఓ తనను ఉద్దేశపూర్వకంగా మానసిక ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఔట్సోర్సింగ్ ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పార్వతి ఆరోపిస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని బైఠాయించింది. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ 2017 నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్లో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్నానని, ఈ డీఈఓ వచ్చినప్పటినుంచి తనకు కేటాయించిన పనులను మాత్రమే చేస్తానంటే సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. డీఈఓ చెప్పిన పనులన్నిటినీ చేస్తున్నా కక్షపూరితంగా మానసికంగా వేధింపులు చేస్తున్నారని, కులం పేరుతో తనను ఇష్టం వచ్చినట్లు మాటలు అంటున్నారని ఆరోపించింది. డీఈఓ వేధింపులు గురిచేస్తున్నాడని 2023 నవంబర్లో జిల్లా కలెక్టర్కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానని, మానుకోట టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్లు తెలిపింది. అప్పటి డీఎస్పీ విచారణకు వచ్చి తాను పెట్టిన కేసు ఉపసంహరించే విధంగా సర్ది చెప్పి యథావిధిగా విధులకు హా జరయ్యేలా చూశారని తెలిపింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగం రెన్యువల్ చేయకుండా తనను ఉద్యోగంలోకి రావొద్దని, వచ్చిన తనను రిజిస్టర్లో సంతకం పెట్టనివడంలేదని తెలిపింది. రాత్రి 9 గంటల వరకు పనిచేయించారని, ఒకరోజు పది గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నానని పేర్కొంది. ఆ రాత్రి ఇంటికి వెళ్లాలంటే భయమేసి 100కు ఫోన్ చేసి పోలీస్ వాహనంలో ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. నా కుటుంబానికి న్యాయం చేయాలని, మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆమె కోరింది. ఈ విషయంపై డీఈఓ రామారావును వివరణ కోరగా పార్వతి అనే ఆఫీస్ సబార్డినేట్ సరిగ్గా విధులు నిర్వహించడం లేదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు ఆమె స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని తెలిపామని చెప్పారు. పార్వతిని ఉద్యోగం నుంచి తొలగించలేదన్నారు. హత్య కేసులో ముగ్గురి అరెస్ట్.. ● ఆస్తితగదాలే కారణం హసన్పర్తి: మామను హత్య చేసిన ఘటనలో కోడలు, ఇద్దరు మనవళ్లను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్ సోమవారం తెలిపారు. హసన్పర్తికి చెందిన జల్లి సారయ్య(70)కు ఇద్దరు కూ తుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు రమేష్, అశోక్ అప్పటికే మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమారుడు రమేష్కు భార్య రమాదేవి, ముగ్గు రు కుమారులు రాకేశ్, సాయికృష్ణ, శశికుమార్ ఉన్నారు. ఆస్తితగాదాలే అంతమొందించాయి.. సారయ్య తన ఆస్తిలో అప్పటికే కొంత అమ్ముకున్నాడు. ఉన్న ఇంటిని కుమారుడితో పాటు ఇద్దరు కూతుళ్లకు సమాన వాటా ఇవ్వడానికి నిర్ణయించాడు. ఇందుకు కోడలు రమాదేవి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈక్రమంలో సారయ్యను హత్య చేస్తే ఆస్తి తమకు చెందుతుందని కోడలు రమాదేవి, మనవళ్లు సాయి కృష్ణ, శశికుమార్ నిర్ణయానికి వచ్చారు. రోజూ నల్లా వచ్చే సమయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇదే అవకాశంగా భావించిన కోడలు, మనవళ్లు.. సారయ్యపై దాడి చేశారు. ఈఘటనలో సారయ్య నుదిటిపై బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement