-
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. -
సిట్ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్
సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.వైఎస్సార్సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. -
మూడు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మూడు మండలాల్లో వర్షం పడింది. మంగళగిరి మండలంలో 16.6 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 5.8 మి.మీ., కొల్లిపర మండలంలో 5.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. మే 21 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 42.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 83.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాశీలో నృత్యనీరాజనానికి తెనాలి చిన్నారులు తెనాలి: పట్టణానికి చెందిన నృత్యశిక్షణ సంస్థ శ్రీకళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి అరుదైన అవకాశం లభించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో శ్రీకాశీ విశ్వనాథ్స్వామి ఆలయంలో నర్తించే అవకాశం లభించింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, శ్రీకాశీ విశ్వేశ్వర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 25న అక్కడ జరిగే నృత్యనీరాజనంలో నృత్యాంశాలను ప్రదర్శించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్యగురువు డాక్టర్ చల్లా బాలత్రిపుర సుందరి తెలిపారు. తెనాలి నుంచి తమ బృందానికి మాత్రమే ఈ అవకాశం లభించిందని చెప్పారు. తనతోపాటు వలివేటి మోక్షిత, చలమలశెట్టి మహతి, వల్లూరు వరలక్ష్మి, పావని, భావజ్ఞసాయి సహా మొత్తం 21 మంది అక్కడ బృంద నాట్యాలను ప్రదర్శించనున్నట్టు వివరించారు. బృందంలోని కొంతమందితో బయలుదేరి వెళ్లారు. -
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
● సచివాలయ ఉద్యోగి హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించొద్దు ● పొన్నూరు అంబేడ్కర్ సెంటర్లో కుటుంబ సభ్యుల నిరసన ● దారుణం జరిగి 14 రోజులైనా చర్యల్లేవని ఆందోళన పొన్నూరు: సచివాలయ ఉద్యోగి హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హత్యను, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివరాల ప్రకారం కొల్లిపర మండలం సిరిపురం గ్రామానికి చెందిన తుల్లిమిల్లి కిషోర్బాబు పట్టణ పరిధిలోని సచివాలయంలో ఎమినిటీస్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. తన భార్య చంద్రకళ సచివాలయ మహిళా పోలీస్గా విధులు నిర్వహిస్తోంది. వీరిద్దరికీ 11 నెలల క్రితం వివాహం జరిగింది. తన భార్య బదిలీపై మాచర్ల నుంచి పొన్నూరు రావడంతో కిషోర్బాబు కూడా పొన్నూరుకు బదిలీ చేయించుకున్నాడు. హఠాత్తుగా ఈనెల 7న కిషోర్బాబు నిడుబ్రోలు చెరువులో శవంగా తేలాడు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన కుటుంబ సభ్యులు కిషోర్బాబు మృతిపై అనుమానాలు ఉన్నాయని, అతని భార్య, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల అజాగ్రత్త వల్లే హత్య కేసు నమోదై 14 రోజులు గడుస్తున్నా కిషోర్బాబు హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసు కోలేదని, నిందితులను తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భార్య, బావమరుదులు, వారి పెదనాన్న తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 6న కిషోర్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అప్పుడే వారు చర్యలు తీసుకుని ఉంటే కిషోర్బాబు బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాత్రే కిషోర్బాబు శవమై చెరువులో తేలాడని కన్నీరుమున్నీరయ్యారు. కిషోర్బాబు మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవడంతో రూరల్ ఎస్ఐ భార్గవ్ ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.న్యాయం చేయండి నా కొడుకును దారుణంగా కొట్టి చంపిన వారిని వారిని వెంటనే అరెస్టు చేయాలి. కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. హత్యకు గురైన నాకొడుకు మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నా చేత సంతకం చేయించుకున్నారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చేయాలి. న్యాయం చేయాలని కోరుతున్నా. – ప్రేమలత, కిషోర్బాబు తల్లి -
వైద్యకళాశాల సువర్ణాధ్యాయం
గుంటూరు మెడికల్: ఆణిముత్యాల్లాంటి ఎందరో వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత దక్కించుకున్న గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. అదనంగానూ పోస్టులు మంజూరు చేశారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు. 52 పీజీ సీట్లు వైద్య కళాశాలకు తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోంది. ఆయన పాలనలో వైద్యకళాశాల సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. చరిత్ర ఘనమే గుంటూరు వైద్య కళాశాల 1946లో ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్యులు కనిపిస్తారు. భారతదేశంలో ఏర్పాటైన తొలి రెండు వైద్య కళాశాలల్లో గుంటూరు ఒకటి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆచంట రుక్మిణమ్మ కృషి ఫలితంగా ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పాటైంది. ఎంతో మంది రాజకీయ నాయకులను అందించిన ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి గతంలో ఎవరూ చూపని చొరవను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవిగో సీఎం చేసిన విప్లవాత్మక మార్పులు ● గుంటూరు వైద్య కళాశాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే ఏడాదిలో 34 పీజీ సీట్లు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతోంది. ఈ ఐదేళ్లలో మొత్తం 52 పీజీ సీట్లు కళాశాలకు మంజూరు చేయడం విశేషం. ● గుంటూరు వైద్య కళాశాల ఏర్పడి 75 ఏళ్లు గడిచినా ఎంతో కీలకమైన ప్రిన్సిపాల్ పోస్టుకు అడిషనల్ డీఎంఈ హోదా లేదు. దీనివల్లనేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీల సమయంలో అడిషనల్ డీఎంఈ హోదా లేని ప్రిన్సిపాల్ వల్ల ఇబ్బందులు పడేవారు. దీనిని గుర్తించిన సీఎం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పోస్టుకు అడిషనల్ డీఎంఈ హోదాకల్పించారు. ● గతంలో ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రమోషన్లు లేక అవస్థలు పడేవారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక కళాశాల బోధనా సిబ్బంది, అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. ● ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేశారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, రోగులకు సత్వర మెరుగైన చికిత్సలు అందించేందుకు అదనంగా పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ● ప్రొఫెసర్లు 15, అసోసియేట్ ప్రొఫెసర్లు 15, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 31 పోస్టులు నూతనంగా మంజూరు చేసి అరుదైన రికార్డును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సృష్టించారు. ● వైద్య కళాశాలలో సుమారు 25 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 32 పారా మెడికల్ పోస్టులు భర్తీ చేసి అదనంగానూ పోస్టులు మంజూరు చేశారు. మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగాలను నూతనంగా మంజూరు చేశారు. పలు వైద్య విభాగాల్లో అదనంగా యూనిట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య కళాశాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.500 కోట్లు మంజూరు చేశారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఛాతి, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. వైద్య కళాశాలలో పీజీ సీట్లకు వసతులు కల్పించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. మైక్రో బయాలజీ, పెథాలజీ, బ్లడ్బ్యాంక్, డెర్మటాలజీ వైద్య విభాగాల్లో కోట్లాది రూపాయలతో వైద్య పరికరాలు అందజేశారు. అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కృషి ప్రత్యేకంగా రూ.500 కోట్లు మంజూరు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 52 పీజీ సీట్లు కేటాయింపు నూతనంగా వైద్య విభాగాల ఏర్పాటుకు చర్యలు వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ -
కౌంటింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి గుంటూరు వెస్ట్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చివరి దశలోకి వచ్చామని, కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించే వరకూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల శిక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలు తీసుకు వచ్చిన దగ్గర్నుంచి కౌంటింగ్ పూర్తవగానే మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత సర్వీస్ ఓటర్లు, ఆ తర్వాత ఈవీఎంల ఓటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సూచనలు ఆర్ఓలు, ఏఆర్వోలు తప్పక పాటించాలన్నారు. నిబంధనలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయడం సంతోషమన్నారు. ఐడీ కార్డులు తప్పనిసరి కౌంటింగ్ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసు బృందాలకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. నియోజకవర్గాల వారీగా సిబ్బంది చేరుకునేందుకు సైన్బోర్డులు ఉండాలన్నారు. కౌంటింగ్ హాలు వద్ద రిసెప్షన్, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ఫోన్లకు అనుమతి లేదని పేర్కొన్నారు. లోపలికి వెళ్ళే ముందే మొబైల్స్ సంబంధిత కౌంటర్ల వద్ద డిపాజిట్ చేయాలన్నారు. రిజర్వ్ టీములకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి తొలి దశ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల 3న ఏఎన్యూలో రెండో దశ శిక్షణ, అనంతరం సిబ్బందికి కౌంటింగ్ కేంద్రాలు కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సంతకం చేసిన తర్వాత మాత్రమే సిబ్బంది ఫలితాలను వెల్లడించాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డీఆర్వో పెద్ది రోజా, స్ఫెసల్ డిప్యూటీ కలెక్టర్లు ఎ.అరవిందరావు, లక్ష్మీకుమారి, గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జగనన్న గృహాల పరిశీలన
లేఅవుట్లను సందర్శించిన ఢిల్లీ సెక్రటేరియట్ బృందం ప్రత్తిపాడు: ఇళ్లు ఎలా ఉన్నాయి? నిర్మాణానికి ఎంత ఖర్చయింది? ప్రభుత్వం ఎంత ఇచ్చింది? మీకు అదనంగా ఎంత ఖర్చయింది? కాలనీలో వసతులు ఎలా ఉన్నాయి? అంటూ ఢిల్లీ సెక్రటేరియట్ అధికారుల బృందం హౌసింగ్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడులోని జగనన్న హౌసింగ్ లే అవుట్ను మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా చేస్తున్న ఆరుగురు అధికారుల బృందం సందర్శించింది. సెక్రటేరియట్ ఏఎస్ఓలు జలేష్యాదవ్, అమర్దీప్ చౌహాన్, ధృవ్ దమిజా, కపిల్, పూజా, శృతి కాలనీలోని ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ సౌకర్యం, మంచి నీటి కుళాయిలు ఉన్నాయా లేవా అన్న విషయాలను గృహాల్లోకి వెళ్లి పరిశీలించారు. కాలనీలో ఇబ్బందులు లేవని లబ్ధిదారులు బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉచితంగా ఇంటి స్థలాన్ని అందించిందని, రిజిస్ట్రేషన్ చేసి మరీ తమకు డాక్యుమెంట్లు అందజేసిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను బృంద సభ్యులకు చూపించి ఆనందం వ్యక్తం చేశారు. ● అనంతరం నడింపాలెం గ్రామంలో బృందం పర్యటించింది. సంపద కేంద్రం (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్)లో గ్రామ పంచాయతీ చేస్తున్న వర్మీ కంపోస్టు తయారీని పరిశీలించారు. నాణ్యత బాగుండటంతో అధికారుల బృందం 12 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. ● తుమ్మలపాలెంలో పర్యటించిన బృందం ఆ గ్రామంలో అమలవుతున్న జలజీవన్ మిషన్ పథకాన్ని పరిశీలించింది. బృందం వెంట నోడల్ ఆఫీసర్ నాగానంద్, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ జీవీఆర్ గుప్తా, డీపీఆర్సి డీటీఎం నాగేశ్వరరావు, ప్రత్తిపాడు మండల ఇన్చార్జి ఈవోపీఆర్డీ షేక్ ఖాజా, పంచాయతీ కార్యదర్శి జాన్పీరా తుమ్మలపాలెం శివాజీ తదితరులు ఉన్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్య వర్తిత్వం’ పై నిర్వహిస్తోన్న నలభై గంటల శిక్షణ తరగతులు మంగళవారం రెండో రోజుకి చేరాయి. సుప్రీం కోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ (ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఐదు రోజుల శిక్షణ తరగతులు న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించేందుకు దోహదపడతాయని చెప్పారు. కక్షిదారులకు మరింతగా అవగాహన కల్పించాలని తెలిపారు. వారి అహాన్ని పక్కనపెట్టి కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకున్నట్లయితే.. సమయం, ధనం ఆదా చేసుకోవచ్చునని చెప్పారు. దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మధ్యవర్తిత్వం ద్వారా మానవ సంబంధాలను నిలుపుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి విచ్చేసిన నిషా సక్సేనా (జిల్లా జడ్జి), నీర్జాభాటియా (జిల్లా జడ్జి)లు మాట్లాడగా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి పాలనాధికారి ఎ.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా జిడ్జి పార్థసారథి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, గుంటూరు జోన్లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల న్యాయాధికారులు పాల్గొన్నారు. కక్షిదారులకు అవగాహన కల్పించాలి గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో రెండో రోజు శిక్షణ తరగతులు -
అలరించిన అందెల సవ్వడులు
చిలకలూరిపేట: కళా నిలయం 39వ జాతీయస్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందుకు చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపం వేదిక అయ్యింది. ముందుగా కళా నిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివ సత్యనారాయణమ్మ నటరాజ పూజ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు పగలు, రాత్రి కొనసాగే ఈ పోటీల్లో తొలిరోజు సూర్య విభాగంలో 13 సంవత్సరాల లోపు కూచిపూడి బీ గ్రూపు నృత్యాలు, 14 సంవత్సరాలు పైబడిన వారికి సూర్య విభాగం ఏ గ్రూపులో కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల నృత్యరూపాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముద్దుగారే యశోద, తరంగం, థిల్లానా, అన్నమయ్య కీర్తన, భామా కలాపం, మహిశాసుర మర్థిని వంటి అంశాలను కళాకారులు ప్రదర్శించారు. కళాకారులను ఆశీర్వదించండి.. పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వరంగల్కు చెందిన శ్రీకృష్ణా మ్యూజికల్ డ్యాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ కొంపల్లి భ్రమరాంబ ముందు మాట ఇచ్చారు. కళలను ప్రోత్సహించాలని, కళాకారులను ఆశీర్వదించాలని కోరారు. కళామతల్లి సేవకు కళా నిలయం వ్యవస్థాపకుడు ప్రగడ రాజమోహనరావు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆధునిక సమాజంలో సాంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆ అవసరం మేరకే కళా నిలయం సంస్థ పాటుపడుతోందన్నారు. సంస్థ నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేటి ప్రదర్శనలు కళా నిలయం పోటీల్లో భాగంగా బుధవారం 13 సంవత్సరాల లోపు చంద్ర కేటగిరి బీ గ్రూపు కూచిపూడి నృత్యాలు, సూర్య కేటగిరి బీ గ్రూపు భరతనాట్యం, చంద్ర కేటగిరి బీ గ్రూపు భరతనాట్యం పోటీలు, చంద్ర కేటగిరి ఏ గ్రూపు 14 సంవత్సరాలు పైబడిన వారికి కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించనున్నారు. ప్రారంభమైన కళా నిలయం నాట్య పోటీలు తొలిరోజు కూచిపూడి నృత్య ప్రదర్శన -
దూరవిద్య సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ద్వారా వ్యవసాయ విద్య విస్తృత వ్యాప్తికి సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించినట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్ట్రార్ డాక్టర్ కె.గురవారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల రైతులు, మహిళలు, యువతకు 8 వారాలపాటు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పలు కోర్సులను ఇప్పటికే ఏప్రిల్ నుంచి ప్రారంభించామని పేర్కొన్నారు. మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఆసక్తిగల వారు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ 20లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ను సందర్శించాలని, లేదా 8008788776, 8309626619, 8096085560 సెల్ నంబర్ల ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ సంప్రదించవచ్చని వివరించారు. -
పచ్చిరొట్ట సాగు.. భూమి బాగు
● 18 మండలాలకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా ● జిల్లా వ్యాప్తంగా 324 క్వింటాళ్ల జీలుగలు ● 473.42 క్వింటాళ్ల జనుములు ● 1,105.30 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు మంజూరు కొరిటెపాడు(గుంటూరు): రైతులు ఒకప్పుడు సేంద్రీయ ఎరువుల ఆధారంగా పంటలను సాగు చేసేవారు. దీంతో ఏళ్ల తరబడి పంటలను సాగు చేసినా భూమి స్వభావం మారేది కాదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపుతూ వచ్చిన రైతులు అధిక దిగుబడుల సాధన కోసం రసాయన ఎరువులు, పురుగు మందులను విచక్షణా రహితంగా వాడటం మొదలు పెట్టారు. దీంతో తాత్కాలికంగా అధిక దిగుబడులు సాధించి తృప్తి పడుతూ వచ్చినా భూమి ఆరోగ్యం గురించి నిర్లక్ష ధోరణి కనిపిస్తూ వచ్చింది. గత కొన్నేళ్లుగా పంటల సాగు ఇదే రీతిలో సాగడం వల్ల భూమి స్వభావంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి నిస్సారంగా మారుతోంది. ఒకప్పుడు వర్షాధారం ద్వారా గానీ లేక కాలువలు, చెరువులు, నదులు, బావుల ద్వారా దాదాపుగా స్వచ్ఛమైన నీటిని పంటలకు ఉపయోగించే వారు. రానురాను భూగర్భ జలాలు అడుగంటుతూ వస్తున్న తరుణంలో వేలాది అడుగుల లోతు వరకు బోర్లను వేసి ఆ నీటితో పంటలను సాగు చేయాల్సి వస్తోంది. ఇలా పలు కారణాల వలన భూమి స్వభావంలో తీవ్ర మార్పులు సంభవించడం, సాగు చేసిన పంటలను చీడపీడలు అధికంగా ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గపోవడం జరుగుతోంది. పచ్చిరొట్టతో భూమికి ఆరోగ్యం ఈ క్రమంలో రైతులు భూమి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంపై మొగ్గు చూపుతున్నారు. నిస్సారంగా మారిన పొలాలను సారవంతం చేసుకోవడానికి గల అవకాశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన వ్యవసాయదారులు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వరి సాగులో భూమిలో కలియదున్ని కుళ్లింప చేయడానికి అవకాశాలు ఉండటంతో వరి రైతులు ఎక్కువగా వీటి సాగుకు ముందుకు వస్తున్నారు. పచ్చిరొట్ట సాగు వల్ల భూమి సారవంతం కావడమే కాక సేంద్రీయ పదార్థాలను నేలకు తద్వారా పంటలకు అందించే అవకాశం ఉంది. కలుపు మొక్కల వ్యాప్తిని తగ్గించడం, మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను సక్రమంగా అందించే వ్యవస్థను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. సాగు ఇలా... భూసారం పెంచడంలో సహాయకారిగా ఉండే పచ్చిరొట్ట పైర్లయిన జనుము, జీలుగలు, పిల్లిపెసర, అలసంద వంటి పంటలను సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్నారు. సేద్యం చేసిన పొలంలో జీలుగలు, పిల్లి పెసర విత్తనాలైతే ఒక ఎకరాకు 10 నుంచి 12 కిలోలు, జనుము విత్తనాలు 16 కిలోల వరకు చల్లి నీటిని పెట్టాల్సి ఉంటుంది. తరువాత అవసరాన్ని బట్టి నీటిని కట్టాలి. ఇవి వర్షాభావ పరిస్థితులనూ తట్టుకుని పెరుగుతాయి. జీలుగ, జనుము, పిల్లిపెసర సాగు వలన హెక్టారుకు దాదాపు 18 నుంచి 21 టన్నుల గ్రాసం దిగుబడి వస్తుంది. దీన్ని పశువుల మేతగా కూడా వాడుతున్నారు. ఎరువు కోసమైతే పచ్చి రొట్ట పైర్లను పూత సమయంలో నేలలో కలియ దున్నాలి. పైరు వయసు 50 నుంచి 60 రోజులలోపు కలియ దున్ని ఒకటి రెండు వారాల తరువాత నాట్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. నత్రజని వాడకం తగ్గించుకోవచ్చు.. ప్రస్తుతం పొలాలకు రసాయనిక ఎరువుల రూపంలో అందిస్తున్న నత్రజని(యూరియా) వాడకాన్ని దాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గించుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. దీంతోపాటు నేలలో నీరు, రసాయన ఎరువులు భూమి కింది పొరలకు జారి పోకుండా అడ్డుకట్ట పడుతుంది. నేలలో చౌడును తగ్గించడానికి సహాయకారిగా మారుతుంది. జిల్లాకు 1,902.72 క్వింటాళ్లు.. గుంటూరు జిల్లాలోని 18 మండలాలకు 1,902.72 క్వింటాళ్లు పచ్చి రొట్ట విత్తనాలు కేటాయించారు. వీటిలో జీలుగలు 324 క్వింటాళ్లు, జనుములు 473.42 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు 1105.30 క్వింటాళ్లు కేటాయించడం జరిగింది. విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. సబ్సిడీ విత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే విత్తనాలు సరఫరా చేస్తారు. సబ్సిడీపై విత్తనాల పంపిణీ నిస్సారంగా మారుతున్న నేల ఆరోగ్య రక్షణకు సహాయపడే పచ్చిరొట్ట ఎరువుల సాగును పెంచడంలో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పేర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు -
మాచర్ల టార్గెట్గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్లాల్కు ఫిర్యాదు చేసింది. ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్చార్జ్గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు. అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్రాజ్ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.పేట్రేగిపోయిన పచ్చమూకలు 11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.‘నారా’యణస్వామి భక్తి కారంపూడి సర్కిల్లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్కు పిలవలేదు. పైగా బాధితుడైన ఎస్ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ పోయొద్దు
గుంటూరు వెస్ట్: బాటిళ్లలో, క్యాన్లలో పెంట్రోల్ పోయొద్దని కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సోమవారం బంకుల యాజమాన్యాలను ఆదేశించారు. వచ్చేనెల 4న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లూ జరగకుండా ఉండేందుకు ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. బంకుల్లో పరిస్థితులను తహసీల్దార్లు, ఆర్డీఓలు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయోత్సవాలు నిషేధం కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ విజయోత్సవాలు నిర్వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. బాణ సంచా దుకాణదారులు పెద్దమొత్తంలో సరుకు అమ్మరాదని తేల్చిచెప్పారు.బంకుల యాజమాన్యాలకు కలెక్టర్ ఆదేశం -
మొగదారమ్మ ఉత్సవాలు ప్రారంభం
నిజాంపట్నం: మత్స్యకారుల ఇల వేల్పు అయిన మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాలు నిజాంపట్నంలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఆయన సోదరుడు మోపిదేవి హరనాథబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారావు మాట్లాడుతూ మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాల్ని ఏటా అంగరంగవైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు. ఉత్సాహంగా జల క్రీడలు ఉత్సవాలను పురస్కరించుకుని తొలిరోజు ఉత్సాహంగా జల క్రీడలు నిర్వహించారు. ప్రత్యేక వాహనాలపై నీటిని ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో తిరుగుతూ యువత కోలాహలంగా చిమ్ముకుంటూ జల క్రీడల్ని నిర్వహించారు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. సీబీఎస్ఈ బోధనపై గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని ఉపాధ్యాయులకు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. గణిత, భౌతిక, రసాయనశాస్త్ర పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులకు జిల్లా పరిశీలకుడు రవీంద్రనాథ్రెడ్డి సూచనలు, సలహాలు ఇచ్చారు. సాంకేతిక బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని చెప్పారు. డీఈఓ పి.శైలజ మాట్లాడుతూ సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఇంగ్లిషు, సోషల్, బయాలజీ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఇటీవల రెండు రోజుల పాటు శిక్షణ విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. ప్రస్తుతం గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో గుంటూరు డీవైఈఓ పి.వెంకటేశ్వరరావు, సీమ్యాట్ నుంచి వచ్చిన పరిశీలకురాలు ఎ.సుహాసిని, ఎంఈఓ పి.వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డి -
శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
తాడికొండ: శాంతి చర్చల ద్వారానే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తుళ్లూరు డీఎస్పీ ఇ.అశోక్ గౌడ్ సూచించారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో పోలింగ్ రోజున గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు సోమవారం ఇరు వర్గాలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఒక్కో వర్గం నుంచి 15 మంది చొప్పున మొత్తం 30 మందితో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం పూర్తిగా అవసరమని, చిన్నచిన్న విషయాలకు భేషజాలకు పోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. వివాదాలు, కేసుల వల్ల ఏళ్ళ తరబడి కుటుంబాలు ఇబ్బంది పడతాయని వివరించారు. కేసులు నమోదైతే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. అనంతరం శాంతి కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తాడికొండ సీఐ సీహెచ్ ప్రభాకర్, ఎస్ఐలు అంజయ్య, రవీంద్ర బాబు పలువురు సిబ్బంది, ఇరు వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 22న ఐఎంఏవైద్య విద్యా కార్యక్రమం గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22న వైద్యులకు నిరంతర వైద్య విద్యా (సీఎంఈ) కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం జీఎంఏ భవనంలో నిర్వహించే కార్యక్రమంలో గుండె సంబంధ వ్యాధులు – అత్యాధునిక చికిత్స పద్ధతులపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.ఎం.ఎస్.హరిత, ఎముకలు కీళ్ల వ్యాధులు– ఆధునిక శస్త్ర చికిత్స విధానాలపై డాక్టర్ గూడూరు జగదీష్, డాక్టర్ చిట్టా రంజన్ సాహూ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వైద్యులందరూ ఈ వైద్య విద్యా కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కోరారు. ధీశాలి ప్రకాశం పంతులుపట్నంబజారు(గుంటూరు ఈస్ట్): తెల్లదొరల తుపాకులకు తన గుండెను చూపి ముందుకు సాగిన ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని శాసన మండలి విప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కీర్తించారు. టంగుటూరి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం బృందావన్ గార్డెన్స్లోని విప్ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విప్ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని నీతినిజాయితీతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఘనత టంగుటూరి సొంతమన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించినా అవసరమైతే గాంధీనే ప్రశ్నించే రాజీలేనితత్వం ప్రకాశం పంతులదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శమన్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారీ), వైఎస్సార్ సీపీ నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నరసింహారావు, వెలుగూరి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా చోరీచీరాల అర్బన్: చీరాల రూరల్ మండలం పుల్లాయపాలెంలోని పోలింగ్ బూత్లో సీసీ కెమెరా చోరీకి గురైంది. ఈపూరుపాలెం రూరల్ పోలీసుల వివరాల మేరకు.. పుల్లాయపాలెంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో ఒకటి కనిపించలేదు. మహిళా పోలీసు ధనలక్ష్మి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఈపూరుపాలెం ఎస్ఐ శివకుమార్ తెలిపారు. -
ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా
తెనాలి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. ఆయన సోమవారం ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్కలెక్టర్ ప్రఖర్జైన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి కొల్లిపర మండలంలోని ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. మండలంలోని బొమ్మువానిపాలెం 14, 15 ఇసుక రీచ్లు, మున్నంగిలోని ఇసుక రీచ్లను అధికారులు పరిశీలించారు. తాడేపల్లి మండలంలోని గుండెమెడ ఇసుక రీచ్నూ తనిఖీ చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు జరపరాదని, అనుమతులు పొందిన ప్రాంతంలోనే మనుషులతో తవ్వకాలు జరపాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ అధికారులతోపాటు పోలీస్, రెవిన్యూ, శాండ్ కమిటీలోని ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనికోసం రెండు షిఫ్టులుగా బృందాలను నియమించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించిన వెంటనే పోలీస్ అధికారులు కేసులు నమోదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కలెక్టరేట్లో ఇసుక కమిటీతో సమావేశం అంతకుముందు కలెక్టరేట్లోని ఏసీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్కలెక్టర్ ప్రఖర్జైన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సమావేశమయ్యారు. జిల్లాస్థాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటైందని, ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతివారం రీచ్లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. కమిటీలోని శాఖలు క్షేత్రస్థాయిలో అధికారులతో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ నంబర్ 0863–2234301తోపాటు ఈ–మెయిల్ dismc2024@gmail.comకు కూడా ఫిర్యాదులను పంపవచ్చని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకర్, తనిఖీల్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ కన్వీనర్, మైనింగ్ శాఖ డీడీ చంద్రశేఖర్, జిల్లా ఎస్ఈబీ సూపరింటెండెంట్ ఎల్.రంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి, భూగర్భ జలవనరులశాఖ డెప్యూటీ డైరెక్టర్ వందనం, ఎన్విరాన్మెంట్ ఇంజినీరు నారాయణ, జిల్లా ఉప రవాణా కమిషనర్ కరీం, ఆర్డబ్ల్యుస్ ఈఈ కళ్యాణ చక్రవర్తి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీలకు రెండు షిప్టులుగా బృందాలు అక్రమ తవ్వకాలు జరిగితే బాధ్యులపై కేసులు కొల్లిపర మండలంలో ఇసుక రీచ్లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ ఫిర్యాదులకు కంట్రోల్ రూం నంబర్ 0863–2234301 -
దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పనులపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులపై ఈఓ కె.ఎస్.రామరావు సోమవారం సమీక్ష చేశారు. మహా మండపం నాలుగో అంతస్తులోని తన చాంబర్లో నిర్వహించిన ఈ సమావేశానికి దేవస్థానంలోకి కీలక విభాగాల అధికారులు హాజరయ్యారు. తొలుత దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా జరుగుతున్న అన్నదాన భవనం, ప్రసాదాల పోటు, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఈఓ చర్చించారు. అన్నదానం, ప్రసాదాల పోటు భవనాల పునాదుల నిర్మా ణం త్వరలోనే పూర్తవుతుందని, ప్రస్తుతం రాడ్ బెండింగ్ పనులు జరుగుతున్నాయని ఈఈ ఎల్.రమాదేవి తెలిపారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో కనకదుర్గనగర్ నుంచి మహా మండపం వరకు వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా ఉండటంతో ప్రత్యామ్నాయ ప్రదేశాలపై దృష్టి సారించాలని ఈఓ సూచించారు. ప్రస్తుతం వీఎంసీ కార్యాలయం ఎదుట వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నా, ఆలయం సమీపంలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. త్వరితగతిన దర్శనం భక్తులు తమ వాహనాలను వీఎంసీ కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో నిలిపి కొండపైకి చేరుకుని అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఈఓ రామరావు పేర్కొ న్నారు. అమ్మవారి దర్శనం త్వరతిగతిన కల్పించేలా చూడాలని ఆలయ పర్యవేక్షకులకు సూచించారు. దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా టికెట్లు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. -
పెట్రోల్ బంకుల తనిఖీ
చేబ్రోలు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హద్దు మీరి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనీ ఐపీఎస్ మనోజ్కుమార్ హెగ్డే హెచ్చరించారు. చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లోని పెట్రోలు బంకులను ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది, యజమానులకు సూచనలు చేశారు. వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ను పోయాలన్నారు. డబ్బాలు, బాటిళ్లు, క్యాన్లలో పెట్రోలు, డీజిల్ పోయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. చేబ్రోలులోని వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యాలయాలను సందర్శించి అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున ప్రజాశాంతికి భంగం కలిగించకూడదని స్పష్టం చేశారు. ఆయన వెంట స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ప్రతిభ ఉంటే.. ఉపకారం మీ వెంటే
కొల్లిపర: పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు ఒడిశా, కేరళ, తెలంగాణ, తమిళినాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాలో అమలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సుమారు 7వేల మందికిపైగా ఆర్థిక సహాయం, 28 వేల మంది వరకు స్కాలర్ షిప్లు అందజేశారు. ఎంపికై న విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందవచ్చు. విద్యార్థులు ప్రతిభ ఆధారంగా నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉపకార వేతనం అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్కు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు. అర్హతలివీ.. ఉపకార వేతనం పొందాలంటే ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీయెట్ చదువుతున్న వారు అర్హులు, పదిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు రావాలి. ఎంపిక విధానం.. చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 23న దరఖాస్తుదారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం తెలియజేశారు. ఎంపికై న విద్యార్ధులు జూన్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 7వ తేదీ వరకూ గడువు విద్యాదాన్ ఉపకార వేతనం కోసం జూన్ 7వ తేదీ లోగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్తులు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, చదువుతున్న కళాశాల వివరాలను పొందుపర్చాలి. ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్ కలిగి ఉండాలి. నెట్ సెంటర్, ఇతరుల ఈ–మెయిల్ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్డీఎఫ్ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్లైన్లో విద్యాదాన్ ఆంధ్రఃఎస్డీ ఫౌండేషన్ఇండియా.కామ్, (vidyadhan@sdfoundationindia.com)కి మెయిల్ చేయాలి. లేదా తమ సొంత నంబరు ద్వారా 9663517131 నంబర్లో సంప్రదించాలి. దరఖాస్తు చేసుకునే విధానం ●విద్యార్ధులు ప్లేస్టోర్లోని విద్యాదాన్ యాప్, లేదా విద్యాదాన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాదాన్.ఓఆర్జీలో(https://www.vidyadhan.org/web/index.php) ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ●పదో తరగతి మార్కుల జాబితాల ప్రకారం పేరులో మొదటి పేరును ఎంటర్ చేయాలి. తర్వాత రెండో పేరును నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి సొంత చిరునామను నమోదు చేయాలి. ●అప్లయ్ నౌ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఈ మెయిల్కు మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం లింక్ వస్తుంది. యాక్టివేషన్ లింక్ క్లిక్ చేయగానే విద్యాదాన్ హోమ్ పేజీలో అకౌంట్ యాక్టికేటెడ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ●ఈ మెయిల్ ఐడీ , విద్యాదాన్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే స్టెప్–2లోకి వెళతారు. లాగిన్ అయిన తర్వాత హెల్ప్పై క్లిక్ చేసి, సూచనలు చదివి, దాని ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి, డాక్యుమెంట్లను ఆప్లోడ్ చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఎడిట్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ను ఎడిట్ చేసుకోవచ్చు. ●ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్లు , పాస్పోర్టు సైజ్ ఫోటోను ఆప్లోడ్ చేసిన తర్వాతే దరఖాస్తును అంగీకరిస్తారు. ●విద్యార్థులు ఎప్పటికప్పుడు ఈ మెయిల్ను చెక్ చేసుకోవాలి. ఎస్డీఎఫ్ ప్రతి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా మాత్రమే తెలియజేస్తుంది. కావున వారంలో ఒక సారైన మెయిల్ చెక్ చేసుకోవాలి. విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్స్ పదో తరగతిలో 90 శాతం మార్కులు ఉండాలి ఇంటర్ మొదటి సంవత్సరంలో నమోదు చేసుకోవాలి జూన్ 7 వరకు దరఖాస్తుకు గడువు -
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
గుంటూరు మెడికల్: మానసిక వైద్య నిపుణుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీగా డాక్టర్ పసుపుల సాయికిరణ్, కోశాధికారిగా డాక్టర్ నెక్కంటి నిమిషా ఎన్నికయ్యారు. గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మిగతా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేయడం గమనార్హం. జాయింట్ సెక్రటరీగా డాక్టర్ జి.జగదీష్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని సోమవారం గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి, పలువురు మానసిక వైద్య నిపుణులు అభినందించారు. మానసిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధుల బారిన పడకుండా చైతన్యం కల్పిస్తామని డాక్టర్ వెంకటకిరణ్ తెలిపారు. యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు అకడమిక్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతినెలా సీఎంఈలు నిర్వహించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. పోలింగ్ రోజు జరిగిన గొడవలపై విచారణ తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధితోపాటు దుగ్గిరాల మండలంలో పోలింగ్ రోజు జరిగిన గొడవలపై డీఎస్పీ సీహెచ్ రవికాంత్ సోమవారం విచారణ చేపట్టారు. మే 13న పలు పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు గొడవలు సృష్టించి దాడులకు పాల్పడ్డారు. వారు ఏ పార్టీకి చెందిన వారు, జరిగిన గొడవలు ఏమిటి? ఎవరెవరు చేశారు? ఎంతమంది పాల్గొన్నారు అనే వివరాలను డీఎస్పీ సేకరించారు. కొందరు జూన్ 4న దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ముందుగానే పసిగట్టి అనుమానితులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. అనుమానితుల పేర్లు సేకరిస్తున్నట్టు సమాచారం. -
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈనెల 22న బుధవారం ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఽధ్వర్యాన మెగా లోన్ మేళా నిర్వహించనున్నట్లు చాబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ దాసరి దేవరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు మద్దతుగా తాము మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో పాల్గొనే వారికి ఉచిత ప్రవేశ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుందని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈనెల 22న సోమవారం ఉదయం 10 గంటలకు నోరీ హాస్పిటల్ సమీపంలోని ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే మెగాలోన్ మేళాకు హాజరు కావాలని కోరారు. మెగాలోన్ మేళాలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్వయంగా గానీ 79959 15450, 89197 37517 నంబర్లలోగానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈదురుగాలుల బీభత్సం నకరికల్లు: మండలంలో సోమవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులు వీయడంతోపాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగి స్తంభాలు విరిగిపడ్డాయి. పలుగ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
పేరంటాలమ్మ తిరునాళ్లు
తెనాలి: అయితానగర్లో రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీవెంకయ్య–గౌరమ్మ దేవస్థానంలో పేరంటాలమ్మ తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్ల సందర్భంగా ఆలయం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈనెల 18 నుంచి ప్రారంభమై 22వ తేదీ వరకూ జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ వెంకయ్య–గౌరమ్మలకు విశేష పూజలు చేస్తున్నారు. రెండోరోజైన ఆదివారం రాత్రి గుమ్మడి సిడి మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు తరలి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈత పండ్లు, తాటికాయలు, వేపాకులతో ప్రత్యేకంగా సిడిమానును అలంకరించారు. కనకతప్పెట్లు, డప్పులతో ఆలయ ప్రదక్షిణలు చేశారు. మహిళలు గుమ్మడికాయలు తెచ్చి సమర్పించారు. అనంతరం గుమ్మడి సిడి కార్యక్రమంలో భాగంగా సిడిమాను ఊరేగింపు నిర్వహించారు. పేరంటాలమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమై పట్టణ వీధుల్లో ఊరేగింపు సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర కార్యక్రమాలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి పొంగలి నైవేద్యం సమర్పణ, గండ దీపాలు, అడుగులు–మడుగులు, పసుపుబండ్లు, కరెంటు ప్రభల ఊరేగింపు, మేకసిడి, గంప సిడులతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నిర్వహణను స్ధానిక పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. -
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
మంగళగిరి: దేశంలోనే తొలిసారిగా 300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. పట్టణంలోని వీజేటీఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రూ.1.35 కోట్లతో జర్మనీకి చెందిన ద హ్యాండ్స్ ప్రాజక్టు సహకారంతో కృత్రిమ చేతులను (జెమ్ ఎంకే 1 హ్యాండ్స్) పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని, డిస్ట్రిక్ట్ గవర్నర్ కె.శరత్ చౌదరి, డాక్టర్ ఎస్వీ రామ్ప్రసాద్, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ఐపీడీజీ తాళ్ళ రాజశేఖర్రెడ్డి, పీడీ ఆర్.ఆర్. వేణుగోపాల్ యలమంచిలి, విజేటీఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గోలి రామ్మోహన్రావు, ప్రాజెక్ట్ చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి కృత్రిమ చేతులు పంపిణీ చేసి ప్రసంగించారు. వారంపాటు కృత్రిమ చేతులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జర్మనీ, న్యూజిల్యాండ్, ఆఫ్రికా దేశాల నుంచి టెక్నీషియన్లు వచ్చి బాధితులకు కృత్రిమ చేతుల వాడకంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
బీటెక్ విద్యార్థి మృతి తాడేపల్లిరూరల్ : బంధువుల ఇంటికి వచ్చి సరదాగా ఈత కొడదామని కృష్ణానదికి వెళ్లి నీటిలో మునిగిపోయి బీటెక్ విద్యార్థి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తాడేపల్లి ఎస్ఐ సాయిప్రసాద్ కథనం ప్రకారం.. గుంటూరు సుబ్బారెడ్డి నగర్కు చెందిన వాసుబాబు కుమారుడైన టి.అవినాష్ (19) గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు కావడంతో తాడేపల్లి మహానాడులోని బంధువుల ఇంటికి వచ్చి ఆదివారం సాయంత్రం సరదాగా దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్ల వద్ద ఈతకు వెళ్లాడు. అందరూ పైన కూర్చుని ఉండగా, అవినాష్ మరో యువకుడు నదిలోకి దిగారు. ఈ సమయంలో అవినాష్ నీటిలో మునిగిపోయాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో అవినాష్ను బయటకు తీశారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడు. ఘటనపై అవినాష్ తండ్రి వాసుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రసాద్ తెలిపారు. లారీని ఢీకొన్న మినీ బస్– ఆరుగురికి గాయాలు గుంటూరు రూరల్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మినీ బస్ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అంకిరెడ్డిపాలెం సమీపంలోని హైవేపై సోమవారం జరిగింది. సీఐ నరేష్కుమార్ కథనం ప్రకారం విశాఖపట్నం సిటీలోని అక్కయ్యపాలెంకు చెందిన 20 మంది తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి మినీబస్లో ఇంటికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున అంకిరెడ్డిపాలెం సమీపంలో హైవే పక్కనే ఆగి ఉన్న లారీని మిని బస్ ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో అందరూ నిద్రావస్థలో ఉన్నారు. ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందుభాగం దెబ్బతింది. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించి చికిత్స అందించి మరో బస్లో ఇళ్ళకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
ఎలిమినేటర్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్
హారర్ థ్రిల్లర్తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
స్వాతిమలివాల్పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్పై రైనా
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డి
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
నటుడు వరుణ్ సూద్కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?
తప్పక చదవండి
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement