-
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు. -
27న నిధి ఆప్కే నికత్
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. పీఎఫ్ భాగస్వామ్య యజమానులందరూ కార్యక్రమానికి విధిగా హాజరై, ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా ఉద్యోగులతో పాటు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గుంటూరు కృష్ణనగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిస గ్రామంలోని ఉమా స్పింటెక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఒంగోలులోని ఈఎస్ఈసీ బ్రాంచ్, విజయవాడ గాంధీనగర్లోని ఈఎస్ఈసీ బ్రాంచ్ కార్యాలయం, బాపట్ల జిల్లా కారంచేడులోని శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తిమ్మాపురంలోని వసంత ఇండస్ట్రీస్లో జరిగే కార్యక్రమాల్లో ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహానికి రుణ మేళా
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్టార్టప్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహానికే ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా రుణ మేళాలను నిర్వహిస్తోందని చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ దాసరి దేవరాజ్ అన్నారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలోని ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణమేళా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం, ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు మెగా లోన్ మేళాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అగ్రి పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతిపాదనలు భాగస్వామ్య బ్యాంకుల ద్వారా అందజేశారు. రూ.15 కోట్ల వరకు వ్యాపార ప్రతిపాదనలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. మేళాలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యపై కత్తితో దాడి
గుడివాడరూరల్: పచ్చని కాపురంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చుపెట్టిన నేపథ్యంలో భార్యపై కత్తితో భర్త విచక్షణారహితంగా దాడి చేయగా తీవ్రగాయాలపాలైన ఘటన మండలంలోని మల్లాయపాలెం టిడ్కో ఇళ్ల వద్ద బుధవారం జరిగింది. సేకరించిన వివరాల మేరకు గుడివాడకు చెందిన దుర్గాదేవి(32)కి ఉయ్యూరు మండలం కుందేరు గ్రామానికి చెందిన మరీదు నాగరాజు(35)తో 2017లో వివాహం జరిగింది. అనుమానంతో నిత్యం భార్యను వేధిస్తుండటంతో 2022లో ఆమె పుట్టిల్లు అయిన గుడివాడకు వచ్చేసింది. ప్రస్తుతం టిడ్కో ఇంట్లో నివాసముంటున్న భార్య దుర్గాదేవి వద్దకు బుధవారం భర్త నాగరాజు వచ్చి తనకు విడాకులు ఇవ్వాలంటూ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య జరిగిన గొడవలో భర్త నాగరాజు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి భర్త నాగరాజుకు దేహశుద్ధి చేయగా, అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు 108 ద్వారా దుర్గాదేవిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి దుర్గాదేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ తాలూకా ఎస్ఐ ఎల్ఎస్ఎన్ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మనోవేదనతో యువకుడు ఆత్మహత్య
చల్లపల్లి: భార్యా పిల్లలకు దూరమైన వ్యక్తి మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం చల్లపల్లి శివారు గంగులవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన చిగురుపల్లి శ్యాంబాబు (33) బుధవారం తెల్లవారుజామున తన ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కొక్కేనికి లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ విద్యుత్ కార్మికునిగా పనిచేసే శ్యాంబాబుకు 2010లో వివాహం కాగా ఒక కుమార్తె జన్మించింది. ఐదేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. భార్య తన కుమార్తెతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కూడా లేని శ్యాంబాబు ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. శ్యాంబాబు సోదరుడు కూడా ఇటీవల మృతి చెందటంతో గంగులవారిపాలెంలోని రెండు పోర్షన్ల ఇంట్లో ఒక గదిలో శ్యాంబాబు, రెండో గదిలో అతని వదిన, పిల్లలు ఉంటున్నారు. ఐదేళ్లుగా భార్యా, పిల్లలకు దూరమైన శ్యాంబాబు మనోవేదనతో నెల రోజులుగా పనికి వెళ్లటం లేదు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, జీవితంలో ఓడిపోయానని, తనకు పెళ్లి, పిల్లలు, చావు అన్నీ త్వరగానే అంటూ సూసైట్ లెటర్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యాంబాబు మృతి వార్త తెలుసుకున్న భార్య, కుమార్తె, బంధువులు చల్లపల్లి చేరుకున్నారు. మృతుని సోదరి సునీత ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎ.పాండురంగారావు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యాంబాబు మృతదేహానికి వీఆర్వో బేబీ పంచనామా చేయగా, పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చెరువులో పడి బాలిక దుర్మరణం
పెనమలూరు: కానూరు చెరువులో పడి బాలిక మృతి చెందటంతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం కానూరు పెద్దబావి సెంటర్లో ఆరేపల్లి నాగరాజు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె వాగ్దేవి(8)గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. తల్లి నాగలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం పనికి వెళుతూ కుమార్తె వాగ్దేవికి పచారి కొట్టు వద్ద తినుబండారాలు కొని ఇచ్చి వెళ్లింది. నాగలక్ష్మి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా వాగ్దేవి కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా కనబడకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. నాగలక్ష్మి ఇంటి వెనుక చెరువు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి బుధవారం ఉదయం చెరువులో వెతికించగా వాగ్దేవి మృతదేహం దొరికింది. ఆటలాడుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాలిక తల్లి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లైంగికదాడి కేసులో ముగ్గురు యువకుల అరెస్టు
కంకిపాడు: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీనివాసరావు, ఎస్ఐ డి.సందీప్ వివరాలను వెల్లడించారు. మండలంలోని దావులూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై లైంగికదాడి జరిగింది. రెండు వారాలుగా తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఈనెల 20న తల్లి సీహెచ్ రేణుకమ్మ తన కుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. రేణుకమ్మ కుమార్తె (26)ను పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో రేణుకమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పుట్టుకతోనే వైకల్యం ఉన్న యువతి (26)పై లైంగికదాడి జరిగినట్లు కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లైంగికదాడికి కారకులుగా తేల్చారు. లైంగిక దాడికి పాల్పడ్డ నల్లమోతు వేదాంత రాజు అలియాస్ ముక్కు రాజు, చాట్ల జోజిబాబు, కొండేటి పెద్దిరాజు కారకులుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించటంతో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ వెల్లడించారు. -
పేద విద్యార్థులకు దీవెన
గుడ్లవల్లేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు బటన్ నొక్కిన విద్యా దీవెన నిధులను బాబు అండ్ కో ఎన్నికల కమిషన్ ద్వారా ఆపించడంతో పేద విద్యార్థులు నీరుగారిపోయారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఇప్పుడు ఆ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడేసరికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు సంతరించుకున్నాయి. పేద వర్గాలకు ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో 2019 నుంచి సీఎం జగన్ నవరత్నాల పేరిట అందించిన సంక్షేమ ఫలితాలు సత్ఫలితాలను ఇచ్చాయి. పేద వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అండగా నిలిచాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కోవిడ్ తదితర కారణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలిపి వేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఠంచనుగా అమలు చేశారు. ఇందులో భాగంగా ఇటీవల సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన విద్యా దీవెన నిధులు చంద్రబాబు వేసిన పిటీషన్ కారణంగా ఆగిపోయాయి. తాజాగా సోమవారం నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విద్యా దీవెన నిధులు జమవుతున్నాయి. దీనితో ఆ పథకాల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యా దీవెన నిధులు రూ.28.30 కోట్లు విడుదల... విద్యా దీవెన నిమిత్తం జిల్లాకు చెందిన 32,620 మంది విద్యార్థులకు గానూ వారి తల్లుల ఖాతాలకు రూ.28.30 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. పేద వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం పేదల విద్యకు విద్యా దీవెన పథకం ద్వారా అండగా నిలిచింది. టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్గా తూతూ మంత్రంగా ఇచ్చేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ విద్యా దీవెన ద్వారా ఏడాది పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్గా విద్యార్థులకు అందిస్తోంది. ఏటా త్రైమాసిక చదువుకు అయ్యే ఖర్చును విద్యార్థుల ఖాతాలకు జమ చేసి ఆ మొత్తాన్ని కళాశాలల్లో చెల్లించే రీతిలో ప్రణాళికా బద్ధంగా అమలు చేశారు. దీనితో పేద విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, వైద్య విద్య, డిగ్రీ తదితర కోర్సులతో పాటు విదేశీ విద్య సైతం అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. నియోజకవర్గం విద్యార్థులు విద్యాదీవెన నిధులు రూ.కోట్లలో మచిలీపట్నం 4,254 3.52 పెడన 4,059 3.40 అవనిగడ్డ 5,376 4.42 గుడివాడ 4,485 4.11 పామర్రు 4,347 3,73 పెనమలూరు 6,219 5.82 గన్నవరం 3,880 3.30 జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.28.30 కోట్లు విడుదల జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు లబ్ధి చాలా హ్యాపీగా ఉంది... విద్యా దీవెన డబ్బులను ఎన్నికల్లో రకరకాలుగా అడ్డుకున్నారు. కాని సీఎం జగన్ అన్న మాటను నెరవేర్చుకున్నారు. పేద పిల్లల చదువుల కోసం చేసే సాయంలో ఎంతో మేలు దాగి ఉంది. అందుకే ఎంతమంది అడ్డుకున్నా మాకు చేరాయి. – తల్లి వెంకటేశ్వరమ్మతో విద్యార్థి ఫణి, డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం -
దొంగ ఓట్లు పట్టించిన వారిపైనే కేసులా?
భవానీపురం పోలీసుల తీరుపై అనుమానాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భవానీపురం పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వర్గంపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు దొంగ ఓట్లు వేసే వారికి వత్తాసు పలికారని, దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి కూటమికి అనుకూలంగా పనిచేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ సందర్భంగా కొందరు చైతన్య కాలేజీ పోలింగ్ స్టేషన్ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో తాము అడ్డుకునేందుకు వెళ్లగా, తమపైనే పోలీసులు కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ నాయకులు వాపోయారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య 15 మంది అనుచరులతో వచ్చి తనపై దాడి చేసి గాయపరిచారంటూ వైఎస్సార్సీపీకి చెందిన ఫారూఖ్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఫారూఖ్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఫారూఖ్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా పోలీసులు ఫారూక్పైనే కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ నాయకులతో పోలీసులు కుమ్మకై ్క ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తప్పుడు కేసులు బనాయించడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనపై దాడి చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఫారూఖ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. భవానీపురం పోలీసు స్టేషన్లో కొందరు పోలీసులు బాహాటంగానే టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య బైక్పై తిరుగుతున్నారని, స్వాతి రోడ్డులో సీసీ కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్నారు. మాజీ కార్పొరేటర్ కనుసన్నల్లోనే తమపై కేసులు, బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా ఒక పార్టీ నాయకుడితో చెట్టాపట్టాల్ వేసుకుని ఎలా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
పవర్ లిఫ్టింగ్లో గుడివాడ క్రీడాకారుల ప్రతిభ
గుడివాడటౌన్: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన తిరువూరులో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో తమ క్రీడాకారులు సత్తా చాటారని గుడివాడకు చెందిన ఫిట్ జోన్ జిమ్ కోచ్ మహ్మద్ సైదా తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలు బాలురు, బాలికల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరిగాయన్నారు. బాలికల సబ్ జూనియర్ విభాగంలో టి.వెన్నెల 105 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, రిత్విజ 95 కిలోల బరువును ఎత్తి వెండి పతకం, బాలుర విభాగంలో ఎన్.మోహన్ 140 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, జూనియర్ విభాగంలో వివేకానంద 95 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, రిత్విక్ 90 కిలోల బరువును ఎత్తి వెండి పతకం, సీనియర్ కేటగిరిలో మణికంఠ 430 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎల్.షేరిల్ 410 కిలోల బరువును ఎత్తి వెండి పతకం, మాస్టర్స్ విభాగంలో గంటా సురేష్ 215 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, 93 కిలోల శరీర బరువు కేటగిరిలో పి.రవికుమార్ 320 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, 96 కిలోల విభాగంలో వెంకటేశ్వరరావు 190 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించినట్లు సైదా తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం ఏలూరు రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ ఆవరణలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ మలిరెడ్డి రవి, జిమ్ సభ్యులు పాల్గొన్నారు. -
రేకుల షెడ్డుపై నుంచి పడి నిర్మాణ కూలీ మృతి
పెనమలూరు: షెడ్డు నిర్మిస్తూ ప్రమాదవశాత్తు షెడ్డు పైనుంచి కిందపడి గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు డబ్బాపంపు సెంటర్కు చెందిన కన్నా శివరామ్ (35) వెల్డింగ్ పనులు చేస్తూ షెడ్లు నిర్మాణం చేస్తాడు. అతనికి భార్య కన్నా రజిని ఉంది. ఈ నెల 20వ తేదీన కానూరు కొత్త ఆటోనగర్ వద్ద సిమెంట్ రేకుల షెడ్డు నిర్మిస్తుండగా రేకులు పగిలి ప్రమాదవశాత్తు శివరామ్ రేకులపై నుంచి కింద రాళ్ల గుట్టపై పడి గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న శివరామ్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. భార్య కన్నా రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఖాయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించబోతోందని, అఖండ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలతో చంద్రబాబుకు రాజకీయ రిటైర్మెంట్ తప్పదన్నారు. జూన్ 4న ఎన్నికల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అఖండ మెజారిటీతో గెలవనుందని, టీడీపీ ఫ్యాన్కు ఉరేసుకుంటుందన్నారు. జగనన్న పాలన దేశానికే దిశా నిర్దేశం చేయనుందన్నారు. ఎన్నికల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో జగనన్న పాలన ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఉండబోతోందన్నారు. -
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయి. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేశాం. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశాం. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశాం. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించాం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశాం.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తాం’’ అని ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు. -
సిట్ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్
సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.వైఎస్సార్సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. -
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ సైలెన్స్.. దేనికి సంకేతం?
ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?. -
సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంటర్ సప్లిమెంటరీ, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో మంగళవారం డీఆర్వో వి. శ్రీనివాసరావు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్న పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ తేదీ నుంచి జూన్ నెల ఒకటో తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ, అలాగే 24 తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ● ఇంటర్ మొదటి సంవత్సరం 28,668 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 6,545 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూనియర్ ఇంటర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సీనియర్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ● పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 6,702 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరికి 35 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యా హ్నం 12:45 గంటల వరకు జరుగుతాయన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని డీఆర్వో చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాల విజయవంతంగా నిర్వహించాలని డీఆర్ఓ వి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సీఎస్ఎస్ఎన్ రెడ్డి, డీఈవో యువీ సుబ్బారావు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్వో శ్రీనివాసరావు -
‘ఉపాధి’ పథకంలోప్రతి ఒక్కరికీ పని
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకం ద్వారా పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్తో ఉపాధి హామీ పనులను భాగస్వామ్యం చేసి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపి వేసవి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా శివారు గ్రామ ఆవాసాలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ కోత లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని, సాంకేతిక సమస్య ఎదురైతే తక్షణమే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ వివరించారు. దూరవిద్య సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్య విస్తృత వ్యాప్తికి సర్టిఫికెట్ కోర్పులు ప్రారంభించినట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.గురవారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల రైతులు, మహిళలు, యువతకు 8 వారాల పాటు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పలు కోర్సులను ఇప్పటికే ఏప్రిల్ నుంచి ప్రారంభించామని పేర్కొన్నారు. మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఆసక్తిగల వారు రూ. 1500 ఫీజు చెల్లించి జూన్ 20లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, తప్పనిసరిగా కంప్యూటర్కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, ఐపాడ్ కానీ కలిగి ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8008788776, 8309626619, 8096085560లో సంప్రదించవచ్చని వివరించారు. సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు -
బొండా ఉమా వ్యాఖ్యలు హాస్యాస్పదం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడానికి వైఎస్సార్ సీపీ నాయకులే కారణమంటూ బొండా ఉమా చేసిన వ్యా ఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమా తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలకు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కావలసిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో తమకు కావాల్సిన వ్యక్తు లను నియమించుకోవడం కోసమే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. పల్నాడులో అంతకు ముందు ఉన్న ఎస్పీ పై నిరాధార ఆరోపణలు చేసి తమకు సంబంధించిన బిందు మాధవ్ను ఎస్పీగా వచ్చేలా చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయలకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి ఎస్పీగా ఉండడం వల్లే ఘర్షణలు జరిగాయన్నారు. తిరుపతిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఎన్నికల కమిషన్ ద్వారా తమ వ్యక్తులను నియమించుకొని ఘర్షణ సృష్టించింది టీడీపీయేనన్నారు. ఎన్నికల్లో అల్లర్లు, ఘర్షణలు సృష్టించి ఆ నిందను వైఎస్సార్ సీపీపై మోపుతున్నారన్నారు. బొండా ఉమా లాంటి చోటా నాయకులు వాస్తవాలను వక్రీకరించినంత మాత్రాన అవి వాస్తవాలు కాకుండా పోవని తెలిపారు. టీడీపీ నాయకులు తమకు కావాల్సిన పోలీస్ అధికారులను నియమించుకున్న ప్రాంతాల్లోనే ఘర్షణలు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా గొడవలు జరగలేదంటేనే టీడీపీ కుట్రలు బహిర్గతం అవుతున్నాయని వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ -
రాష్ట్రాన్ని మణిపూర్లా చేయాలనుకున్న చంద్రబాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి మెలసి జీవిస్తుంటే, వారి మధ్యన చిచ్చుపెట్టి మరో మణిపూర్లా చేసేందుకు బీజేపీతో చంద్రబాబు జతకట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు విమర్శించారు. చంద్రబాబుకు తన పదవీ వ్యామోహం మినహా, ప్రజల శ్రేయస్సు పట్టదని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 60 లక్షలకు పైగా ఉన్న మాల, మాదిగ ఓటర్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సామాజిక న్యాయం, సంక్షేమానికి మద్దతు తెలిపారన్నారు. వారితో పాటు ముస్లింలు, బలహీనవర్గాల వారు, క్రైస్తవులు మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఓటు ద్వారా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన దాడులు అత్యంత బాధాకరమన్నారు. అత్యధిక మంది దళితులు జగన్వైపు ఉండటంతో ప్రతిపక్షాలు తమ అక్కసు వెళ్లగక్కుతూ దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు. ఈ దాడులకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే... ఎన్డీఏ కూటమి అభ్యర్థన మేరకు పోలీసు అధికారుల మార్పు జరిగిన ప్రాంతాల్లోనే దాడులు జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అక్కడ ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా ఉన్నట్లు ప్రతి ఒక్కరికీ అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవారిని సంక్షేమ పథకాలు అందించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ నాలుగో తేదీన మరోసారి ఘన విజయం సాధించబోతున్నారని చెప్పారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించే శక్తి, దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు స్టేట్ లీగల్సెల్ అధ్యక్షుడు కోట జయరాజు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు సత్తెనపల్లి కిషోర్, విజయవాడసిటీ అధ్యక్షుడు కాపుదేశీ రాజేష్, నాయకులు రెండపల్లి కొండా, బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు.మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు -
నియోజకవర్గాల వారీగా ఇన్ఫుట్ సబ్సిడీ మంజూరు ఇలా....
నియోజకవర్గం – రెతులు – పంట నష్టం(హెక్టారుల్లో)– ఇన్ఫుట్ సబ్సిడీ మచిలీపట్నం – 7,729 – 5,080.32 863.65 (లక్షల రూపాయల్లో) పెడన – 16,826 – 9,082.90 1,544.09 అవనిగడ్డ – 22,994 – 13,511.83 2,297.01 గుడివాడ – 6,929 – 4,203.15 714.54 పామర్రు – 20,741 – 14,443.846 2,451.660 పెనమలూరు – 5,614 – 4535.88 770.852 గన్నవరం – 11,485 – 7,977.61 1,348.63 మొత్తం రైతులు – 92,318మంది మొత్తం పరిహారం – 9,990.44లక్షలు -
స్థిరత్వ సర్టిఫికెట్ ఉంటేనే !
పటమట(విజయవాడతూర్పు): బహిరంగ ప్రదేశాల్లో, ప్రైవేటు భవనాలపై వాణిజ్య, వ్యాపార ప్రకటనలను ఆకర్షణీయంగా ప్రదర్శించే క్రమంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పబ్లిక్ ప్రదేశాలు, ప్రైవేటు భవనాలలపై ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇవి తుప్పుపట్టి ఎప్పుడు కూలతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. హోర్డింగ్లను ఏర్పాటు చేసే ఏజెన్సీలు వాటి నిర్వహణను గాలికొదిలేశాయి. ఈదురుగాలులు వీచినప్పుడు హోర్డింగ్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ముంబైలో హోర్డింగ్ కుప్పకూలి 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇకపై చిన్న వ్యాపారాల నుంచి భారీ వ్యాపార ప్రకటనలకు వినియోగించే హోర్డింగ్లు, బ్యానర్లు, సైన్బోర్డులు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉంటేనే వీఎంసీ నుంచి ప్రకటనల ప్రదర్శనను అనుమతి వస్తుంది.. స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ అంటే... నిర్మాణ స్థిరత్వ ఽధ్రువీకరణ పత్రం అనేది భవన నిర్మాణ స్థిరత్వాన్ని ఽధ్రువీకరించే ముఖ్యమైన పత్రం. ఆస్తుల కొనుగోలు, అమ్మకం, పునరుద్ధరణ సమయంలో ఇది చాలా ముఖ్యమైన అవసరం. భవనం నిర్మాణ అంశాలు స్థిరంగా, సురక్షితంగా ఉన్నాయని సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని స్ట్రక్చరల్ ఇంజినీర్, లేదా ఆర్కిటెక్ ఇంజినీర్లు ఇస్తారు. సంబందింత భవనాన్ని తనిఖీ చేసి, నిర్మాణ నాణ్యత, వయస్సును నిర్థారిస్తారు. ఇప్పటికే ఉన్న భవనాల అవసరమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, పునాది, ఫ్రేమ్లు, గోడలు, పైకప్పుతో సహా దాని నిర్మాణ భాగాల అనువుగా ఉన్నాయని నిర్థారించాల్సి ఉంటుంది. సంబంధిత భవనం ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈదురుగాలు, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినా ఇవి పడిపోవని నిర్థారించిన తర్వాత మాత్రమే భవనాలకు, హోర్డింగ్లకు ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. నగరంలో ఇలా... నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో 15 యాడ్ ఏజెన్సీలు, ప్రకటన సంస్థలు వీఎంసీలో రిజిస్టర్కాగా ఇంకా అనధికారికంగా మరో 10 సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో ప్రచార కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆయా సంస్థలు నగరంలో ఇప్పటి వరకు 800 హోర్డింగ్లు/బోర్డులను మాత్రమే గుర్తించగా నగర వ్యాప్తంగా అవి సుమారు 2500 వరకు ఉంటాయని వీటన్నింటికీ ఇకపై స్ట్రక్చరల్ సర్టిఫికెట్ తప్పనిసరి. లేని పక్షంలో వాటిని తొలగిస్తామని వీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో ప్రచార హోర్డింగ్లు, బోర్డులకు తప్పనిసరి చేసిన వీఎంసీ నెలాఖరు నుంచి ప్రత్యేక డ్రైవ్లు ఇప్పటికే ఏజెన్సీలు, ప్రచార సంస్థలు, భవన యజమానులకు నోటీసులు ఇచ్చిన వీఎంసీ నెలాఖరు నుంచి స్పెషల్ డ్రైవ్ ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్లు, బోర్డులకు తప్పనిసరిగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి హోర్డింగ్లను గుర్తిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటికి, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాటికి కూడా తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవాలని నోటీసులు పంపాం. ఈ నెలాఖరు నుంచి డ్రైవ్ నిర్వహిస్తాం, చిన్నా, పెద్ద వ్యాపార సంస్థ అని తేడాలేకుండా అందరూ తీసుకోవాల్సిందే. స్టెడిలిటీ సర్టిఫికెట్ తీసుకోని వారు డిఫెస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రావర్టీ యాక్ట్ ద్వారా చర్యలు చేపడతాం. – జీవీజీఎస్వీ ప్రసాద్, చీఫ్ సిటీ ప్లానర్, వీఎంసీ -
ఆపదలో అన్నదాతకు వెన్నుదన్నుగా జగనన్న
గుడ్లవల్లేరు: ఆపదలో ఉన్న రైతన్నకు వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిలిచింది. గతేడాది డిసెంబరు తొలి వారంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆరుగాలం పండించిన పంటలు నష్టపోయిన రైతుల కన్నీరు తుడిచే దిశగా ప్రభుత్వం ఆనాడు అడుగులు వేసింది. నెలల వ్యవధిలోనే పంట నష్ట పరిహారం (ఇన్ఫుట్ సబ్సిడీ) అందించే ప్రయత్నం చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో ఒక సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే ఇన్ఫుట్ సబ్సిడీ అందించే నూతన విధానాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే మిచాంగ్ తుపాను నష్ట పరిహారాన్ని కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సరిగ్గా అదే తరుణంలో చంద్రబాబు కూటమి మోకాలడ్డి సైంధవ పాత్ర పోషించింది. ఎన్నికల కోడ్ పేరిట రైతులకు పరిహారం నిధులు విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్కు లేఖ రాసి అడ్డం పడ్డారు. ఈ నెల 13న పోలింగ్ పూర్తి కావటంతో ఆ పరిహారాన్ని ప్రభుత్వం ఇపుడు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. శర వేగంగా నష్టాల అంచనా.... నాటి మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుముతో పాటు ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లింది. దీనిపై సీఎం వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టరు, జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆగ మేఘాల మీద క్షేత్ర స్థాయికి వెళ్లారు. అప్పట్లోనే ఖరీఫ్ సీజన్ జరుగుతున్నందున రైతులకు గింజ కూడా నష్టపోకుండా అండగా నిలిచారు. ఆన్లైన్తో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫ్లైన్లో కూడా కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. ధాన్యంలో తేమ ఉన్నప్పటికీ మిల్లులకు తరలించింది. రైతులకు అన్ని సదుపాయాలను కల్పించింది. రాత్రి వరకూ ఉండి మరీ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను చేపట్టింది. ముందస్తుగానే అప్రమత్తమై కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి రైతులకు ఎప్పటికపుడు సలహాలు, సూచనలు అందించారు. అదే సమయంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం పంట నష్టాల జాబితాను పక్కాగా రూపొందించింది. నిర్దేశిత గడువు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఆ జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలు స్వీకరించి అర్హుల తుది జాబితా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రకారమే మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 92,318 మంది రైతులకు వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని నిర్ధారించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన రైతులకు అతి సమీప వ్యవధిలోనే పంట నష్ట పరిహారం కింద రూ.9,990.44 లక్షల పెట్టుబడి రాయితీని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. నిబంధనల మేరకు ఒక్కో పంటను ఒక్కో విధంగా ఇన్ఫుట్ సబ్సిడీ నిర్ధారించారు. రైతన్నపై బాబు కన్నెర్ర.... తుపాను ప్రభావంతో పంటలను నష్టపోయిన రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కనికరం చూపలేకపోయారు. మేలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వాన్ని సైతం అడ్డుకున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ అందకుండా కుట్రలు పన్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని పెట్టుబడి డబ్బుల మంజూరు చేయకూడదంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. దీనితో నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఈ నెల 13న పోలింగ్ అవ్వగానే ఇన్ఫుట్ సబ్సిడీ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల వారీగా హెక్టారుకు మంజూరు.... పంట రకం లక్షల రూపాయల్లో ఇన్ఫుట్ సబ్సిడీ వరి – 9,822.10 పత్తి – 25.76 వేరుశనగ – 115.82 మొక్కజొన్న – 20.96 మినుము – 5.80 అరటి – 87.500 తమలపాకు – 7.554 మిరప – 5.739 పూలు – 0.873 బొప్పాయి – 0.346 కూరగాయలు – 10.357 కంద – 0.085 తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement