-
పథకాలను పరిశీలిస్తూ.. వివరాలు తెలుసుకుంటూ..
భూపాలపల్లి రూరల్/కాటారం/కాళేశ్వరం/రేగొండ: కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సభ్యులు రెండోరోజు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు హెల్త్ సెంటర్ను బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. అనంతరం హెల్త్సెంటర్ను పరిశీలించారు. కాటారం మండలం గంగారం పంచాయతీ కార్యదర్శి బీరెళ్లి కరుణాకర్తో పాటు ఇతర గ్రామస్థాయి అధికారులతో కలిసి బృందం సభ్యులు గ్రామంలో అభివృద్ధి, పల్లెప్రగతి పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ, కంపోస్ట్ తయారీ విధానం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, గ్రామపంచాయతీకి సమకూరే ఆదాయంపై ఆరా తీశారు. డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంను పరిశీలించారు. రోజు వారి వైద్య సేవలు, మాతా శిశు సంరక్షణ సేవలు, చిన్న పిల్లలకు అందజేసే వ్యాధుల నివారణ టీకాలు, బీపీ, షుగర్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకునే చర్యలు, ఆశ కార్యకర్తల సేవల గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలు తదితర అంశాలను పరిశీలించారు. బృందంలో హిమాన్షు టైలర్, నిషాన్సింగ్, నీరజ్కుమార్, వివేక్కుమార్ చౌదరి, అరుణ్కుమార్ ఉన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అంకిత్గుప్త, సాహిల్, రిత్విక్, అన్సల్జైన్, అధిత్సోనీ బృందం పర్యటించింది. కాళేశ్వరాలయంలో పూజలు చేశారు. వైకుంఠదామం, సెగ్రిగేషన్షెడ్లు, నర్సరీలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలను పరిశీలించారు. రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో అంకిత్ కుమార్, శ్రేయ, పియూష్ కుమార్, రాహుల్ అరోరా, మేఘన, విజయలక్ష్మి, దుబే బృందం పర్యటించింది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను పరిశీలించి పిల్లలకు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తెలుసుకున్నారు. వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, నర్సరీని పరిశీలించారు. ఉపాధి కూలీల వివరాలు తెలుసుకున్నారు. రెండోరోజు అధికారుల పర్యటన -
పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 27న నిర్వహించే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. ఎన్నికలో విధులు నిర్వహించే నోడల్ అధికారులు, పోలీస్, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రూట్ అధికారులు, సెక్టార్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల నిర్వహణపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 52మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 12,535మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందుకోసం 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ సక్రమంగా నిర్వహించుటలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓల విధులు చాలా కీలకమని అన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికలో 19మంది పీఓలు, 19మంది ఏపీఓలు, 38మంది ఓపీఓలకు విధులు కేటాయించామన్నారు. పొరపాట్లుకు తావులేకుండా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 23వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగానికి సమయం కేటాయించామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది శిక్షణ నోడల్ అధికారులు అవినాష్, శామ్యూల్, ఆర్డీఓ మంగీలాల్, డీఎస్పీ సంపత్రావు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
మహాముత్తారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది పనితీరుపై వైద్యాధికారి సందీప్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీదేవి, ఉమాదేవి, ప్రమోద్, సీహెచ్ఓ విద్యాసాగర్, వైద్యసిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కీం కింద 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లితండ్రుల సంవత్సర ఆదాయం గ్రామాల వారికి రూ.1.50 లక్షలలోపు, పట్టణాల వారికి రూ.2లక్షల లోపు ఉండాలన్నారు. విద్యార్థులను డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారని చెప్పారు. దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో నేటినుంచి జూన్ 6వ తేదీ వరకు చేసుకోవాలన్నారు. అన్నారం బ్యారేజీ వద్ద తనిఖీలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీ వద్ద ఎస్సై భవానిసేన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు వచ్చి వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేనివారికి జరిమానా విదించారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ఇసుక లారీల పట్టివేతకాటారం: అనుమతులు లేకుండా మహదేవపూర్ మండలం అన్నారం క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్న రెండు లారీలను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంగారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఇసుక లారీ డ్రైవర్ పోలీసులను గమనించి అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. మరో లారీ అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నారు. లారీ డ్రైవర్ గంధమల్ల మధుతో పాటు లారీ ఓనర్ గోవర్దన్పై కేసు నమోదు చేశారు. మరో లారీ డ్రైవర్, యజమాని వివరాలు తెలియలేదని ఎస్సై పేర్కొన్నారు. మూడు లారీలకు జరిమానా.. మహదేవపూర్ మండలం అన్నారం ఇసుక క్వారీ నుంచి ఓవర్లోడ్తో ఇసుక తరలిస్తున్న మూడు లారీలను మంగళవారం అర్ధరాత్రి పట్టుకొని జరిమానా విధించినట్లు ఆర్టీఓ సంధాన్ తెలిపారు. ఇసుక లారీలు ఓవర్లోడ్తో వెళ్తున్నాయనే సమాచారం మేరకు దాడులు చేసి మూడు ఓవర్లోడ్ లారీలను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తునికాకు కూలీలపై తేనెటీగల దాడి ఎస్ఎస్తాడ్వాయి: అడవిలోకి తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు మంగళవారం దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన కూలీలు ఆకు సేకరణకు ట్రాక్టర్లో సుమారుగా 40 మంది కూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆకు సేకరించి ట్రాక్టర్ దగ్గరకు వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేయగా కూలీలు అడవిలో పరిగెత్తారు. మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఈ తేనెటీగల దాడిలో సుమారుగా 15మంది కూలీలు గాయపడ్డారు. అటవీశాఖ అధికారులు, తునికాకు కాంట్రాక్టర్ గాయపడిన కూలీలకు వైద్య ఖర్చులు చెల్లించాలని కోరుతున్నారు. -
సాగుకు సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సారి వానాకాలంలో 2,48,270 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి, మిర్చి, వరికి ప్రాధాన్యత ఇచ్చారు. పంటల అంచనాకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో గతేడాది 91,510 ఎకరాల్లో పత్తి, 24,360 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 1,01,500 ఎకరాల్లో పత్తి, 25,800 ఎకరాల్లో మిర్చి సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి విత్తనాల ప్యాకెట్లను ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది మొదట్లో మిర్చితో పాటు పత్తికి అనుకూలమైన ధర పలికింది. పెద్దమొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతోనే రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఎరువులు, విత్తనాల అంచనా.. జిల్లాలో 2,48,270 ఎకరాల సాగుకు గాను 36,203 టన్నుల యూరియా, 11,511 టన్నుల డీఏపీ, 11,511 టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో పాటు 6,444 టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాగుకు వరి, పత్తి తదితర విత్తనాలను డిమాండ్ మేర సరఫరా చేస్తామని అధికారులు చెపుతున్నారు. 2,29,470 క్వింటాల విత్తనాలు కావాల్సి ఉండగా 10,556 క్వింటాల విత్తనాలు రైతుల దగ్గర ఉన్నాయని, 2,18,913 క్వింటాలు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఏది.. జిల్లాలో చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు జిల్లాలో పండించడం లేదు. ఐదేళ్ల క్రితం మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో ఆత్మ పథకం ద్వారా పరిమితంగా రైతులు సజ్జలు, కొర్రలు పండించారు. ఈ సారి చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం లేనట్లే ఉంది. అవగాహన కార్యక్రమాలేవి.. నాసిరకం విత్తనాలు, సేంద్రియ వ్యవసాయంపై రైతు చైతన్య యాత్రల పేరిట గతంలో మే నెలలో రైతులకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించేవారు. నాలుగేళ్లుగా అవగహన కల్పించడం లేదు. విత్తనాలు, ఎరువులు సిద్ధం విత్తనాలు, ఎరువులు డిమాండ్ మేర సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటాం. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు, మందులు కోనుగోలు చేయాలి. భూసారాన్ని పెంచుకునేందుకు వీలుగా జీలుగ విత్తనాలు జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు జీలుగ విత్తనాలను చల్లి భూసారాన్ని పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి. – విజయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిసాగు అంచనా (ఎకరాల్లో) పంట గతేడాది ప్రస్తుతం అంచనా వరి 1,10,899 1,05,000 పత్తి 91,510 1,01,500 మిర్చి 24360 25,800 మొక్కజొన్న 93 250 పెసర 116 250 కంది 57 20 మినుము 11 350 వేరుశనగ 00 50 ఆయిల్పామ్ 3,186 6,500 ఇతర పంటలు 12,961 8,550 2,48,270 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు పత్తి, మిర్చి, వరికి ప్రాధాన్యం పంటలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అవగాహన సదస్సులు కరువు -
పథకాలపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలపై అసిస్టెంట్ సెక్షన్ అధికారులు సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఐదు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన 27 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్టచివరి ఇంటిని కూడా పరిశీలించి క్షేత్రస్థాయిలో ప్రజల జీవన విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. గ్రామస్థాయి పర్యటన భవిష్యత్ ఉద్యోగ జీవితానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవలో మంచి ఉద్యోగులుగా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఉత్తర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి చాలా వ్యత్యాసం ఉంటుందని.. గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం కాబట్టి ప్రజల జీవన విధానంపై అవగాహన కలిగి ఉండాలని సెక్షన్ అధికారులకు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం జిల్లాలో పర్యటిస్తుందని, పర్యటనలో భాగంగా గ్రామాల్లో బస చేయాల్సి ఉన్నందున లోటుపాట్లు రాకుండా పర్యవేక్షణ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. 27మంది అధికారులు ఐదు రోజుల పాటు గణపురం మండలంలోని చెల్పూరు, రేగొండ మండలంలోని కొడవటంచ, కాటారం మండలంలోని గంగారం, మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. అదే గ్రామాల్లో అధికారులు బస చేయాల్సి ఉంటుందని, సౌకర్యాలు కల్పనలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ప్రజల జీవన విధానం, పంటలు, ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు వారి జీవన ప్రమాణాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ మేనేజర్ కుమారస్వామి, సీపీఓ శామ్యూల్, డీఆర్డీఓ నరేష్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 15 దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాకు 27మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు -
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఉండవద్దని.. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు లేనట్లు గుర్తించామని, 61 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. రెండు పాఠశాలల్లో మైనర్ మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణానికి 42 మరుగుదొడ్లు అనుమతులు మంజూరు చేశామని.. నెల రోజుల్లో మొత్తం పూర్తిచేయాలని ఆదేశించారు. మరుగుదొడ్డి లేని పాఠశాలలు ఉండొద్దని.. చాలా ప్రాధాన్యమైన అంశమని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ని పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందో చెప్పాలని డీఈఓను అడుగగా సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేవన్న సమాచారం కూడా లేకపోతే ఎలా అని అసంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరగాలని ప్రతి రోజు డీఆర్డీఓ సిబ్బంది టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మంగళవారం వరకు డిజైన్లు అందచేయాలని పంచాయతీరాజ్ ఈఈని సూచించారు. మరుగుదొడ్లు ఎన్ని నిర్మించాల్సి ఉందో నివేదికలు అందచేయాలని డీఈఓను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోతే అందుకు బాధ్యులు డీఈఓ అవుతారని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ నరేష్, డీఈఓ రాంకుమార్, పీఆర్ ఈఈ దిలీప్ పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ భవేష్మిశ్రా డీఈఓపై ఆగ్రహం -
సింగరేణి సీఎండీకి వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సోమవారం సింగరేణి ఇన్చార్జ్ సీఎండీ బలరాంనాయక్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వవద్దని.. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు చేయాలని.. అసంఘటిత రంగ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య, నాయకులు రమేష్, కిరణ్, కుమారస్వామి, సత్యం, కనకయ్య పాల్గొన్నారు. -
ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 13మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసు పరిధిలోని ప్రతీ అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
నిరుద్యోగులను ముంచిన బీఆర్ఎస్
● కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భూపాలపల్లిరూరల్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచింది కేసీఆర్ ప్రభుత్వమేనని నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదలకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
ఓరుగల్లు మాణిక్యాలు
మధ్య తరగతి కుటుంబంలో విద్యా కుసుమాలు వికసించాయి. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈఏపీసెట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో మెరుగైన ర్యాంకులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన శ్రీవర్షిణి రాష్ట్రస్థాయిలో (అగ్రికల్చర్, ఫార్మసీ) 3వ ర్యాంకు, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం మణితేజ 9వ ర్యాంకు (ఇంజనీరింగ్) సాధించారు. – స్టేషన్ఘన్పూర్/హన్మకొండ చౌరస్తాఈఏపీసెట్లో మనోళ్లకు స్టేట్ ర్యాంక్లు ● అగ్రికల్చర్, ఫార్మసీలో శ్రీవర్షిణికి 3వ ర్యాంక్ ● ఇంజనీరింగ్లో కొంతం మణితేజకు 9వ ర్యాంక్ ● తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చిన విద్యార్థులు ● అభినందనలతో ముంచెత్తిన స్థానికులు, బంధువులు -
గ్రూప్–1 నిర్వహణకు సన్నద్ధం కావాలి
● వీసీలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి భూపాలపల్లి: జూన్ 9న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ –1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్లు సన్నద్ధం కావాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రీజనల్ కో ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఐడీఓసీ నుంచి ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి చైర్మన్ మహేందర్రెడ్డి పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 4,473 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. అభ్యర్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పోలీసుశాఖ నుంచి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారన్నారు. స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేస్తామని, పోలీసు భద్రత మధ్య ప్రశ్నపత్రాలను తరలిస్తామన్నారు. ఈ వీసీలో రీజినల్ కో ఆర్డినేటర్ శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
స్కూల్ స్థాయి నుంచి టాపరే..
హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రికల్చర్, ఫార్మసీలో (హాల్ టికెట్ నంబర్ 2411ఆర్09048, మార్కులు 145.255026) రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి అంతంత మాత్రంగానే తెలిసిన శ్రీవర్షిణి సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించడంతో కాలనీవాసుల అభినందనలతో తల్లిదండ్రులు మురిసిపోయారు. గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె శ్రీవర్షిణి, కుమారుడు ఫణితేజ. ఫణితేజ కర్ణాటకలోని ధార్వాడలో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కన్నయ్య ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లావణ్య గృహిణి. శ్రీవర్షిణి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి 10/10 మార్కులు సాధించింది. హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడిఝెట్ చదివి 987 మార్కులు తెచ్చుకుంది. శ్రీవర్షిణి ఇటీవల నీట్ రాసింది. అందులోనూ 200లోపు ర్యాంక్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. -
పిల్లల చదువు కోసమే హైదరాబాద్కు..
ఊళ్లో సరైన పని దొరకలేదు. జీవనోపాధి కోసం, పిల్లల చదువుల కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాం. నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య మిషన్ కుడుతోంది. మణితేజ, కుమార్తె మానసను కష్టపడి చదివిస్తున్నాం. మణితేజకు పదో తరగతిలో అనుకున్నన్ని మార్కులు రాలేదు. చదువు విలువను తెలిపి పిల్లలను మోటివేట్ చేశాం. ఐదేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్ బాగుంటుందని చెప్పేవాళ్లం. ఈఏపీసెట్లో 9వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. – కొంతం వేణుగోపాల్ (మణితేజ తండ్రి) -
తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లిది కుట్టు పని
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. వేణుగోపాల్ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్ హైదరాబాద్ కూకట్పల్లి ఎస్ఆర్ శ్రీగాయత్రి కళాశాలలో ఎంపీసీ చదివాడు. ఇంటర్లో 715 మార్కులు సాధించాడు. కాగా ఈఏపీసెట్లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్ ర్యాంక్ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. -
టీఎస్ను టీజీగా మార్చాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం భూపాలపల్లి: పీఎస్యూ, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లలో టీఎస్కు బదులుగా టీజీగా మార్చాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రివియేషన్స్ సూచించే టీఎస్ స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిందన్నారు. మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుమతులు రాగా, తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పీఎస్యులు, ఏజెన్సీల పేర్ల ముందు టీఎస్కు బదులు టీజీగా మార్చాలన్నారు. ఉదాహరణకు టీఎస్ఎన్పీడీసీఎల్ పేరును ఇక నుంచి టీజీఎన్పీడీసీఎల్, టీఎస్ఆర్టీసీ పేరును టీజీ ఆర్టీసీగా మార్చాలన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం సర్క్యూలర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. లెటర్ హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్, పాలసీ పేపర్లు, జీఓలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లు అన్నింటిపై టీజీగా మార్చాలన్నారు. ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని, ఆ నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీభూపాలపల్లి అర్బన్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిజిస్ట్రేషన్ ఆధారిత రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ వాయు (సింగీతకారుడు) ఆవివాహిత భారతీయ పురుషులు, సీ్త్రలు కాన్పూర్లోని 3 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లో, 7 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, బెంగళూర్లో దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) ఇంటెక్ 2025 రిక్రూట్మెంట్ కోసం జాబ్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్మాణ పనులు అడ్డగింతకాటారం: మండల కేంద్రంలోని మహదేవపూర్ వైపుగా ఆర్టీసీ సంస్థ, ఇతరుల మధ్య కొనసాగుతున్న వివాద భూమిలో చేపడుతున్న నిర్మాణాలను శనివారం ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. వరంగల్ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది భూమి వద్దకు చేరుకొని పనులు నిలిపివేయాలని సూచించారు. దీంతో సదరు భూమికి సంబంధించిన పలువురు ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు కోర్టు ఆర్డర్ ఉందని ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు చేపట్టుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులకు తెలిపారు. భూమికి సంబంధించిన హద్దులు, పూర్తి వివరాలు తేలే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆర్టీసీ అధికారులు నిర్మాణదారులకు సూచించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు జరగగా చివరకు ఇరువర్గాలు పోలీస్స్టేషన్కు వెళ్లారు. వివాదాస్పద భూమిలో కాకుండా మిగిలిన భూమిలో నిర్మాణాలు చేపట్టుకోవాలని సీఐ, ఎస్సై నిర్మాణదారులకు తెలిపారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున అది తేలే వరకు ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వద్దని పేర్కొన్నారు. డిప్యూటీ ఆర్ఎం వెంట భూపాలపల్లి డీఎం లక్ష్మినారాయణ, ఆర్టీసీ ఎస్సై శ్రీనివాస్, విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం సిబ్బంది ఉన్నారు. సదరం క్యాంపునకు 119మంది హాజరుభూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని శనివారం 100 పడకల ఆస్పత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు 119 మంది దివ్యాంగులు హాజరైనట్లు డీఆర్డీఓ నరేష్ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో జరిగిన సదరం క్యాంపునకు హాజరైన వారిలో ఆర్థో 55 మంది, వినికిడి లోపం ఉన్నవారు 18, మానసిక దివ్యాంగులు 23, విజబుల్ ఇన్పాక్ట్ కలిగినవారు 23 మంది హాజరయ్యారని, వారికి అర్హత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం తన చాంబర్లో విద్య, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, సమాచార, మున్సిపల్, విద్యుత్, వైద్య, రవాణా, పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,015 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 426 మంది, మొత్తం 1,441మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రూట్ల వారీగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంచాల ని, తాగునీరు, గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం ఉండవద్దన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దేవరాజం, డీఈఓ రాంకుమార్, డీపీఓ నారాయణరావు, డీఎంహెచ్ఓ మధుసూద న్, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు -
పనులను వేగిరం చేయాలి
భూపాలపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ భవేష్మిశ్రా ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతి, గ్రామాల్లో తాగునీటి సమస్య అంశాలపై అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు, ఏంఈఓలతో సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ మొదటి వారం లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు నిఘా పెంచాలన్నారు. నాణ్యమైన మెటీరియల్ వాడుతూ పనులను పూర్తి చేయాలని చెప్పారు. మెటీరియల్ కొనుగోలు, లేబర్ ఖర్చులు తదితర వివరాలకు సంబంధించి రిజిస్టర్ మెయింటెన్ చేయాలన్నారు. పూర్తిస్థాయిలో పనులు జరిగిన తరువాత మాత్రమే కాంట్రాక్టర్కు డబ్బు ఇవ్వాలని చెప్పారు. పాఠశాలలో జరిగే పనులకు ఇసుకను సమకూర్చడానికి సంబంధిత పంచాయతీరాజ్ అధికారులతో అంచనాలు తీసుకుని తనకు నివేదిక పంపితే సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చి ఇసుకను ఉచితంగా అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీరోజు నీరు అందించాలన్నారు. పైపులైన్ల లీకేజీలు, ఇతరత్రా సమస్యలు ఏర్పడితే ముందుగానే గ్రామస్తులకు తెలియజేయాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి డీపీఓ నారాయణరావు, డీఈఓ రాంకుమార్ పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలి.. సీఎస్ శాంతికుమారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో శుక్రవారం సచివాలయం నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 117 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 16,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకనూ దాదాపు 45 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 13 మిల్లులు ఓపీఎంఎస్ ద్వారా కేటాయించామన్నారు. మిల్లర్లతో ఎలాంటి సమస్య లేదని, ఏజెన్సీతో చర్చించి, తొందరలోనే పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీఓ నారాయణరావు, డీసీఎస్ఓ నర్సింగరావు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు కలెక్టర్ భవేష్మిశ్రా -
దరఖాస్తుల స్వీకరణ
భూపాపల్లి అర్బన్: గ్రూప్–1, సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టును నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిణి శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో నేటి(శనివారం) నుంచి జూన్ 3 తేదీ వరకు గ్రూప్–1 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్కు ఈ నెల 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్కు హాజరయ్యే ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపికకు.. 2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలకు 1వ తరగతిలో 41 సీట్లు, 5వ తరగతిలో 43 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆదర్శ పాఠశాల, వివేకనంద పాఠశాల, సువిద్య పాఠశాల కాటారం, సెయింట్ పీటర్స్ హైస్కూల్ భూపాలపల్లి పాఠశాలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఎంపిక చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లు క్లీన్ చేశారు! కాళేశ్వరం: ప్రభుత్వ ‘లక్ష్యం నిరుపయోగం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో వచ్చిన కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు స్పందించారు. కాళేశ్వరం, కుదురుపల్లి గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లను క్లీన్ చేసి వాడకంలోకి వచ్చేలా చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోగు చేసి ఎరువుల తయారీ ప్రారంభించనున్నారు. జిల్లాలోని పలు పంచాయతీల్లో కూడా క్లీనింగ్ ప్రక్రియ మొదలు కానుందని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. వినియోదారులు సహకరించాలి ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ సాయికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, పత్తిపల్లి నుంచి కాశిందేవిపేట, సబ్ స్టేషన్ పరిధి గ్రామాలలో 33కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతుందని తెలిపారు. నేడు(శనివారం) ఉదయం 7నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులు సహకరించాలని కోరారు. వికసించిన ‘మే’ పుష్పం వాజేడు: అరుదుగా కనిపించే మేడే పుష్పం మండల పరిధిలోని పెద్ద గొళ్లగుడెం గ్రామంలో శుక్రవారం వికసించింది. పెద్ద గొళ్లగూడెం గ్రామానికి చెందిన జెజ్జరి సత్యనారాయణ ఇంట్లో ఈ మే పుష్పాలు కనిపించాయి. -
సైబర్ నేరాలపై జాగ్రత్త అవసరం
భూపాలపల్లి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకొని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలు అనవసర లింక్లు క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పాస్వర్డ్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ–మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దన్నారు. గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు. లాటరీలు, బ్యాంకుల రివార్డు పేరిట, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు.ఎస్పీ కిరణ్ఖరే -
భూములు ఇవ్వం..
మొగుళ్లపల్లి: న్యూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇవ్వబోమని మొగుళ్లపల్లి మండల బాధిత రైతులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులతో ఆర్డీఓ మంగీలాల్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటుచేశారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. దీంతో తాము భూములు ఇవ్వబోమని రైతులు సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ రేటు ప్రకారం భూములకు ధరలు నిర్ణయించడం రైతులను మోసం చేయడమేనన్నారు. భూమికి బదులు భూమి ఇప్పించాలని రైతులు కోరారు. బలవంతంగా రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ సునీత, ఎస్సై అశోక్ ఆర్ఐ సురేందర్రెడ్డి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. తమ భూములు ఇవ్వబోమని, సర్వే ఆపాలంటూ రైతులు ఆర్డీఓకు వినతిపత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
తీరని నష్టం
భూపాలపల్లి రూరల్/కాటారం/మల్హర్/గణపురం/కాళేశ్వరం/రేగొండ: రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. భూపాలపల్లి మండలంలో గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి కమలాపూర్, నాగారం, నందిగామ, గొర్లవీడులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మల్హర్ మండలం తాడిచర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కొయ్యూరులో ధాన్యం తడిసింది. వరద నీరు కుప్పల కిందికి చేరింది. గాలివాన బీభత్సానికి మల్లారం శివారులోని పొలంలో నిర్మించుకున్న షెడ్డు రేకులు ఎగిరిపోయాయి. గణపురం మండలం నగరంపల్లిలో వరిపంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కాటారం మండలంలో రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. పలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై, పొలాల్లో, కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. రంగయ్యపల్లిలో వర్షానికి వరి పంట నేలకొరిగింది. మహదేవపూర్ మండలం మెట్పల్లిలో కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. శుక్రవారం వర్షపాతం వివరాలు (మి.మీ) మహదేవపూర్ 20.6 పలిమెల 8.2 మహాముత్తారం 12.4 కాటారం 19.4 మల్హర్ 14.2 చిట్యాల 14.2 టేకుమట్ల 13.4 మొగుళ్లపల్లి 13.2 రేగొండ 39.8 గణపురం 47.2 భూపాలపల్లి 23.6 రెండురోజులుగా వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
డెంగీ నివారణ చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: డెంగీ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య కోరారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డెంగీ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాధి ప్రబలిన సమయంలో తప్పని జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమలు కుట్టకుండా ఇప్పటి నుంచే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమాదేవి, వైద్యాధికారులు, సిబ్బంది డాక్టర్ రోహిణి, రాజయ్య, లక్ష్మణ్, రమేష్, ఆలీం, బృంద, శ్రీదేవి, శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: లక్ష్మిబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్యాలియర్ 2024–25 డిప్లొమా, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ సీహెచ్ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమో, పీజీ ప్రవేశాల అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ సూరం జగన్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సీవీటీ విధానంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 14 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జూన్ 10వ తేదీలోపు గడువు ఉందని పేర్కొన్నారు. ఇసుక క్వారీ పనుల అడ్డగింత పలిమెల: మండలంలో పంకెనలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు గురువారం పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనుషులతో ఇసుకను తీయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఇసుక క్వారీలో పనులు కల్పించాలని పనులను అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో వివిధ గనుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా నూతన జీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత అందరినీ సమన్వయం చేయాల్సిన అధికారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ నిబంధనలు పాటించకువండా బదిలీలు చేస్తున్నారని చెప్పారు. ఏరియా వర్క్షాపు నుంచి సింగరేణి ఏరియా ఆస్పత్రి, కేఎల్పీలకు బదిలీ చేస్తున్నారన్నారు. ఏకపక్షంగా బదిలీలు చేయడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజేందర్, సమ్మిరెడ్డి, అశోక్, మధుకర్రెడ్డి, రాములు పాల్గొన్నారు. ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నారు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ రెమ్యునషన్ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య శిబిరం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదాపురం, తిప్పాపురం గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిర వైద్యాధికారి భవ్యశ్రీ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలిపాక, బోదాపురంలో ఇద్దరు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల బోల్తా.. ముగ్గురి మృతి
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
- ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
Advertisement