-
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
విద్యానగర్ (కరీంనగర్): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్లోని పెద్దస్టార్స్ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి. ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచి్చనట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం. -
విత్తన మేళాకు వేళాయే!
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలోని పొలాస, కరీంనగర్లోని వ్యవసాయ పరిశోధన స్థానాల వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, మొక్కజొన్న, పెసర, కంది, నువ్వు విత్తనాలను రైతులకు నేరుగా విక్రయించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. శుక్రవారం పొలాస, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో విత్తనమేళాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు అందించనున్నారు. వివిధ పంటల్లో సాగుకు సంబంధించిన విషయాలను వివరించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. మేలు రకం విత్తనాలు ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో ఆయా పంటల్లో విత్తనోత్పత్తి చేసి.. ఆ పంట నుంచి వచ్చే మేలు రకం విత్తనాలను రైతులకు సరసరమైన ధరలకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. కల్తీ లేకుండా నాణ్యమైన విత్తనాలను ప్రత్యేక పద్ధతిలో కోయించి, పరిశోధన స్థానంలోని ప్రాసెసింగ్ ప్లాంట్లో తాలు, తప్ప, మట్టి లేకుండా చూస్తారు. అలా తయారైన విత్తనాలను శాస్త్రవేత్తల బృందం ఒకే చెప్పిన తర్వాతనే రైతులకు విక్రయిస్తుంటారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల విత్తన సంస్థలకు.. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో తయారైన వరి బ్రీడర్ సీడ్ విత్తనాలను ఏపీ సీడ్స్, మహారాష్ట్ర సీడ్స్, కర్ణాటక సీడ్స్ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఆయా సంస్థలు వారికి అవసరమైన సీడ్ కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మూడు నెలల ముందే దరఖాస్తు చేసుకుంటాయి. ఈ ఆర్డర్ల మేరకు పరిశోధన స్థానం నుంచి విత్తనాలను ఆ సంస్థలకు కేటాయించి.. మిగతా విత్తనాలను రైతులకు అందిస్తారు. శుక్రవారం విత్తనమేళా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన దొడ్డు వరి రకాల్లో జగిత్యాల రైస్–1 (జేజీఎల్–24423) రకం 25కిలోల బస్తాను రూ.1100కు విక్రయించనున్నారు. అలాగే జేజీఎల్–28639 (త్వరలో విడుదలయ్యే రకం) రూ.1100(25కిలోలు), సన్నరకాల్లో జగిత్యాల రైస్–3 (జేజీఎ ల్27356) రూ.750 (15కిలోలు), జగిత్యాల రైస్– 2 (జేజీఎల్–28545) రూ.960(20కిలోలు), జేజీ ఎల్–33124 (త్వరలో విడుదలయ్యే రకం) రూ. 950(20కిలోలు) చొప్పున విక్రయించనున్నారు. కరీంనగర్ పరిశోధన స్థానంలో.. కరీంనగర్ పరిశోధన స్థానంలోనూ శుక్రవారం విత్తనమేళా విక్రయిస్తున్నారు. మొక్కజొన్న రకాల్లో కరీంనగర్ మక్క–1(కేఎన్ఎంహెచ్–4010131)ను రూ.900(4కిలోలు), కరీంనగర్ మక్క(కేఎన్ఎంహెచ్–4010141)ను రూ 900(4కిలోలు), పెసరలో యాదాద్రి (డబ్ల్యూజీజీ–42) రూ.840 (6కిలోలు), కంది వరంగల్ కంది (డబ్ల్యూఆర్జీ–255) రూ.600 (4కిలోలు), నువ్వు జగిత్యాల థిల్–1 (జీసీఎస్–1020) రూ.690 (3కిలోలు) చొప్పున విక్రయించనున్నారు. రేపు జగిత్యాల, కరీంనగర్లో విక్రయం అందుబాటులో వరి, మొక్కజొన్న, పెసర, కంది సీడ్స్ తక్కువ ధరకే రైతులకు నేరుగా అమ్మకాలు -
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
● డీఐఈవో జగన్మోహన్రెడ్డి కరీంనగర్: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్ 10,073, సెకండియర్ 4,907 మొత్తం 14,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, సాంకేతిక పరికరాలను అనుమతించరని తెలిపారు. మాస్కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, కేంద్రాల సమీపంలో జరిగే ప్రతి ఫోన్ సంభాషణ రికార్డు అవుతుందని ఇన్విజిలేటర్లు, విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. సలహాలు, సూచనల కోసం ట్రోల్ఫ్రీ 14416, 1800–914416 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. -
ఎలగందులకు పూర్వవైభవం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్మార్ట్సిటీ పనులతో కొత్తశోభ సంతరించుకున్న కరీంనగర్ నగరం విశాలమైన రోడ్లు, కూడళ్ల సుందరీకరణ, ఇతరత్రా అభివృద్ధితో కొత్తవన్నె సంతరించుకుంది. పట్టణానికి ఆనుకొని ఉన్న మానేరునదిపై తీగలవంతెన పూర్తి అవ్వడం, లైటింగ్స్తో జిగేల్మంటూ వెలుగులు విరజిమ్మడం, మానేరు రివర్ఫ్రంట్ పనులు పూర్తయితే నగరానికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. తాజాగా కరీంనగర్–ఎలగందుల పాతరోడ్డుపై రూ.90 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా సాగుతుండడంతో ఎలగందుల గ్రామానికి పూర్వ వైభవం రానుంది. బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఎలగందుల పాత గ్రామానికి ఉన్న రోడ్డుపై నుంచే 29 ఫిల్లర్లు 600 మీటర్ల పొడవైన వంతెన పనులు సాగుతున్నాయి. వర్షకాలం సమీపిస్తున్న వేళకు ముందే డ్యామ్ బ్యాక్వాటర్లో నిర్మిస్తున్న వంతెనను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించి ఆ దిశగా పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, వరంగల్, అటూ నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచే వచ్చే భారీ వాహనాలు జిల్లా కేంద్రంలోకి రాకుండానే బైపాస్ గుండా ఎలాంటి ఇక్కట్లు లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే వాహనాలకు ఎలగందుల బ్రిడ్జి పూర్తవ్వడం వల్ల 12 కిలోమీటర్ల దూర భారం తగ్గనుంది. ఒకప్పటి జిల్లా కేంద్రబిందువైన ఎలగందుల ఖిల్లాకు పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు చారిత్రక కట్టడాల ప్రాధాన్యత పెరగనుంది. టూరిజం శాఖ కోటలోపల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వీలుంటుందని ఎలగందుల గ్రామస్తులతో పాటు పర్యాటక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయి కోట సందర్శనకు కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే గ్రామానికి మరింత పర్యాటక శోభ పెరిగే అవకాశం ఉంటుందని పర్యాటకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. రూ.90 కోట్లతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు డ్యామ్ బ్యాక్వాటర్లో వారధి నిర్మాణం డిసెంబరు చివరినాటికి పూర్తికానున్న పనులు 12 కిలో మీటర్లు తగ్గనున్న దూరభారం -
తీరు మారలే!
వీణవంక(హుజూరాబాద్): ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని పీహెచ్సీకి వెళ్తే అక్కడ సిబ్బంది లేక నరకయాతన పడ్డాడు. ప్రాణపాయ స్థితిలో చివరికి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ను మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన ఇంటి సమీపంలో విషపాము కాటేసింది. కుటుంబీకులు 2కిలోమీటర్ల దూరంలోని చల్లూరు పీహెచ్సీకి తరలించారు. అప్పటికే సిబ్బంది ఎవరూ లేరు. 40 నిమిషాల పాటు బాధితుడు నరకయాతనపడ్డాడు. సిబ్బంది కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ‘వస్తున్నాం’ అనే సమాధానం ఇచ్చారు తప్ప.. ఎవరూ రాలేదని బాధితుడి కుటుంబీకులు వాపోయారు. పీహెచ్సీలో బోర్డుపై ఉన్న ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేయగా అంబులెన్స్ పంపించారని, దీంతో కరీంనగర్ ఆసుపత్రిలో చేరాడని గ్రామస్తులు తెలిపారు. కొంత ఆలస్యమైతే ప్రాణాలు పోయేవని పేర్కొన్నారు. సా యంత్రం 4గంటలు కాకముందే సిబ్బంది వెళ్లి పోతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటీవల చల్లూరు పీహెచ్సీని కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. సాయంత్రం 4గంటలకు కలెక్టర్ వెళ్లే సరికి సిబ్బంది ఎవరూ లేరు. దీంతో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో మరునాడు డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. ఈక్రమంలో నెల రోజుల పాటు సక్రమంగా విధులు నిర్వర్తించిన సిబ్బంది మళ్లీ సాయంత్రం 4గంటల ముందే వెళ్లిపోతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి 8గంటల విధులకు స్టాఫ్నర్సు రాకముందే అంతకు ముందున్న స్టాఫ్నర్సు వెళ్లిపోతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పీహెచ్సీపై కలెక్టర్ దృష్టి సారించి మెడికల్ ఆఫీసర్తో పాటు సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ● మల్లారెడ్డిపల్లి వాిసిని కాటేసిన పాము చల్లూరు పీహెచ్సీకి వెళ్తే పత్తాలేని సిబ్బంది 40 నిమిషాలు అక్కడే నరకయాతన చివరికి కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితుడుకలెక్టర్ తనిఖీ చేసినా.. -
ఎస్సారార్ ప్రిన్సిపాల్ రామకృష్ణకు అవార్డు
కరీంనగర్సిటీ: ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామకృష్ణను అవార్డు వరించింది. ఉన్నత విద్యారంగంలో గత 25 ఏళ్లుగా చేసిన కృషిని ప్రశంసిస్తూ ఢిల్లీకి చెందిన వందన సంస్థ, జీసీసీఆర్ కౌన్సిల్ సంయుక్తంగా ఇండియన్ ఐకాన్ అవార్డు ప్రకటించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ అవార్డు స్వీకరించారు. విద్యారంగం ప్రగతికి రామకృష్ణ చేస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు. ప్రిన్సిపాల్కు అవార్డు రావడంపై ఎస్సారార్ వైస్ ప్రిన్సిపాల్ టి.రాజయ్య, డా.ప్రమోద్, డా.కె.సురేందర్రెడ్డి, డా.కె.మల్లారెడ్డి, స్టాఫ్ సెక్రటరీ డా. ఆడేపు శ్రీనివాస్, డా.సతీశ్, డా.ఓదెలుకుమార్, ఎన్సీసీ అధికారి పి.రాజు, డా.మహేశ్, నాగేశ్వర్, లైబ్రేరియన్ కె.సురేందర్, వివిధ విభాగాల అధిపతులు, బోధనేతర సిబ్బంది తదితరులు అభినందించారు. యూనిఫాంలు సిద్ధం చేయండికరీంనగర్ కార్పొరేషన్: పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫాంలు సిద్ధంగా ఉంచాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరంలోని సీతారాంపూర్లో స్వశక్తి మహిళల స్టిచ్చింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపల్లి పాఠశాలకు సంబంధించి విద్యార్థుల యూనిఫాంలను పరిశీలించి మాట్లాడారు. స్టిచ్చింగ్ త్వరగా పూర్తిచేయాలని, పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జి పీడీ, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ స్వ రూపరాణి, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం’కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తుందని మాజీ మేయర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలు తాజాగా సన్న రకాలకు మాత్రమే ఇస్తామని మాట్లాడుతున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు పోటీ పడి రాహుల్గాంధీకి డబ్బులు పంపే ధ్యాసలోనే ఉన్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను మిల్లర్లు అనేక ఇబ్బందులు పెడుతున్నారని, తాలు, తేమ పేరిట అన్నదాతల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కరీంనగర్లోనే కొనుగోలు చేయాల్సి ఉందని, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెంసారం తిరుపతి, తుల భాస్కర్రావు, జయంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. పత్తి క్వింటాల్కు రూ.7,450 జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,450, మోడల్ ధర రూ.7,350, కనిష్ట ధర రూ.6,800 పలికింది. గన్నీ సంచుల్లో తెచ్చిన పత్తి క్వింటాల్ గరిష్ట ధర రూ.6,200, మోడల్ ధర రూ.6,100, కనిష్ట ధర రూ.5,000 వ్యాపారులు చెల్లించారు. క్రయవిక్రయాలను కార్యదర్శి గుగూలోతు రెడ్డినాయక్ పర్యవేక్షించారు. -
వేగంగా పనులు..
కరీంనగర్ నుంచి ఎలగందుల పాతరోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కరీంనగర్–సిరిసిల్ల రోడ్డు మార్గం కన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తే 12 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఎలగందుల ఖిల్లా కొత్త పర్యాటక శోభను సంతరించుకోనుంది. జిల్లాకు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషించనుంది. – గంగుల కమలాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
అణగారిన వర్గాల వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ
కరీంనగర్: అణగారిన వర్గాల వైతాళికుడిగా ప్రసిద్ధిగాంచిన దళితోద్యమ తొలిపొద్దు భాగ్యరెడ్డివర్మ స్ఫూర్తిని నేటి సమాజం పునికి పుచ్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బుధవారం మాతాశిశు కేంద్రం వద్ద ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డివర్మ 136వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డివర్మ దళిత సీ్త్రలను పట్టిపీడిస్తున్న జోగిని, దేవదాసి, మాతంగి లాంటి వ్యవస్థలను నిర్మూలించడమే లక్ష్యంగా మురళీ నివారణ మండలి సంస్థను స్థాపించిన మహనీయుడని కొనియాడారు. దళిత బాలికల కోసం పాఠశాలలు స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని వివరించారు. వారి ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నేతానియల్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం తగదు ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు వందశా తం పూర్తి కావాలని కలెక్టర్ పమేలా సత్పతి అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్షించారు. పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాల పనులు పూర్తయ్యేలా మండల ప్రత్యేక అధికారుల నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో తీసుకున్న కొలతల ఆధారంగా ఏకరూప దుస్తుల తయారీని హెచ్ఎంలు పర్యవేక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ, ఏ పని పెండింగ్ లేకుండా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈవో జనార్దన్రావు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆర్థికాభివృద్ధికి 10 వేల ఎఫ్పీవోలు
కొత్తపల్లి(కరీంనగర్): రైతుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీవోలు) ఏర్పాటు చేయనుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్రావు తెలిపారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట రైతు సంఘం భవనంలో బుధవారం కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎఫ్పీవోల నిర్వాహకులు, ప్రగతిశీల రైతుల సమావేశానికి హాజరై, మాట్లాడారు. రైతులు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుందన్న ఆలోచనతోనే కేంద్రం వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 84 శాతం మంది చిన్న, సన్నకారు రైతులను సంఘటితపరిచి, వారు పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఎఫ్పీవో మార్కెటింగ్ నిపుణుడు, రాజమండ్రి సీటీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ హేమ మాట్లాడుతూ.. ఎఫ్పీవోలకు మంచి భవిష్యత్తు ఉందని, పంటలకు విలు వ జోడింపునకు సహకారం అందిస్తాయన్నారు. పాలమూరు సీడ్స్ ప్రతినిధి డాక్టర్ అప్పారావు, సిగ్నెట్ సీడ్స్ అధినేత డాక్టర్ సుదేశ్ శర్మ మాట్లాడుతూ.. తమ కంపెనీలు ఎఫ్పీవోల ప్రోత్సాహానికై బై బ్యాక్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయని తెలిపారు. చింతకుంట ఎఫ్పీవో అధ్యక్షుడు శంకర య్య మాట్లాడుతూ బియ్యం, మిరప పొడి, కూరగా యల అమ్మకాలతో లాభాలు గడిస్తున్నామని తెలి పారు. ఎఫ్పీవోల అధ్యక్షులు నరసింహారెడ్డి, కమలాకర్రావు, పురుషోత్తంరావు, పర్శరాం గౌడ్, బాపురెడ్డి, వెంకట్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వేణుగోపాల్రావు, రైతు నాయకులు మారుతి, ఇంద్రారెడ్డి, వెంకట్రావు, పర్శరాములు తదితరులున్నారు. కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్రావు -
జీజీహెచ్ ఆవరణలోని గోతిలో పడి ఒకరి మృతి
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఆవరణలో కొత్త భవనం కోసం తవ్విన గోతిలో పడి రావుల విజయ్(47) మృతిచెందాడు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన విజయ్ మేషన్ పని చేస్తుండేవాడు. జీజీహెచ్ ఆవరణలో కొత్త భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త బ్లాక్ ముందు భారీ గోతిని తవ్వారు. కాగా, మంగళవారం రాత్రి విజయ్ మద్యం మత్తులో అందులో పడి, లోపల సిమెంట్ సర్ఫేస్కు తగిలి, నీళ్లలో పడిపోయాడు. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం సైట్ ఇంజినీర్ మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి జయశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో రెండు కొత్త భవనాలను వేర్వేరు కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారు. అయితే, వారు రక్షణ చర్యలను గాలికి వదిలేశారన్న ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికుడు..రామగుండం: కేరళ ఎక్స్ప్రెస్ రైలులో అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడు రామగుండం రైల్వేస్టేషన్ను చేరుకోగానే మృతిచెందాడు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా పుతియావిపిల్ గ్రామానికి చెందిన జార్జి వర్జీస్(61) బుధవారం ఢిల్లీ నుంచి కొట్టాయం కేరళ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగీలో ప్రయాణించాడు. మంచిర్యాల రైల్వేస్టేషన్ దాటిన తర్వాత అస్వస్థతకు గురవడంతో తోటి ప్రయాణికులు గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రామగుండం జీఆర్పీ పోలీసులు, రైల్వే డాక్టర్ 108 వాహనంతో రామగుండం రైల్వేస్టేషన్లో సిద్ధంగా ఉన్నారు. బాధితుడిని స్టేషన్లో దింపి, పరీక్షించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఔట్పోస్టు ఇన్చార్జి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం
మెట్పల్లి/మేడిపల్లి: రోడ్డు ప్రమా దం తండ్రీకొడుకును బలితీసుకు ంది.. ఒకేరోజు ఇద్దరి మృతితో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన మెట్పల్లిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి పట్టణంలోని బర్కత్పురకు చెందిన మహమ్మద్ ఖైరొద్దీన్(82) ఎస్సారెస్పీ ఉద్యోగిగా రిటైరయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు రషీదొద్దీన్(58) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వీరు కరీంనగర్లో ఉంటున్నారు. అయితే, ఖైరొద్దీన్ ఆస్పత్రిలో చూపించుకునేందుకు మంగళవారం కరీంనగర్లో ఉంటున్న కుమారుడి వద్దకు వచ్చారు. తిరిగి రషీదొద్దీన్ బుధవారం మధ్యాహ్నం తండ్రిని మెట్పల్లిలో దింపేందుకు కారులో తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో మేడిపల్లి శివారుకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి, చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారు ఢీకొని వ్యక్తి.. జగిత్యాల క్రైం: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడని జగిత్యాల పట్టణ ఎస్సై నరేశ్ తెలిపా రు. ఆయన వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్కు చెందిన పల్లికొండ రాజ య్య(58) బుధవారం ఉదయం ఎలుకబావి వాడలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చాడు. రోడ్డు పక్కన మాట్లాడుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. కండ్లపల్లి పోశాలు కూడా గాయపడ్డాడు. స్థానికులు వారిని జగి త్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాజయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మేడిపల్లిలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు మెట్పల్లిలో విషాదం -
వడదెబ్బతో ‘ఉపాధి’ కూలీ మృతి
మేడిపల్లి(జగిత్యాల): వడదెబ్బతో ఉపాధిహామీ మహిళా కూలీ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలంలోని తొంబరావుపేటకు చెందిన బస్వరాజుల లక్ష్మి(57) రోజూ మాదిరిగానే గత సోమవారం స్థానిక పెద్ద చెరువులో పూడిక తీసే పనికి వెళ్లింది. వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. భవనం పైనుంచి పడి వలస కూలీ.. ● మృతుడు మహారాష్ట్ర వాసి ఇబ్రహీంపట్నం(కోరుట్ల): బతుకుదెరువు కోసం వచ్చిన ఓ వలస కూలీ దాబా పైనుంచి పడి మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ గంగారాం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర యావత్మాల జిల్లా మార్చండి గ్రామానికి చెందిన దగుడు ముఖడే(60) తన కుటుంబసభ్యులతో కలిసి కొన్ని రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి వచ్చి, కుమ్మరి సంఘ భవనంలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పని చేసుకొని, వచ్చాడు. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నిద్రించాడు. మధ్యలో ఉక్కపోస్తుందని భవనం మొదటి అంతస్తుకు వెళ్లి, పడుకున్నాడు. అయితే, పైన చుట్టూ ప్రహరీ లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జనకు లేచి, నిద్రమత్తులో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని మెట్పల్లి సీఐ నవీన్కుమార్ పరిశీలించారు. మృతుడి కుమారుడు రాంజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి.. ● ఇంటర్లో ఫెయిలవడంతో ఈ నెల 17న ఆత్మహత్యాయత్నం జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని దూదేకుల కాలనీకి చెందిన చొప్పదండి చంద్రప్రకాశ్(20) అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందా డని జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ తెలిపా రు. ఆయన వివరాల ప్రకారం.. చొప్పదండి దశరథంకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు చంద్రప్రకాశ్ ఇటీవల ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై, ఈ నెల 17న జగిత్యాల అర్బన్ మండలంలోని ధరూర్ శివారు ఎస్సారెస్పీ కెనాల్ వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు గమనించి, జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి బాబా యి ప్రవీణ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి.. పాలకుర్తి(రామగుండం): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బసంత్నగర్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని వేంనూర్ శివారులో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో దీకొండ మహేందర్, తనుగుల రాములు, అతని భార్య రాంబాయి తీవ్రంగా గాయపడ్డారు. మహేందర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, రాములు బుధవారం చనిపోయాడు. -
నేడు టీ–20 జట్టు ఎంపిక
కరీంనగర్ కల్చరల్: హెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే టీ–20 క్రికెట్ టోర్నమెంట్కు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక పోటీలను గురువారం నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆగంరావు, మురళీధర్రావు తెలిపారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు, రెండు ఫొటోలు, సొంత క్రికెట్ కిట్, యూనిఫాంతో కరీంనగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ గ్రౌండ్లో గురువారం ఉదయం 6.30 గంటలకు హాజరుకావాలన్నారు. 16 నుంచి 28 ఏళ్ల మధ్య వయసువారు అర్హులన్నారు. -
కారు, బైక్ ఎదురెదురుగా ఢీ
ముస్తాబాద్(సిరిసిల్ల): కారు, బైక్ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్కు చెందిన ఈద శ్రీకాంత్, ఆయన కోడలు భాగ్యలక్ష్మి, ఆమె కూతురు లిఖిత బుధవారం ద్విచక్రవాహనంపై సిద్దిపేట వెళ్తున్నారు. కామారెడ్డికి చెందిన ప్రవీణ్ కారులో సిద్దిపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాడు. ముస్తాబాద్ మండలంలోని కామారెడ్డి–సిద్దిపేట ప్రధాన రహదారి బందనకల్ స్టేజీ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో నలుగు రూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగా త్రులను ము స్తాబాద్లోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీ లించి, విచారణ చేపట్టారు. నలుగురికి తీవ్ర గాయాలు -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్ల క్రైం: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో స్వర్ణకార కుటుంబానికి చెందిన చింతోజు రమేశ్(46) స్థానిక కోర్టు ఎదురుగా హార్డ్వేర్ షాపు నిర్వహిస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతినగా ఇప్పటికీ కోలుకోలేదు. వ్యాపారం, కుటుంబం కోసం దాదాపు రూ.20 లక్షల అప్పులు చేశాడు. తాను ఇబ్బందులు పడుతున్నానని.. ఎప్పటికై నా అప్పులు తీర్చాల్సిందేనని.. కానీ, ఎలా తీర్చాలంటూ భార్యకు చెబుతూ బాధ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం అద్దె ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి గమనించిన భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పట్టణ స్వర్ణకారులు, ఇతర వ్యాపారులు అక్కడికి తరలివచ్చారు. రమేశ్ అందరితో కలివిడిగా ఉండేవాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య ఉమ, పదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద చిన్నారుల రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. రమేశ్కు కుటుంబసభ్యులతో ఆస్తి విషయంలో తగాదాలు న్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. -
మట్టి టిప్పర్ల పట్టివేత
సాక్షి, పెద్దపల్లి: అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టి ప్పర్లను బుధవారం పట్టుకున్నట్లు పెద్దపల్లి తహసీ ల్దార్ రాజ్కుమార్ తెలిపారు. అక్రమంగా మట్టి త రలిస్తున్నారని సమాచారం రావడంతో హుటాహుటిన రాఘవాపురం చేరుకొని, పట్టుకున్నామన్నారు. ఆర్డీవో గంగయ్య ఆదేశాల మేరకు టిప్పర్లను సీజ్ చే శామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా మట్టి తీ సుకెళ్తే ఉపేక్షించేది లేదన్నారు. సమగ్ర విచారణ చేప ట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడిరోడ్డుపై ఊడిపోయిన లారీ టైర్లు ● తప్పిన ప్రమాదం వేములవాడ: పట్టణంలోని పాపన్నచౌక్లో బుధవారం బండరాళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ వెనక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మధ్యలో సంఘటన జరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై దిలీప్ అక్కడికి చేరుకొని, వాహనాలను పంపించారు. మరమ్మతు అనంతరం లారీ వెళ్లిపోయింది. అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన కారు రామగుండం: అంతర్గాం నుంచి రామగుండం వైపు బుధవారం తెల్లవారుజా మున వేగంగా వస్తు న్న ఓ కారు పెద్దంపే ట రైల్వేగేటు సమీప మూలమలుపు వద్ద అదుపుతప్పి, పొదల్లోకి దూసుకెళ్లింది. వాహనంలో ఎల్ఐ సీ అధికారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కారు ను రోడ్డుపైకి చేర్చేందుకు సహాయం చేశామన్నారు. పిచ్చికుక్కల దాడిలో నలుగురికి గాయాలు వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం పిచ్చికుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. బాధితులు గొడుగు మహనీత్, ఇస్కిల్ల ఎల్ల వ్వ, సామల్ల అంజ య్య, భూత శ్రీకాంత్లను స్థానికులు సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోగొట్టుకున్న డబ్బులు అప్పగింతసారంగాపూర్(జగిత్యాల): ఓ మహిళ తన డబ్బులు పోగొట్టుకోగా పోలీసులు గుర్తించి, అప్పగించారు. వారి వివరాల ప్రకారం.. జగిత్యాల టవర్సర్కిల్ ప్రాంతంలో మామిడి పండ్లు విక్రయించే మహిళ బుధవారం రూ.4,700 పోగొట్టుకుంది. ట్రాఫిక్ పోలీస్ లక్ష్మీనారాయణ సీసీ కెమెరాలు పరిశీలించి, డబ్బులు దొరికిన వ్యక్తిని గుర్తించారు. అతని నుంచి స్వాధీనం చేసుకొని, బాధితురాలకి అందజేశారు. -
‘ఫసల్ బీమా’పై అవగాహన కల్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో ఈ పథకంపై ఉమ్మడి జిల్లా వ్యవసాయ, జిల్లా ముఖ్య ప్రణాళిక, ఉద్యానవన అధికారులు, ప్రోగ్రెసివ్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన ద్వారా పరిహారం అందుతుందని పేర్కొన్నారు. అన్నదాతలు బీమా చెల్లించే అవసరం లేదని, ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయన్నారు. అధికారులు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటూ సూచనలు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయం, సాగులో ఆధునాతన పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. జేడీఏ బాలునాయక్ ఫసల్ బీమా యోజనపై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్లు మమత, ప్రతిభ, భూంరెడ్డి దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా సీపీవోలు కొమురయ్య, పీబీ.శ్రీనివాస్, పూర్ణచందర్రావు, షబానా సుల్తానా, ఉద్యానవన అధికారులు శ్రీనివాస్, జ్యోతి, ప్రతాప్సింగ్, జగన్మోహన్రెడ్డి, ఆయా జిల్లాల వ్యవసాయ అధికా రులు శ్రీనివాస్, ఆదిరెడ్డి, భాస్కర్, వాణి, ఏడీఏ లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంకు సందర్శన కరీంనగర్ కేడీసీసీ బ్యాంకును కలెక్టర్ పమేలా సత్ప తి సందర్శించారు. బ్యాంకు, పీఏసీఎస్ల పనితీరు తెలుసుకున్నారు. ఈ బ్యాంకు దేశంలోనే రోల్ మో డల్గా నిలిచిందని సీఈవో సత్యనారాయణ కలెక్టర్కు వివరించారు. చొప్పదండి పీఏసీఎస్ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందన్నారు. జీఎంలు ప్రభాకర్ రెడ్డి, ఉషశ్రీ, పీఏసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ రి సోర్స్పర్సన్ సత్యనారాయణ తదితరులున్నారు. పంటల వివరాలు పక్కాగా నమోదు చేయాలి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి -
చోరీ కేసులో ఒకరి అరెస్టు
ఖలీల్వాడి(నిజామాబాద్): నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ ఠాణా పరిధిలోని షిర్డీ సాయినగర్లో చోరీకి పాల్పడిన ఒకరిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి సీఐ విజయ్బాబు తెలిపారు. ఈ నెల 4న మధ్యాహ్నం షిర్డీ సాయినగర్కు చెందిన దాచ మధుసూదన్ ఇంట్లో పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మ ండలం మడిపల్లికి చెందిన శివకుమార్ రెండున్నర తులాల బంగారం, కిలో వెండి చోరీ చేశాడు. బుధవారం నిజామాబాద్ బస్టాండ్లో అతన్ని అదుపులో కి తీసుకొని, విచారించగా నేరం ఒప్పుకున్నాడు. శివకుమార్ను రిమాండ్ చేశామని, అతనికి విజ య్కుమార్ సహకరించినట్లు సీఐ తెలిపారు. -
కొనుగోలు కేంద్రం ఇన్చార్జిపై లారీడ్రైవర్ దాడి
ధర్మారం(ధర్మపురి): మండలంలోని సాయంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి తిరుపతిపై ఓ లారీడ్రైవర్ దాడి చేసి, గాయపరిచాడు. బాధితుడు, రైతుల వివరాల ప్రకారం.. సాయంపేట కొనుగోలు కేంద్రంలో ప్రతీరోజు తూకం వేస్తున్న వరి ధాన్యాన్ని ఒకే ఒక్క లారీ మిల్లుకు తరలిస్తోంది. అకాల వర్షాలు కురుస్తుండటంతో మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ఆదేశాల మేరకు కేంద్రం ఇన్చార్జి తిరుపతి అదనంగా మరో లారీని రప్పించి, ధాన్యం బస్తాలను మిల్లుకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రెగ్యులర్గా బస్తాలను తరలించే లారీ కేంద్రానికి చేరుకుంది. డ్రైవర్ తాను వస్తున్నాను కదా.. మరో లారీని ఎందుకు తీసుకువచ్చారని ఆయనతో గొడవ పడి, దాడి చేశాడు. విండో చైర్మన్తోపాటు సంబంధిత జిల్లా అధికారుల ఆదేశాల మేరకే అదనంగా లారీని ఏర్పాటు చేసినట్లు చెప్పినా వినిపించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్సై సత్యనారాయణకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు -
చెరువుల్లో కలుస్తున్న ప్రాణాలు
● చేపల వేట, ఈతకు వెళ్తూ.. అనంతలోకాలకు ● కరెంట్షాక్ పెట్టడం, లోతు తెలియకే ప్రమాదాలు ● రోడ్డున పడుతున్న కుటుంబాలు ● రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఏడాదిలో 23 మంది మృతి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చేపల వేటకు వెళ్లి కొందరు, సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మరికొందరు.. చెరువుల్లో దిగి, ప్రాణాలు కోల్పోతున్నారు. లోతు తెలియకపోవడం, ఎక్కువ చేపలు పట్టాలన్న ఆశతో వలలకు బదులుగా విద్యుత్షాక్ పెట్టడం ప్రాణాలమీదుకు తెస్తోంది. చేపల కూర కోసం విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఏడాది కాలంలో 23 మంది చెరువుల్లో మునిగి, కరెంట్షాక్తో చేపలు పడుతూ మృతిచెందారు. ఒక్క ఎల్లారెడ్డిపేట మండలంలోనే ఈ నెల రోజుల్లో ఐదుగురు చనిపోయారు. చేపలు పట్టేందుకు కరెంట్షాక్.. జిల్లాలో ఇటీవల కరెంట్షాక్తో చేపలు పట్టడం అలవాటుగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టేందుకు ఇలా చేస్తున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చెరువుల సమీపంలోని స్టార్టర్ల వద్ద ఫ్యూజులకు విద్యుత్ తీగలను తగిలించి, మరోవైపు కర్రలకు వాటిని కర్రలకు చుట్టి, నీళ్లలో వదులుతున్నారు. విద్యుత్షాక్కు గురై, నీటిలో తేలిన చేపలను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఆ సమయంలో కర్రలకు చుట్టిన కరెంట్ తీగలు జారిపోయి, మీద పడుతున్నాయి. సదరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురైన విషయం స్టార్టర్ల వద్ద ఉన్నవారికి తెలియకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో చేపలు పట్టినా.. వారు సంపాదించే మొత్తం రూ.1,000 మించడం లేదు. విద్యుత్షాక్లతో చేపలు పట్టవద్దని అధికారులు అవగాహన కల్పించకపోవడంతో చాలామంది చనిపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో నెల రోజుల్లో ఐదుగురు.. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిర్యాల్కార్ సాయి తన మేక చెరువులోని గుంతలో పడటంతో కాపాడేందుకు వెళ్లి, మృతిచెందాడు. ● సింగారం గ్రామంలో ముత్యాల బాలకృష్ణ విద్యుత్షాక్తో చేపలు పడుతూ చెక్డ్యామ్లో పడి, ప్రాణాలు కోల్పోయాడు. ● రాచర్లగొల్లపల్లికి చెందిన అలకుంట రాజు చేపలు పట్టేందుకు కొత్తకుంట చెరువుకు వెళ్లి, కరెంట్షాక్తో చనిపోయాడు. ● రాచర్లబొప్పాపూర్కు చెందిన నిరుద్యోగి లవన్కుమార్ గ్రామ శివారులోని జక్కుల చెరువులో పడి మృతిచెందాడు. ● రాచర్లబొప్పాపూర్కు చెందిన తమ్మనవేని దేవరాజు చేపలు పట్టేందుకు వెళ్లి, చెరువులోని ఊబిలో చిక్కుకొని, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన ముత్యాల బాలకృష్ణ భార్యాపిల్లలు. ఈ నెల 9వ తేదీన బాలకృష్ణ తన ఇద్దరు మిత్రులతో కలిసి చేపలు పట్టేందుకు మానేరు వాగుకు వెళ్లాడు. వలలతో కాకుండా విద్యుత్షాక్ ద్వారా చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో కర్రకు చుట్టిన కరెంట్ తీగ ఊడిపోయి, అతనిపై పడటంతో విద్యుదాఘాతం సంభవించి, అక్కడికక్కడే మృతిచెందాడు. బాలకృష్ణ మృతితో కుటుంబం రోడ్డున పడింది. ముగ్గురు చిన్నారులతో అతని భార్య కావ్య దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒక్క బాలకృష్ణ కాదు.. ఏడాది కాలంలో చేపల వేట, ఈతకు వెళ్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలువురు ఇలాగే చనిపోయి, తమ కుటుంబసభ్యులను దిక్కులేనివారిని చేశారు. కరెంట్షాక్ పెట్టొద్దు.. చెరువుల్లో కరెంట్షాక్ పెట్టి, చేపలు పట్టొద్దు. అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వందల రూపాయల విలువ చేసే చేపల కోసం చెరువుల్లోకి దిగి, అనేక మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల విద్యుత్షాక్ ద్వారా చేపలు పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశాం. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట -
పోలీసులకు సవాల్గా రాయికల్ చోరీ కేసు
రాయికల్(జగిత్యాల): రాయికల్కు చెందిన బుడికె విజయలక్ష్మి ఇంట్లో మంగళవారం 40 తులాల బంగారం, రూ.లక్ష చోరీకి గురైన కేసు పోలీసులకు సవాల్గా మారింది. జగిత్యాల ఎస్బీ డీఎస్పీ రవీందర్, రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్, పోలీసు సిబ్బంది బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్లి, విచారణ చేపట్టారు. దుండగులు తాళం పగులగొట్టిన విధానం చూస్తుంటే ఆధారాలు దొరకకుండా చేతికి గ్లౌజులు వేసుకున్నారని, ఇంటి ముందు నుంచి కాకుండా వెనక నుంచి వచ్చి, తాళాలు పగులగొట్టినట్లు అంచనా వేశారు. డాగ్స్క్వాడ్ సైతం గేటు వెనక నుంచి మసీదు.. ఇటిక్యాల అడ్డరోడ్డు వరకు వెళ్లి, ఆగిపోయింది. ఈ దారిలో సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆలయానికిచ్చిన ఆవు, దూడ విక్రయం
చందుర్తి(వేములవాడ): దేవాదాయశాఖ పరిధిలోని ఆలయ ఆదాయాన్ని పూజారి, ఒగ్గు కళాకారులు కలిసి, స్వాహా చేస్తున్నారని చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి వివరాల ప్రకారం.. నర్సింగాపూర్లోని శ్రీమోహినకుంట మల్లికార్జునస్వామి ఆలయానికి ఓ భక్తుడు ఆవు, దూడను కానుకగా ఇచ్చాడు. అయితే, పూజారి, ఒగ్గు కళాకారులు కలిసి, వాటిని రూ.46,500కు విక్రయించారని తెలిసి, స్థానికులు పోలీసుల వద్దకు వెళ్లారు. వారు పూజారి, ఒగ్గు కళాకారులను పిలిపించి, ప్రశ్నించడంతో ఆవు, దూడను పోషించే స్థోమత లేక విక్రయించామని తెలిపారు. కొత్త ఆవును కొనుగోలు చేసి, ఆలయానికి అప్పగిస్తామని ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా, దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ ఆదాయాన్ని కూడా పూజారి సొంతానికి వాడుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై పూజారి భద్రయ్యను వివరణ కోరగా వారు తనపై కక్షగట్టి, ఇలా మాట్లాడుతున్నారని, ఆవును మాత్రం ఒగ్గు కళాకారులకు అప్పగిస్తే విక్రయించారని పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయించిన గ్రామస్తులు -
మట్టిపెళ్లలు కూలి ఉపాధి కూలీ మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో మంగళవారం మట్టిపెళ్లలు కూలి ఉపాధిహామీ కూలీ ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలోని కేశవరావుకుంటలో కొన్నిరోజులుగా ఉపాధిహామీలో భాగంగా మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయి. మంగళవారం 190 మంది కూలీలు పనులకు వెళ్లారు. ట్రాక్టర్లో మట్టిని నింపి పంపించి, మరో ట్రాక్టర్ రావడానికి ఐదు నిమిషాల సమయం పడుతుందని భావించి ఎండ నుంచి రక్షణకు కట్టకిందకు వెళ్లి నిల్చున్నారు. ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలిపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న తోటి కూలీలు హుటాహుటిన పరుగెత్తుకొని వచ్చి మట్టిపెళ్లల్లో చిక్కుకున్న కూలీలను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో కర్నాల లహరి, కర్నాల శ్యామల, మారుపాక రాజవ్వ తీవ్రంగా గాయపడగా, పల్లం దేవవ్వ, ఎడ్ల రామవ్వ, వడ్నాల అమృత, సందు చంద్రయ్య స్వల్పంగా గాయపడ్డారు. వీరిని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి చేరేలోపే మారుపాక రాజవ్వ మృతిచెందింది. మరో ఆరుగురికి గాయాలు -
రియల్టర్ ఆత్మహత్య
చొప్పదండి: మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన రియల్టర్ బైరగోని ఆనందం(47) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం.. ఆనందం తనకున్న భూమి అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. ఆరు నెలలుగా వ్యాపారం నడవకపోవడంతో అప్పులు పెరిగాయి. వాటిని తీర్చే దారి కనిపించకపోవడంతో మంగళవారం వేకువజామున ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రమ, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిరిసిల్లలో విద్యార్థి..సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన గోతం చందు(17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు స్నేహితులు తెలిపిన వివరా లు.. ఇటీవల పదో తరగతి పాౖ సెన చందు ఇంటర్ చదివేందుకు కరీంనగర్లోని ఓ కాలేజీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. కానీ సదరు కాలేజీలో చేరేందుకు తనకు ఇష్టంలేదని స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు మల్లాపూర్(కోరుట్ల): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ము త్యంపేటలో మంగళవారం పిచ్చికుక్క ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. స్థాని కుల వివరాలు.. గ్రా మానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు వాకిటి గంగవ్వ ఇంట్లో పడుకొని ఉండగా పిచ్చికుక్క ఒక్కసారిగా ఆమైపెకి దూకి ముఖంపై కరవడంతో తీవ్రంగా గాయపడింది. వృద్ధురాలి అరుపులకు సమీప ఇళ్లలోనివారు రావడంతో అక్కడి నుంచి పిచ్చికుక్క పరిగెడుతూ అడ్డుగా వచ్చిన మరో మహిళ రాజశ్రీని కరిచింది. తీవ్రంగా గాయపడిన గంగవ్వను మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పిచ్చి కుక్కలను పట్టుకోవాలని స్థానికులు కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement