-
జగనన్న నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి విశేష సేవలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అరకు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనూజారాణి తెలిపారు. బుధవారం పార్వతీపురం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎంపై నమ్మకాన్ని రుజువు చేసేలా.. నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో సీఎం జగన్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రుజువు చేసిందన్నారు. తాను రాజకీయాలకు కొత్త అన్నారు. వైద్యురాలిగా పాడేరు ఐటీడీఏ పరిధిలో తోటి గిరిజనులకు సేవ చేస్తున్నానని తనూజారాణి పేర్కొన్నారు. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం.. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలుగా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్కు భార్యగా, తన తండ్రి గుమ్మా శ్యాంసుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారని.. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని తనూజారాణి తెలిపారు. అనూహ్యంగా అవకాశం.. అనూహ్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అరకు పార్లమెంట్ బరిలో నిలిపి గిరిజనులకు సేవచేసే భాగ్యం కల్పించారన్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా గిరిజనులకు సేవ చేస్తానని చెప్పారు. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని వర్గాల ఓటర్లు సీఎం జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశయంతో ఉన్నారన్నారు. ఆ నమ్మకమే ఎంపీగా, నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. ప్రతీ కుటుంబానికి ఆర్థిక లబ్ధి జగనన్న ప్రభుత్వం అర్హత గల ప్రతీ కుటుంబం పథకాల రూపంలో ఆర్థికంగా లబ్ధిపొందిందన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించి గిరిజన ప్రాంత సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్ ఇవ్వడానికే పవన్ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు. టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు. బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్ వ్యూహాత్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్ ఫర్ టాట్’గా కలరింగ్ ఇవ్వడం ఆ ఇద్దరికే చెల్లిందంటున్నారు. పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో.. నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ మాటున పవన్ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది. బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు. సీఎం పదవి లేదన్నలోకేశ్కూ జీ హుజూరే! టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్ కళ్యాణ్కు వాటా లేదంటూ గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్ అనేశారు. నెల కిత్రం లోకేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు. -
చంద్రబాబు మోసం.. నక్కాకు చేదు అనుభవం
సాక్షి, అల్లూరి: చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది ఆయనకి. నక్కా ఆనంద్ బాబు తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం. అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. దీంతో నక్కా ఆనంద్బాబును అడ్డుకోవడం ద్వారా టీడీపీ అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు కార్యకర్తలు. -
అరకుకి వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ
విశాఖపట్నం: అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమన్వయ పర్చేందుకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటుచేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. అరకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు అరుణకుమారి, పెదబయలు మండల మాజీ ఎంపీపీ జర్శింగి సూర్యనారాయణ, హుకుంపేట మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు పోయా రాజారావులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక నుంచి అరుకు నియోజకవర్గ పరిధిలో పార్టీపరంగా జరిగే కార్యక్రమాలన్నింటిని ఈ త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్యాన్ గుర్తుపై గెలిచి పార్టీకి.. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడుస్తూ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయించినప్పటికీ పార్టీ క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరకుండా తామంతా వైఎస్సార్సీపీ వెంటే ఉన్నానని తేల్చిచెప్పారు. కిడారి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగిన నష్టం ఏమీ లేదని, గిరిజనులంతా వైఎస్సార్ సీపీకి అండగానే ఉన్నారని ఇటీవల పార్టీ పిలుపు మేరకు జరిగిన కార్యక్రమాల ద్వారా రుజువు చేశారు. పార్టీ క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు కిడారి పార్టీ ఫిరాయించిన మరునాడే జిల్లా పార్టీ నేతలంతా అరుకు వెళ్లి కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపారు. ఆ తర్వాత పార్టీ ఇచ్చిన ప్రతీ పిలుపునకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండృలాల్లోనూ పార్టీశ్రేణులు స్పందిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని సమన్వయపర్చే లక్ష్యంతో పార్టీ అధినాయకత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement