-
ఉద్యోగ విప్లవం
పార్వతీపురంటౌన్: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పరిపాలన వికేంద్రీకరణ పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు కలిసొచ్చింది. యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడంతో పాటు ప్రజలకు పాలన చేరువైంది. జవాబుదారీ తనం పెరిగింది. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరోవైపు అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో నెరవేర్చుతోంది. ముందస్తుగానే జిల్లాలోని నిరుద్యోగుల వివరాలను సేకరించి వారికి స్కిల్హబ్లలో వివిధ ఉద్యోగ కోర్సుల్లో శిక్షణ అందజేస్తోంది. నైపుణ్యాలు పెంపొందాక వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపుతోంది. శిక్షణ+ఉద్యోగం యువతలో నైపుణ్యాలను మెరుగుపరచి ఉపాధి బాటలు వేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషిచేస్తోంది. జిల్లాలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాల్లో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు వివిధ ఉద్యోగ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. 18 నుంచి 28 ఏళ్ల వయస్సు లోపు యువతకు మూడు నెలలపాటు ఇచ్చే శిక్షణలో నైపుణ్యాలు మెరుగుపర్చుతోంది. జాబ్మేళాలకు సిద్ధం చేస్తోంది. జిల్లాలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత మూడేళ్లలో 13 మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాల్లో 2,315 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాబ్మేళాలో సుమారు 800 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. పార్వతీపురం మన్యం జిల్లాలో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాలుగు స్కిల్ హబ్లలో శిక్షణ శిక్షణ పూర్తిచేసిన వారికి వివిధ కంపెనీల్లో ఉపాధి జిల్లాలో 19 జాబ్ మేళాల నిర్వహణ 3,115 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చుతున్న జిల్లా అధికార యంత్రాంగం -
No Headline
పార్వతీపురంటౌన్: జైలులో ఉండే ఖైదీలకు సత్ప్రవర్తనతోనే మార్పు రావాలని పార్వతీపురం మన్యం జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి అ న్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సబ్ జైలు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ వారికి సరైన ఆరోగ్య తని ఖీలు చేస్తున్నారో లేదోన ని ఆరా తీశారు. మంచి భోజనం, వసతి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కాలం జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు? అలాంటి వారికి ఇప్పటి వరకూ ఎందుకు బెయిల్ రాలేదని జైలు వార్డెన్ మోహన్బాబును అడిగారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయని ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొన్ని సార్లు క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడపవలసి వస్తోందని పేర్కొన్నారు. మీరు జైలులో ఉంటే బయట ఉండే నీ కుటుంబం పరిస్థితి గురించి ఆలోచించారా? అనాలోచిత నిర్ణయాలు మంచిది కాదని బయటకు వచ్చిన తరువాతైనా కుటుంబం కోసం సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి జైలు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి విజయ కల్యాణి పాల్గొన్నారు. -
26న సాహితీ సమాలోచనం
విజయనగరం టౌన్: విజయభావన సాహితీమిత్ర సమాఖ్య 535వ సభను ఈ నెల 26న ఆదివారం గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిర్వహిస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ భావన్ సాహితీ సమాలోచనం కార్యక్రమంలో భాగంగా ‘డాక్టర్ ఆచార్య భావన్ సాహిత్య సమీక్షణం’ అనే అంశంపై హైదరాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కానూరి బాపూజీ వక్తగా ప్రసంగిస్తార్ననారు. ధర్మపురి ఎల్డీజీ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎల్ఎన్.మూర్తి అధ్యక్షత వహించే సభకు సమన్వయకర్తగా విజయభావన ఉపాధ్యక్షుడు భోగరాజు ఖాదరవలీ బాబూజీ ఉంటారన్నారు. ఆచార్య భావన్ 28వ వర్ధంతి సందర్భంగా సంస్థ ప్రతినిధులు నివాళులర్పిస్తారని తెలిపారు. సాహితీవేత్తలందరూ హాజరుకావాలని కోరారు. -
ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు
కొమరాడ: అనుమతులు లేకుండా ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ నిషాంత్కుమార్ హెచ్చరించారు. మండలంలోని కూనేరు–రామభద్రపురం వద్ద ఉన్న ఇసుక రీచ్ను ఎస్పీ విక్రాంత్పాటిల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తరలించిన, మట్టి తవ్వకాలు జరిపిన వాహన యజమానులపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్, జిల్లా రవాణా శాఖాధికారి మల్లికార్జున రెడ్డి, తదితరులు ఉన్నారు. కలెక్టర్ నిషాంత్ కుమార్ -
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
విజయనగరం అర్బన్: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కాంపై కలెక్టర్ స్పందించారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంగళవారం కలిసి ఎన్నిల నిర్వహణలో ఎదుర్కొన్న వివిధ సమస్యలపై రెండుసార్లు వినతి పత్రాలను ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందించి పలు సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. శిక్షణ రోజులతో కలిపి డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించారన్నారు. అలాగే రిజర్వ్లో ఉన్న ఉద్యోగులకు రెమ్యూనరేషన్తోపాటు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పారు. 14వ తేదీ రెమ్యూనరేషన్ చెల్లింపు విషయంలో డ్యూటీ సర్టిఫికెట్ అభ్యంతరం లేదని, పరిశీలించి నర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో జేఏవీఆర్కే ఈశ్వరరావు, డి.శ్యామ్, ఈ.రామునాయుడు, కేవీరమణ, షేక్ బుకారీబాబు, సీహెచ్.పైడితల్లి, రమేష్ చంద్రపట్నాయక్, డి.రాము, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ను కలిసి ఉపాధ్యాయ సంఘాలు -
ఉత్తీర్ణతే లక్ష్యంగా.. ప్రత్యేక బోధన
● సప్లిమెంటరీ పరీక్షలకు కసరత్తు ● పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ప్రతీ ఒక్కరు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు ● ఈ నెల 24 నుంచి పది, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ● జిల్లాలో ఇంటర్మీడియట్లో 4,074, పదోతరగతి తప్పిన విద్యార్థులు 319 మంది పార్వతీపురంటౌన్/పాలకొండ రూరల్: పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. సులభ పద్ధతుల్లో పాఠ్యాంశ బోధన చేయిస్తోంది. పరీక్షలో విజేతగా నిలిపేందుకు అవసరమైన సూచనలు ఇప్పిస్తోంది. మెలకువలను నేర్పిస్తోంది. పరీక్షలకు సన్నద్ధం గతనెల 13న ఇంటర్మీడియట్ ఫరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 2,482 మంది, ఒకేషనల్–483 మంది, సెకెండియర్ జనరల్–840, ఒకేషనల్ విద్యార్థులు 269 మంది వెరసి 4,074 మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూ ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు మూడువారాలుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే, గతనెల 21న విడుదలైన ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 11,536 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 319 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరికి ఫెయిలైన సబ్జెక్టులో సబ్జెక్టు టీచర్లు బోధన చేస్తున్నారు. ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. వీటిని ప్రతిరోజు జిల్లా ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పదో తరగతి పరీక్షకు ఈనెల 23వ తేదీ వరకూ రూ.50 ఫైన్తో పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పదోతరగతి (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (ఫస్టియర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, సెకెండియర్ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు) పరీక్షలు జరగనున్నాయి. ప్రత్యేక దృష్టి సారించాం ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల ప్రకారం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఫెయిలైన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణత సాధించే విధంగా ఆయా సబ్జెక్టుల్లో తర్ఫీదునిస్తున్నాం. – మంజులా వీణ, జిల్లా వృత్తి విద్యాధికారిణి, పార్వతీపురం మన్యం సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన పదోతరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జారీచేశాం. ప్రతి విద్యార్థి పరీక్షల్లో తిరిగి ఉత్తీర్ణత సాధించేలా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు తర్పీదునిస్తున్నారు. – జి.పగడాలమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం -
గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ రేపు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో శుభం బన్సల్ ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట బాలికలు, బాలురు, పెద్దమడి బాలుర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూపులైన ఏఅండ్టి, సీజీఏలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఉంటుందన్నారు. విద్యార్థులు టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఆధార్కార్డులు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, 6 పాస్పోర్ట్ ఫొటోలు, మూడు జిరాక్స్ సెట్లు తీసుకుని కౌన్సెలింగ్ సెంటర్కు ఆ రోజు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. -
మిమ్స్లో అరుదైన శస్త్రచికిత్స
నెల్లిమర్ల: నగరంలోని మిమ్స్ ఆసుపత్రిలో వెన్నెముకకు అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు ఆర్థోపెడిక్ హెచ్ఓడీ డాక్టర్ శశిభూషణరావు తెలిపారు. ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయనగరం పట్టణ పరిధిలోని వీటీ అగ్రహారానికి చెందిన ఎ. జ్యోతి (33) పుట్టుక నుంచి వెన్నెముక వైకల్యంతో బాధపడుతోందన్నారు. విపరీతమైన వెన్ను నొప్పితో పాటు రెండు కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిందని చెప్పారు. ఆమెకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు ఆరు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి వెన్ను వంకరను సరిచేశామన్నారు. ఇటువంటి శస్త్రచికిత్స విజయనగరంలో ఇదే తొలిసారని తెలిపారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ, ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. చివరకు మిమ్స్కు రాగా.. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు యశ్వంత్, విజయభూషణ్, రాజశేఖర్, సతీష్, ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
24న డీఈఈ సెట్
విజయనగరం అర్బన్: డీఈఈసెట్–2024 ఈ నెల 24న ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులంతా హాల్టిక్కెట్లను ‘సీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’, ‘ఏపీడీఈఈసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నగర శివారులోని చిన్మయానగర్ ఎల్ఆర్జీ స్కూల్ పక్కన ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా భవనాన్ని పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్తో ఫొటో రానివారు ఒక పాస్పోర్టు సైజ్ ఫొటోతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆధార్కార్డు, పాన్కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకురా వాలని సూచించారు. -
ఎండలతో వచ్చే వ్యాధులు
ఎండ ధాటికి వృద్ధులు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరిగాయి. అయినప్పటికీ వృద్ధులు అప్రమత్తంగా ఉండడమే మేలని వైద్యులు చెబుతున్నారు. హైపర్ థెర్మియా.. ఎండల్లో తిరగకుండా ఇంటిలో ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరసించిపోతారు. దీన్నే హైపర్థెర్మియా అంటారు. శరీరం స్వీకరించే దానికన్నా అధిక వేడిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. హీట్ ఎగ్జాషెన్.. సాధారణంగా నాలుగు గంటలు ఎండల్లో తిరిగితే వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో ఒకటి రెండు గంటలు తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీన్నే హీట్ ఎగ్జాషెన్ అంటారు. వడదెబ్బ.. ఎండల్లో పనిచేసే వారు, తిరిగే వారు వడదెబ్బకు గురవుతారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఆరుబయట పనులకు వెళ్లకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే టోపీ ధరించడంతో పాటు వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. యూరినరీ ఇన్ఫెక్షన్లు.. వేసవిలో వృద్ధులు యూరినరీ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. మహిళల్లో మెనోపాజ్ వల్ల హార్మోన్ల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల.. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి సమస్యతో యూరినరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. -
23న జాబ్ మేళా
పార్వతీపురం టౌన్: పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీస్, డెక్కన్ కెమికల్స్, ఫాక్స్కాన్, ఆల్స్టామ్, డైకీ అల్యూమినియమ్ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో రిలేషన్షిప్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులై 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు జాబ్మేళాకు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్లతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9440127517 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఈదురుగాలుల బీభత్సం
వీరఘట్టం: ఈదురుగాలుల బీభత్సంతో వీరఘట్టం పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో భారీగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది. మరో వైపు వీరఘట్టం–పాలకొండ రహదారిలో పలు కూడళ్ల వద్ద భారీ వృక్షాలు నేలకొరగడంతో రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఎస్సై షేక్ ఫకృద్దీన్ సిబ్బందితో వచ్చి రోడ్డుపై పడిన చెట్లను జేసీబీతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రెండు విద్యుత్ స్తంభాలు, తహసీల్దార్ కార్యాలయంలో ఒక విద్యుత్ స్తంభం విరిగిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే చేపడుతున్నట్లు ఏఈ బాలాజీ తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం పూర్తిగా చల్లబడడంతో పట్టణ ప్రజలు ఉపశమనం పొందారు. నేలకొరిగిన భారీ వృక్షాలు విరిగిన విద్యుత్ స్తంభాలు -
–8లో
వృద్ధులకు.. వడదెబ్బ ముప్పు.. ఎండతీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. వేడిమి ప్రభావం ఎక్కువగా వృద్ధులపై పడి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులివే ● నోటిఫైడ్ డిసీజ్ (డెంగీ మొదలుకుని టీబీ వరకు)బాధితుల వివరాలను పోర్టల్లో నమోదు చేయకపోవడం ● ఇష్టారాజ్యం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండడం ● జనన ధ్రువీకరణ వివరాలు పోర్టల్లో నమోదు చేయకపోవడం ● సరైన కారణాలు లేకుండానే అబార్షన్లు నిర్వహించడం ● డెంగీ చికిత్సకు భారీగా డబ్బులు వసూలు చేయడం ● ఆరోగ్యశ్రీ సేవలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం ● కాన్పు సమయంలో తల్లుల మృతి పట్ల సరైన కారణాలు చూపకపోవడం -
పందెంరాయుళ్లకు జైలుశిక్ష
నెల్లిమర్ల రూరల్: కోడి పందాలు ఆడుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తులకు జిల్లా కోర్టు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.50 చొప్పున జరిమానా విధించిందని ఎస్సై రామగణేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 9న జగ్గరాజుపేట గ్రామ శివారులో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నాలుగు కోడిపుంజులు, రూ.7,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి జిల్లా కోర్టులో సెకెండ్క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు ముందు హాజరుపరచగా, ముద్దాయిలకు జైలుశిక్షతో పాటు అపరాధ రుసుం విధిస్తూ తీర్పు చెప్పారని పేర్కొన్నారు. -
రాజశేఖర్ సేవలు శ్లాఘనీయం
విశాఖ లీగల్: న్యాయవాదులు, న్యాయమూర్తులు సాంకేతికత వైపు అడుగులు వేయాలని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సూచించారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం దివంగత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బట్ట రాజశేఖర్ చిత్రపటం వద్ద నివాళలర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాయ్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా ఆన్లైన్ ద్వారా ప్రథమ సమాచార నివేదికను స్వీకరించిన రాజశేఖర్ సంచలనం సృష్టించినట్లు చెప్పారు. కేవలం న్యాయమూర్తి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సలహాలకు కేంద్ర బిందువుగా రాజశేఖర్ నిలిచారన్నారు. నిజాయితీ, నీతి కలిగిన న్యాయమూర్తిగా విశేష ఖ్యాతి గడించినట్లు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్.ఎస్.సోమయాజులు అన్నారు. రాజశేఖర్ సేవలను రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్ వివరిస్తూ అందరికీ ఆప్తుడుగా నిలిచిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. జూనియర్లకు ఒక మార్గదర్శి రాజశేఖర్ నిలిచారని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, రాజశేఖర్ కుటుంబ సభ్యులు, విశాఖ జిల్లా వినియోగదారుల మండలి–2 సభ్యురాలు బి.విజయదుర్గ, సీనియర్ న్యాయవాది హేమమాలిని, రాజశేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: రాష్ట్ర సేవాధికార సంస్థకు మధ్యవర్తిత్వం (మీడియేటర్లు) వహించుటకు ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి కె. విజయకల్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన వ్యక్తులను ఎం ప్యానల్మెంట్ జాబితాలో చేర్చడం జరుగుతుందని, మే 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. విశ్రాంత న్యాయాధికారులు, బ్యూరోక్రాట్లు, న్యాయవాదులు, ఆచార్యు లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ రంగాలలో నిష్ణాతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ సీతానగరం: ఏపీ గిరిజన సంక్షేమ ప్రతిభా గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోగింపేట గిరిజన ప్రతిభా విద్యాలయం ప్రిన్సిపాల్ పోల వెంకటినాయుడు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు జోగింపేటలో పాఠశాలలో కౌనెల్సింగ్ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 7న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఫోన్ ద్వారా, కాల్లెటర్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 8వ తరగతి, ఇంటర్మీడియట్లో.. మల్లి (పీజీటీ) కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి, కృష్ణ ఉమ్మడి జిల్లాలకు చెందిన గిరిజన బాలురు కౌన్సిలింగ్కు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలన్నారు. వివరాలకు 94909 57218, 94401 03332 నంబర్లను సంప్రదించాలని కోరారు. చెరువులో పడి బాలుడి మృతి దత్తిరాజేరు: చెరువులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని ఆర్. రామచంద్రాపురంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్. బూర్జవలస ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మండాది గౌతం (10) తోటి స్నేహితులతో కలిసి మల విసర్జనకు పప్పల చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి చెరువులో పడిపోవడంతో తోటి స్నేహితులు బయటకు తీసి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే స్థానికులు చేరుకుని 108 సిబ్బందికి ఫోన్ చేయగా... వారు వచ్చి పరిశీలించారు. అయితే అప్పటికే చిన్నా రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. తల్లి మృతి చెందడంతో గౌతం తాత ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. మృతుడి తాత సాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిర్గిస్తాన్లో అల్లర్లు... ఆందోళనలో రాజాం వాసులు
రాజాం సిటీ: కిర్గిస్తాన్లో జరుగుతున్న అల్లర్లు రాజాం వాసులను కలవరపెడుతున్నాయి. రా జాం ప్రాంతానికి చెందిన 12 మంది విద్యార్థులు ఆ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం రష్యాలోని కిర్గిస్తాన్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురతున్నారు. పట్టణ పరిధి బాబానగర్, వాసవీనగర్, శ్రీకాకుళం రోడ్డు, అమ్మవారికాలనీ, లక్ష్మీపురం, లింగాలవలస ప్రాంతాలకు చెందిన ఎస్.భార్గవ్నాయుడు, టి.వినయ్, సీహెచ్ సురేంద్ర, బి.గ్రీష్మ, జి.సోమేశ్వరరావు తదితర విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఆయా విద్యార్థులతో తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిలను అడిగితెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులంతా క్షేమంగానే హాస్టల్లో ఉన్నామంటూ చెబుతున్నా.. తల్లిదండ్రుల్లో టెన్షన్ తగ్గడంలేదు. మరో నెల రోజుల్లో కోర్సులు పూర్తిచేసుకుని వచ్చే సమయంలో ఇలా జరగడం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం స్పందించి పిల్లలకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మంత్రి బొత్స పరామర్శ
విజయనగరం: గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ నడిపిల్లి ఆదినారాయణను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం పరామర్శించారు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు తీవ్ర అస్వస్థతకు గురైన ఆదినారాయణకు కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి ఆదినారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణ తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వసతి గృహంలో నిర్వహించనున్నారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసెస్ వంటి కోర్సుల్లో 30 రోజులు శిక్షణ ఇస్తారు. వసతి, భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు. తెలుపుకార్డు కలిగిన 45 ఏళ్లలోపు వయస్సుగల గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 1వ తేదీలోగా దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని సంస్థ డైరె క్టర్ రమణ (99595 21662) కోరారు. -
బస్సులకు ిఫిట్నెస్ పరీక్షలు
● స్కూల్ బస్సులు కండిషన్లో లేకుంటే వెనక్కు పంపడమే ● జిల్లా రవాణా కార్యాలయం వద్ద బస్సుల కండీషన్ తనిఖీ ● జిల్లాలో 85 స్కూల్ బస్సులు ● ఫిట్నెస్ టెస్ట్ పాసైతేనే నడిపేందుకు అనుమతి పార్వతీపురంటౌన్: వేసవి సెలవుల అనంతరం కళాశాలలు, పాఠ శాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రతి రోజూ ప్రయాణించే స్కూల్, కళాశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఫిట్నెస్ పరీక్షలో తప్పనిసరిగా బస్సులు పాసవ్వా లని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు రవాణా శాఖ కార్యాలయాల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలు ఇలా... స్కూల్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు స్వయంగా డ్రైవ్ చేస్తారు. బస్సులోపల, బయట పూర్తిగా పరిశీలించి మరమ్మత్తులు చేయాల్సినవి గుర్తిస్తారు. డ్రైవింగ్కు సంబంధించి బ్రేకులు, క్లచ్, స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్, బ్యాటరీ, ఇంజిన్కు సంబంధించి పలు విభాగాలను పరిశీలిస్తారు. బస్సులోని అత్యవసర ద్వారాలు, కిటికీలు, టైర్లు, సీట్లు, ఇలా ప్రతి దానిని పూర్తిగా పరిశీలించి అన్నీ బాగున్నాయని సంతృప్తి చెందిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇప్పటి వరకు జిల్లాలో 85 బస్సులు జిల్లాలో 85 వరకూ స్కూల్ బస్సులు ఉండగా వాటి కి ఫిట్నెస్ పరీక్షలు తలపెట్టారు. బస్సుల ఫిట్నెస్ చేసుకున్నవారికి ధ్రువీకరణ పత్రం జారీచేస్తున్నా రు. మరమ్మతులు చేయాల్సిన వాటికి సమయం ఇచ్చి ఫిట్నెస్కు రావాలని ఆదేశిస్తున్నారు. స్కూల్ బస్సు నడిపే వారికి ఈ నిబంధనలు తప్పనిసరి ●ఐదేళ్లు అనుభవంతో కూడిన భారీ వాహన లైసెన్సు ఉండాలి. ●డ్రైవర్ వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. ●శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ ఉండాలి. ●డ్రైవర్, సహాయకుడు యూనిఫాంఽ ధరించాలి. ●వేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడపరాదు. ●బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సు ఉండాలి. ●బస్సులోకి విద్యార్థులు ఎక్కేందుకు, దిగేందుకు ఆధారంగా రెండు వైపులా ఇనుప కడ్జీలు ఉండాలి. ●బస్సు ముందు భాగంలో పాఠశాల పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు తప్పనిసరి. ఫిట్నెస్ టెస్ట్ పాసైతేనే నడిపేందుకు అనుమతి స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. అన్నీ సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఫిట్నెస్ పరీక్షలు జరుగుతా యి. ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సు రన్నింగ్కు అనుమతించం. ఫిట్నెస్ పరీక్ష చేయించకుండా బస్సులు నడిపితే కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి, పార్వతీపురం మన్యం -
స్ట్రాంగ్రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లను గురువారం పార్వతీపురం తరలించారు. అక్కడి డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో భద్రపరిచారు. అరకు పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నిషాంత్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ సహాయ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం శాసనసభ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు సి.విష్ణుచరణ్, శుభం బన్సాల్, వి.వి.రమణ, కె.హేమలత, కంట్రోల్ రూం ఇన్చార్జి ఎస్డీసీ ఆర్.సూర్యనారాయణ, ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, 234 బెటాలియన్ బి.కంపెనీ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినిత, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
No Headline
బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పులు, కోరిన కోరికలు తీర్చే గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల సిరిమానోత్సవ సంబరాలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 19,20,21 తేదీల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండగలు నిర్వహించేందుకు రెండు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 19న దేశతల్లి అమ్మవారి ఉత్సవంతో ప్రారంభమయ్యే పండగలో భాగంగా 20న సిరిమానోత్సవం జరుగుతుంది. 21న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఈ జంట సంబరాలకు రెండు ప్రాంతాల్లో భక్తులు సన్నద్ధమయ్యారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగను చుట్టుపక్కల 12 గ్రామాల వారు ఘనంగా జరుపుకుంటారు. అలాగే పాత బొబ్బిలిలో సరేపోలమ్మ ఉత్సవాలు కూడా ఈనెల 19నే ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గొల్లపల్లి, పాత బొబ్బిలి అమ్మవార్ల సిరిమానోత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతాయి. పాత బొబ్బిలి నుంచి పట్టణంలోకి సిరిమాను ప్రవేశించి పురవీధులన్నీ కలియదిరిగి భక్తులను పరవశింప చేస్తుంది. అలాగే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమాను కూడా సోమవారం సాయంత్రం గొల్లపల్లి నుంచి ఊరేగింపుగా ప్రారంభమై పట్టణంలోకి ప్రవేశించి పట్టణంలోని అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పాత బొబ్బిలి, గొల్లపల్లిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాము గరిడీలు, బిందెల డ్యాన్సులు, తప్పెట గుళ్లు, కోలాటం, భారీ లైటింగ్, బళ్ల వేషాలు, కాంతార హంస డ్యాన్స్, బాహుబలి ప్రదర్శన, తీన్మార్, డీజే, మందుగుండుసామగ్రి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికే పట్టణంలో అమ్మవార్ల ఘటాలు తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. -
గిజబలో సంచరిస్తున్న ఏనుగులు
గరుగుబిల్లి: గిరిజన ప్రజలను ఏనుగులు బెడద వీడడం లేదు. కొద్ది నెలల నుంచి కొమరాడ, జియ్యమ్మవలస మండల పరిధిలో సంచరిస్తున్న ఏనుగులు గురువారం మండలంలోని గిజబ, నందివానివలస గ్రామాల పరిసరాల్లోకి చేరుకున్నాయి. ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అరటి, మొక్క జొన్న, పామాయిల్ పంటలు నాశనం చేస్తాయన్న బెంగ రైతులను వెంటాడుతోంది. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గిరిజన వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి నోటిఫికేషన్కు సంబంధించిన వివరాల ను గురువారం వెల్లడించారు. పీజీ ప్రొగ్రామ్ల కు దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలకు ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో చూడాలన్నారు. అర్హులై న విద్యార్థులు ఈ నెల 22వ తేదీ రాత్రి 11.55 నిమిషాలలోపు రిజిస్టర్ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం యూనివ ర్సిటీ క్యాంపస్లో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ను లేదా, మొబైల్ నంబర్ 63004 43499ను యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులివే... యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఏ ట్రైబల్ స్టడీస్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లిష్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ), మాస్టర్ ఆఫ్ జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎంబీఏ రెండేళ్ల పీజీ కోర్సును ఏర్పాటు చేశారు. ఈ కోర్సునకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని అనుసరించి ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రవేశాలు కల్పిస్తామని వీసీ తెలిపారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన ప్రజానీకానికి దివంగత వైఎస్సార్ అన్నా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా అమితమైన అభిమానం. వారికి అధికంగా మేలు జరిగింది కూడా ఈ ఇద్దరి నేతల హయాంలోనే. ఆ విశ్వాసంతోనే ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి అరకు పార్లమెంట్ స్థానం, ఏజెన్సీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో సంపూర్ణ ఆధిక్యతను కట్టబెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత గిరిజన ప్రజలు జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. ఈసారీ వారి మద్దతు కచ్చితంగా తమకే లభిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. చరిత్ర తిరగరాస్తామని ధీమాగా చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ హవా.. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. పార్టీ తరఫున బరిలోకి దిగిన పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలుపొందారు. స్థానిక సంస్థల్లోనూ అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పార్టీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు సైతం తిరుగులేని ఆధిక్యం సాధించారు. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలతో పాటు.. అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు మంజూరు వంటి శాశ్వత పథకాలు గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ● సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజన్నదొర వైఎస్సార్సీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 1,46,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రాజన్నదొరకు 78,430 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 58,401 ఓట్లు వచ్చాయి. 20,029 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన రాజన్నదొరకు 63,755 ఓట్లు వచ్చాయి. 47.8 శాతం ఓటింగ్తో ఆయన విజయం సాధించారు. ● పార్వతీపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొత్తం 1,37,154 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు వచ్చాయి. 24,199 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. ● కురుపాం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 1,38,723 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 26,602 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ 55,435 ఓట్లు సాధించారు. 19,083 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ● 2014 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి 55,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కలిసొస్తున్న పెరిగిన ఓటింగ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గిరిజన ప్రజలతో నిత్యం మమేకమయ్యారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు గిరిజన శాఖకు మంత్రులుగానూ వ్యవహరించారు. దీనివల్ల గిరిజనుల జీవన స్థితిగతులు మరింతగా మారాయి. సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ వెళ్లాయి. గతంలో నిరక్షరాస్యులైన గిరిజనులకు తమ పేరిట ఏ పథకాలు వచ్చేవో కూడా తెలియదు. ఇప్పుడు నేరుగా వలంటీర్ల ద్వారానే లబ్ధి పొందగలుగుతున్నారు. గిరి శిఖర గ్రామాలకు రహదారులనేకం మంజూరయ్యాయి. తాగునీరు అందుతోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందుకున్నారు. జగనన్న లేఅవుట్ల కింద ఇళ్లు, ఇంటి పట్టాలను పొందారు. పింఛన్లు పొందుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. దీనివల్ల వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. అందుకే.. ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ పట్ల తమ విధేయతను చాటుతున్నారు. ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. ఆ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చూపించారని, పెరిగిన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శమని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,54,633 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,53,709 మంది కాగా.. మహిళలు 8,00,813 మంది. ఇతరుల సంఖ్య 111. ఈ దఫా ఎన్నికల్లో మొత్తంగా 11,45,426 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 5,60,845 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా.. 5,84,533 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటు వేశారు. 73.68 పోలింగ్ శాతం నమోదైంది. కొండలు, కోనలు దిగివచ్చి గిరిజన ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంత చైతన్యం తాము మునుపెన్నడూ చూడలేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధికి మరోసారి పట్టం కట్టేందుకే గిరిజనులు జై కొట్టారని ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. న్యూస్రీల్పార్లమెంట్ స్థానంలో పాగా.. అరకు పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన కొత్తపల్లి గీత... జగన్మోహన్రెడ్డిపై గిరిజనులకు ఉన్న విశ్వసనీయతతో గెలిచారు. ఆ తర్వాత ఆమె స్వార్థ ప్రయోజనాలు చూసుకుని పార్టీ ఫిరాయించి గిరిజన ప్రజానీకాన్ని మోసగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా జి.మాధవి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గుమ్మ తనూజారాణికి అధినేత అవకాశం ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రజలతో సత్సంబంధాలను పెంచుకున్నారు. నేడు గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు కై వసం ఈసారీ పునరావృతం అవుతున్నాయన్న విశ్వాసంలో పార్టీ శ్రేణులు గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి -
మళ్లీ రానున్నది సంక్షేమ ప్రభుత్వమే
పార్వతీపురంటౌన్: మళ్లీ రానున్నది జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వమే అని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ స్థానిక కార్యాలయంలో ‘సాక్షి’తో బుధవారం మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ అండగా నిలిచారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పోలింగ్ రోజు రాత్రి వరకూ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారన్నారు. జగనన్నకు జై కొట్టిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడి్డ్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందన్నా రు. జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని, లేకుంటే బీజేపీలో విలీనమవుతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా పచ్చ మూకల్లో మార్పురాకపోవడం శోచనీయమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
No Headline
కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement