-
క్వింటా ఎండుమిర్చి రూ.12 వేలు
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటా ఎండుమిర్చి రూ.12 వేలు పలికాయి. మార్కెట్కు 52 క్వింటాళ్ల సరుకు రాగా, అధికారులు ఈ– నామ్ పద్ధతిలో వేలం వేశారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అక్కడక్కడా వర్షం అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట, గాండ్లపెంట, మడకశిర, తనకల్లు, అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, విడపనకల్లు మండలాల్లో పదును వర్షం కురిసింది. కదిరి, అమడగూరు, నల్లచెరువు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఆత్మకూరు, కంబదూరు, బెళుగుప్ప, గార్లదిన్నె, ఉరవకొండ, కూడేరు, గుంతకల్ల, పామిడి తదితర మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్ల వర్షం పడింది. 22 వరకు వర్షాలు.. 22వ తేదీ వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు తెలిపారు. -
మూడంచెల భద్రత
జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు హిందూపురం ‘బిట్’ కళాశాలలోనూ, మరో రెండు నియోజకవర్గాల ఈవీఎంలు లేపాక్షి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వద్ద స్ట్రాంగ్రూంలలో భద్ర పరిచాం. స్ట్రాంగ్రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అక్కడ 24 గంటలూ రక్షణ ఉండేలా మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల నిఘా కూడా ఉంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు వరకూ అలాగే ఉంటుంది. ఎవ్వరూ లోనికి వెళ్లడానికి ఉండదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. – అరుణ్బాబు, జిల్లా ఎన్నికల అధికారి -
నిలిచిన ఆర్టీఏ సేవలు
అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో సర్వర్ పనిచేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. గత కొన్నేళ్ల కిందట ఆర్టీఏ సేవలు మొత్తం ఆన్లైన్ చేశారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ మెయింటెన్స్ చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ పనిచేయడం లేదు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ సేవలు తదితర కార్యకలాపాలు నిలిచిపోయాయి. మూడు రోజుల వ్యవధిలో నిలిచిపోయిన కార్యకలాపాలన్నీ సోమ, మంగళవారాలకు వాయిదా వేశారు. డ్రైవింగ్ లైసెన్స్లు, ఎల్ఎల్ఆర్ల స్లాట్స్ కూడా వాయిదా వేసుకోవాలని ఆర్టీఓ సురేష్నాయుడు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాటికి సర్వర్ పనిచేస్తుందని రాష్ట్ర ట్రాన్స్పోర్టు కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్లు వివరించారు. సోమవారం నుంచి యథావిధిగా కార్యాలయ సేవలు కొనసాగుతాయని తెలిపారు. వసతి గృహాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు అనంతపురం రూరల్: మైనార్టీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 2024–25విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వసతి గృహాల్లో 6–10వ తరగతి వరకు వంద మంది మైనార్టీ బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండి, రేషన్కార్డు, ఆధార్కార్డు కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 97039 42423 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
చెన్నకేశవా..మము బ్రోవుమా
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు శుక్రవారం లక్ష్మీచెన్నకేశవస్వామి సర్వభూపాల, సింహ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు స్వామివారి మూలవిరాట్ను ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ దాసెట్టి సుబ్రహ్మణ్యం సమక్షంలో అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్లు సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. సాయంత్రం సింహవాహనంపై లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. కాగా, శనివారం స్వామివారు కల్పవృక్ష, హనుమద్ వాహనాలపై పురవీధుల్లో ఊరేగనున్నారు. -
పిడుగు పాటుకు ఆవు సజీవ దహనం
పావగడ: తాలూకాలోని అరసికెరె పోలీస్స్టేషన్ పరిధిలోని రంగసముద్రం గ్రామంలో గురువారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇందులో భాగంగానే ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. అదే విధంగా పిడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రైతు కరియప్పకు చెందిన పశువుల కొట్టం పిడుగు నిప్పు రవ్వల మంటలతో దగ్ధమైంది. కొట్టంలో ఉన్న ఆవు సజీవ దహనమైంది. మరో మూడు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఆవులకు కాపలాగా కొట్టంలో పడుకుని ఉన్న కరియప్ప, ఆయన మనువడు మహలింగ తీవ్ర గాయాల పాలయ్యారు. మహలింగ ఆవులను రక్షించబోగా మంటల్లో చిక్కుకుని మంటల వేడికి చేతులు, కాళ్లు స్వల్పంగా కాలాయి. వారిద్దరూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై అరసికెర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానిక తహసీల్దార్ సంతోష్కుమార్, పశు వైద్యాధికారి అశ్వర్థనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పిడుగు పాటుతో పశువుల కొట్టం, ఆవు పూర్తిగా దహనమై నష్టం జరిగిందని ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందివ్వాలని బాధిత కుటుంబీకులు తహసీల్దార్ను కోరారు. -
ఇండియన్ సిక్సర్స్, ఫ్యామిలీ క్లబ్ జట్ల గెలుపు
అనంతపురం: అనంతపురం క్రికెట్ లీగ్–2లో భాగంగా శుక్రవారం జరిగిన ఇండియన్ సిక్సర్స్, యూనైటైడ్ చాంపియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియన్ సిక్సర్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. టి.మహేందర్రెడ్డి 34 బంతుల్లో 48 పరుగులు (నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) , ఎం. రాజ కుళ్లాయప్ప 36 బంతుల్లో 43 పరుగులతో (2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూనైటెడ్ ఛాంపియన్స్ 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. బీఎస్ వినయ్కుమార్ కేవలం 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో ఇండియన్ సిక్సర్స్ జట్టు 26 పరుగుల తేడాతో గెలుపొందింది. బీఎస్ వినయ్కుమార్కు ‘మ్యాన్ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ● ఆర్డీటీ–బీ గ్రౌండ్లో దినేష్ గ్రానైట్స్, ఫ్యామిలీ క్లబ్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో ఫ్యామిలీ క్లబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. బి. యోగానంద 44 బంతుల్లో 57 పరుగులు ( ఆరు ఫోర్లు), రామమూర్తి 31 బంతుల్లో 42 పరుగులు, ఎస్కే ఇస్మాయిల్ 10 బంతుల్లో 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దినేష్ గ్రానైట్స్ జట్టు 18.3 ఓవర్లకు 126 పరుగులకు ఆలౌట్ అయింది. డీబీ ప్రశాంత్ 22 బంతుల్లో 30 పరుగులు, ఖాదర్వలి 29 పరుగులు, పి. గిరినాథరెడ్డి 26 పరుగులు చేశారు. మహమ్మద్ ఆసీఫ్ మూడు వికెట్లు తీసి దినేష్ గ్రానైట్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. యోగానందకు మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
No Headline
● బెంగళూరులో ఉద్యోగం చేస్తోన్న ఓ వ్యక్తి శనివారం సాయంత్రం కదిరి వెళ్లాలని ప్రయత్నించగా.. బస్సుల్లో సీట్లు దొరకలేదు. వెంటనే ‘కార్ పూలింగ్’ యాప్ను సంప్రదించి సీటు పొందాడు. అనుకున్న సమయానికి ముందే ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లాలని మరో ప్రయాణికుడు చిక్కబళ్లాపురం వద్ద అదే కారును ఆశ్రయించాడు. టోల్చార్జీలు పోగా.. తనకు గిట్టుబాటు అయ్యిందని డ్రైవర్ తెలిపాడు.● పుట్టపర్తికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లాలనుకున్నాడు. వేసవి సీజన్ కావడంతో పర్యాటకుల తాకిడితో రైలులో బెర్తు దొరకలేదు. బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ చూపించాయి. వెంటనే యాప్ ద్వారా ‘కార్ పూలింగ్’ చెక్ చేసుకున్నాడు. సీటు అందుబాటులో ఉండటంతో బుక్ చేశాడు. బస్సు చార్జీకే బెంగళూరుకు చేరుకున్నాడు. మధ్యలో గోరంట్లలో మరో ప్రయాణికుడూ అదే కారును ఆశ్రయించాడు.సాక్షి, పుట్టపర్తి అద్దె కారు ప్రయాణం ఖరీదైంది. ఇద్దరు.. నలుగురు కలిసి హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నుంచి పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లాలంటే రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు అవుతోంది. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ సమస్య. దీంతో చాలామంది కారులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ.. కారు ప్రయాణాన్ని చౌక ధరలకే అందిస్తోంది. ‘కార్ పూలింగ్’కు కొన్ని మొబైల్ యాప్లు అందుబాటులోకి రావడంతో జిల్లాలోని చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, గోరంట్ల, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లేవారు అక్కడి నుంచి తిరుగు పయనం అయ్యేవారు యాప్ ద్వారా కార్ పూలింగ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. పెరిగిన ‘కార్ పూలింగ్’ కల్చర్ జిల్లాలో కార్ పూలింగ్ కల్చర్ ఇటీవల బాగా పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఫలితంగా విద్యార్థులు, ఉద్యోగులు కార్ పూలింగ్ ద్వారా బెంగళూరుకు వెళ్లి వస్తున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, గోరంట్ల, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన చాలామంది ఉద్యోగులు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వారాంతపు సెలవుల్లో ప్రయాణాలు, మూడు రోజుకోసారి కంపెనీకి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగింది. తక్కువ ధరకే కారు ప్రయాణం అందుబాటులోకి రావడంతో నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య రెట్టింపయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కోర్టుల్లో కేసులు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు.. తదితర అవసరాల రీత్యా బెంగళూరుకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. ఓనర్కు.. రైడర్లకూ ఉపయోగమే యాప్లు కార్లు లేని వారికే కాదు.. సొంత వాహనాలున్న వారికీ ఉపయోగపడుతున్నాయి. వారాంతపు సెలవులు, పండుగల సమయాల్లో సొంతూళ్లకు వస్తున్న వారు.. యాప్ ద్వారా ఇతరులను వాహనాల్లో తీసుకొచ్చి.. లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను ఊర్లో దింపి.. తిరుగు పయనంలో ఒంటరిగా వెళ్తున్న సమయంలో చాలామంది యజమానులు కూడా ఈ యాప్ల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తుంటారు. బ్లాబ్లా, క్విక్ రైడ్ తదితర యాప్లపై చాలామందికి అవగాహన ఉంది. బస్సు చార్జీతో కారు ప్రయాణం అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో చాలామంది కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో యాప్ ద్వారా నిమిషాల్లో సీట్లు ఫుల్ అవుతున్నట్లు తెలుస్తోంది. నచ్చిన చోట పికప్, డ్రాప్ బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో దిగి.. అక్కడి నుంచి ఇంటికెళ్లాలంటే క్యాబ్కు రూ.200, రూ.300 చెల్లించాల్సిన పరిస్థితి. అదే యాప్ ద్వారా కార్లలో వెళ్తే నచ్చిన చోట పికప్, డ్రాప్ సదుపాయం ఉంటుందని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. పుట్టపర్తి, గోరంట్ల, పెనుకొండ నుంచి బెంగళూరు వెళ్లే వారు చాలామంది ‘కార్ పూలింగ్’నే అనుసరిస్తున్నారు. నచ్చిన చోటకు వాహనం వస్తుండటతో ఆటోలు, క్యాబ్లను సంప్రదించే పని లేకుండా ఉందని చెబుతున్నారు. పండుగ సమయాల్లో రద్దీ పండుగల సమయంలో రైళ్లలో సీట్లు దొరకవు. బస్సుల్లో సీట్లు ఫుల్ అవుతాయి. ఉన్నఫలంగా ఊరెళ్లాలనుకునే వారికి ఈ యాప్లు బాగా ఉపయోగపడుతున్నాయి. నిమిషాల్లో సీటు దొరకడం.. వెంటనే కారు రావడం.. గంటల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవడం.. ఇలా చకచకా జరిగిపోతున్నాయి. ఫలితంగా పండుగల సమయంలో టోల్ గేట్ల వద్ద కార్ల తాకిడి విపరీతంగా ఉంటోంది. జిల్లాలో పెరుగుతున్న ‘కార్ పూలింగ్’ కల్చర్ బస్సు చార్జీకే కారులో బెంగళూరుకు ప్రయాణం నచ్చిన చోట పికప్, డ్రాప్ సదుపాయం సమయంతో పాటు డబ్బు, ఇంధనం ఆదా పెరిగిన టెక్నాలజీతో ఎందరికో ఉపయోగంసమయం, ఇంధనం ఆదా కార్ పూలింగ్తో సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతోంది. ఒకే కారులో నలుగురు ప్రయాణిస్తున్న కారణంగా డబ్బు షేరింగ్ చేసుకుంటారు. ఒకసారి ఇంధనం కొట్టించి.. అందరూ ఒకేసారి ప్రయాణిస్తారు. ఎవరికి వారుగా ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తే డబ్బు ఖర్చు కావడంతో పాటు ఇంధనం వృథా అవుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్జామ్ అవుతుంది. పర్యావరణం కలుషితం అవుతుంది. కార్ పూలింగ్తో చాలా ఉపయోగాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అయితే రాత్రివేళల్లో ప్రయాణించే సమయంలో, మహిళలు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ‘కార్ పూలింగ్’ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రాప్తాడురూరల్: ఆటో వేగంగా వస్తూ రోడ్డుదాటుకుంటున్న ఎనుమును ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడితో పాటు ఎనుము కూడా మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున అనంతపురం రూరల్ మండలం పామురాయి గ్రామ సమీపంలో జరిగింది. రూరల్ పోలీసుల వివరాల మేరకు... గార్లదిన్నెకు చెందిన నారాయణస్వామి, వేణుఆచారి (66) మామా అల్లుళ్లు. ఉదయాన్నే పని మీద ఆటోలో అనంతపురం బయలుదేరారు. పామురాయి సమీపంలోకి రాగానే ఎనుము రోడ్డు దాటుకుంటోంది. గమనించని ఆటోడ్రైవర్ బీమా వేగంగా వచ్చి ఎనుమును ఢీ కొట్టాడు. దీంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో వేణుఆచారి మృతి చెందగా నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సర్వజన ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. ఆటోడ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏఎస్ఐ విజయ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గంలో మరొకరు... రాయదుర్గం రూరల్: పట్టణంలోని శాంతినగర్లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన అరవా గంగమ్మ (68) మృతి చెందినట్లు అర్బన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. రాత్రి కరెంట్ లేని సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఇంటి వద్దనే రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతున్న గంగమ్మను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. ఢీ కొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయిందన్నారు. కుమారుడు అరవా మైలారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తల్లిని చంపిన కుమారుడి అరెస్టు
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండల పరిధిలోని వైసీపల్లిలో ఈ నెల 14న కుంటుంబ కలహాలతో కొడుకు చేతిలో తల్లి దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు.... వైసీపల్లికి చెందిన వడ్డే సుంకమ్మ, రామదాసు భార్య, భర్తలు. వారి కుమారుడు వెంకటేశులు అనంతపురంలో భార్యతో పాటు ఉంటూ అప్పుడప్పుడూ గ్రామానికి వస్తుండేవాడు. ఈ నెల 14న వెంకటేశులు గ్రామానికి వచ్చాడు. అయితే సుంకమ్మ, రామదాసులు కుటుంబ కలహాలతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలోనే రామదాసు కాలికి గాయమైంది. నాన్నను గాయపరుస్తావా? అంటూ తల్లి సుంకమ్మ తలపై కొడుకు వెంకటేశులు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న నిందితున్ని శుక్రవారం కంబదూరు మండలం నూతిమడుగు వద్ద రూరల్ సీఐ నాగరాజు, కంబదూరు ఎస్ఐ, ఆంజనేయులు సిబ్బందితో కలసి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. రైల్వే సామగ్రి చోరీ కేసులో నిందితుల అరెస్టు అనంతపురం సిటీ: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని పాత క్వార్టర్స్ వద్ద ఉన్న రైల్వేకు సంబంధించిన పాత సామగ్రి చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అనంతపురం ఆర్పీఎఫ్ ఎస్ఐ మధుకర్చారి తెలిపారు. గురువారం జరిగిన ఘటనకు సంబంధించి కల్లూరుకు చెందిన దూద్వలి, జిలానీతో పాటు ఆటో డ్రైవర్ నల్లబోతుల నాగరాజును అరెస్టు చేశామన్నారు. పాత సామగ్రి చోరీకి ఉపయోగించిన ఆటోను సైతం సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్టు చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు వెల్లడించారు. మట్టి దిబ్బలు పడి కూలీ మృతి గుమ్మఘట్ట: మండలంలోని గలగల గ్రామానికి చెందిన గాజుల రాజశేఖర్ (41) అనే వ్యక్తిపై మట్టి దిబ్బలు పడి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజశేఖర్ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆర్.కొత్తపల్లి చెరువులోని ఇసుకను ఎద్దుల బండిలో తరలించేందుకు వెళ్లాడు. అడుగున ఉన్న ఇసుకను తవ్వుతుండగా పైన్నున్న మట్టిదిబ్బలు ఒక్కసారిగా మీద పడడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు మట్టిదిబ్బలను తొలగించేలోగా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
జీవన పోరాటం
చింత చెట్లకు చిగురు రావడంతో చిగురు కొస్తూ ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. ఎంత పెద్ద చెట్టు అయినా సరే చిటారు కొమ్మలకు చేరుకొని చిగురు సేకరించి అమ్ముతున్నారు. పట్టు తప్పితే ప్రాణాలకు ముప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చింత చిగురును కోస్తున్నారు. నాలుగు మెతుకుల కోసం ఈ కష్టం తప్పడం లేదని వారు చెబుతున్న మాటలు మనసున్నోళ్లెవరికై నా కన్నీళ్లు తెప్పించక మానవు. ఈ సీజన్లో వచ్చే అరకొర డబ్బులతో తమ కుటుంబాలు పోషించుకుంటున్నామని చెబుతున్నారు. పెనుకొండ పట్టణంలో ఇద్దరు మహిళలు చిటారు కొమ్మలో చిగురు సేకరిస్తున్న ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. – పెనుకొండ: -
బాధ్యుడిని వదిలేసి ఇతరులపై వేటు
తాడిపత్రిరూరల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. శాంతిభద్రతలు అదుపుతప్పడానికి ఏఎస్పీ రామకృష్ణ బాధ్యుడని ఆరోపణలు పెల్లుబికిన నేపథ్యంలో ఆయన్ను కాకుండా డీఎస్పీ గంగయ్య, పట్టణ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. తాడిపత్రి డీఎస్పీగా గంగయ్య 2023 మే5న బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో రాజకీయ వివాదాలు, శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదు. పోలింగ్ అనంతరం అల్లర్లను నియంత్రించేందుకు డీఎస్పీ గంగయ్య తన వంతు కృషి చేశారు. సిబ్బంది తక్కువగా ఉండటం టీడీపీ మద్దతుదారులు భారీగా ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి. పట్టణ సీఐగా ఉన్న మురళీకృష్ణ తాడిపత్రికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన కూడా వివాదాలకు దూరంగా ఉండేవారు. అల్లర్లను నియంత్రించడానికి సీఐ మురళికృష్ణ ప్రయత్నించి రాళ్ల దాడిలో గాయపడ్డారు. వీరిద్దరూ ఎస్పీతో పాటు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న ఏఎస్పీ రామకృష్ణ పరిధిలో ఉండటంతో సొంత నిర్ణయాలు తీసుకొని అల్లర్లను నియంత్రించలేని పరిస్థితి. అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐలు సస్పెండ్ చేశారు. అయితే ఏఎస్పీ రామకృష్ణ తప్పించుకోవడం బట్టి చూస్తే ఆయనకు చంద్రబాబుతో డైరెక్టు లింకు ఉందని, ఆ మేరకే తాడిపత్రికి ఎన్నికల ఇన్చార్జ్గా వేయించుకున్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓడించడానికి స్థానిక టీడీపీ నాయకులతో చేతులు కలిపారని , ఆ సంబంధాల ద్వారానే సస్పెండ్ను తప్పించుకొని ఉండవచ్చని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. తాడిపత్రి ఘటనలో బాధ్యుడైన ఏఎస్పీ సేఫ్జోన్ డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం -
స్ట్రాంగ్ పర్యవేక్షణ
కదిరి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను గట్టి పోలీస్ బందోబస్త్ మధ్య ఎంపిక చేసిన ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. జిల్లాలోని కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలకు, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను లేపాక్షి చోళసముద్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు తరలించారు. జూన్ 4వ తేదీన ప్రస్తుతం ఈవీఎంలు భద్రపరిచిన చోటే ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు.. ఇలా మూడంచెల్లో రాత్రింబవళ్లు భద్రత ఉంటుంది. వీరితో పాటు కంట్రోల్ యూనిట్ నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. అనుమతులు లేకుండా ఆ ప్రాంతానికి వెళ్లడానికి అవకాశమే ఉండదు. ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో పాటు జిల్లా ఎన్నికల అధికారికి కూడా అనుమతి లేనిదే స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లడానికి వీలులేదు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి స్ట్రాంగ్ రూంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే కాల్చివేత ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తూ స్ట్రాంగ్ రూంతో పాటు పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగితే నివారణకు అగ్నిమాపక శకటాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం సమస్య లేకుండా జనరేటర్లను అమర్చారు. కౌంటింగ్ రోజున ఓపెన్ ఓట్ల లెక్కింపు నాడు (జూన్ 4న) ఉదయం మాత్రమే స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల గదులకు వరుస క్రమంలో తరలిస్తారు. అప్పటి వరకూ ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలోనే ఉంటాయి. స్వయంగా జిల్లా ఎన్నికల అధికారి ఆయా నియోజక వర్గాల ప్రధాన పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంకు రెండు తాళాలు చొప్పున వేసి లక్కతో సీల్ వేసిన విషయం తెలిసిందే. ఒక తాళం చెవి(కీ)జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరోతాళం చెవి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద భద్ర పరిచారు. స్ట్రాంగ్ రూం పరిశీలనకు వచ్చే అధికారులను తప్ప... మరెవ్వరినీ అక్కడికి అనుమతించరు. వాహనాలకు నో ఎంట్రీ రెండో భద్రతా వలయాన్ని దాటే ప్రతి ఒక్కరూ తమ వివరాలను అక్కడ లాగ్బుక్(రిజిష్టర్)లో నమోదు చేయాలి. రిటర్నింగ్ అధికారి రోజూ ఉదయం, సాయంత్రం స్ట్రాంగ్ రూం ప్రాంగణాన్ని సందర్శిఽంచి లాగ్బుక్ను, సీసీటీవీ పుటేజ్ని పరిశీలిస్తారు. మంత్రులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, అధికారులు..చివరకు జిల్లా ఎన్నికల అధికారి అయినా సరే... వారి వాహనాలను మూడో అంచెలోకి అనుమతించరు. ఓట్ల లెక్కింపు నాడు స్ట్రాంగ్ రూంను ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరుస్తారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -
పచ్చబ్యాచ్కు పోలీసు వత్తాసు!
చిలమత్తూరు: పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీన మండలంలోని హుస్సేన్పురంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా స్థానిక పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా పోలింగ్ రోజున టీడీపీ నేతలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్ సీపీ శ్రేణులు లక్ష్యంగా రాళ్లు రువ్వారు. మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. 13వ తేదీ ఏం జరిగిందంటే.. పోలింగ్ జరిగిన 13వ తేదీ ఎంపీపీ పురుషోత్తమరెడ్డి తన స్వగ్రామం హుస్సేన్పురంలో పోలింగ్ సరళి పరిశీలిస్తున్నారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకుడు బాబురెడ్డి ఆయన్ను దుర్భాషలాడారు. అయినా సంయమనం పాటించారు. గొడవలు ఎందుకని భావించి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. టీడీపీ అల్లరి మూకలు ముందస్తు ప్లాన్ ప్రకారం కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఎంపీపీ కారుపై రాళ్లు రువ్వారు. ఎంపీపీ కారు దిగగా, ఆయన్ను హతమార్చాలని పెద్దపెద్ద బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎంపీపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన్ను రక్షించబోయిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్ తలకు తీవ్ర గాయమైంది. ఇంత జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం అటువైపు చూసిన పాపాన పోలేదు. దీంతో గ్రామస్తులంతా టీడీపీ అల్లరి మూకలపై తిరబడ్డారు. టీడీపీ నేత బాబురెడ్డికి దేహశుద్ధి చేశారు. అయితే పచ్చ బ్యాచ్ ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని టీడీపీ నేతపై దాడి జరిగిందంటూ నానా యాగీ చేసింది. దీనికి స్థానిక ఎస్ఐ గంగాధర్ కూడా సహకరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి పోలింగ్ ఏకపక్షం చేసే క్రమంలోనే టీడీపీ నాయకుడు బాబురెడ్డి తన అనుచరులు ద్వారా అలజడి సృష్టించారని గ్రామస్తులు చెబుతున్నారు. మడుపులు ముట్టడం వల్లేనా...? ఎస్ గంగాధర్ టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. పోలింగ్కు రెండు రోజులు ముందు ఓ టీడీపీ నేత స్టేషన్కు రూ.1.25 లక్షలు ఇచ్చినట్టుగా ఆరోపణలున్నాయి. నగదు పంపిణీ అడ్డుకోవద్దంటూ మరో రూ.10 లక్షలు, ప్రస్తుత కేసులో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, ఆయన అనుచరులను రిమాండ్కు పంపేందుకు మరో రూ.8 లక్షలు పోలీసులు తీసుకున్నట్లు మండల కేంద్రంలో చర్చ జోరుగా సాగుతోంది. కాగా ఎంపీపీ ఫిర్యాదు మేరకు 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దాడి పాల్పడిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా...బాధితులైన వైఎస్సార్సీపీకి చెందిన 19 మందిపై 147, 148, 324, 307 రెడ్విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఇరువర్గాలపై కేసు కట్టినా టీడీపీ నేతల ఫిర్యాదుపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చడం విశేషం. ‘కోడ్’ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దాడులు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ నేతలు హింసను ప్రేరేపించడం మొదలు పెట్టారు. ఉద్దేశ పూర్వకంగానే ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం, గొడవ పడటం వంటివి చేసేవారు. ఈ క్రమంలోనే ఏప్రిల్లో టీడీపీ నాయకుడు బాబురెడ్డి, తన అనుచరులతో కలిసి ఎంపీపీని లక్ష్యంగా చేసుకొని ఘర్షణకు దిగారు. ఈ ఘటన తర్వాత కూడా పోలీసులు అప్రమత్తం కాలేదు. సంబంధం లేకపోయినా స్టేషన్కు తరలింపు అల్లర్లకు ఘటనకు సంభందించి ఎన్నికల కమిషన్ ‘సిట్’ ఏర్పాటు చేసిందని చెబుతున్న పోలీసులు అమాయకులను వేధిస్తున్నారు. కేసుకు సంబంధం లేని వారిని పలువురిని స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారు. పలువువిపై కేసులు నమోదు చేసి వారు దొరక్కపోవడంతో వారి బంధువులను స్టేషన్కు తీసుకువచ్చారు. కేసులో నిందితులుగా పేర్కొన్న వారు లొంగిపోతేనే మిమ్మల్ని వదులుతామంటూ బెదిరిస్తున్నారు. గొడవలకు సంబంధంలేని వారిపై కేసులు పెట్టడం ఒక ఎత్తయితే వారి కుటుంబ సభ్యులనూ హింసించడం పట్ల ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పలువురు గ్రామస్తులు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల వైఫల్యం వల్లే హుస్సేన్పురంలో అల్లర్లు ముందస్తు సమాచారం ఉన్నా పట్టించుకోని ఎస్ఐ గొడవ సమయంలోనూ కనీస చర్యలు తీసుకోని వైనం అల్లర్ల ఘటన తర్వాత వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యం కుటుంబీకులనూ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్న ఖాకీ -
ఎండిన వక్క రైతుల ఆశలు
ధరపైనే రైతుల ఆశలు మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గంలో వక్క తోటలు అధికం. నియోజకవర్గంలోని రైతులను ఆర్థికంగా వక్క తోటలు ప్రతి ఏడాది అంతో ఇంతో ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా వక్క తోటల ఆదాయంపై రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశల అడియాశలయ్యాయి. రైతులు ఆశించినంత దిగుబడి ఈ ఏడాది వక్క తోటల్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎండ ప్రభావం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో వక్క తోటలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 1,500 హెక్టార్లలో పంటకొచ్చిన వక్క తోటలు ఉన్నాయి. ప్రతి ఏడాది వక్క తోటల నుంచి రైతులకు రూ. కోట్లల్లో ఆదాయం లభిస్తోంది. దాదాపు 10 వేల మంది రైతులు వక్క తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఏడాది అధిక ఎండలు వక్క తోటల రైతులను నట్టేట ముంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది ఎండలు దంచి కొట్టాయి. ఉష్ణోగ్రతలు మడకశిర ప్రాంతంలో 42 డిగ్రీ వరకూ నమోదయ్యాయి. ఆ ప్రభావం వక్క తోటలపైనా పడింది. ఎండ తీవ్రతకు వక్క కంకులు చెట్లలోనే ఎండిపోయాయి. వేసవి కాలంలోనే వక్క చెట్లలో కంకులు వస్తాయి. ఒక చెట్టుకు 5 నుంచి 10 వరకు వక్క కంకులు ఉంటాయి. ఇందులో ఎండ తీవ్రతకు రెండు నుంచి 3 వరకు వక్క కంకులు ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది వక్క దిగుబడి తగ్గడానికి ఎండ తీవ్రత కారణంగా మారింది. చెట్లలోనే ఎండిపోయిన వక్క కంకులు తగ్గనున్న దిగుబడి ఈ ఏడాది గిట్టుబాటు కాదంటున్న రైతులువక్క ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతాంగం ధర ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. దిగుబడి తగ్గినా ధర ఆశాజనంగా ఉంటే వక్క రైతుల ఆదాయం బాగుండే అవకాశం ఉంటుంది. లేకపోతే వక్క రైతులకు నష్టాలు తప్పవని అంటున్నారు. వక్క ధర క్వింటాల్ రూ. 50 వేల నుంచి రూ.55 వేల వరకు పలికితే రైతుల ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వక్క రైతులకు ఈఏడాది గడ్డు కాలమే. -
ఎస్పీ అమిత్ బర్దర్ సస్పెన్షన్
అనంతపురం/తాడిపత్రి: ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఎస్పీ అమిత్బర్దర్పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పాటు ఆయనపై శాఖాపరమైన విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణలను అదుపు చేయడంలో వీరు విఫలమైనట్లు ఈసీ గుర్తించింది. ఘర్షణలను ముందే పసిగట్టి అరికట్టలేదనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అలాగే,తాడిపత్రి లో జరిగిన ఘటనలపై నమోదైన ప్రతి కేసుపై విచారించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడిన తొలి ఎస్పీ.. జిల్లా పోలీసు చరిత్రలో గతంలో ఎన్నడూ ఓ ఎస్పీ సస్పెండ్ కాలేదు. తొలిసారిగా అలా వేటు పడిన ఎస్పీ అమిత్ బర్దర్ కావడం గమనార్హం. ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ అన్బురాజన్ను ఈసీ బదిలీ చేసింది. అనంతరం అమిత్ బర్దర్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అనతి కాలంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఫలితాల ప్రకటన తర్వాత భద్రత కల్పించండి కాగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లావ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈసీ దిశానిర్దేశం చేసింది. జూన్ 4న కౌంటింగ్ తరువాత తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా నియంత్రించడానికి కేంద్ర బలగాల కంపెనీలను అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ బలగాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. టీడీపీ నాయకుల వల్లే బలి.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగారు. పచ్చ మూకలతో కలిసి ప్రశాంత పట్టణంలో హింస రాజేశారు. ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైనే దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఎస్పీ సస్పెండ్కు గురి కావడం గమనార్హం. గత నెల 5న ఎస్పీగా అమిత్ బర్దర్ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నాయకుల హింసాత్మక వైఖరి కారణంగా కేవలం 40 రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది. అడిషనల్ ఎస్పీ రామకృష్ణపై చర్యలేవీ..? కాగా, తాడిపత్రిలో హింసాత్మక ఘటనలకు పరోక్షంగా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ కారణమయ్యారని ఏకంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన మద్దతుతోనే పచ్చ మూకలు రెచ్చిపోయారని కూడా విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఆధార సహితంగా లేఖ కూడా రాశారు. అలాంటి ఏఎస్పీ రామకృష్ణపై మాత్రం ఈసీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణపైనా వేటు పట్టణంలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం -
No Headline
కదిరి: సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. అయితే ఫలితాల కోసం జూన్ 4వ తేదీ ఎప్పుడొస్తుందా? అని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఈ పార్టీ .. ఆ పార్టీ అనే తేడా లేకుండా భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. కోడి పందేలు, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఎన్నికల ఫలితాలు, మెజార్టీపై భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. కొందరైతే 1కి మూడు రెట్ల పందెం కాస్తున్నారు. అంటే రూ. లక్షకు రూ.3 లక్షలు చొప్పున బెట్టింగ్లు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఫలానా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఫలానా మండలంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఇలా పలు రకాలుగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఆస్తులు తాకట్టు పెట్టిమరీ... జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కొందరు ఎన్నికల బెట్టింగ్లకు చేతిలో డబ్బు లేకపోయినా వారి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ పందెం కాస్తున్నారు. ● కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన ఒక నాయకుడు తనకున్న ఆరెకరాల భూమిని బెట్టింగ్కు తాకట్టు పెట్టాడు. కదిరికి చెందిన మరో నాయకుడు తన కారును పందెంలో వేశాడు. ● పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలానికి చెందిన 8 మంది ఒక బృందంగా ఏర్పడి రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్లు వేశారు. ● ధర్మవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డికి జిల్లాలో అందరి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని ఒక పట్టు చీరల వ్యాపారి రూ.50 లక్షలు బెట్టింగ్ వేశాడు. ● ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని హిందూపురానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగుళూరులో తనకున్న అపార్ట్మెంట్ను బెట్టింగ్లో పెట్టాడు. ● మడకశిరలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు బెంగుళూరుకు చెందిన ఒక బిల్డర్తో రూ.35 లక్షలు బెట్టింగ్ వేశాడు. ● హిందూపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఓడిపోతాడని జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పందేలు వేశారు. ఎన్నికల్లో గెలుపుపై కొందరు.. మెజార్టీపై మరికొందరు జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్ టీడీపీలో ఉంటూ వైఎస్సార్సీపీ పక్షాన కొందరు పందాలు శ్రీసత్యసాయి జిల్లాలో 7 ఎమ్మెల్యే స్థానాలకుగాను టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వస్తాయని గోరంట్లలో ఆ పార్టీకే చెందిన ఒక నాయకుడు రూ.75 లక్షలు బెట్టింగ్ వేశాడు. మహిళలు ఎక్కువ శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారని, వారంతా జగన్కే ఓటు వేశారని ఆయన బహిరంగంగా చెబుతున్నాడు. ఎందుకిలా చెబుతున్నారని సొంత పార్టీ నాయకులు అడుగుతుంటే తాను బెట్టింగ్ వేసిన విషయం బయట పెట్టడంతో పాటు జూన్ 4న ఓటమిని తట్టుకోవడానికి మన పార్టీవారంతా ‘సిద్ధం’గా ఉండాలని చెబుతున్నాడు. కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికలకు మునుపు టీడీపీలో చేరిన ఓ నాయకుడు కదిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మగ్బుల్ గెలుస్తాడని పందెం వేశాడు. ఈ విషయం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్కు తెలిస్తే కోప్పడతాడని ముందే గ్రహించి ఎవరికీ అనుమానం రాకుండా వైఎస్సార్సీపీలో ఉన్న ఆయన బిజినెస్ పార్టనర్ చేతికి రూ.50 లక్షల డబ్బులిచ్చి ఆయన ద్వారా మగ్బుల్ గెలుస్తాడని బెట్టింగ్ కాశాడు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
హిందూపురం/లేపాక్షి/హిందూపురం టౌన్: జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఆయా స్ట్రాంగ్ రూములకు చేర్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. గురువారం మండల పరిధిలోని బిట్ కళాశాల, లేపాక్షి చోళ సముద్రం వద్దనున్న డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద ప్రస్తుత పరిస్థితులు, భద్రతా చర్యలు, విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియను రెండు కేంద్రాల్లో చేపట్టినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణగా ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చి, భద్రత వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో డీఎస్పీ స్థాయి అధికారులు, ఇతర పోలీస్, ఉద్యోగ సిబ్బంది ఆధ్వర్యంలో 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. స్ట్రాంగ్ రూములను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆర్ఓలకు కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఎవరు కూడా అతిక్రమించకూడదన్నారు. కౌంటింగ్ సెంటర్ల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా కౌంటింగ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న వారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్శాఖ నేతృత్వంలో గట్టి బందోబస్తు చేపట్టాలని, చిన్నపాటి అవాంఛనీయ సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూముల తనిఖీలో భాగంగా ఈవీఎం గదులను పరిశీలించి సంబంధిత అధికారులకు సీసీ కెమెరాల పనితీరు, పోలీసు పహారా, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన తర్వాత విజిటర్స్ రిజిస్టర్లో కలెక్టర్ అరుణ్బాబు సంతకం చేశారు. కార్యక్రమంలో హిందూపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్ కుమార్, పెనుకొండ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ, కదిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వంశీకృష్ణ, ధర్మవరం రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి, మడకశిర రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్, హిందూపురం డీఎస్పీ కంజక్షన్, సీఐ ఈరన్న, పెనుకొండ తహసీల్దార్ ఉదయ శంకర్, చిలమత్తూర్ తహసీల్దార్ భాగ్యలత, మడకశిర తహసీల్దార్ వెంకటేష్, ఆర్ఐ అమర్, ఎస్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అరుణ్బాబు -
అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం
సోమందేపల్లి: మండలంలోని గుడిపల్లి పార్రిశామిక వాడలో ఉన్న కియా అనుబంధ ఎస్ఎల్ఏపీ పరిశ్రమంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గురువారం కంపెనీ ముఖ్య ప్రతినిధులు ఎస్ఎల్ఏపీ పరిశ్రమకు చేరుకుని పరిశీలించారు. కియా కార్లకు సంబంధించిన హెడ్ లైట్లు, గ్లాసులు ఈ పరిశ్రమలో తయారవుతాయి. వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఘటనలో విలువైన యంత్రాలు కాలి బూడిదయ్యాయి. దీంతో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేశారు. కాగా, పరిశ్రమను ఆగమేఘాలపై పునరుద్ధరించి గురువారం నుంచి యథావిధిగా పనులు చేపట్టారు. ఎంత పని‘జేస్తి’వయ్యా!పెద్దపప్పూరు: ఎన్నికల ముందు వరకు వచ్చేది తమ ప్రభుత్వమే అని మీసాలు మెలివేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెరగడం, మళ్లీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని తేలిపోవడంతో గ్రామాల్లో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, పెద్దపప్పూరు, చిన్నపప్పూరు తదితర గ్రామాల్లో పచ్చ మూకలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. అంతటితో ఆగకుండా ఈ నెల 14న తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి రాళ్లు, టపాసులతో వీరంతా దాడి చేశారు. ఈ అరాచక కాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోననే భయంతో అనారోగ్యం నాటకమాడి హైదరాబాద్లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు. దాడులకు తమను ఉసిగొల్పిన నేత ఒక్కసారిగా మాయమవడంతో మండలంలోని ఆ పార్టీ గూండాలు నేడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కొండలు, గుట్టలు, పొలాల బాట పట్టి తమ బంధువుల ద్వారా అన్న పానీయాలను తెప్పించుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. -
22న అరుణాచలానికి ఆర్టీసీ బస్సు సర్వీసు
ధర్మవరం అర్బన్: పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన అరుణాచలం గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని ఆర్టీసీ డీఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 23న పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానుపోను చార్జీలు రూ.1400 మాత్రమేనని తెలిపారు. బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్లో గాని, ఆన్లైన్లోగాని సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 6303151302, 9959225859 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి వేరుశనగకు రిజిస్ట్రేషన్పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్లో సాగు చేయడానికి అవసరమైన సబ్సిడీ విత్తన వేరుశనగకు రైతులు శుక్రవారం నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2,44,763 హెక్టార్లు కాగా వేరుశనగ విస్తీర్ణం 1,74,910 హెక్టార్లు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసుకొనడానికి 1,00,443 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో వేరుశనగ 97,886 క్వింటాళ్లు, కందులు 1500 క్వింటాళ్లు, రాగులు 300 క్వింటాళ్లు, పెసలు 200 క్వింటాళ్లు, ఉలవలు 300 క్వింటాళ్లు, అలసంద 100 క్వింటాళ్లు, కొర్ర 20 క్వింటాళ్లు, జీలుగ 138 క్వింటాళ్లు సరఫరా చేయడానికి అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఇవన్నీ 40 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఎరువులు కూడా... ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా 14,875 టన్నులు, డీఏపీ 5969 టన్నులు, ఎంఓపీ 1151 టన్నులు, కాంప్లెక్స్ 1456 టన్నులు, ఎస్ఎస్పీ 2821 టన్నులు, మొత్తం 39,378 టన్నులు ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. క్వింటా చింతపండు రూ.16 వేలుహిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.16 వేలు ధర పలికింది. మార్కెట్కు గురువారం 1,200 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ–నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.16 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.11 వేల ప్రకారం ధర పలికిందన్నారు. అలాగే ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.8,500, కనిష్టంగా రూ.4 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి. ఇక బోటు రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.3 వేలు, కనిష్టంగా రూ.2,500 ప్రకారం పలికింది. పలు రైళ్లకు అదనపు కోచ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యాప్తంగా దాదాపు 28 ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదనంగా స్లీపర్, 3 ఏసీ కోచ్లను జత చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గుత్తి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–ధర్మవరం (17247/48) ఎక్స్ప్రెస్ రైళ్లు, అదేవిధంగా గుంతకల్లు జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–హుబ్లీ (17225/26) అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 21 వరకూ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
వైభవంగా లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు గురువారం ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనానికి ఉభయదారులుగా గుద్దిటి నారాయణప్ప, బండ్లపల్లి వెంకటజయప్రకాష్, అంబటి సతీష్కుమార్, కట్టా భాగ్యమ్మ అండ్ సన్స్, అన్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున, నీలయ్యగారి ఫణికుమార్, షర్మిల, జింకా చిన్న కంబయ్య, కోటం కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కుమారుడు కోటం రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులు, సుందరేషన్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చంద్రప్రభ వాహనానికి ఉభయదాతలుగా రామాయణం వెంకటేశ్వరప్రసాద్, కీ.శే.గోపాల కృష్ణయ్య కుమారులు, గుద్దిటి నారాయణప్ప, సౌందర్యలహరి, పంచాంగం సరసాదత్తమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వారికి ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు స్వాగతం పలికారు. వారిచేత స్వామికి పూజలు చేయించారు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాల ఊరేగింపుకు ఆలయ కమిటీ ఛైర్మన్ దాసెట్టి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు. నేడు సర్వభూపాల, సింహ వాహనాల్లో... లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు సర్వభూపాల వాహనం, సాయంత్రం 6 గంటలకు సింహ వాహనంపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగిన స్వామివారు -
నేటి నుంచి బీసీజీ వ్యాక్సినేషన్
ప్రశాంతి నిలయం: క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈనెల 16వ తేదీ (గురువారం) నుంచి జిల్లాలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమ నిర్వహణపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మంజువాణి తన కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్లో భాగంగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ టీకా వేస్తారన్నారు. ఈనెల 16న ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. ప్రతి గురువారం జిల్లాలోని 544 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సమీక్షలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర నాయక్, జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు ● జిల్లా ఆహార భద్రత అధికారి తస్లీం హిందూపురం టౌన్: ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తూ కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారిణి తస్లీం హెచ్చరించారు. బుధవారం ఆమె పట్టణంలోని ‘సరిగమ’, తాడిపత్రి బిర్యాని రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా రెస్టారెంట్లలో వండిన ఆహార పదార్థాలను, వండడానికి సిద్ధం చేసిన పదార్థాలను పరిశీలించారు. కొన్ని పదార్థాల నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా తస్లీం మాట్లాడుతూ, రెస్టారెంట్ నిర్వాహకులు ఆహార భద్రత శాఖ అనుమతులు తీసుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోయినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించినా ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నేడు ఏపీఈఏపీ సెట్ అనంతపురం: ఏపీ ఈఏపీసెట్ గురువారం జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 29,025 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అనంతపురం జిల్లాలకు సంబంధించి మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 23 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. -
స్ట్రాంగ్రూంలకు పటిష్ట భద్రత
హిందూపురం/హిందూపురం అర్బన్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్ర్డ్ రిజర్వుడ్ బలగాలు, సివిల్ పోలీసులను మోహరించామన్నారు. బుధవారం ఆయన హిందూపురం సమీపంలోని ‘బిట్’ కళాశాల, లేపాక్షి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్ట్రాంగ్రూంల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో సంచరించేందుకు ఎవరికీ అనుమతిలేదన్నారు. ఓట్ల లెక్కింపు కోసం జూన్ 4న జిల్లా ఎన్నికల అధికారి, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలు తెరిచి ఈవీఎంలను బయటకు తీస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేసినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మూడంచెల భద్రత... సాయుధ బలగాల పహారా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించిన ఎస్పీ మాధవరెడ్డి -
జిల్లాలో 144 సెక్షన్
● నేటి నుంచి జూన్ 4 వరకూ అమలు ● ఎస్పీ మాధవరెడ్డి వెల్లడి పుట్టపర్తి టౌన్: జిల్లాలో బుధవారం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ అంటే జూన్ 4వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. హింసాత్మక ఘటనలకు, రెచ్చగొట్టేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టి కృషి, రాజకీయ పార్టీ నేతల సహకారం, ప్రజల స్వచ్ఛంద మద్దతుతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పోలింగ్ ముగిసినందున అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, హింసాత్మక సంఘటనలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో సైతం రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఎక్కడా గుంపులు, గుంపులుగా ఉండకూడదని, అల్లర్లు, ఘర్షణ జోలికి వెళ్లకూడదన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడా సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. అయితే పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు మినహాయింపు ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహరించాలని కోరారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
సోమందేపల్లి: మండలంలోని గుడిపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన ఎస్ఎల్ఏపీ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పొగ కారణంగా ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే... ఇటీవల ఎస్ఎల్ఏపీ పరిశ్రమ విస్తరణలో పనులు చేపట్టారు. బుధవారం వెల్డింగ్ పనులు చేస్తుండగా...నిప్పురవ్వలు సమీపంలోని గుజరీ సామగ్రిపై పడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించగా రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఈ సమయంలో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెనుకొండ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధర్మవరం అర్బన్: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శమీనారాయణస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహోత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం పలుకుతూ అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్ తదితరులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఉభయదారులుగా గజనాణ్యం పట్టుసాలే సంఘం వారు వ్యవహరించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement