-
27 నుంచి విజయవాడ రైలు రద్దు
కొత్తగూడెంఅర్బన్: రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా విజయవాడ రైలు రద్దైనట్లు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వరకు రాకపోకలు సాగించే రైలును ఈ నెల 27వ తేది నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేరళ అపెక్స్ బ్యాంక్లో డీసీసీబీ బృందం ఖమ్మంవ్యవసాయం: కేరళ విజ్ఞాన యాత్రలో ఉన్న డీసీసీబీ పాలకవర్గం బాధ్యులు బుధవారం అక్కడి అపెక్స్ బ్యాంకును సందర్శించారు. అలెప్పీలోని బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఇస్తున్న రుణాలపై అధ్యయనం చేశారు. తొలుత టెక్కడి ప్రాంతంలోని మార్కెటింగ్ సొసైటీలను సందర్శించిన బృందం సభ్యులు సుగంధ ద్రవ్యాల వ్యాపారంపైనా ఆరా తీశారు. సుగంధ ద్రవ్యాల సేకరణ, మార్కెటింగ్ వివరాలు తెలుసుకున్నారు. -
కమనీయం.. కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నేడు చండీహోమం పూజలుపాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి ) ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం చండీహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ జి.సుదర్శన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరారు. హోమంలో సంప్రదాయ దుస్తులు మగవారు తెల్లపంచె, కండువా, మహిళలు చీరలు ధరించాలని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి● ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ భద్రాచలం: ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులు వర్షాకాలంలో వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. తాగునీటి సరఫరా పైపులు లీకవకుండా శ్రద్ధవహించాలని పేర్కొన్నారు. జంతు కళేబరాలు, చెత్తాచెదారం కలిసి తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలని వివరించారు. అనారోగ్యానికి గురైతే తప్పనిసరిగా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సలహాలు సూచనలు పాటించాలని కోరారు. రేపు పాలిసెట్● హాజరుకానున్న 1,755 మంది విద్యార్థులు సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 24న పాలిసెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ బి. నాగముని నాయక్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా, 1,755 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందే అనుమతిస్తామని, నిమిషం నిబంధన అమలు చేస్తామని పేర్కొన్నారు. హాల్టికెట్ మీద ఫొటో స్పష్టంగా లేనివారు ఒక పాస్పోర్టు సైజుఫొటో, ఐడీ ప్రూఫ్ (ఆధార్కార్డ్) తప్పక తెచ్చుకోవాలని సూచించారు. ఓసీలో పరిశీలన మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని మణుగూరు ఓసీని బుధవారం జీఎం(ఎస్టేట్స్) వెంకటయ్య సందర్శించారు. వ్యూపాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మణుగూరు ఓసీ పునరావాస ప్రాంతమైన కొత్త కొండాపురం ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించారు. అనంతరం జీఎం దుర్గం రాంచందర్తో సమావేశమై ఏరియాలో అన్ని ఓసీలకు ఒకేసారి లీజు తీసుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అధికారులు శ్యాంసుందర్, శ్రీనివాసాచారి, సురేశ్, శ్రీనివాస్, బాబుల్ రాజు, శైలేందర్కుమార్ పాల్గొన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లో తనిఖీ ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో 39 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు బుధవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ప్లాంట్లో ఉత్పత్తి వివరాలు తెలుసుకుని పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. జీఎం జాన్ ఆనంద్, కిషోర్ కుమార్, నర్సింహరాజు, విజయ శేఖరబాబు, జీవీ మోహన్రావు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు పూర్తి చేశాం
సూపర్బజార్(కొత్తగూడెం): శాసనమండలి వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఏఆర్ఓలతో బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఓటర్లకు సౌకర్యాలు కల్పించామని, ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామని వివరించారు. ఆర్డీఓలు మధు, దామోదర్రావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ పాల్గొన్నారు. 24 వరకు పోస్టల్ బ్యాలెట్ గడువుసూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 24వ తేదీ లోగా ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎమ్మెల్సీ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన చేశారు. శాసనమండలి వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకోసం కలెక్టరేట్లోని రూం నంబరు ఎఫ్–7లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 70 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికలపై వీసీలో కలెక్టర్ ప్రియాంక -
యోగా శిక్షణకు మోక్షమెప్పుడో?
● జిల్లాలో నిరుపయోగంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లు ● నిర్మించి ఏళ్లు గడిచినా ప్రారంభించని వైనం ● అందుబాటులోకి వస్తే ప్రకృతివైద్యం, యోగాపై శిక్షణ ● ఆశా వర్కర్లను శిక్షకులుగా నియమించే యోచనలో ప్రభుత్వంజూలూరుపాడు: ఏళ్లు గడిచినా హెల్త్వెల్నెస్(ఆరోగ్య స్వస్థత) కేంద్రాలు ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదు. ఫలితంగా ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య పరిరక్షణకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణలో ఆయుష్ విభాగం కింద వీటిని ఏర్పాటు చేశారు. యోగా శిక్షణ ద్వారా రోగాలు రాకుండా చూడటం, వస్తే త్వరగా నయం చేయడం, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాన్ని అందించి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు జిల్లావ్యాప్తంగా 12 ఆరోగ్య స్వస్థత కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల ఏర్పాటుకు రూ. 72 లక్షల వ్యయం యునాని, ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులకు అనుబంధంగా ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షల చొప్పున రూ.72 లక్షలతో 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లలో యోగా షెడ్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. దీర్ఘకాలిక బీపీ, షుగర్, ఆస్తామా, కీళ్ల నొప్పులు, వాపులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, పక్షవాతం తదితర వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంపై శిక్షణ, యోగా, ఫిజియోథెరఫీ, ఆరోగ్య సూత్రాలు, సలహాలు, ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించాలని భావించారు. కానీ హెల్త్ వెల్నెస్ సెంటర్ల నిర్మాణం పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. అక్కడక్కడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినా శిక్షణ, వైద్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. నిరుపయోగంగా.. జిల్లాలో రెండు యునాని, ఏడు ఆయుర్వేద, మూడు హోమియో వైద్యశాలల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట, భద్రాచలం ఇల్లెందు ప్రాంతాల్లో ప్రభుత్వ హోమియో వైద్యశాలలకు అనుబంధంగా, భద్రాచలం, జూలూరుపాడు(పాపకొల్లు) ప్రభుత్వ యునాని, ఆర్లగూడెం(దుమ్ముగూడెం), భద్రాచలం, ఆర్.కొత్తగూడెం(చర్ల), రొంపేడు, అశ్వాపురం, నాగుపల్లి(దమ్మపేట), చంచుపల్లి ఆయుర్వేద వైద్యశాలలకు అనుబంధంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయుష్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వంటి సమస్యలతో వైద్య సేవలు పొందేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. కొన్ని ఆయుష్ వైద్యశాలలు పీహెచ్సీలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటుతో సమస్యలను అధిగమించవచ్చునని ప్రభుత్వం భావించింది. కానీ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. సిబ్బంది నియామకాలేవి? ప్రతి హెల్త్ వెల్నెస్ సెంటర్లో యోగా శిక్షకుడు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఫార్మసిస్టు, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు. యోగా శిక్షణా కేంద్రాలు నిర్మించి రెండేళ్లుకాగా, కాంట్రాక్టు పద్ధతిలో యోగా శిక్షకులను తీసుకోవాలని నిర్ణయించినా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తాజాగా ఆశావర్కర్లకు శిక్షణ ఇచ్చి యోగా శిక్షకులుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే.. ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా ఏర్పాటు చేసిన హెల్త్వెల్నెస్ కేంద్రాల్లో ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి యోగా ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కేంద్రాలను ప్రారంభించి వైద్య సేవలందిస్తాం. – డాక్టర్ కె.రాజేందర్రావు, ఆయుష్ శాఖ జిల్లా ఇన్చార్జి -
ఓటింగ్పై అవగాహన కల్పించాలి
దమ్మపేట/మణుగూరుటౌన్: ఈ నెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటువేసే విధానంపై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సూచించారు. బుధవారం మణుగూరు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, గ్యారంటీలను అర్థమయ్యేరీతిలో వివరించి, తనకు ఓటు వేసేలా ఒప్పించాలని అన్నారు. పల్లా రాజేశ్వర్రెడ్డి దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు కనీసం ప్రచారం చేసేవారు కూడా లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమించుకున్న భూములపై ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా కేసులు బనాయించి, జైల్లో పెట్టారని ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాడి తాను జైలుకు పోయాను తప్ప, కేసీఆర్ బిడ్డ కవితలా మద్యం కేసులో జైలు మెట్లు ఎక్కలేదని, తన ఇంటి పంచాయితీలతో కేసులు కాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అక్రమాలు వెలుగులోకి తెస్తున్న తనకు రూ.కోట్లు, పదవులు ఆఫర్ చేసినా తిరస్కరించానని, సొంత ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణకు ప్రయత్నించారని, 46, 317 జీవోలు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు కృషిచేస్తానని మల్లన్న హామీ ఇచ్చారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచాక ప్రభుత్వ పాలనలోలేమైనా తప్పులు దొర్లితే ప్రశ్నించాలని కోరారు. కాగా దమ్మపేటలో గెస్ట్ లెక్చరర్ల సంఘం సభ్యులు, తీన్మార్ మల్లన్నకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.50వేలు విరాళంగా చెక్కు రూపంలో సభావేదికపైనే అందజేశారు. నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జ్లు పిడమర్తి రవి, నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, చందా సంతోష్, కాటబోయిన నాగేశ్వరరావు, పీరినాకి నవీన్, గొడిశాల రామనాథం, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీపీఐ, టీడీపీ టీజేఎస్ నాయకులు వాసిరెడ్డి చలపతిరావు, నైనారపు నాగేశ్వరరావు, సరెడ్డిపుల్లారెడ్డి, దుర్ాగ్యల సుధాకర్, ఐఎన్టీయూసీ కృష్ణంరాజు, కొర్సా ఆనంద్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, ముస్లిం, మైనార్టీ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న -
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి
మణుగూరురూరల్/మణుగూరుటౌన్/అశ్వాపురం: ప్రజలకు స్థానిక వైద్యులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ శిరీష సూచించారు. బుధవారం ఆమె మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. పలు గ్రామాల్లో జ్వర ప్రభావంపై ఆరాతీశారు. వైద్యాధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ.. రక్త నమూనాలను సేకరించాలని, అవసరమైనవారికి చికిత్స అందించాలని చెప్పారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించి జ్వరపీడితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆమె వలస గొత్తికోయ గ్రామం రేగులగండిని సందర్శించారు. గ్రామస్తుల ఇమ్యునైజేషన్, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ స్పందన, ఎన్వీబీడీసీపీ శివకుమార్, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు డీఎంహెచ్ఓ సూచన -
ఇక ‘స్థానిక’ పోరు..
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారుల కసరత్తు ● జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ● గ్రామాల్లో మొదలుకానున్న సందడిచుంచుపల్లి: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. జిల్లాకు అవసరమైన 1,250 బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి తెప్పించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల్లో సవరణలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ఉండగా, 2019 జనవరిలో పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మరో రెండు భద్రాచలం, సారపాక పంచాతీయలకు ఎన్నికలు జరపలేదు. ఇక రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు లేకపోవడంతో పాల్వంచ మండలంలోని సంగం, నారాయణరావుపేట పంచాయతీలకు సైతం ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. ఆ సమయంలో 54 గ్రామపంచాయతీలు, 820 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి 31తో ముగిసింది. దీంతో గత ఫిబ్రవరి 2 నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో పల్లె పాలన సాగిస్తోంది. గతంలో కొంత కసరత్తు.. గతేడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తక్షణమే కొత్త ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీల అమలుపై దృష్టిపెట్టింది. అనంతరం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కొంతవరకు కసరత్తు చేశారు. సిబ్బంది కేటాయింపు, ఓటర్ల జాబితాలో సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటివి పూర్తిగా చేపట్టారు. ఆ లోగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం అవి కూడా పూర్తికావడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్సాహం.. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతుండటంతో ఆశావాహుల్లో ఉత్సాహం మొదలైంది. రాజకీయంగా ఎదిగేందుకు సర్పంచ్ పదవిని తొలిమెట్టుగా భావిస్తూ.. పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో ఓడిపోయినవారు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ఆయా పార్టీల నాయకులు, యువకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇటీవల అధికార కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో పాత, కొత్త నేతలతో ఆశావహుల సంఖ్య పెరిగి అధికార పార్టీలో పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు పార్టీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. 2019లో పంచాయతీ ఎన్నికల తీరు విడత పంచాయతీలు వార్డులు మండలాలు మొదటి 174 1,534 7 రెండో 142 1,294 7 మూడో 163 1,404 7రిజర్వేషన్ల వర్తింపుపై సందిగ్ధం గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు ప్రకటించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లను పదేళ్లకు పొడిగించింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వర్తించిన రిజర్వేషనే వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. పరిషత్ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల 4 వరకు లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం బీసీ కమిషన్తో అభిప్రాయ సేకరణ, సర్వే నిర్వహించి రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోందో చూడాల్సి ఉంది. -
9న ఆలిండియా ట్రైబల్ ఫోరం ఆవిర్భావ సదస్సు
ఇల్లెందు: దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణ కోసం పోరాడుతుంటే వారిని క్రూరంగా హతమారుస్తూ ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆలిండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, కోకన్వీనర్ సూర్నబాక నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యాన ఫాసిజానికి వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం ఇతర అట్టడుగు వర్గాలతో కలిసి పోరాడాల్సిన తరుణం అసన్నమైందని చెప్పారు. ఇల్లెందులోని పెన్షనర్ల భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలో వివిధ రాష్ట్రాల ఆదివాసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఫోరం ఏర్పడిందని తెలిపారు. పది రాష్ట్రాల్లో ఆలిండియా ట్రైబల్ ఫోరం ఆవిర్భావ సదస్సులు నిర్వహిస్తూ రాష్ట్రస్థాయి కమిటీలను నియమిస్తున్నామని, ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రస్థాయి సదస్సు జూన్ 9న కొత్తగూడెంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను అడవి నుంచి వెళ్లగొట్టి ఖనిజ సంపదను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే కాక ఆదివాసీల రక్షణగా ఉన్న చట్టాలను ఎత్తివేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నిందని విమర్శించారు. ఈ నేపథ్యాన ఆదివాసీలను ఏకం చేసి హక్కుల సాధన, చట్టాల రక్షణకు పోరాడుతున్నట్లు సత్యం, నాగేశ్వరరావు వెల్లడించారు. సమావేశంలో నాయకులు వీసం కృష్ణ, చింతా ఉదయ్, చింత రజిత తదితరులు పాల్గొన్నారు. ఫోరం జాతీయ కన్వీనర్ సత్యం, కోకన్వీనర్ నాగేశ్వరరావు -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
●మృతిపై పలు అనుమానాలు ●చోరీ చేసేందుకు వచ్చిన దుండగుల పనే అంటున్న స్థానికులు ●మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీకొత్తగూడెంటౌన్: ప్యూన్బస్తీలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దేవరాజు ప్రమీల (68) బుధవారం తెల్లవారు జామున ఇంట్లో మంచం కింద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ కోసం వచ్చిన దుండగులు హత్య చేశారా? ఇంకా ఏదైనా జరిగిందా? అని స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్లో ఉంటున్న ప్రమీల పెద్ద కుమారుడు మహేందర్ తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో స్నేహితులు రఫీ, మందా వెంకట్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారిద్దరు ప్రమీల ఇంటికి వెళ్లగా ఆమె కదలలేని స్థితిలో మంచం కింద పడిఉండటంతో వారు మహేందర్, పోలీసులు, 108కు కు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ సీఐ ఎం.కరుణాకర్, టూటౌన్ సీఐ రమేశ్కుమార్, క్లూస్టీం, పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 108లో చేరుకున్న వైద్యులు ప్రమీల మృతిచెందిందని ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న కుమారులు మహేందర్, వినోద్ హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు చేరుకున్నారు. ప్రమీల హత్యకు గురై ఉంటుందని, బంగారం కోసం వచ్చిన దుండగులు హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? కొత్తగూడెం ప్యూన్బస్తీలో దేవరాజు ప్రమీల భర్త ప్రభాకర్ ఏడాది కింద మృతిచెందగా పెద్ద కుమారుడు మహేందర్, చిన్న కుమారుడు వినోద్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం కుమారుల వద్ద ఉన్న ప్రమీల అనంతరం ప్యూన్బస్తీలో ఒంటరిగా ఉంటోంది. మంగళవారం రాత్రి బంధువుల శుభకార్యానికి వెళ్లిన ప్రమీల రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చింది. తెల్లవారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కాగా, ప్రమీల ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు, ముక్కు పుడక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురు మహిళలు ఎవరు? ప్రమీల ఇంటి సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు మహిళలు ఎర్రరంగు చీర ధరించి అనుమానాస్పదంగా కనిపించారని ఇంటి పక్కన ఉన్న వ్యక్తి తెలిపారు. శుభకార్యానికి వెళ్లి వచ్చిన ప్రమీల ఇంటికి వచ్చిన ముగ్గురు మహిళలు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మృతురాలి కుమారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో వివరాలు సేకరించింది. -
కాల్వలోకి దూసుకెళ్లిన బొలేరో
ఏడుగురికి గాయాలు చర్ల: మండలంలోని దానవాయిపేట సమీపంలో మృతదేహాన్ని తరలిస్తున్న ఓ బొలేరో వాహనం అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లగా ఏడుగురు గాయపడ్డారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలోని దుబ్బతోటకు చెందిన ఓ వ్యక్తి చర్ల మండలంలోని బూరుగుపాడులో మంగళవారం అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం మృతదేహాన్ని స్వగ్రామానికి బొలేరో వాహనంలో తరలిస్తున్నారు. దానవాయిపేట సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి తాలిపేరు ప్రధాన కాల్వలోకి దూసుకెళ్లింది. వాహనంలో పది మంది ఉండగా అందులో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. వైద్యాధికారి దివ్యనయన ప్రాథమిక చికిత్స అందించారు. మద్యం రవాణా చేసిన వ్యక్తికి ఆరు నెలలు జైలుకొత్తగూడెంటౌన్: అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసులో కొత్తగూడెం కూలీలైన్కు చెందిన కుసుమ శ్రావణ్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బత్తుల రామారావు బుధవారం తీర్పు చెప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దమ్మపేట సెంటర్లో ఏప్రిల్ 9వ తేదీన వాహన తనిఖీలు చేస్తుండగా హోండా స్కూటీపై వస్తున్న వ్యక్తిని ఆపి పరిశీలించగా మద్యం బాటిళ్లు దొరికాయి. 147 మద్యం బాటిళ్లతో పట్టుబడిన కుసుమ శ్రావణ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, చార్జిషీట్ దాఖలు చేశారు. ముగ్గురు సాక్షులను విచారించిన జడ్జి నేరం రుజువు కావడంతో శ్రావణ్కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మనోవర్తి చెల్లించని వ్యక్తికి నెల.. కొత్తగూడెంటౌన్: మనోవర్తి చెల్లించనందుకు పాల్వంచ వనమాకాలనీకి చెందిన పానుగంటి వినయ్కు నెలరోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలిలా ఉన్నాయి.. వనమాకాలనీకి చెందిన పానుగంటి మనీషాకు వికలాంగులకాలనీకి చెందిన పానుగంటి వినయ్ 2023 జూన్ 13 నుంచి రూ.44 వేలు మెయింటనెన్స్ (మనోవర్తి) చెల్లించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంతో ఉప్పుశెట్టి సునీల్కుమార్ న్యాయవాదిని కమిషనర్గా నియమించారు. ఆయన పానుగంటి వినయ్ను కోర్టులో హాజరు పరిచారు. విచారించిన జడ్జి పానుగంటి వినయ్కు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మనీషా తరఫున న్యాయవాదులు యాస యుగంధర్, మౌనిక వాదించారు. రెండు కేజీల గంజాయి స్వాధీనం దమ్మపేట: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బుధవారం మండలంలోని గోపాలపురం గ్రామ సమీపంలో పోలీసులు, నార్కోటిక్ అధికారులు కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. చిల్లగుంపు గ్రామానికి చెందిన కొయ్యల సత్తిబాబు (57) ద్విచక్ర వాహనంపై రెండు కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు. సత్తిబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయిని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
ఆడుకుంటూ కారులో ఎక్కి ఊపిరాడక.. మణుగూరులో విషాద ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది. -
నెలాఖరు నాటికి కొనుగోళ్లు పూర్తిచేయాలి
● జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ ● సుజాతనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనసూపర్బజార్(కొత్తగూడెం) : ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. ధాన్యంలో తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ జిల్లాలో 136 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 1.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2,081 మంది రైతుల నుంచి 12,400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ. 24 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించారు. తేమశాతం పరిశీలన.. సుజాతనగర్ : సుజాతనగర్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ మంగళవారం తనిఖీ చేశారు. ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. 20 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించిన ఆయన.. 17 శాతం వచ్చేంతవరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, డీఎస్ఓ రుక్మిణీదేవి, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, వ్యవసాయాధికారి బాబూరావు, ఆర్టీఓ మనోహర్, డీఎంఓ అలీం, సివిల్ సప్లై డీఎం త్రినాథ్బాబు, జీసీసీ డీఎం విజయ్కుమార్ పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడిఝెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24న ప్రారంభమవుతాయని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని డీఐఈఓ బి.సులోచనారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు జిల్లాలో 23 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 8,134 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 5,408 మందికి గాను 4,707 మంది జనరల్, 701 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారని, ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 2,261 మంది, ఒకేషనల్ 465.. మొత్తం 2,726 మంది పరీక్ష రాయనున్నారని వివరించారు. అని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయిస్తామని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారని పేర్కొన్నారు. హాల్టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దానిపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు, ద్వితీయ సంవత్సరం వారు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీతారామ పైప్లైన్ పనుల పరిశీలనఅశ్వారావుపేటరూరల్: మండలంలోని రెడ్డిపల్లిలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పైపులైన్ పనులను ఇరిగేషన్ ఈఈ కోటగిరి సురేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దమ్మపేట మండలం ఆర్లపెంట నుంచి అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం వరకు 5.2 కిలో మీటర్ల మేర రెండు వరుసల పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఇందుకు రూ.12 కోట్లు వ్యయం అవుతోందన్నారు. ఇప్పటికి 60 శాతం మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. పైప్లైన్ నిర్మాణంలో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట డీఈ కృష్ణ ఉన్నారు. మండలాలకు ‘యూనిఫాం’ పంపిణీకొత్తగూడెంఅర్బన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బడులు తెరిచేనాటికే యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరిన యూనిఫాం క్లాత్ను మంగళవారం ఆయన మండలాలకు పంపిణీ చేశారు. జిల్లాకు 1,26,381 మీటర్ల వస్త్రం రాగా, మండలాల వారీగా విభజించి సరఫరా చేస్తున్నారు. యూనిఫాం కుట్టే బాధ్యతను డీఆర్డీఏ, మెప్మా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి సైదులు, మెప్మా, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
‘నిధిమ్’ అడ్మిషన్లు ప్రారంభం
సూపర్బజార్(కొత్తగూడెం): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిధిమ్) ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 26 ఎకరాల సువిశాల క్యాంపస్లో మూడు కోర్సులను అందిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్లకు పేరుగాంచిన ఐఐటీ, ఐఐఎం మాదిరిగా టూరిజం హాస్పిటాలిటీ కోర్సులకు పేరగాంచిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తున్న మూడు కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ) కోర్సు కాలవ్యవధి రెండేళ్లు ఉంటుందని, కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. దీంతోపాటు క్యాట్/ఐసెట్/ఏటీఎంఏ లేదా తత్సమాన పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదని తెలిపారు. బీబీఏ కోర్సుకు నాలుగేళ్ల కాలవ్యవధి ఉంటుందని, 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. వయోపరిమితి 22 సంవత్సరాలకు మించరాదని, ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్ల సడలింపు ఉంటుందని తెలిపారు. బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు మూడేళ్లు ఉంటుందని, 10 ప్లస్ 2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈకోర్సులో ప్రవేశానికి జాతీయస్థాయిలో ఎన్పీహెచ్ఎంటీ – 2023 ప్రవేశపరీక్ష జేఈఈలో అర్హత సాధించి ఉండాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన.. కొత్తగూడెంరూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 55 పోలింగ్ కేంద్రాలకు 312 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించామని తెలిపారు. పీఓలు, ఏపీఓలు 76 మంది చొప్పున, ఓపీఓలు 160 మంది ఉన్నారని వివరించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటుచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల డీటీ రంగప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రియాంక ఆల వెల్లడి -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు
కొత్తగూడెంటౌన్: నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, ఇకపై వారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెబుతూ రైతులకు అంటగడుతున్నారని, తద్వారా సరైన దిగుబడి రాక అన్నదాతలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు నకిలీ విత్తన ముఠాల బారిన పడకుండా వ్యయసాయ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని, జిల్లాలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని ఆయా మండలాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు.. పోలీసు శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తూ ఆనారోగ్యంతో మరణించిన వీరన్న కుటుంబానికి రూ.4 లక్షల చెక్కును ఎస్పీ రోహిత్రాజ్ మంగళవారం అందజేశారు. కొమరారం పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వీరన్న ఇటీవల మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులు ఎస్పీని తన కార్యాలయంలో కలవగా ఈ మేరకు చెక్కు అందజేశారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులు నిరంతరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, సుధాకర్, సత్యవతి, మధు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ హెచ్చరిక -
ఆధిపత్య పోరు..
అదుపు తప్పుతున్న సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న సింగరేణిలో ప్రధాన కార్మిక సంఘాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. గడిచిన ఐదు నెలలుగా నెలకొన్న ఆధిపత్య పోరు అదుపు తప్పుతోంది. కార్మిక నేతల పనులు ఇలా.. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా భూగర్భ, ఉపరితల గనులతో పాటు వివిధ వర్క్షాపులు, సివిల్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ తదితర విభాగాల్లో విధుల్లో ఉన్నారు. ఇక్కడ పని చేసే కార్మికుల హక్కులు, రక్షణ, బదిలీలు తదితర అంశాలపై యాజమాన్యంతో చర్చించేందుకు కార్మిక సంఘాలు పని చేస్తాయి. వర్కర్స్ సేఫ్టీ, మైన్స్, జనరల్ మేనేజర్ తదితర కమిటీల సభ్యులు, పిట్ సెక్రటరీ, బ్రాంచి సెక్రటరీ, ఏరియా ఉపాధ్యక్షుడి వరకు వివిధ హోదాల్లో కార్మిక నేతలు ఉంటారు. వీరు రెగ్యులర్ విధుల్లో పాల్గొంటూనే కార్మికుల సమస్యలపై స్పందించాల్సి ఉంటుంది. టీబీజీకేఎస్పై ఆరోపణలు.. సింగరేణిలో ఎన్నికల ద్వారా గుర్తింపు సంఘాన్ని ఎన్నుకుంటారు. సంస్థలో మొదటి నుంచీ సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ (సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఎస్సీడబ్ల్యూయూ)దే ఆధిపత్యం. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ (సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్, ఎస్సీఎల్యూ) ఉండేది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) హవా మొదలైంది. దశాబ్దకాలం పాటు సింగరేణిలో టీబీజీకేఎస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. గతంలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆ సంఘానికి చెందిన నేతలు కనీసం పని ప్రదేశాల్లో యూనిఫామ్ ధరించడం, పనిముట్లు పట్టుకోవడం కూడా చేసేవారు కాదని, ఖద్దరు దుస్తుల్లోనే పని ప్రదేశాల దగ్గరకు వచ్చి మస్టర్ (హాజరు) పడగానే బయటకు వెళ్లిపోయేవారనే విమర్శలు వచ్చాయి. టీబీజీకేఎస్కు అనుకూలంగా సింగరేణి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. గతేడాది చివరలో ఒకేసారి అటు రాష్ట్రంలో, ఇటు సింగరేణిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ అధికారం కోల్పోయాయి. అధికారులకు తలనొప్పి.. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్కు అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ నేతలకు ఆదేశాలు జారీ చేయలేక, గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ నేతల డిమాండ్లను నెరవేర్చడం వీలుకాక వివిధ పని ప్రదేశాల్లో హెచ్ఓడీలుగా ఉన్న అధికారులు తలలు పట్టుకుంటున్నారని సాధారణ కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత గనులు, వర్క్షాపుల దగ్గర ఈ పంచాయితీ తీవ్రమవుతోంది. రోజురోజుకూ ముదురుతున్న సమస్యకు పరిష్కార మార్గం చూపడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఖద్దరు X కార్మికులు అన్నట్టుగా వ్యవహారం సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ జిల్లాలోని అన్ని చోట్లా ఐఎన్టీయూసీ గెలుపు ఇరు సంఘాల నేతల మధ్య ముదురుతున్న వైరం సంస్థలో వారి పనితీరుపై రాజుకున్న వివాదంఇప్పుడు పోటాపోటీ.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచింది. అయితే జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ విజయం సాధించింది. టీబీజీకేఎస్ అన్ని చోట్లా ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీబీజీకేఎస్ నేతల్లో ఎక్కువ మంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలో చేరారు. దీంతో గత జనవరి నుంచి అన్ని గనులు, వర్క్షాపులు, కార్పొరేట్ సెక్టార్లోని పని ప్రదేశాల వద్ద ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య ఘర్షణ పూరిత వాతావరం నెలకొంది. ఐఎన్టీయూసీ సంఘానికి చెందిన కీలక నేతలు (గతంలో టీబీజీకేఎస్లో ఉన్న వారు) పని ప్రదేశాల్లో యూనిఫామ్ఽ ధరించి విధులు నిర్వహించాలని, గతంలో లాగా మస్టర్ పడి వెళ్లిపోతామంటే కుదరదని ఏఐటీయూసీ నేతలు అంటున్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం వారికి పని చెప్పడంలో అధికారులు విఫలమైతే తాము కూడా పని చేయబోమని స్పష్టం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం మస్టర్ వేయించుకుని పని చేయకుండా వెళ్లిపోయే వారికి ఆబ్సెంట్ వేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశాం. దశల వారీగా బయోమెట్రిక్ విధానం కూడా అమల్లోకి తెస్తున్నాం. కార్మికులైనా, సంఘాల నేతలైనా సంస్థ నిబంధనలు, డ్యూటీ చార్ట్ ప్రకారం పని చేయాల్సిందే. అలా చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. – ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (పా) -
‘మొర్రేడు’కు మోక్షం
● వాగుపై అందుబాటులోకి రెండో బ్రిడ్జి ● ఎన్హెచ్ నిర్మాణంలో రూ.9 కోట్లతో పనులు ● ట్రయల్ రన్లో రాకపోకలకు అనుమతి ● త్వరలోనే అధికారికంగా ప్రారంభోత్సవంకొత్తగూడెంరూరల్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి పనుల్లో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మొర్రేడు వాగుపై తొమ్మిదేళ్ల క్రితం చేపట్టిన రెండవ బ్రిడ్జి ఎట్టకేలకు పూర్తయింది. సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా, మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనచోదకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారం అయింది. నేషనల్ హై వే రోడ్డు పనుల్లో భాగంగా రుద్రంపూర్ నుంచి భద్రచాలం వరకు 44 కిలోమీటర్ల మేర తారు రోడ్డుతోపాటు, మధ్యలో కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణానికి 2015లో రూ.240 కోట్లు మంజురు చేశారు. ఈ రోడ్డు పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. అంతేకాక జిల్లా కేంద్రంలోని గోదుమ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించగా ఈ ఏడాదే పనులు పూర్తి చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని మొర్రేడు వాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేశారు. కాగా ఈ పనులు ఆగుతూ.. సాగుతూ నత్తనడకన కొనసాగాయి. దీంతో నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో ఎన్హెచ్ ఈఈ యుగంధర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ట్రయల్ రన్ చేపట్టగా, మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ జామ్కు చెక్.. మొర్రేడు వాగుపై ఇంతకాలం ఒకే బ్రిడ్జి ఉండడంతో దానిపై ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతుండేది. ఇటు కొత్తగూడెం, అటు లక్ష్మీదేవిపల్లి వైపు వాహనాలు భారీగా నిలిచిపోయేవి. భారీ వాహనాలు బస్సులు, ట్రాలీలు, ఆటోలు, ద్విచక్రవాహన చోదకులు సైతం ఇబ్బంది పడేవారు. మెర్రేడువాగు బ్రిడ్జి అవతల వైపున విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం ఒకే బ్రిడ్జిపై రవాణాకు అంతరాయం కలుగుతుండేది. ఇప్పుడు రెండో వంతెన ప్రారంభం కావడంతో ఖమ్మం, కొత్తగూడెం, విజయవాడ నుంచి ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోయినట్టయింది. ట్రాఫిక్ ఇక్కట్లు ఉండవు... మొర్రేడు వాగుపై రెండో బ్రిడ్జి ప్రారంభం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పినట్టయింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య ప్రజలను వేధించేది. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు. సమయం వృథా కాదు. – ఆకుల శ్రీనివాస్, లక్ష్మీదేవిపల్లి విద్యార్థులకు సులువు మొర్రేడు వాగు బ్రిడ్జికి అటు వైపు విద్యా సంస్థలు ఎక్కువగా ఉండడంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్య ఉండేది. వాహనాల రద్దీతో విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఇప్పుడు మొర్రేడు వాగు పై రెండో బ్రిడ్జి నిర్మాణంతో ఇక ఆ సమస్యలకు చెక్ పడనుంది. – మచ్చా వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి -
గాలివాన బీభత్సం
●విరిగిన విద్యుత్ స్తంభాలు ●విద్యుత్ సరఫరాకు అంతరాయంకరకగూడెం: మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చిరుమళ్ల గ్రామంలో గాలి విధ్వంసం సృష్టించింది. గ్రామంలోని చింత చెట్టు విరిగి అక్కడున్న విద్యుత్ తీగలపై పడటంతో అదే వరుసలో ఉన్న సుమారు ఏడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో విద్యుత్ స్తంభం పడింది. కానీ, ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న కరకగూడెం విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. సుమారు రూ.లక్ష వరకు విద్యుత్ శాఖకు ఆస్తి నష్టం జరిగినట్లు ఏఈ నరేందర్రెడ్డి తెలిపారు. అలాగే పోలకమ్మతోగు గ్రామంలో గాలివానకు ఏడూళ్ల రాంబాబుకు చెందిన రేకుల ఇళ్లు ధ్వంసమైంది. పాల్వంచ మండలంలో.. పాల్వంచరూరల్: మండలంలో మంగళవారం సాయంత్రం వీచిన గాలి దుమారం విధ్వంసం సృష్టించింది. జగన్నాథపురం, తోగ్గూడెం గ్రామాల ప్రధాన రహదారి పక్కన చెట్లు కూలిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీ సిబ్బంది రహదారిపై కూలిన చెట్లను తొలిగించినట్లు గ్రామ కార్యదర్శి రవి తెలిపారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
పాల్వంచ: అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గట్టాయిగూడెంనకు చెందిన మాలోతు శ్రీను (38) ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి సక్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ బి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవే ఎదురుచూపులు..
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా వైద్యశాలలో పలువురికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించగా నిధులు గత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ విడుదల చేయలేదు. దీంతో ఏడాదిన్నరగా ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ అంశంపై ‘సాక్షి’లో ‘నిధులు నిల్’శీర్షికన ఆదివారం కథనం ప్రచురితం కాగా, ఇల్లెందు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్ ఉన్నతాధికారులకు మంగళవారం వివరణ పంపించారు. ప్రతీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే, అభివృద్ధి, పరికరాల కొనుగోలుకు వెచ్చిస్తారు. ఇలా ఏడాదిన్నరగా ఇల్లెందు ఆస్పత్రికి సుమారు రూ.70 లక్షల వరకు నిధులు విడుదల కావాల్సి ఉన్నా రాకపోగా.. జిల్లాలోని ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ తెలిపారు. జైలు నుంచి విడుదలైన ఎన్డీ నేత అశోక్ ఇల్లెందు: న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అలియాస్ కుర్సం వజ్జయ్య మంగళవారం ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యారు. సీపీఐ (ఎంఎల్) పేరుతో అనేక వర్గాలు ఉండగా.. రారష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు ఎదిగిన ఎన్డీ చంద్రన్న వర్గం నేత అశోక్ను కొన్నాళ్ల కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు తర్వాత పార్టీ సంక్షోభంలో కూరుకుపోగా, చంద్రన్నతో ఏపీలో తలెత్తిన విబేధాలు, గుంటూరు జిల్లాలో నాయకుడు బ్రహ్మయ్య హత్యతో ఆ వర్గం చీలిపోయింది. దీంతో సాధినేని వెంకటేశ్వరరావును రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే అశోక్ విడుదలైన నేపథ్యాన చంద్రన్న, వెంకటేశ్వరరావు వర్గాల్లో ఎవరి వెంట పయనిస్తాడో తేలాల్సి ఉంది. కాగా, అశోక్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా రెండు వర్గాల నాయకులు ఆయనను కలిశారు. కోక్యాతండా వాసికి ఈసెట్లో మూడో ర్యాంక్టేకులపల్లి: మండలంలోని తడికలపూడి పంచాయతీ కోక్యాతండాకు చెందిన తేజావత్ లక్ష్మణ్ – కవిత దంపతుల కుమారుడు సాత్విక్ ఈసెట్ జనరల్ విభాగంలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంక్ సాధించాడు. మంగళవారం విద్యార్థిని ఉపాధ్యాయ సంఘాల నాయకుడు జి.మోతీలాల్, ఎం.బాలు, ఎ.రమేశ్, బి.మోహన్, ఎన్.రాంచందర్, ఎల్.గణేశ్ సన్మానించారు. ఎస్టీ నుంచి లంబాడీల తొలగింపునకు ఉద్యమంఇల్లెందురూరల్: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిద్దామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. ఇల్లెందు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడీల కారణంగా ఆదివాసీ జాతి అన్యాయానికి గురవుతోందని, ఈ కారణంగానే వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు ఉద్యమం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో అన్ని అవకాశాలను లంబాడీలు పొందుతూ ఆదివాసీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు మోకాళ్ల సతీశ్, పొదెం భరత్, వాసం రమేశ్, మోకాళ్ల శ్రీకాంత్, చీమల అభిలాష్, కల్తీ మురళి తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి బలవన్మరణం మోతె: భార్యాభర్తల మధ్య గొడవలతో మనస్తాపానికి గురైన వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం పైనంపల్లికి చెందిన దంపతులైన కంచెం కొమరయ్య(38), రమ నడుమ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రమ వారం క్రితం తన ముగ్గురు ఆడపిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈమేరకు మనస్తాపానికి గురైన కొమరయ్య సోమవారం అర్థరాత్రి మోతె మండలం ఉర్లుగొండ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. -
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలసూపర్బజార్(కొత్తగూడెం): శాసనమండలి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికను పాదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఎన్నికల సిబ్బందికి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని, అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. 26న శ్రీరామచంద్ర ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, 27న రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం నంబరు ద్వారా ఓటు వేయాలని, పోలింగ్ స్టేషన్లలో ఇచ్చిన వైలెట్ కలర్ స్కెచ్పెన్ మాత్రమే వాడాలని, ఇంకా ఏవిధమైన నంబర్లు, పేరు, సిగ్నేచర్ రాయవద్దని సూచించారు. బ్యాలెట్ పేపర్ను ముందు నిలువుగా, తర్వాత అడ్డంగా మలిచి బ్యాలెట్ బాక్స్లో వేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫామ్–12 ద్వారా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఓటరు పెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ట్రైనింగ్ నోడల్ అధికారి అలీం, డీఎల్ఎంటీ పూసపాటి సాయికృష్ణ, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై టీజీ డిస్కం
● టీఎస్ఎన్పీడీసీఎల్ టీజీఎన్పీడీసీఎల్గా మార్పు ఖమ్మంవ్యవసాయం : విద్యుత్ పంపిణీ సంస్థ పేరులో మార్పు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ (టీఎస్ ఎన్పీడీసీఎల్) సంస్థగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరులో స్వల్ప మార్పు చేస్తూ తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ (టీజీ ఎన్పీడీసీఎల్) సంస్థగా నిర్ణయించింది. దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థకు కూడా టీజీ ఎస్పీడీసీఎల్గా నామకరణం చేశారు. సంస్థ నిర్వహణలో ఉన్న కార్యాలయాల బోర్డులను టీజీ ఎన్పీడీసీఎల్ పేరుతో ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఎస్ఈ సర్కిల్ కార్యాలయం మొదలు డీఈ, ఏడీఈ, ఏఏఓస్, ఏఈ ఆపరేషన్స్ కార్యాలయాలు టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయాలుగా మారనున్నాయి. -
పట్టభద్రులు మోసపోవొద్దు
సూపర్బజార్(కొత్తగూడెం)/ఇల్లెందు: శాసనమండలి నల్లగొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని, పట్టభద్రులు మోసపోవొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం కొత్తగూడెం క్లబ్లో, ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆరు నెలల క్రితం అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మవద్దని, నమ్మితే ఘోస పడతారని చెప్పినా వినకుండా ప్రజలు మోసపోయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మోసపోకుండా ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని, అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని అన్నారు. ఆరు నెలల క్రితం కొలువైన కాంగ్రెస్తోపాటు సీపీఐ ఇచ్చిన హామీలను ఎంతమేరకు పరిష్కరించారో అర్థం చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నాట్లు వేసే నాడు రైతుబంధు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓట్లు వేసే నాడు వేస్తోందని విమర్శించారు. డిసెంబర్ 9న రైతుబంధు ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందన్నారు. తాము అధికారం, పాలనను వికేంద్రీకరణ చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించామన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్లు అదానీకి అమ్మేస్తారని ఆరోపించారు. అభ్యర్థుల చరిత్ర చూడాలి.. బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రులు అభ్యర్థుల చరిత్ర కూడా చూడాలన్నారు. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉండాలనే పుస్తకం రాసిన రాకేష్రెడ్డి ఒక వైపు ఉంటే, చీటర్, 56 కేసులున్న మల్లన్న మరోవైపు ఉన్నాడని తెలిపారు. మాజీ మంత్రి సత్యవతి మాట్లాడుతూ 5 నెలల క్రితం కాంగ్రెస్ ప్రజలను మాయమాటలతో మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్పర్సన్ దామోదర్, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, లక్కినేని సురేందర్, రంగనాథ్, దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా మోసపోతే ఆ తప్పు మనదే అవుతుంది.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి శాసనమండలి అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి కొత్తగూడెం, ఇల్లెందు సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెండులక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను రాజీనామా చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తయిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ఊదరగొట్టే వాగ్దానాలతో గెలిచిందని, అయితే ఈ ఐదారు నెలల్లో అందరికీ అర్థం అయ్యిందన్నారు. రాష్ట్రంలో మూడు మెడికల్ కళాశాలలు ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో 33 మెడికల్ కళాశాలలకు పెంచామని గుర్తుచేశారు. మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మంలో మెడికల్ కాలేజ్లు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, ఉన్నత చదవువులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కొత్తగూడెంలో 140 మంది సూపర్స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇల్లెందు పట్టణ అభివృద్ధి ఘనత తమదేనన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అడిగే దమ్ము కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఉందా అని ప్రశ్నించారు. పట్టభద్రులు మోసపోకుండా రైతు బిడ్డ, ఉన్నత విద్యావంతుడైన రాకేష్రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి మాట్లాడుతూ పాల్వంచలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి పట్టభద్రులు తనను ఆదరించి చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. -
పుస్తకాలు వచ్చేస్తున్నాయి..
● జిల్లాకు చేరిన 3,15,050 పాఠ్యపుస్తకాలు ● వారంలోగా మండల కేంద్రాలకు చేరవేత ● పాఠశాలల ప్రారంభంరోజే విద్యార్థులకు పంపిణీకొత్తగూడెంఅర్బన్: విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పాఠ్యపుస్తకాలను జిల్లాకు చేరవేస్తోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు 61 శాతం చేరగా, మిగిలిన 39 శాతం పుస్తకాలు పాఠశాలల ప్రారంభం నాటికి వస్తాయని జిల్లా విద్యాధికారులు చెబుతున్నారు. నోటు పుస్తకాలు వందశాతం జిల్లాకు చేరాయి. గోదాంకు చేరిన పుస్తకాలను ఈ నెలాఖరులోగా మండల కేంద్రాలకు పంపించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు చేరవేయనున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే మైనర్ మరమ్మతులు పూర్తి చేసి కొన్ని సదుపాయాలు కల్పించారు. దీంతోపాటు మన ఊరు–మన బడి కార్యక్రమం పనులు కూడా ఇంకా కొన్ని పాఠశాలల్లో జరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లు సైతం పెరిగే అవకాశాలున్నాయని విద్యాధికారులు చెబుతున్నారు. గత ఏడాది కూడా అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. బడిబయట పిల్లలపై సర్వే, జూన్ నెలలో బాడిబాట వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. నోట్ పుస్తకాలు వందశాతం.. జిల్లాలోని 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 5,17,000 పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 3,15,050 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఇంకా 2,10,950 పాఠ్య పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతోపాటు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్లేన్ నోట్ పుస్తకాలు 2,12,868, రూల్స్ నోట్ పుస్తకాలు 51,590.. మొత్తం 2,66,458 నోట్ పుస్తకాలు వందశాతం వచ్చాయని జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది కూడా పార్టు–1, పార్టు–2గా పాఠ్యపుస్తకాలు జిల్లాకు రెండు దఫాలుగా వస్తాయి. విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించేందుకు పార్టు–1, పార్టు–2గా విభజన చేసి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. పార్టు–2 సంబంధించి అక్టోబర్ నెలలో 1,43,200 పుస్తకాలు రానున్నాయి. 61 శాతం వచ్చాయి.. జిల్లాకు ప్రస్తుతం 61 శాతం పాఠ్య పుస్తకాలు, వంద శాతం నోట్ పుస్తకాలు వచ్చాయి. ఇంకా మిగిలిన 39 శాతం పాఠ్య పుస్తకాలు పాఠశాలల ప్రారంభం నాటికి జిల్లాకు చేరతాయి. వచ్చిన పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేస్తాం. –ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాధికారిరావాల్సిన పుస్తకాల వివరాలు తరగతి సబ్జెక్టు 1 తెలుగు 2 ఇంగ్లిష్, 3 ఇంగ్లిష్, మ్యాథ్స్ 4 ఇంగ్లిష్ 6 తెలుగు, ఇంగ్లిష్, సైన్స్ 7 సైన్స్, హిందీ 8 తెలుగు, ఇంగ్లిష్ 9 హిందీ, బయాలజీ, భౌతికశాస్త్రం, ఇంగ్లిష్, గణితం 10 హిందీ, సోషల్, భౌతికశాస్త్రం -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ
ఇల్లెందు: ఎమ్మెల్సీ పదవిపై తనకు ఆఽశ లేదని, ప్రజలిచ్చిన తీన్మార్ మల్లన్న అనే పదవి కంటే ఇది పెద్దది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి జేకే కాలనీలోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. గతంలో పోటీ చేసినప్పుడు తనతోడు పట్టభద్రులే ఉన్నారని, ప్రస్తుతం పట్టభద్రులతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, టీడీపీ కూడా జత కలిశాయన్నారు. ఇంతమంది కలిశాక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి అమెరికా నుంచి కాదు అంతరిక్షం నుంచి దిగి వచ్చినా గెలువడన్నారు. గతంలో గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఏనాడూ ఈ ప్రాంతంలో కనిపించలేదని, పట్టభద్రుల కోసం పనిచేయలేదని విమర్శించారు. ఓడిన తీన్మార్ మల్లన్న మాత్రం మరుసటి రోజు నుంచే ప్రజల మధ్య ఉన్నాడని గుర్తుచేశారు. అమెరికా నుంచి ఓ గొప్ప మేధావి వచ్చినట్లు ఇల్లెందు సభలో కేటీఆర్ ప్రకటించాడని, తనకు అమెరికాలో చదివే స్థోమత లేకపోవచ్చని, వరంగల్ జిల్లాకు చెందిన పేద విద్యార్థిని అరుంధతిని అమెరికా చదువుకు పంపించిన చరిత్ర మాత్రం ఉందన్నారు. పేదల గుడిసె నుంచి వచ్చిన తాను అదే పేదల గుడిసెల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం, ఆపరేషన్లు చేయించానని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటూ బీజేపీ ఒకవైపు, తెలంగాణలో పరీక్షల లీకేజీలు, ఉద్యోగాలు అమ్ముకోవటం లాంటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ మరొక వైపు ఉన్నాయని, వీరికి పోటీగా ప్రజల గొంతుక మల్లన్న ఉన్నాడని పేర్కొన్నారు. ధరణి, కాళేశ్వరం బాగోతం, అవుటర్ రింగురోడ్డు, హైదరాబాద్ భూములు అమ్మకం లాంటి అనేక కుంభకోణాలను తాను వెలికి తీశానని తెలిపారు. ఈ తరుణంలోనే తన మీద 70 కేసులు పెట్టారని, ఇందులో ఒక్కటీ తన ఇంటి పంచాయితీకి సంబంధించినది కాదని పేర్కొన్నారు. అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి కేటీఆర్.. కవిత మీద ఎందుకు కేసు నమోదైందో చెప్పాలన్నారు. తన భార్యా పిల్లలను కేసీఆర్ ఏడ్పించారని, ఆయన కూతురు మార్చి 26 నుంచి జైలులో ఏడుస్తోందని అన్నారు. పట్టభద్రులు అంతరాత్మ సాక్షిగా ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇన్చార్జ్ మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, నాగ సీతారాములు, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా, ఎంపీపీ నాగరత్నమ్మ, గార్ల జడ్పీటీసీ ఝాన్సీ, మెట్టెల కృష్ణ, పులి సైదులు, డానియేల్, సీపీఐ, సీపీఎం, టీడీపీ నేతలు శంకర్, నజీర్ అహ్మద్, నబీ, ముద్రగఢ వంశీ, ఎంసీ నాగిరెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏనాడూ పట్టభద్రుల కోసం పనిచేయని పల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
తప్పక చదవండి
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
Advertisement