-
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా వెంకట్రావు
ఒంగోలు: ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా బి.వెంకట్రావు నియమితులయ్యారు. స్థానిక హెడ్మాస్టర్స్ సంఘ భవనంలో శుక్రవారం నూతన జిల్లా కమిటీ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక జిల్లా అధ్యక్షుడు కేవీజీ కీర్తి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఎ.అమ్మయ్య, జిల్లా అధ్యక్షునిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా బి.అశోక్కుమార్, సహాయ అధ్యక్షులుగా ఎన్.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా పీవీ ప్రభాకరరావు, కె.వెంకటేశ్వర్లు, యం.విశ్వభారతి, టి.పాండురంగస్వామి, అదనపు కార్యదర్శిగా ఎస్హెచ్ కబీర్, కార్యదర్శులుగా బి.నాగార్జున, విక్రమ్, జి.పాండు, ఎస్.శ్రీదేవి, కె.పెద్దన్న, యం.సురేష్ బాబు, ఎ.గురులింగం, టి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.వెంకట్రావు, బి.అశోక్కుమార్, పీవీ సుబ్బారావు, వై.శ్రీనివాసులు, కేవీజీ కీర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా పి.ఆంజనేయులు, అకడమిక్ కమిటీ కన్వీనర్గా సీహెచ్వీ చలపతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగాన్ని పరిరక్షించుకుని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం పోలింగ్ బూత్ల వద్ద కూడా అల్లర్లు...
దర్శి పట్టణంలో కొత్తరెడ్డిపాలెం, పొదిలి రోడ్డుకు చెందిన పోలింగ్ బూత్లను స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ బూత్లు వైఎస్సార్ సీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చేవి కాగా, సాయంత్రానికి టార్గెట్ చేసుకుని ఈవీఎంలు ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో 6 గంటల తర్వాత వంద మందికిపైగా అనుచరులతో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానిక నాయకులు, ఓట్లేసే వారు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి చూడాలంటే అభ్యర్థికి మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన వారు వెళ్లడానికి లేదని అడ్డుకున్నప్పటికీ.. వాళ్లని నెట్టుకుని బూత్లలోకి ప్రవేశించేందుకు లక్ష్మి ప్రయత్నించారు. లక్ష్మితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కడియాల వెంకటేశ్వరరావు, గొట్టిపాటి భరత్, కడియాల లలిత్ సాగర్లు కూడా వారి అనుచరులు 100 మందితో బూత్లలోకి ప్రవేశించి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓటర్లు, ఏజెంట్లు అడ్డుగా నిలబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లకుండా తలుపులు వేసి ఈవీఎంలను కాపాడుకున్నారే తప్ప ఏ ఒక్క పోలీసు వారిని ఆపిన పాపానపోలేదు. కడియాల వెంకటేశ్వరరావు అనుచరులు అక్కడి ఓటర్లను, బూత్ ఏజెంట్లను తోసివేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర మాత్రమే వహించారు. దీంతో వారి మధ్య గొడవలు పెద్దవి కావడంతో ప్రత్యేక బలగాలు వచ్చి వారిని పంపించి వేశారు. బూత్లో తాము ఏమీ చేయలేకపోయామనే ఆక్రోశంతో కడియాల కుటుంబబం అక్కడి కార్యకర్తలను రెచ్చగొట్టి తమ అనుచరులను తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వి బూత్పైకి రాళ్లు విసిరేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి చెదరగొట్టాయి. ఇంత గందరగోళం జరిగినా గొడవలకు కారణమైన అసలు వారిపై కేసులు నమోదు చేయకుండా కేవలం స్థానిక టీడీపీ నాయకులపై మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తునారు. -
వెలుగొండస్వామి ఆలయంలో కూలిన ధ్వజస్తంభం
కొనకనమిట్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వెలుగొండస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం కూలిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగినట్లు దేవస్థాన ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆలయంలోని ధ్వజస్తంభం అడుగు భాగం పూర్తిగా కుళ్లిపోయిందని, ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలిపోయిందని ఈఓ తెలిపారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారన్నారు. కూలిన ధ్వజస్తంభం ఆలయ గర్భగుడి అంచులపై పడటంతో అంచు కొంతమేర దెబ్బతిందని చెప్పారు. ఈ విషయాన్ని దేవస్థానం ఉన్నతాధికారులకు, ఉభయ దాతలైన గార్లదిన్నె గ్రామస్తులకు తెలియజేశామన్నారు. పడిపోయిన ధ్వజస్తంభాన్ని తొలగించి త్వరలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తామని ఈఓ తెలిపారు. పిల్లర్ గుంతలో పడి బాలుని మృతి హస్తినాపురం: ఆడుకుంటూ వెళ్లిన పసిబాలుడు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన పిల్లర్ గుంతలోని నీళ్లలో పడి మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలానికి చెందిన మదాల అచ్చమ్మ, మాల్యాద్రి దంపతులు మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. అతనికి ఒక కుమారుడు మనోజ్ ఉన్నాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బహిరంగ ప్రదేశంలో ఉన్న పిల్లర్ గుంత వర్షపు నీటితో నిండి ఉండడంతో మనోజ్ (08) ఆడుకుంటూ వెళ్లి ఆగుంతలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని గుంతలోంచి బయటికి తీసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాలుని తల్లిదండ్రులు, వారి బంధువులు బహిరంగ ప్రదేశంలో వేసిన గుంత మూలంగా తమ బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు. బాలుని కుటుంబ సభ్యులకు బిల్డర్ నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిల్డర్ మృతుని కుటుంబ సభ్యులు రాజీకి వచ్చి నష్టపరిహారం చెల్లించడంతో ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లు బాలుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖరీఫ్, రబీ సీజన్లకు ప్రణాళిక సిద్ధం
● జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు ● ‘తరుముకొస్తున్న కాలం..కదులుతుందా యంత్రాంగం’ కథనానికి ఖండన ఒంగోలు సెంట్రల్: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్కు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని అందుకు అనుగుణంగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక పత్రికలో (సాక్షి కాదు) శుక్రవారం ‘తరుముకొస్తున్న కాలం–కదులుతుందా యంత్రాంగం’ పేరుతో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఖండిస్తూ... శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగలు 667, పెసర 390, జనుములు 1716 క్వింటాళ్లు జిల్లాకు కేటాయించారని చెప్పారు. ఖరీఫ్లో సాగు చేయటానికి వరి 4000, పెసర 120, మనుము 500, కంది 1500 క్వింటాళ్లు కేటాయించారని, సదరు విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారా సాధారణ రాయితీపై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆయా మండలాలకు ఇప్పటికే కేటాయించామని రైతులు తమ పరిధిలోని ఆర్బీకేల ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని వారికి కావాల్సిన విత్తనాలు రాయితీపై పొందవచ్చన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా గత సంవత్సరం 31,600 మినీ కిట్స్ పూర్తి రాయితీపై రైతులకు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ సంవత్సరం 35,00 కంది కిట్స్ కేటాయింపునకు ప్రతిపాదనలు పంపారన్నారు. అవి కూడా అందుబాటులోకి వస్తాయని, రైతులు తమ వద్ద ఉన్న స్వంత విత్తనాలు కూడా సాగుకు సిద్ధం చేసుకుని ఉన్నారని వివరించారు. -
నేడు హెచ్ఎం, ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు
ఒంగోలు: జిల్లాలో పాల్ ల్యాబ్ సౌకర్యం ఉన్న 33 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒక గణితం, ఒక ఆంగ్ల సబ్జక్టు టీచర్లకు శనివారం ఒకరోజు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశిక్షణ స్థానిక బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాతోపాటు బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని 74 పాఠశాలల నుంచి 222 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరవుతారన్నారు. శిక్షణ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని, శిక్షణకు కేటాయించిన ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదన్నారు. సంబంధిత డివిజన్ విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శిక్షణకు కేటాయించిన వారిని రిలీవ్ చేయాలన్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఒంగోలు: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సులో శిక్షణ, ఉద్యోగం కల్పిస్తారని ఫౌండేషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ పాస్/ ఫెయిల్, డిప్లొమా పాస్/ఫెయిల్, డిగ్రీ పాస్ / ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని, 35 రోజులపాటు జరిగే ఈ శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. 35 రోజుల కోర్సులో ట్యాలీ జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్ లో అత్యుత్తమ శిక్షణ ఉచితంగా ఇస్తారన్నారు. శిక్షణ తదనంతరం వంద శాతం వివిధ సంస్థల్లో కనీస నెల జీతం రూ.15 వేలు పైన కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు హరిప్రసాద్ 9000487423 ను సంప్రదించాలన్నారు. కలెక్టర్కు స్వీప్ అధికారుల అభినందనలు ఒంగోలు అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ను స్వీప్ నోడల్ అధికారులు బీ రవి, వీఎస్ జ్యోతి శుక్రవారం ప్రకాశం భవనంలో కలిసి అభినందనలు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 87.06 శాతం ఓటింగ్తో మొదటి స్థానం నిలవడంతో పాటు దర్శి అసెంబ్లీ స్థానం 90.91 శాతంతో మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో మన జిల్లా 87.9 శాతంతో మొదటి స్థానంలో నిలిచేందుకు కలెక్టర్ సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్వీప్ అధికారులు తెలిపారు. దీనిలో సూపరింటెండెంట్ నాగజ్యోతి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మారుతి ఇతర స్వీప్ బృందం సభ్యులు పాల్గొని కలెక్టర్కు అభినందనలు తెలిపారు. -
బీజేపీ పాలనలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్లచట్టాలను తెచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలకులు దేశంలోని భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగం చేపట్టిన ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు నిర్బంధాన్ని ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో వేయి మందికిపైగా రైతులు ఆశువులు బాసారని, నల్లచట్టాల ఫలితంగా వ్యవసాయం కుదేలై అప్పుల పాలైన రైతులు 1,50,000 మంది ఆత్మహత్యలు చేసుకుని మరణించారని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎన్నికలలో దేశంలోని రైతులు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఓట్లేస్తున్నారని చెప్పారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వమేనని అన్నారు. గతేడాది వచ్చిన కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, జిల్లా నాయకులు వీరారెడ్డి, పావులూరి అంజయ్య, పోలవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ -
పోల్డ్ ఈవీఎంలకు పటిష్ట భద్రత
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి శుక్రవారం ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్ట్రాంగ్ రూమ్లకు భద్రతా చర్యలు, కౌటింగ్ కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్లు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పోల్డ్ ఈవీఎంల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలు స్ట్రాంగ్ రూమ్లను ప్రతి రోజు సందర్శించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు సుబ్బారెడ్డి, లోకేశ్వరరావు, నాగజ్యోతి, జాన్ ఇర్విన్, కుమార్, కలెక్టర్ పరిపాలన అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ శుక్రవారం స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలో పరిశీలించారు. కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూముల వద్ద పటిష్టమైన భద్రతా ఉండాలన్నారు. భద్రతా చర్యల్లో ఉన్న అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీళ్లను పరిశీలించారు. -
మల్లవరం వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మద్దిపాడు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మల్లవరం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి 8 గంటల నుంచి అకురారోహణ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. 19 ఉదయం స్వామివారికి అగ్ని ప్రతిష్టాపనలో నిత్యహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి ధ్వజారోహణ సమయంలో సంతానంలేని దంపతులకు గరుడ ప్రసాదం అందిస్తారు. రాత్రికి శేష వాహన సేవ, 20వ తేదీ సాయంత్రం హంసవాహన సేవ, 21వ తేదీ సింహవాహన సేవ, 22వ తేదీ హనుమద్వాహన సేవ, 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడ సేవ 24వ తేదీ రాత్రికి గజోత్సవం, 25వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, కల్యాణం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ, రాత్రికి రథోత్సవం, 26వ తేదీన అశ్వవాహనం, 27వ తేదీ ధ్వజావరోహణ పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీ ఉదయం 8 గంటలకు చక్రతీర్థం, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ కాగడా సేవ నిర్వహిస్తున్నట్లు పలువురు ఉభయ దాతలు బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, నారాయణం రాజశేఖరాచార్యులు ఆధ్వర్యంలో ప్రముఖ యాజ్ఞీకులు ఆగమ ప్రవర దివి వెంకట శేషాచార్యులు స్వామివారి కల్యాణ కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ నారా నాగిరెడ్డి తెలిపారు. పటిష్టంగా బందోబస్తు మల్లవరం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు మద్దిపాడు ఎస్ఐ వీ మహేష్ తెలిపారు. వాహనాల పార్కింగ్కు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూరల్ సీఐ టీఎక్స్ అజయ్కుమార్లో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించినట్లు తెలిపారు. కల్యాణం సమయంలో రద్దీని తట్టుకోవడానికి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. -
వేగంగా ఎకో టూరిజం పార్కు పనులు
హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఫారెస్టు ఎత్తు రోడ్డు వద్ద రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఎకో టూరిజం పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు కేంద్ర అటవీ శాఖ నుంచి రూ.2 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. దీంతో ఫారెస్టు అధికారులు టూరిజం పార్కు, జిమ్ పార్కు, వాచింగ్ టవర్, రోడ్డు, ఇతర పనులను వేగంగా చేస్తున్నారు. ఈ పార్కులో జిమ్ పార్కు, క్యాంటీన్, వాచ్టవర్, నీటి కుంటలు, సోలార్ విద్యుత్ లైట్లు, బోరు మోటార్లు, రోడ్డు, జింకల పార్కు, వాకింగ్ పార్కు, ఆర్చి, కారు పార్కింగ్ తదితర పనులు జరుగుతున్నట్లు ఫారెస్ట్ డీఆర్ఓ రామిరెడ్డి తెలిపారు. ఈ పనులు రెండు సంవత్సరాలకు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత వాసులకు టూరిజం పార్కులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
జూనియర్ కళాశాలలుగా జెడ్పీ పాఠశాలలు
పుల్లలచెరువు: గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ విద్య కోసం హైస్కూల్ ప్లస్ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. మండలానికి జూనియర్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. వీటిలో జిల్లాలోని కామేపల్లి, పందువనాగులవరం, ముండ్లపాడు, బేస్తవారిపేట, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, కొత్తపట్నం, కురిచేడు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, తర్లుపాడు జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేవలం ఆంగ్ల మాద్యమంలో మాత్రమే విద్యా బోధన ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువగా ఉండటంతో కళాశాల విద్యలో ప్రైవేట్ విద్యాసంస్థలదే పైచేయిగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాణ్యతతో కూడిన విద్యా బోధన... కొత్తగా ఏర్పాటయ్యే కళాశాలలకు బోధకుల కోసం ఆయా పాఠశాలల్లో పీజీ అర్హత కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి వారితో విద్యా బోధన చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐఎఫ్పీ ద్వారా ఆధునిక పద్ధతుల్లో బోధనకు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు అర్హతలు కలిగిన ఉపాధ్యాయుల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. వీరితో పాటు వర్క్లోడ్ లేని జూనియర్ కళాశాలల నుంచి రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులను సర్దుబాటు చేసి బోధన చేసేలా కార్యచరణ జరిగిందని ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రవేశాలన్నీ మాన్యువల్గానే జరగనున్నాయి. విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లుగా సర్టిఫికెట్లు తీసుకెళ్తే.. వారికి ఇంటర్లో ప్రవేశం లభిస్తుంది. గరిష్టంగా 80 మందిని చేర్చుకోవచ్చని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం శుభపరిణామమని విద్యావేత్తలు అంటున్నారు. 11 జెడ్పీ పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు విద్యాభివృద్ధికి సీఎం జగన్ సంస్కరణలపై సర్వత్రా హర్షం ఎంతో గొప్ప విషయం : గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో శుభపరిణామం. గ్రామాల్లో పదో తరగతి చదువుకుని ఇంటర్ చదివేందుకు అవకాశాలు లేక.. దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడలేక చదువు మానుకునే వారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది చదువుకోవడానికి వీలు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జి.గురు నాథం, విద్యా కమిటీ మాజీ చైర్మన్, పుల్లలచెరువు -
రెచ్చగొట్టారు.. రెచ్చిపోయారు..!
దర్శి: నరసరావుపేట నుంచి టీడీపీ రౌడీ నేతలు వచ్చారు. ఆ పార్టీ దర్శి నాయకులను రెచ్చగొట్టారు. వారితో కలిసి రెచ్చిపోయిన స్థానిక నేతలు ఎన్నికల పోలింగ్ సందర్భంగా దర్శి మండలంలో గొడవలకు కారణమయ్యారు. ఈ గొడవల్లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులపై మాత్రం ఎటువంటి కేసులు పెట్టకుండా పోలీసులు వదిలేశారు. కేవలం స్థానిక నాయకులపై మాత్రమే కేసులు పెట్టి నరసరావుపేట నుంచి వచ్చిన టీడీపీ రౌడీలను వదిలేయడం పట్ల ఖాకీల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శిలో గొడవలు సృష్టించేందుకు నరసరావుపేట నుంచి టీడీపీ సామాజికవర్గానికి చెందిన అల్లరి మూకలను తీసుకొచ్చి ఒక్కరిపై కూడా కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడి ఆ పార్టీ స్థానిక నాయకులను బలి చేయడంపై దర్శిలో జోరుగా చర్చ నడుస్తోంది. కేసులు నమోదైన వారంతా స్థానికులే... దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో జరిగిన గొడవల్లో ఇరువర్గాలకు సంబంధించి ఒక్కో వర్గంలో 11 మంది చొప్పున కేసులు పెట్టారు. వారంతా స్ధానికులే కావడం గమనార్హం. దేవవరంలో జరిగిన దాడి విషయానికి వస్తే శేషంవారిపాలేనికి చెందిన ఓట్ల చేర్పులు, మార్పుల్లో సుమారు 25 ఓట్ల వరకు దేవవరం బూత్లోకి వచ్చాయి. అయితే, వాళ్లు 50 మందికిపైగా బూత్లోకి ప్రవేశించి దొంగ ఓట్లు వేసేందుకు లలిత్సాగర్తో కలిసి వచ్చారు. దీంతో స్థానికులు ఓటు ఉన్న వాళ్లు మాత్రమే లోపలికి వెళ్లాలని, మిగతావాళ్లు బయట ఉండాలని అడ్డుకున్నారు. దీంతో లలిత్ సాగర్ తెలివిగా పక్కకు వెళ్లి తమ రౌడీలను ఉసిగొల్పారు. వారు లోపలకు వెళ్లాల్సిందేనని గొడవలకు దిగడంతో తోపులాట జరిగింది. వాళ్లు ముందస్తు ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కర్రలతో అడ్డువచ్చిన వారందరినీ చితకబాదారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని కూడా కొట్టి బీభత్సం సృష్టించారు. ఆ తర్వాత లలిత్ సాగర్ వెంటనే వచ్చి మళ్లీ తన అనుచరులతో వారిని తీసుకుని బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. లలిత్ సాగర్ బూత్లోకి వెళ్లాలంటే మీరొక్కరే వెళ్లండి.. మీతో వచ్చిన వారందరూ ఇక్కడే ఉండాలని అడ్డుకున్నారు. 20 నిముషాలకుపైగా గ్రామంలో మహిళలు లలిత్సాగర్ను నిలదీశారు. మీ ఊరు నుంచి రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇవేం రాజకీయాలు.. మీ వాళ్లు వచ్చి మా గ్రామంలో కర్రలతో తల పగులగొట్టారు.. దీనికి మీరేం సమాధానం చెప్తారని పదే పదే నిలదీయడంతో మొహం చాటేసి పోలీసులను అడ్డుపెటుకుని జారుకున్నారు. ఆ గొడవ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన సీఐకి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. లలిత్ సాగర్ కొత్తవ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యం చేసి దొంగ ఓట్లు వేయించాలని చూశారని, అడ్డుకున్నందుకు గొడవలు సృష్టించారని, రౌడీలు, స్థానికులు కలిసి తమను విచక్షణారహితంగా కొట్టారని అక్కడున్న వారు సీఐతో చెప్పి మొత్తుకున్నారు. కానీ, ఆ రౌడీలపై మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కేసులు పెట్టిన ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే దేవవరంలో ఓటు ఉంది. మిగతా వారికి ఓటు కూడా లేదు. టీడీపీ దర్శి నాయకులను రెచ్చగొట్టిన ఆ పార్టీ నరసరావుపేట నేతలు రెచ్చిపోయి ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన స్థానిక నేతలపై కేసులు రెచ్చగొట్టి వెళ్లిపోయిన నరసరావుపేట రౌడీ నేతలను వదిలేసిన పోలీసులు ఖాకీల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు -
చెప్పాడంటే.. చేస్తాడంతే..!
సంక్షేమ శాఖల వారీగా విడుదలైన నిధులు... సంక్షేమశాఖ విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) ఎస్సీ 12,460 11,196 8,54,04,869 ఎస్టీ 1,107 1,009 75,24,724 బీసీ 15,774 14,297 11,38,71,905 ఈబీసీ 12,250 10,985 11,40,52,489 ముస్లిం 3,006 2,725 2,10,41,998 కాపు 2,768 2,534 2,20,06,142 క్రిస్టియన్ 57 51 5,27,624 మొత్తం 47,422 42,797 36,44,29,757 నియోజకవర్గాల వారీగా నిధుల విడుదల ఇలా... నియోజకవర్గం విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) దర్శి 6,247 5,657 1,21,52,075 గిద్దలూరు 6,049 5,498 1,57,65,392 కనిగిరి 6,223 5,586 1,52,87,210 కొండపి 6,482 5,847 1,51,32,550 మార్కాపురం 5,357 4,861 1,19,11,323 ఒంగోలు 6,387 5,691 1,85,79,073 ఎస్.ఎన్.పాడు 5,288 4,731 1,31,07,315 వై.పాలెం 5,389 4,926 1,19,36,967 మొత్తం 47,422 42,797 36,44,29,751 ఎన్నికల అనంతరం సైతం ప్రజా సంక్షేమంపైనే సీఎం జగన్ దృష్టి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 42,797 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.36.44 కోట్లు జమ ఎన్నికలకు ముందే జమకావాల్సి ఉండగా, ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ కూటమి పోలింగ్ పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేసిన సీఎం జగన్ -
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు
ఒంగోలు: రాష్ట్రంలో సీబీఎస్ఈ పాఠశాలలుగా ఎంపికై న 63 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పరిశీలకులైన ఆర్.ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ముండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. స్ట్రక్చర్డ్ పెడగాగీ లెసన్ ప్లాన్స్ 2024–25 అకడమిక్ ఇయర్ శిక్షణ (నాన్ రెసిడెన్షియల్) నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇంగ్లిష్, సోషల్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులకు ఈ నెల 20, 21 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. సబ్జెక్టుల వారీగా ఆంగ్లం 97, సోషల్ 89, బయోలాజికల్ సైన్స్ 116, గణితం 128, ఫిజిక్స్ 58, కెమిస్ట్రీ 58 మంది వెరసి 546 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు ఎంపికై న ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరయ్యేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించారు. 108 కలశాలతో శోభాయాత్ర ● వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ప్రారంభం ఒంగోలు మెట్రో: వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి జయంతి వేడుకలు స్థానిక గాంధీరోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి వీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు స్థానిక రంగారాయుని చెరువు నుంచి 108 కలశాలతో నగరంలోని ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. డాక్టర్ చావల ప్రకాష్ వాసవీ పతాకను ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ ఆలయ తదియారాధన సంఘ సభ్యులు పాల్గొన్నారు. వాలీబాల్ శిక్షణకు ఎంపికలు ఒంగోలు సెంట్రల్: ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉచితంగా వేసవి రెసిడెన్షియన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సూదనగుంట కోటేశ్వరరావు (బుజ్జి), ఎం.ఆంజనేయులు తెలిపారు. బాలబాలికల ఎంపికను శనివారం స్థానిక డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 13 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలు అర్హులని తెలిపారు. బాలురు 178 సెం.మీ, బాలికలు 168 సెం.మీ ఆపైన ఎత్తు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 94901 96274, 94903 82802, 77290 61966 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: మల్లన్న దర్శనానికి వెళ్తుండగా కారు అదుపు తప్పి లోయలో బోల్తా పడిన ఘటన గురువారం చిన్నారుట్ల సమీపంలోని దయ్యాల మలుపు వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై అంకమ్మరావు కథనం మేరకు.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన ఉమ్మడి కుటుంబ సభ్యులు దైవదర్శనం నిమిత్తం కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ప్రేమ్కుమార్, నగేష్, వెంకట్రాముడు, రమేష్, కేశవులు, మనోహర్, సురేష్, కుమార్తోసహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శ్రీశైలం, పెద్దదోర్నాల 108 వాహనాల సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీశైలం పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై అంకమరావు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు సుమారు 15 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులది కర్నూలు జిల్లా ప్యాలకుర్తి -
No Headline
మండు వేసవిలో మంచి వర్షం కురిసింది. గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 వరకూ రెండు గంటలకుపైగా దంచికొట్టింది. ఒంగోలు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపించింది. రోడ్లపై వర్షం నీరు పొంగిపొర్లి వాహనదారులు కొద్దిసేపు అవస్థపడ్డారు. వర్షం వెలిసిన గంట తర్వాత నీళ్లన్నీ కాలువల ద్వారా జారుకోవడంతో ప్రశాంతంగా రాకపోకలు సాగించారు. వర్షానికి సూర్యుడు మొహం చాటేసి వాతావరణం చల్లబడినప్పటికీ.. తీవ్రస్థాయిలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. చెమటలతో తడిసిముద్దయ్యారు. ఏదిఏమైనప్పటికీ మండుటెండల సమయంలో భారీ వర్షంతో ఊరట చెందారు. -
ప్రశాంతంగా ఏపీఈఏపీసెట్
ఒంగోలు సెంట్రల్: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఏపీఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలులోని రెండు కేంద్రాల్లో 940 మంది విద్యార్థులకుగానూ 870 మంది హాజరై పరీక్ష రాశారు. ఆయా కేంద్రాల వద్ద ముందస్తుగా విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షకు అనుమతిచ్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో విడత ఎంట్రెన్స్ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. -
No Headline
మార్కాపురం: ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో మార్కాపురం పరిధిలో 900 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. దాదాపు 84 పెద్ద పులులతో పాటు 400కుపైగా చిరుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లు తదితర వన్యప్రాణులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్ రేంజ్లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. మూడు వారాలుగా నల్లమల పరిసర ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులే ఎండవేడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నోరులేని వణ్యప్రాణుల పరిస్థితి ఊహించలేము. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత కూడా కరువైంది. దీంతో తాగునీటి కోసం దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు రహదారిపైకి, గ్రామాల వైపు వణ్యప్రాణులు వెళ్తున్నాయి. తిరిగి అవి అరణ్యంలోకి వెళ్లలేకపోతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలిరాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరుల కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో 175 సాసర్పిట్లు ఏర్పాటు చేసి ప్రతి రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతున్నారు. వీటితో పాటు సహజసిద్ధంగా 275 నుంచి 300 నీటి కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా 40 నీటి కుంటలు ఏర్పాటు చేశారు. 20 సోలార్ పంప్సెట్ల ద్వారా నీటితో నింపుతున్నారు. దీంతో పెద్ద పులులు, చిరుతలు, దుప్పులు ఇతర వన్యప్రాణులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. దీని వలన రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా వీటి కదలికలను పరిశీలిస్తున్నారు. బేస్ క్యాంపులు ఏర్పాటు... నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. రాత్రి సమయంలో అడవి జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటాయి. నల్లమల అటవీ ప్రాంతంలో సహజ కుంటల్లో వేసవిలో కూడా ఇక్కడ నీరు ఉండటం విశేషం. దీంతో అడవి జంతువులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. -
No Headline
ప్రత్యేక రక్షణ చర్యలు నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 175 సాసర్పిట్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ఎత్తైన అరుదైన వృక్షాలు, జంతువులు నల్లమలలో ఉన్నాయి. వేసవిలో జంతువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసకున్నాం. ఘాట్ రోడ్డులో ఎవరైనా వాహనాలు ఆపి బీడీ, సిగరేట్ తాగితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నాం. – విఘ్నేష్ అప్పావు, డీడీ, మార్కాపురం -
డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి
● కలెక్టర్ దినేష్కమార్ ఒంగోలు టౌన్: డెంగీ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారించేందుకు సమర్థవంతంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని చెప్పారు. ప్రతి ఏడాది దర్శి ప్రాంతంలో డెంగీ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నందున దానికి కారణాలను అన్వేషించి పరిష్కార చర్యలు చేపట్టాలని చెప్పారు. పంచాయతీ శాఖ, పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వెక్టార్ వెబ్ కంట్రోల్ యాప్ పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావులకు సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శాఖల వారీగా డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, డీపీఓ, వైద్య విధాన పరిషత్, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్, డీఆర్డీఏ, ఎస్సీ, రూరల్ వాటర్ సప్లయ్, విద్యాశాఖ, డీడీ మైన్స్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
No Headline
ఒంగోలు సెంట్రల్: జగనన్న విద్యాదీవెన పథకం 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలకు ముందే ఈ నిధులు తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఆ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టా రు. కానీ, టీడీపీ కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి నిధులు జమకాకుండా అడ్డుకుంది. కోర్టులకు సైతం వెళ్లినా నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ కుట్రల వలన ఆగిన ఈ పథకం నిధులను ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు 42,797 మంది బ్యాంక్ ఖాతాలకు రూ.36.44 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వీరంతా డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారత నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. -
గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్కుమార్ ఒంగోలు టౌన్: గర్భిణుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సురేష్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా కార్యాలయంలో వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు వారి పరిధిలోని గర్భిణుల వివరాలను సకాలంలో రిజిస్టర్ చేయాలని, సమగ్ర వివరాలతో ఆర్సీహెచ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రసవం నుంచి ప్రసవానంతరం వరకు అన్ని రకాల సేవలను క్రమం తప్పకుండా అందజేయాలని చెప్పారు. గర్భిణులకు అందించిన సేవల వివరాలను వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని, ప్రతి ఒక్కరికీ ఎంసీపీ కార్డ్ అందజేయాలని చెప్పారు. గర్భిణులకు అందించే వైద్య సేవలను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్సీహెచ్, చెయిల్డ్ హెల్త్, ఇమ్యూనైజేషన్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నింటిలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, లక్ష్యాలు సాధించలేని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఒంగోలు ఉప వైద్యాధికారి డాక్టర్ మాధవీలత, డీపీఎంఓ డాక్టర్ వాణిశ్రీ, డీపీహెచ్ఎన్ఓ సుగుణమ్మ, డీపీఓ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గుండెల్లో పెట్టుకుంటా
కష్టించి పనిచేసిన వారిని సీఎస్పురం(పామూరు): వైఎస్సార్ సీపీ బలోపేతం, ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్సార్ సీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అన్నారు. ఈ నెల 13న సీఎస్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 84వ పోలింగ్బూత్లో టీడీపీ ఏజెంట్ల దురాగతాలను వైఎస్సార్ సీపీకి చెందిన టీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల బాలుయాదవ్ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన టీడీపీ వారు పెద్ద సంఖ్యలో మేకల బాలుయాద్పై దాడిచేసి గాయపరిచారు. దీంతో బుధవారం రాత్రి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ మేకల బాలు స్వగ్రామం కొండబోయినపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవం కనిగిరితో పాటు అటు రాష్ట్రంలోను చవిచూడబోతోందని దీంతో టీడీపీ శ్రేణులు ఏం చేయాలో దిక్కుతోచక ఇతర పార్టీల వారిపై దాడులకు దిగుతున్నారన్నారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, దాడికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, మరోమారు ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చూస్తాన్నారు. ఆయన వెంట పీడీసీసీబీ చైర్మన్ వైఎం.ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు, వెలిగండ్ల జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, మండల జేఏసీ కన్వీనర్ బైరెడ్డి తిరుపతిరెడ్డి, పార్టీ యూత్ మండల అధ్యక్షుడు బొర్రాజు రమణయ్యయాదవ్, బొట్లా చిరంజీవి, ఇర్లా వీరాంజనేయులు, బత్తుల మాల్యాద్రి, పలువురు నాయకులు ఉన్నారు. దద్దాల నారాయణ యాదవ్ -
No Headline
ఒంగోలు సెంట్రల్: జగనన్న విద్యాదీవెన పథకం 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలకు ముందే ఈ నిధులు తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఆ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టా రు. కానీ, టీడీపీ కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి నిధులు జమకాకుండా అడ్డుకుంది. కోర్టులకు సైతం వెళ్లినా నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ కుట్రల వలన ఆగిన ఈ పథకం నిధులను ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు 42,797 మంది బ్యాంక్ ఖాతాలకు రూ.36.44 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వీరంతా డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారత నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. -
కనిగిరి టీడీపీలో కలవరం
కనిగిరి రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి పట్టణంలో మహిళల ఓట్లే అత్యధికంగా పోలయ్యాయి. కనిగిరి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 34,281 ఓట్లు ఉండగా 27,712 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 34 పొలింగ్ బూత్లు ఉండగా 29 బూత్ల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఓటు వేశారు. 5 బూత్లలో(132, 142, 143, 152, 168) మాత్రమే మహిళలకంటే పురుషులు ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 34 బూత్ల్లో పురుషులు 13,119 మంది, మహిళలు 13,882 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 763 మంది ఎక్కువగా ఓటు వేశారు. మహిళల ఓటింగ్పై టీడీపీలో ఆందోళన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. అందులో ప్రతి పథకంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఇంట్లో రూ లక్ష నుంచి రూ.20 లక్షల వరకు లబ్ధి చేకూరింది. దీంతో ఎక్కువ మంది మహిళల ఓట్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. అంతేగాక ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా నియోజకవర్గంలో సుమారు 22 వేలు ఉండగా, అందులో కనిగిరి పట్టణంలోనే 14 వేల మంది ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్ రద్దు చేస్తారని ముస్లింలు బలంగా నమ్మారు. దీంతో టీడీపీ అభిమానుల్లోని ముస్లిం ఓటర్లు సైతం పొలింగ్ కేంద్రాల్లో ఉత్సాహంగా కనిపించలేదు. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా పట్టణంలో మహిళల ఓటింగ్ శాతం పెరగడం, అంతేగాక ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ఉండే (119, 120, 121, 122, 126, 129, 140, 141, 143, 144, 149, 151) బూత్ల్లో, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే 123, 132,133,150, 152 బూత్ల్లో కూడా దాదాపు మహిళలే ఎక్కువ శాతం ఓటు వేశారు. దీంతో ఆయా సామాజికవర్గాల ఓట్లు ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఉంటాయనేది విశ్లేషకులు అంచనా. అంతేగాక మరో సామాజికవర్గం ఓట్లపై పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. కనిగిరిలో 29 బూత్ల్లో మహిళల ఓట్లే అత్యధికం 5 బూత్ల్లో మాత్రమే పురుషుల ఓట్లు ఎక్కువ పురుషుల కంటే అధికంగా ఓటేసిన 763 మంది మహిళలు మహిళలు, మైనారిటీల ఓట్లు తమవే అంటున్న వైఎస్సార్ సీపీ -
అడవిలో ఆర్తనాదాలు..!
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ● ట్రైనీ ఐఎఫ్ఎస్ శివకుమార్ హంగల్ పెద్దదోర్నాల: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రైనీ ఐఎఫ్ఎస్ శివకుమార్ హంగల్ పేర్కొన్నారు. గురువారం శ్రీశైలం రహదారిలో ప్లాస్టిక్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు శ్రీశైలం వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న పెద్దదోర్నాలలో నీటి బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన తినుబండారాలు సర్వ సాధారణంగా కొనుగోలు చేస్తుంటారన్నారు. అయితే రుచి చూసిన ఆహార పదార్థాల వ్యర్థాలను మార్గ మధ్యంలో అభయారణ్యంలో పడేయడం వల్ల వాటిని వన్యప్రాణులు ఆత్రంగా తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, యాత్రికులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ సేవక్ల సాయంతో సేకరించి, రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించేలా చర్యలు చేపట్టామని వివరించారు. నల్లమలలోని బేస్ క్యాంపులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దదోర్నాల: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొందరు అధికారుల దుందుడుకు నిర్ణయాలు శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికుల నుంచి ప్లాస్టిక్ నీటి బాటిళ్ల(నిండువి)ను గణపతి చెక్ పోస్టు వద్ద బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్న నేటి తరుణంలో ప్లాస్టిక్ ఫ్రీజోన్ను బూచిగా చూపిస్తూ నీటి బాటిళ్లను పెద్దదోర్నాల చెక్పోస్టు వద్దే స్వాధీనం చేసుకోవడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించారా? ప్లాస్టిక్ బాటిళ్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్లాస్టిక్ సీసాలను అభయారణ్యంలో నిషేధిస్తున్నట్లు ముందుగానే సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. ఉన్నట్టుండి కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల మార్గమధ్యంలో దాహం వేస్తే తాము ఏమి చేయాలన్న భక్తుల ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. అభయారణ్యంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఏకపక్షంగా ప్లాస్టిక్ సీసాలను నిషేధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కొర్రప్రోలులో ఒకలా.. గణపతి చెక్పోస్టులో మరోలా.. అభయారణ్యాన్ని ప్టాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటిస్తే కొర్రప్రోలు చెక్పోస్టు వద్ద కర్నూలు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను స్వాధీనం చేసుకోవాలి. కానీ కేవలం గణపతి చెక్పోస్టు వద్దే స్వాధీనం చేసుకోవడంలో ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నల్లమల అభయారణ్యంలో రోడ్డు వెంట ప్లాస్టిక్ బాటిళ్లను ఏరివేసేందుకు కొంత మంది స్వచ్ఛసేవక్లను నియమించారు. వారిని అలాగే కొనసాగిస్తూ, అభయారణ్యంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయం చూపే వరకు కఠిన ఆంక్షలు నిలిపేయాలని కోరుతున్నారు. భక్తుల నీటి అవస్థలపై అటవీశాఖ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్లాస్టిక్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నామని ముక్తాయించారు. ప్టాస్టిక్ ఫ్రీ జోన్ పేరిట అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం శ్రీశైలం యాత్రికుల నుంచి తాగునీటి బాటిళ్లు స్వాధీనం విస్తృతంగా అవగాహన కల్పించకుండానే ఆంక్షలపై భక్తుల ఆగ్రహం కొర్రప్రోలు చెక్పోస్టు వద్ద లేని రూల్స్ శ్రీశైలం చెక్పోస్టు వద్దే ఎందుకని మండిపాటు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement