-
No Headline
సిద్ధంగా ఉండాలని ఆదేశాలు గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకోసం యంత్రాంగం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా అధికారులు గ్రామపంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఎన్ని ఉన్నాయనే వివరాలు కూడా తెలియజేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చుకోవాలని నిర్మల్ జిల్లాకు ఆదేశాలు అందాయి. -
ఘనంగా పెందోర్ వంశస్తుల పెర్సాపెన్ పూజలు
నార్నూర్: సూర్యవంశీ రాజ్ గోండు మెద్నికర్ పెందోర్ వంశస్తులు పెర్సాపెన్ మహాపూజను బుధవారం మండలంలోని ఖైరదాట్వా గ్రామ పొలిమేరలో ఘనంగా నిర్వహించారు. గ్రామం నుంచి పొలిమేర వరకు ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఊరేగింపు చేపట్టారు. పెర్సాపెన్ పెద్ద దేవుడు వద్ద పెందోర్ వంశానికి చెందిన 23 మంది కొత్త కోడళ్లతో సంప్రదాయ భేటీ నిర్వహించారు. కార్యక్రమంలో పెర్సాపెన్ కటోడా నీలాశావ్, అర్జున్, ఆనందరావు, తుకారాం, సంతోష్, పెర్సాపెన్ పటేల్ బొజ్జు, గ్రామ పటేల్ నారంజీరావు, గ్రామ పెద్దలు తుకారాం, భగవంత్రావు, పెందోర్ వంశస్తులు, సోరియల్, దారియల్, భారీగా పాల్గొన్నారు. -
మంత్రిని కలిసిన గెస్ట్ లెక్చరర్లు
భైంసాటౌన్: సమస్యలు పరిష్కరించాలని బాసర ట్రిపుల్ఐటీ గెస్ట్ లెక్చరర్లు, ల్యాబ్ సిబ్బంది బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి విన్నవించారు. వారు మాట్లాడుతూ.. 2018 నుంచి పనిచేస్తున్నా ప్రతి సెమిస్టర్కు ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నారని తెలిపారు. వేసవిలో రావాల్సిన వేతనం అందించడంలేదని పేర్కొన్నారు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి వివరించారు. తమను ఏటా ఆటో రెన్యూవల్ చేయాలని మంత్రికి విన్నవించారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి భైంసాటౌన్: ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సొలొమాన్రాజ్ సూచించారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్–2.0 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భా గంగా వైద్యసిబ్బందితో ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ఉద్యోగులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చే యాలని సూచించారు. కార్యక్రమంలో డి ప్యూటీ ఆర్ఎం ప్రవీణ్కుమార్, డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీల త, కిరణ్కుమార్, హెల్త్ వలంటీర్లున్నారు. -
జాతీయస్థాయి న్యాయ నిర్ణేతలుగా ఎంపిక
ఆదిలాబాద్: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జిల్లాకు చెందిన పలువురు అర్హత సాధించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఈనెల 19నుంచి 21వ తేదీ వరకు తైక్వాండో న్యాయ నిర్ణేతల సెమినార్, పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొరిగి, పూమ్స్ విభాగాల్లో జిల్లాకు చెందిన తైక్వాండో మాస్టర్ అన్నారపు వీరేశ్, శృతి వీరేశ్, కన్య, మాధవి, గొంగళి శివకుమార్, వనిత రాథోడ్ జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించారు. ఈ మేరకు నిర్వాహకులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి శివకుమార్, సాత్విక్, వనిత రాథోడ్, విరాజ్ తేజ బ్లాక్బెల్ట్, డాన్ వన్బెల్ట్ సాధించారు. -
ఇక ‘స్థానిక’ సమరం!
● జూలైలో ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ● కులగణన చేపడితే మరింత జాప్యం ● ముగిసిన సర్పంచుల పదవీ కాలం ● గ్రామపంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు గ్రామపంచాయతీల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. సర్పంచులను నేరుగా ఎన్నుకోనుండగా, ఉపసర్పంచ్ను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల కోసం ప్రతీ వార్డుకు ఒక పోలింగ్స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరుగా తెలుపు, గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులుండవు. ముందుగానే ముగ్గురు, నలుగురు పేర్లతో కూడిన నమూనా బ్యాలెట్ పేపర్లను మూడు, నాలుగు విధాలుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.నేరడిగొండ/నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న లెక్కింపు నిర్వహించనున్నారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి వెల్లడించిన విషయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నా యి. లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్ని కలు ఉంటాయని సూత్రప్రాయంగా సీఎం తెలపడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియగా.. 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై పల్లెల్లో నాయకులు, ఆశావహుల సందడి మొదలైంది. ఈసారి అన్ని ఎన్నికలు ఒకేసారి! సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను గతంలో మూడు దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియగా, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వరకు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 5 వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి మూడు విభాగాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కులగణనకు ఉత్తర్వులు జారీ గత ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రెండు నెలలు పట్టే అవకాశముంది. అయితే కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సమరంలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయమై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. 200 మందికో పోలింగ్ కేంద్రం ప్రతీ 200 మందికో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ అధికారి ఉంటారు. అంతకుమించి ఓటర్లు ఆ వార్డులో 200 నుంచి 400మంది ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు సహాయ అధికారులను నియమిస్తారు. 400 నుంచి 650 మంది ఓటర్లుంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తారు. -
మహిళను అవమానపరిచిన కేసులో ఒకరికి జైలు
నిర్మల్టౌన్: మహిళను అవమానపరిచిన కేసులో ఓ వ్యక్తికి నిర్మల్ న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు సమన్వయ అధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి, బాధితురాలైన మహిళ ఒకే గ్రామానికి చెందినవారు. సదరు మహిళ భర్త దాసరి పోశెట్టి దగ్గర 10 రోజుల్లో అప్పు తీరుస్తానని 2015లో రూ.10వేలు సూరిమెడ పోశెట్టి అప్పు తీసుకున్నాడు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. 2016 ఫిబ్రవరి 26న దాసరి పోశెట్టి భార్య అయిన ఆమెకు సూరిమెడ పోశెట్టి వద్ద రావాల్సిన డబ్బులు తీసుకోమని చెప్పాడు. దీంతో ఆ మహిళ ఇంటి పక్కన గల మరో మహిళను వెంట తీసుకెళ్లి అతడి ఇంటికి వెళ్లి డబ్బులివ్వమని అడిగింది. దీంతో సూరిమెడ పోశెట్టి ఆ మహిళపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఆ మహిళ నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై రమణమూర్తి కేసు నమోదు చేశారు. పరిశోధన అనంతరం చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏపీపీవో రామకృష్ణ ఆరుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యం రుజువు చేశారు. దీంతో నిర్మల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అజయ్కుమార్.. సూరిమెడ పోశెట్టికి మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. -
రేబిస్ కలకలం
దస్తురాబాద్: మండల కేంద్రంలో రేబిస్ కలకలం రేపుతోంది. మండల కేంద్రంలో ఇప్పటికే ఐదు బర్రెలు మృతి చెందాయి. మరోవైపు మరిన్ని బర్రెలకు వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పశువైద్యులు స్పందించి మండల కేంద్రంలో రేబిస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పశు యజమానులు కోరుతున్నారు. బైకును ఢీకొన్న కారు నర్సాపూర్ (జీ): మండలంలోని అర్లి (కే) హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదుట భైంసా నుంచి నర్సాపూర్ (జీ)కి వస్తున్న బైకును నిర్మల్ నుంచి భైంసా వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న రాహుల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంబెల్లంపల్లి: బెల్లంపల్లి పాత బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పాత బస్టాండ్ ఏరియాలోని బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న తోపుడు బండిపై బుధవారం మధ్యాహ్నం 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి 8 గంటలకు కొందరు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వడదెబ్బ తగిలి చనిపోయాడా, మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపర్చారు. -
‘అకాల’ బీభత్సం
తలమడుగు: జిల్లాలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తలమడుగు మండలంలోని ఉండం గ్రామ సమీపంలో 33 కేవీ విద్యుత్ పోల్ విరిగింది. దీంతో తాంసి, తలమడుగు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. తాంసి మండలంతో పాటు తలమడుగు మండలంలోని సుంకిడి, ఉండం, లింగి, కుచులాపూర్, పల్సి బీ, పల్సి కే, సోనపూర్, కొత్తూర్, పునగూడా, ఝరి గ్రామాలకు విద్యుత్ అంతరాయమేర్పడింది. పునగుడ గ్రామంలో పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఒక ఇంటిపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పల్సి బీలో, పల్సి కే లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పల్సి బీ గ్రామంలో గోవింద్, కిషన్, నవీన్, నూర్సింగ్, రాథోడ్ లాలు ఇంటి పైకప్పులు లేచిపోయాయి. మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్డుపై చెట్లు విరిగిపోయాయి. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిచాయి. ఉట్నూర్ మండలంలో.. ఉట్నూర్రూరల్: మండలంలో బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్–మంచిర్యాల ప్రధాన రహదారికి ఇరువైపులా పాత ఉట్నూర్, నాగాపూర్ తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మండలంలోని చిన్నుగూడ చిన్నపాటి గ్రామంలో సిడాం భీంరావు, ఆత్రం రాము ఇండ్లు కూలిపోగా, ఆత్రం బారిక్రావు, ఆత్రం కాశీరాం ఇండ్ల పైరేకులు లేచిపోయాయి. ఇంట్లోని చిరు ధాన్యాలు తడిసిముద్దయ్యాయి. కుంటాల మండలంలో.. కుంటాల: మండలంలో బుధవారం సాయంత్రం అరగంట పాటు ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని కల్లూర్, కుంటాల, ఓలా, లింబా(కే), లింబా(బీ), కుంటాల, అంబకంటి, పెంచికల్పాడ్, అందాకూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కుంటాల, పెంచికల్పాడ్ కొనుగోలు కేంద్రాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న జొన్న కుప్పలు తడిసిపోయాయి. కల్లూర్, ఓలా, కుంటాల గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఓలాలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా రాథోడ్ దాదారావు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఇదే గ్రామానికి చెందిన రుక్మ ఇంటి పైనున్న రేకులు లేచిపోయి ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఖానాపూర్ మండలంలో.. ఖానాపూర్: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. గన్నీ సంచుల కొరత కారణంగా అధికారులు ధాన్య ం కొనుగోలు చేయకపోవడంతోనే తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలో.. నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. స్థానిక రాంరావ్ బాగ్లో డ్రైనేజీలు నిండి ఇండ్ల ఎదుట వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు. బోథ్ మండలంలో.. బోథ్: మండలంలోని మర్లపెల్లి, నిగిని, కంటెగాం, నక్కలవాడ తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. పలు గ్రామాల్లో చేతికందే జొన్నపంట నేలకొరిగింది. బోథ్ మార్కెట్ యార్డుకు రైతులు విక్రయానికి తెచ్చిన జొన్న పంట తడిసిపోయింది. తాంసి, భీంపూర్ మండలాల్లో.. తాంసి: తాంసి, భీంపూర్ మండలాల్లో బుధవారం సాయంత్రం గంటకు పైగా గాలివాన కురిసింది. తాంసి మండలంలోని తాంసి, వడ్డాడి, జామిడి, హ స్నాపూర్, గిరిగాం, కప్పర్ల, గోట్కూరి, సావర్గాం, భీంపూర్ మండలంలోని నిపాని, భీంపూర్, వడూర్, పిప్పల్కోటి, తాంసి(కే) గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. తాంసి మండల కేంద్రంలో కుంటాల రమేశ్ ఇంటిపై తాటిచెట్టు విరిగిపడింది. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఉండం సమీపంలో 33కేవీ విద్యుత్ స్తంభం విరిగిపడి తాంసి, తలమడుగు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. తాంసి మార్కెట్ సబ్ యార్డుకు రైతులు విక్రయానికి తెచ్చిన జొన్నపంట తడిసిపోయింది. నేరడిగొండ మండలంలో.. నేరడిగొండ: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పాత జాతీయ రహదారి అయిన వాంకిడి జాతీయ రహదారిపై రెండు వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. 44వ జాతీయ రహదారి వరకు ప్రయాణికులు కాలినడకన వచ్చారు. గ్రామస్తులు, అధికారులు స్పందించి జేసీబీ సాయంతో వృక్షాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ఇంద్రవెల్లి మండలంలో.. ఇంద్రవెల్లి: మండలంలోని అంజీ, మామిడిగూడ, వడగామ్, వాల్గోండ, పిట్టబొంగరం, తేజాపూర్, సాలేగూడ, పొల్లుగూడ, హర్కపూర్, పాటగూడ, మోడిగూడ, లింగాపూర్ గ్రామాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇండ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. వడగామ్ రింగ్ రోడ్పై చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. స్థానికులు రోడ్డుపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్లు వాహనాల రాకపోకలకు అంతరాయం పలు చోట్ల ఒరిగిన విద్యుత్ స్తంభాలు తీగలు తెగి నిలిచిన కరెంట్ సరఫరా పలు గ్రామాల్లో లేచిన ఇళ్ల పైకప్పులు -
ప్రమాదవశాత్తు చెరువులో పడి మనుబోతు మృతి
కుంటాల: మండలంలోని సూర్యాపూర్ పెద్దచెరువులో ప్రమాదవశాత్తు నీటిలో పడి మనుబోతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయపనుల కోసం వెళ్లిన రైతులు మూడు రోజుల క్రితం సూర్యాపూర్ చెరువు తూము వద్ద మనుబోతు మృతి చెందినట్లు గమనించారు. విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రాజుకు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి స్పందించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బుధవారం సాయంత్రం ఎఫ్ఎస్వో శ్రీనివాస్, ఎఫ్బీవో హరిలత ఘటనా స్థలానికి చేరుకున్నారు. పశువైద్యాధికారి ప్రకాశ్ పంచనామా నిర్వహించారు. నీరు తాగేందుకు వచ్చిన మనుబోతు ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందినట్లు ఎఫ్ఆర్వో రాథోడ్ రమేశ్ తెలిపారు. -
No Headline
జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలు జిల్లా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జీపీలు వార్డు సభ్యులు ఆదిలాబాద్ 158 17 17 467 3,840 మంచిర్యాల 130 16 16 311 2,730కుమురంభీం 123 15 15 334 2,874నిర్మల్ 156 18 18 396 3,336మొత్తం 567 66 66 1,508 12,780 -
గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్ట్
మోర్తాడ్: బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన హైదరాబాద్కు చెందిన ఆరుగురితోపాటు కమ్మర్పల్లికి చెందిన ఒకరు, నిర్మల్కు చెందిన మరో ఇద్దరు గంజాయి కేసులో అరెస్టు అయ్యారు. ఏర్గట్ల ఎస్సై మచ్చేందర్రెడ్డి బుధవారం తెలిపిన వివరాలు.. కమ్మర్పల్లికి చెందిన ఎండీ ఆరీఫ్ ఇంట్లో శుభకార్యానికి హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రహమాన్, ఎండీ అజర్, ఎస్కే శంషద్, సమీర్, ప్యార్శని వంశీవర్ధన్, ఎండీ సలీం పాషా హాజరయ్యారు. వీరు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ ఈతవనంలో మంగళవారం గంజాయి తాగుతూ హంగామా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరు నిర్మల్కు చెందిన షేక్ షాదుల్లా, సయ్యద్ అజారుద్దీన్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. 268 గ్రాముల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
సీసీఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమ(సీసీఐ)లో గల క్వార్టర్స్లో 36 ఏళ్లుగా నివసిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పరిశ్రమను 1997లో మూసివేయగా కార్మికులు ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలకు సంబంధించి హైకోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. కేసు ఫైనల్ కాకపోవడంతో కార్మికులు క్వార్టర్స్లోనే కుటుంబాలతో కలిసి ఇబ్బందుల నడుమ జీవిస్తున్నారని తెలిపారు. విషయం జీఎంకు తెలిసినప్పటికీ తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కట్ చేయిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్కు వివరించారు. జీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లుగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, కౌన్సిలర్ సాయి ప్రణయ్, సీసీఐ కార్మికులు భూషణం, స్వామి, కాళిదాసు, ఓదెలు, బాబు శర్మ తదితరులున్నారు. -
● అత్యవసరం పేరిట హడావుడి పనులు ● ఆగని అధికారుల ‘బినామీ’ దందా? ● నిధులు ఖర్చయినా నిష్ప్రయోజనమే ● బల్దియా అధికారుల నిర్వాకం
కై లాస్నగర్: గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ బల్దియాలో బినామీ కాంట్రాక్ట్ పనుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రజల అవసరాలు ఆసరాగా చేసుకున్న ఒకరిద్దరు అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీల పేరిట టెండర్లు దక్కించుకుని ఇష్టానుసారం పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులే కాంట్రాక్టర్ అవతారమెత్తడంతో పర్యవేక్షణ లోపించి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. తాజాగా బల్దియా పరిధిలో అత్యవసరం పేరిట చేపట్టిన హడావుడి పనులతో రూ.లక్షల ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు వెచ్చించినా నిష్ప్రయోజనమే పట్టణంలోని కాస్తాల రాంకిష్టు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో బల్ది యా అధికారులు ఇటీవల ఫిల్టర్బెడ్లో పైపులైన్ మరమ్మతు పనులుచేపట్టారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.26లక్షలు వెచ్చించారు. ఫిల్టర్బెడ్ నుంచి కేఆర్కే, పిట్టలవాడ, శంకర్గుట్ట కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు వీలుగా ఉన్న పైపులైన్కు కొత్తగా ఇంటర్నల్ కనెక్షన్ ఇచ్చారు. ఇందులో భాగంగా 600 మీటర్ల వరకు హైపవర్ పైపులతో పాటు ఆయా కాలనీలకు నీటిని సరఫరా చేసేందుకు, ఫిల్టర్బెడ్లోని వాటర్ ట్యాంక్, సంప్లోకి నీళ్లు నింపేందు కోసం కొత్తగా ఏడు వాల్వ్లను ఏర్పా టు చేశారు. అత్యవసరం పేరిట కౌన్సిల్ తీర్మా ణం లేకుండానే కలెక్టర్ ఆనుమతితో హడావుడిగా ఈ పనులు పూర్తి చేశారు. అయితే అధి కారు ల అవగాహన రాహిత్యం కారణంగా చేపట్టిన పనులతో నిధులు ఖర్చయ్యాయే తప్ప కేఆర్కే, శంకర్గుట్ట కాలనీలకు చుక్క నీరు అందని పరిస్థితి. దీంతో ఆయా కాలనీవాసులు ఇప్పటికీ బల్దియా ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఒక్కరోజు ట్యాంకర్ రాకపోయినా వారి కష్టాలు వర్ణనాతీతం. అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా.. ఫిల్టర్బెడ్లో జరిగిన ఈ పనులను బల్దియాలోని ఒకరిద్దరు ఇంజినీరింగ్ అధికారులే చేసినట్లుగా తెలుస్తోంది. హడావుడిగా టెండర్లను ఆహ్వానిస్తూ మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. స్వల్పవ్యవధిలో తమకు సన్నిహితంగా ఉండే ముగ్గురు కాంట్రాక్టర్లతో టెండర్లు దాఖలు చే యించి అందులో అనుకూలమైన ఒకరికి పనులను కట్టాబెట్టారు. అయితే ఈ పనులను సదరు కాంట్రాక్టర్ కాకుండా పర్యవేక్షించాల్సిన అధికా రులే బినామీగా మారి దగ్గరుండి చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. తమ తప్పిదాలు, అక్రమాలు కప్పిపుచ్చుకునేలా జాగ్రత్త వహిస్తూ పనులను హడావుడిగా పూర్తి చేశారనే విమర్శలున్నాయి.గతంలోనూ సదరు అఽధికారులు పట్టణంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను బినామీల పేర్లతో చేపట్టారనే ఆరోపణలున్నా యి. వీరి తీరుపై బల్దియా వర్గాలతో పాటు రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం చేపట్టిన పనుల ద్వారా కేఆర్కే కాలనీ, శంకర్గుట్ట కాలనీలకు నీటి సరఫరా జరగనప్పటికీ సంజయ్నగర్, రిక్షాకాలనీ, విద్యానగర్కు మాత్రం నీరు సరఫరా అయ్యేలా చూశామని తమ తప్పు కప్పిపుచ్చుకునే యత్నం చేస్తుండటం గమనార్హం. అధికారులు చెప్పినట్లుగా ఆయా కాలనీలకు సైతం పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని సంబంధిత కాలనీ వాసులు చెబుతున్నారు. ఉన్నతాఽధికారులు దీని పై సమగ్ర విచారణ జరిపిస్తే అక్రమాలు బయటపడే అవకాశముందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. నిబంధనల ప్రకారమే పనులు ఫిల్టర్బెడ్లో పనులు నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్ ద్వారా చేపట్టాం. అయితే దగ్గరుండి చేయించడంతో మేమే పనులు చేసినట్లుగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫిల్టర్బెడ్తో పోల్చితే కేఆర్కే కాలనీలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎత్తులో ఉండటంతో అక్కడికి నీరు సరఫరా కావడం లేదు. పనులు పూర్తయ్యాక విషయం తెలిసింది. అయితే ఫిల్టర్బెడ్ సంపులో నీరు నిల్వ చేయడం ద్వారా ట్యాంకర్లు నిరంతరం ఎలాంటి విద్యుత్ ఖర్చు లేకుండా నిండుతున్నాయి. నెలకు రూ.70వేల విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. – తిరుపతి, మున్సిపల్ ఇంజనీర్ -
● దేశంలో ఏర్పాటై 50 వసంతాలు పూర్తి ● వేడుకలకు సర్వం సిద్ధం ● రైతులకు అవగాహన కార్యక్రమాలు
బెల్లంపల్లి: రైతులకు ఆధునిక వ్యవసాయ సలహాలు, శాస్త్ర, సాంకేతిక అంశాలను అందించాలనే ప్రధాన లక్ష్యంతో దేశంలో ఏర్పడిన కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) యాభై వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బెల్లంపల్లి కేవీకేల్లో రైతు శిక్షణ తరగతులు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. స్వర్ణోత్సవ జయంతి జ్యోతి గురువారంబెల్లంపల్లికి చేరుకోనుండగా.. ఘనస్వాగతం పలకడానికి కేవీకే యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వర్ణోత్సవ జయంతి జ్యోతి రాక స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో గత నెల 22న స్వర్ణోత్సవ జయంతి జ్యోతిని నల్గొండ జిల్లా కంపసాగర్ కేవీకేలో ప్రారంభించారు. ఇప్పటివరకు గడ్డిపల్లి, వైరా, కొత్తగూడం, మల్యాల్, మామ్నూర్, జమ్మికుంట, రామగిరిఖిల్లా కేవీకేకు చేరుకోగా అక్క డి నుంచి బెల్లంపల్లి కేవీకేకు తీసుకు రానున్నారు. ఈ నెల 24వరకు శిక్షణ తరగతులు, వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించి రైతులను చైతన్యవంతం చేస్తారు. 25న బెల్లంపల్లి నుంచి స్వర్ణోత్సవ జయంతి జ్యోతి బయల్దేరి ఆదిలాబాద్ కేవీకేకు చేరుకుంటుంది. అక్కడ 27వరకు కార్యక్రమాలు నిర్వహించి 28న రుద్రూర్ కేవీకేకు తీసుకెళ్తారు. రైతాంగానికి శిక్షణ తరగతులు బెల్లంపల్లి కేవీకేలో స్వర్ణోత్సవ జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పిస్తారు. ప్రదర్శనలు, క్షేత్ర దినోత్సవాలు నిర్వహిస్తారు. బెల్లంపల్లి కేవీకేలో ఇప్పటివరకు 250కి పైగా రైతు క్షేత్రాల్లో నూనెగింజలు, పప్పు దినుసుల పంటలపై ప్రథమ శ్రేణి ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామాల్లో సర్వే చేసి ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇప్పించారు. మహిళా రైతులకు గృహ విజ్ఞాన సంబంధిత కార్యక్రమాలు, విత్తనోత్పత్తిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు, ఎస్సీ, ఎస్టీ, ఉప ప్రణాళికతో వ్యవసాయ రంగంపై యువతను ఆకర్శించేందుకు శిక్షణ తరగతులు అమలు చేస్తున్నారు. బెల్లంపల్లి కేవీకే కార్యాలయం భవనంఆదాయం రెట్టింపే లక్ష్యం పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నాం. పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పిస్తూ అధిక దిగుబడులు సాధించడానికి తోడ్పడుతున్నాం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నాం. కేవీకే స్వర్ణోత్సవ వేడుకలను రైతులు విజయవంతం చేయాలి. – కోట శివకృష్ణ, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, బెల్లంపల్లిపుదుచ్చేరిలో మొదటగా.. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) ఆధ్వర్యంలో 1974 మార్చి 21న దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభించారు. దేశంలో పది జోన్లు ఏర్పాటు చేసి వీటి పరిధిలో 735 కేవీకేలను విస్తరించారు. పదో జోన్ పరిధిలో పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చేర్చారు. ఈ జోన్లో 72 కేవీకేలు ఉండగా రాష్ట్రంలో 16 రైతాంగానికి వ్యవసాయ సేవలు అందిస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ కేంద్రంగా కేవీకేను ప్రారంభించగా, 2018 మార్చి 17న ఢిల్లీ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ప్రధానమంత్రి మోదీ బెల్లంపల్లి కేవీకేను ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సేవలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
కైలాస్నగర్:పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసిన సిబ్బందిని అభినందించారు. ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నకిలీ వి త్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారుల తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రానున్న లోక్ అదాలత్లో ఎక్కువ శాతం కేసులు పరిష్కరించే దిశగా చొరవచూపాలని సూచించారు. పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే సైబర్నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి సాగు అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే క్రమంలో సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సమయ్ జాన్ రావు, డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బి.ప్రకాశ్, హసీబుల్లా, సీఐలు, ఎస్సైలు, రిజ ర్వ్, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ● కలెక్టర్ రాజర్షి షాకైలాస్నగర్: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీస్శాఖల అధికారులతో బుధవా రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల కట్ట డికి వ్యవసాయ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల సి బ్బందితో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో డీఎస్పీ, ఏడీఏ, ఆర్డీ వో, మండల, డివిజన్ స్థాయిలో తహసీల్దార్, సీఐ, ఏవోలు ఉంటారన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని ఈ బృందాలు గుర్తించాలన్నారు. ఈమేరకు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలోని విత్తన, ఎరువుల దుకాణాలు, గోడౌన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అనుమానం వచ్చిన వాటి శాంపిల్స్ను పరీక్షలకు పంపాలన్నారు. రవా ణా వాహనాలను కూడా తనిఖీ చేయాలన్నారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధి కారి పుల్ల్ల య్య, డీఎస్పీ జీవన్రెడ్డి, ఆర్డీవోలు వినోద్ కుమార్, జీవాకర్ రెడ్డి, తహసీల్దార్లు, పోలీస్, వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ధరణి, ప్రజావాణి దరఖాస్తులు వారంలోగా పరిష్కరించాలి కై లాస్నగర్: పెండింగ్లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించా రు. జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్ అధికారులతో బుధవారం సమావేశమయ్యా రు. మండలాల వారీగా తహసీల్దార్ల లాగిన్లో ఉన్న ధరణి దరఖాస్తులతో పాటు వారి పరిధి లోని ప్రజా వాణి పెండింగ్ అర్జీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న ప్రతీ దరఖా స్తును క్షుణ్ణంగా పరి శీలించి, అవసరమైతే క్షేత్రస్థా యి పరిశీలన చేసి ప రిష్కరించాలన్నారు. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్ లైన్లోనూ ఫైల్స్ను సిద్ధం చేయాలన్నారు. జూన్ రెండోవారంలో ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభమవుతుందని అప్పటిలోగా అన్నిరకాల పెండింగ్ దరఖాస్తులు పరి ష్కరించాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవోలు టి.వినోద్ కుమార్, జీవాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో 5,88,332 పత్తి విత్తన ప్యాకెట్లు
కై లాస్నగర్: జిల్లాలోని వివిధ మండలాల్లో గల 245 విత్తన డీలర్ల వద్ద 5,88,332 ప్యా కెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్న ట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన కు గురికాకుండా తమకు సమీపంలో ఉన్న దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. డీలర్లు ఎమ్మార్పీకి మించి విక్రయించినా, పత్తి విత్తనాలు అందుబాటులో ఉండి కూడా ఇవ్వనట్లయితే హెల్ప్లైన్ నంబర్ 8074812429, 9392779149పై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. విత్తన లభ్యతపై రైతులకు ఎలాంటి సందేహాలున్నా, ఇతర సలహాలు, సూచనల కోసం వ్యవసా య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్లైన్ నంబర్లకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. రేపు పాలిసెట్కైలాస్నగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవే శం కోసం నిర్వహించే పాలిసెట్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భరద్వాజ్ తెలి పారు. ఈనెల 24న జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన మూడు కేంద్రాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కా మర్స్ డిగ్రీ కళాశాల, విద్యార్థి డిగ్రీ కళా శాల, మావలలోని నలంద డిగ్రీ కళాశాలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు మొత్తం 1,059 మంది హాజరు కానునట్లు పేర్కొన్నారు. నిమిషం నిబంధ న ఉండడంతో ఆలస్యమైతే అనుమతించమని స్పష్టం చేశారు. -
● బల్దియాలో ‘మహిళా’ కమిటీ ● వేధింపులు అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు ● ఉత్తర్వులు జారీ చేసిన పురపాలకశాఖ ● కసరత్తు చేస్తున్న మున్సిపల్ అధికారులు
కైలాస్నగర్: బల్దియాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో వాటికి చెక్ పెట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. వేధింపులపై విచారణ జరిపి బాధితులకు అండగా నిలిచేలా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక అంతర్గత మహిళా కమి టీల ఏర్పాటుకు ఆదేశించింది. ఈ మేరకు గత నెల 29న మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. యంత్రాంగమంతా పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండటంతో ఈ కమిటీలపై దృష్టి సారించలేదు. తాజాగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. 2013 చట్టానికి లోబడి.. మహిళా ఉద్యోగులకు వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన చట్టాన్ని పరిగణలోకి తీసుకుని అంతర్గత మహిళా కమిటీల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్నగర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, నస్పూర్, క్యాతన్పల్లి మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో వివిధ హోదాల్లో మహిళా ఉద్యోగులు, కార్మికులు వేలాది మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారికి పనిచేసే చోట మరింత రక్షణ కల్పించేలా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ దిశగా బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం మున్సిపల్ పరిధిలో పని చేసే మహిళా ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశాల్లో వేధింపులకు గురైతే విచారణ జరిపి చర్యలు చేపట్టేలా అంతర్గత మహిళా కమిటీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీడీఎంఏ ఆదేశాలకనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. మహిళా ఉద్యోగులతో సమావేశం నిర్వహించి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతాం. – ఎండీ.ఖమర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ అంతర్గత కమిటీల స్వరూపం ఇలా.. ఈ కమిటీలో సీనియర్ మహిళా ఉద్యోగిని ప్రిసైడింగ్ అధికారిగా నియమించాలి. ఒకవేళ బల్దియాలో సీనియర్ మహిళా ఉద్యోగి లేనట్లైతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఒక సీనియర్ మహిళా ఉద్యోగిని ఎంపిక చేసి వారికి ఈ బాధ్యతలు అప్పగించాలి. కమిటీలో మరో ఇద్దరిని సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. మహిళా చట్టాలపై అవగాహన, సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహిళను నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే మహిళల సమస్యలపై పోరాటం చేసే, ఎన్జీవోలో పనిచేసే మహిళకు కమిటీలో చోటు కల్పించాలని స్పష్టం చేశారు. ఇలా ముగ్గరు మహిళలతో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. మహిళా ఉద్యోగులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీల ఏర్పాటుతో బల్దియాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
గిరి గ్రామాల్లో పెర్సపేన్ పూజలు
ఇంద్రవెల్లి: వైశాఖమాసం పురస్కరించుకుని మండల పరిధిలోని గిరి గ్రామాల్లో ఆదివాసీలు మంగళవారం పెర్సపేన్ (పెద్ద దేవుడు) పూజలు ఘనంగా నిర్వహించారు. వడగామ్లో కోర్కార్ ఆత్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా వాయిద్యాలు వాయిస్తూ పెర్సపేన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కటోడ(పూజారి) ఇంట్లో సంప్రదాయ పూజలు చేశారు. ప్యాలాలు, పుట్నాలు, కానుకలు వేసి మొక్కులు సమర్పించారు. అనంతరం గ్రామ సమీపంలోని పవిత్రమైన మడుగులో స్నానం ఆచరించారు. రాత్రి మహాపూజ అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి కోర్కార్ ఆత్రం వంశీయులు తరలివచ్చారు. -
క్లుప్తంగా
గంజాయి స్వాధీనం బజార్హత్నూర్: మండలంలోని టెంబి గ్రామంలో పంట చేనులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఉర్వత జలీంషా పంట పొలంలో తనిఖీ చేయగా 500 గ్రాముల (రూ.12వేలు) గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన శ్రీకాంత్, అరుణ్, సతీష్పై దాడి చేసిన రవితేజ, చెప్పు అనే వ్యక్తులపై టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 20న క్రాంతినగర్ రోడ్డుపై అడ్డంగా రవితేజ, చెప్పు అనే ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆ రోడ్డు గుండా వెళ్తున్న శ్రీకాంత్, అరుణ్ వాహనం వారికి తాకగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. వీరితో పాటు మరో వ్యక్తి సతీష్పై కూడా దాడికి దిగారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఆటో చోరీ
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన రౌతు విక్కి ఈ నెల 19న రాత్రి తన ఇంటి ముందు ఆటోను పార్కింగ్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఆటో కనిపించకుండా పోయింది. దీంతో ఆయన చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపారు. నీలగిరి తోట దగ్ధం లోకేశ్వరం: మండలంలోని బిలోలిలోని సాయినేని సౌజన్య అనే మహిళా రైతుకు చెందిన నీలగిరి తోటకు మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. బాధిత మహిళ తనకున్న 22 ఎకరాల్లో కొన్నేళ్ల క్రితం నీ లగిరి చెట్లను నాటింది. మంగళవారం సాయంత్రం చెట్లకు నిప్పంటుకోవడంతో పదెకరాల్లో చెట్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహా రం అందించాలని బాధితురాలు కోరుతోంది. ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన కొలాం, తోటి, కొలావర్ విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తి చేసినవారు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులలో ప్రవేశం పొందవచ్చన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్రూరల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని అంకోలి, అనుకుంట గ్రామాల్లోని విత్తన షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, విత్తన ప్యాకెట్లపై ఉన్న లాట్ నంబర్, షాప్ డోర్ నంబర్, బిల్ బుక్, తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన షాపులలో అందుబాటులో ఏఏ విత్తనాలు, ఎన్ని అందుబాటులో ఉన్నాయో స్టాక్ బోర్డుపై రాయాలన్నారు. మండలంలోని రైతులు విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కావాల్సిన విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల వద్దనే విత్తనాలు తీసుకోవాలన్నారు. విత్తనాలు తీసుకునేటప్పుడు బిల్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అష్రఫ్, ఏఎస్సై సునీత, తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచింగ్
జైనథ్: 44వ నంబరు జాతీయ రహదారిపై గల మాండగాడ బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో పన్నాల భారతి అనే మహిళ మెడలోంచి 3 తులాల గొలుసు చోరీకి యత్నించిన మండలంలోని పిప్పర్వాడకు చెందిన డిడాకర్ శ్యాంసుందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పన్నాల భారతి మహారాష్ట్రలోని చిన అర్లి గ్రామానికి వెళ్లి సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యింది. మండలంలోని మాండగాడ బస్ స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆమె వెనక ఉన్న శ్యాంసుందర్ మెడలోంచి మంగళ సూత్రం లాక్కొని పరిగెత్తాడు. గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. చైన్ను స్వాధీనం చేసుకొని మంగళవారం కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. -
బడిబయట నుంచి గురుకులానికి
బడికి దూరంగా ఉన్న బాలురను అక్కున చేర్చుకుంటుంది జిల్లాకేంద్రంలోని యూఆర్ఎస్. విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని గురుకులాల వైపు మళ్లిస్తున్నారు. గిరి గ్రామాల్లో పెర్సపేన్ పూజలు వైశాఖమాసం పురస్కరించుకుని ఇంద్రవెల్లి మండల పరిధిలోని గిరి గ్రామాల్లో ఆదివాసీలు మంగళవారం పెర్సపేన్ పూజలు ఘనంగా నిర్వహించారు. 9లోu బుధవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 20248లోu ● ఇటీవల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో గల ఓ బిర్యానీ హౌస్లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి భోజనం చేద్దామని ప్లేట్లో వేసుకునే సరికి అందులో నుంచి బొద్దింక కళేబ రాలు బయట పడ్డాయి. హోటల్కు వెళ్లి య జమానితో మా ట్లాడితే పట్టించుకోకపోవడంతో పాటు కస్టమర్నే బెదిరించాడు. విషయాన్ని సదరు వ్యక్తి అఽ దికారులకు ఫిర్యాదు చేయగా మరుసటి రోజు హోటల్ను తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లోకి వెళితే అపరిశుభ్రం దర్శనమిచ్చింది. దీంతో యజ మానికి రూ.20వేల జరిమానా విధించారు. ● ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో గల ఓ హోటల్లో నుంచి ఓ వ్యక్తి బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి తెరిచి చూడగా అందులో నుంచి ఎలుక మలం దర్శనమిచ్చింది. వెంటనే అక్కడికి చేరుకొని యజమానితో వాగ్వాదానికి దిగాడు. వారు తప్పు జరిగిందని, మరొకటి తీసుకెళ్లాలని సూచించినప్పటికీ ఆ వ్యక్తి తీసుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. జిల్లా కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుబజార్హత్నూర్: రైతులకు నకిలీ విత్తనా లు, ఎరువులు, పురుగుమందులను అంటగడితే కఠిన చర్యలు తప్పవని సీడ్స్, ఎరువుల దుకాణాదారులను ఏడీఏ శ్రీధర్స్వామి హెచ్చరించారు. అవసరమైతే దుకా ణాల లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేశా రు. మండలకేంద్రంలోని పలు విత్తన దు కాణాలను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నా ణ్యమైన విత్తనాలు, ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నా రు. వారి వెంటఏవో ప్రమోద్రెడ్డి, ఏఈవో సంతోష్, నాగభూషణ్, రమణ, ప్రశాంత్, ఆశన్న, గోవర్ధన్, ముత్తన్న పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి ఎదులాపురం: నకిలీ విత్తనాలు, బ్లాక్ మా ర్కెట్ అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు బండి దత్తాత్రి, చిల్క దేవిదాస్, వెంకట నారాయణ, జగన్సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో దాదాపు 4 లక్షలు ఎకరాల్లో పత్తి పంట సాగు కానున్న ట్లు తెలిపారు. సుమారు 10లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరముతాయన్నారు. ఈ మేరకు డిమాండ్ రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా అధికారులు స్పందించి రైతుల డిమాండ్ మేరకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. ఆదిలాబాద్టౌన్: హోటళ్లు, రెస్టారెంట్ల పక్క నుంచి వెళితే బిర్యానీ ఘుమఘుమ లాడిస్తుంటుంది. ఒక్కసారి వెళ్లి తింటే బాగుంటుందనే కోరిక కలగక మానదు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో పేరుకు పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయినప్పటికీ మీద మెరుగు.. లోపల మురుగనే చందంగా ఉంది పరిస్థితి. కిచెన్లోకి ‘నాట్ అలౌడ్’ అనే బోర్డు పెట్టి తమ పని కానిచ్చేస్తున్నారు. ఒక్కసారి అందులోకి తొంగిచూస్తే చాలు జీవితంలో అలాంటి ఫుడ్ తినొద్దు అనుకోవడం ఖాయం. కుళ్లిన సరుకులు చూస్తే వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదా, పాడైన చింతపండు, నాసిరకం అల్లంవెల్లుల్లి, తదితర వాటితో కిచెన్ కంపు కొడుతుంది. ఒక్కసారి తయారు చేసిన మసాలాలు ఓ గంజిలో వేసి రోజు వేడి చేస్తూ వాటినే కళ్లకు ఇంపుగా డెకరేట్ చేస్తూ వడ్డించడం షరా మామూలే. వంట గదులు అపరిశుభ్రం.. హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించి కిచెన్లను శుభ్రంగా ఉంచడం లేదు. కుళ్లిన ఆహార పదార్థాల నే వంటలో వినియోగిస్తున్నారు. మసాలాలు గ్రైండింగ్ చేసి వాటిని వారం వరకు ఉపయోగిస్తున్నా రు. వాటిపై ఎలాంటి మూత పెట్టకపోవడంతో అందులో పురుగులు, బొద్దింకలు, బల్లులు పడడంతో పాటు ఎలుకలు సైతం సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులకు సరిపడా చికెన్, మట న్ ఒకేసారి తీసుకొస్తున్నారు. వాటిని పసుపులో ఉడికించి బిర్యానీలో వాడుతున్నారు. మిగతా వాటిని ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో బిర్యానీ చేసిన తర్వాత మిగిలిపోతే అందులోని ముక్కలను తీసి మరుసటి రోజు బిర్యానీలో వేస్తున్నట్లు సమాచారం. ఘుమఘుమ లాడేందుకు అందులో టెస్టింగ్ పౌడర్ వేస్తున్నారు. కాగిన నూనే మళ్లీ వినియోగంలోకి.. ఒకసారి వినియోగించిన నూనెను వంటకాల్లో పదేపదే వినియోగిస్తుండడంతో జనం క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యు లు చెబుతున్నారు. రోడ్డు పక్కన తోపుడు బండ్లు, బేకరీలు, రెస్టారెంట్లలో సైతం ఇదే జరుగుతుంది. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోప ణలున్నాయి. న్యూస్రీల్ నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు నిల్వ ఉంచిన చికెన్, మాంసంతోనే వంటలు నాసిరకం సరుకులు.. కాగిన నూనే మళ్లీ వాడకం అనారోగ్యం ‘కొని’ తెచ్చుకుంటున్న జనం ఫిర్యాదు చేస్తేనే అధికారుల తనిఖీలు క్యాన్సర్ సోకే ప్రమాదం.. కాగిన నూనెను వంటకాల్లో వాడితే అల్సర్ వస్తుంది. ఎక్కువ రోజులు ఉడికించిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. పెద్ద పేగు, చిన్న పేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ క్రాంతి కుమార్, ఎండీ యజమానులకు నోటీసులు అందజేస్తాం వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేస్తాం. పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపడతాం. తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాం. పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. – నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ, ఆదిలాబాద్ క్యాన్సర్ సోకే ప్రమాదం.. కాగిన నూనెను వంటకాల్లో వాడితే అల్సర్ వస్తుంది. ఎక్కువ రోజులు ఉడికించిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. పెద్ద పేగు, చిన్న పేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ క్రాంతి కుమార్, ఎండీ యజమానులకు నోటీసులు అందజేస్తాం వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేస్తాం. పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపడతాం. తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాం. పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. – నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ, ఆదిలాబాద్ (21ఏడిఐ56) పట్టించుకోని.. ఫుడ్ సేఫ్టీ హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహార పదార్థాలు వినియోగించకుండా చర్యలు చేపట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వీరి అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తేగాని సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడం గమనార్హం. -
హడావుడికే పరిమితం!
● రిమ్స్లో ఆరోపణలపై విచారణలు నామమాత్రం ● ఘటనలు జరిగినప్పుడే సద్దుమణిగేలా కమిటీలు ● రోజులు గడిచినా వెల్లడికాని నివేదికలు సాక్షి,ఆదిలాబాద్: ఆదివాసీ అమాయక గిరిజనులు అత్యధికంగా నివసించే ఆదిలాబాద్ వంటి ప్రాంతంలో వారికి మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు ఆరోగ్య ప్రమాణాలు పెంపొందించేందుకు సర్కారు వైద్య కళాశాల రిమ్స్ ఏర్పాటైంది. అయితే అది ఆ లక్ష్యాలను అందుకోగలుగుతుందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఆస్పత్రిలో జవాబుదారితనం కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా వైద్యసేవల పరంగా ఆరోపణలు వచ్చినప్పుడు, సేవలందించే విషయంలో విమర్శలు వ్యక్తమైనప్పుడు దానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో నిండా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. ఈనేపథ్యంలో ఇలాంటి సంఘటనలపై దృష్టి సారించాలనే అభిప్రాయం సామా న్య జనం నుంచి వ్యక్తమవుతుంది. ఇదీ పరిస్థితి.. గర్భకోశ సంబంధిత సమస్యతో ఉట్నూర్ మండలం శ్యాంపూర్ లక్సెట్టిపేట సమీపంలోని చిన్నగూడకు చెందిన ఆత్రం లక్ష్మిబాయి(55) బాధపడుతూ ఏప్రిల్ 30న రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం రాగా, ఆమెను చేర్చుకునేందుకే సిబ్బంది నిరాకరించారు. రాత్రి 11నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు సుమారు ఐదున్నర గంటల పాటు ఆమె స్ట్రెచర్పైనే ఉంది. అక్కడ చికిత్స అందించే పరిస్థితులు వారి కుటుంబ సభ్యులకు కనిపించకపోవడంతో ఆ మహిళను తిరిగి గ్రామానికి తీసుకెళ్లగా మే 1న ఆమె మృతి చెందింది. దీనిపై శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంలో ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు విచారణపై అతిగతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సేవలు ఎలా మెరుగవుతాయనేది ఆలోచించదగ్గ విషయమే. అలాగే ఆస్పత్రిలో పేషెంట్కేర్ సిబ్బంది అయిన ఓ మహిళ ఈనెల 15న ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం కలిగించింది. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణ చేయిస్తామని డైరెక్టర్ స్పష్టం చేసినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో రిమ్స్లో సేవలు అందించే సిబ్బందికి మనోధైర్యం ఎలా ఇవ్వగలుగుతారనేది ప్రశ్నార్థకమే. కలెక్టర్ దృష్టి సారించాలనే అభిప్రాయం.. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్లో జరిగే ఘటనల కు సంబంధించి విచారణపై నివేదిక రూపొందించే విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం విచారణకు కమిటీలు నియమించడం.. వారు ఆ విచారణ చేపడుతున్నారో లేదో.. ఆ తర్వాత ఎవరికీ తెలియని పరిస్థితి. దానిపై నివేదిక తయారు చేసి ఎవరికి పంపిస్తున్నారు.. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. ఇలాంటివేవి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రిమ్స్లో జవాబుదారి తనం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సామాన్య జనం నుంచి వ్యక్తమవుతుంది. ఈ విషయంపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వి వరణ కోరగా, ఆదివాసీ గిరిజన మహిళకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చిందని తెలిపారు. అలాగే పేషెంట్కేర్కు సంబంధించి కమిటీ విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement