-
సప్లిమెంటరీకి సర్వంసిద్ధం
టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 24 శుక్రవారం నుంచి జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్ట వసతులు కల్పించారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను డీజీఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్తో పాటు ఇంటర్ హాల్ టికెట్లను బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్లలో అందుబాటులో ఉంచారు. వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని, నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చు. టెన్త్ పరీక్షలకు 27 పరీక్ష కేంద్రాలు ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 6,373 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 27 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల విధులకు 27 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు సహా 280 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖాధికారులు నియమించారు. ఇంటర్కు 36 పరీక్ష కేంద్రాలు ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు ఫెయిలైన వారితో పాటు బెటర్మెంట్ రాస్తున్న విద్యార్థులను కలుపుకుని 15,291 మంది హాజరు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్న ద్వితీయ సంవత్సర పరీక్షలకు 2,485 మంది హాజరు కానున్నారు. రేపటి నుంచి పరీక్షలు ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు సైట్లలో హాల్ టికెట్లు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్న 6,373 మంది ఇంటర్ పరీక్షలకు 17,776 మంది పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు -
27 నుంచి మార్టూరులో నాటిక పోటీలు
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటిక పోటీల్ని 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అన్నారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 14వ తెలుగు రాష్టాల స్థాయి నాటిక పోటీల్ని శ్రీకారం స్వచ్ఛంద సంస్థ, మార్టూరు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 నాటికల్ని ప్రదర్శన కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మార్టూరు పరిసర మండలాల కళాకారులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. విజేతలకు రోటరీ జిల్లా పీస్ కమిటీ చైర్మన్ కె. విక్రమ్ రెడ్డి, శ్రీమతి వైజయంతి విక్రమ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో ఎఫర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.వి.మోహనరావు, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తాళ్లూరి సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు ఇంటూరి ఆంజనేయులు, శానంపూడి లక్ష్మయ్య, దొడ్డా రమేష్, ఆజా హుస్సేన్, శ్రీకారం సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పోటీలలో ప్రదర్శించనున్న నాటికలు 27వ తేదీ: రాత్రి 8: 30 గంటలకు శ్రీ అమృత లహరి ఆర్ట్స్ విజయవాడవారి ‘నాన్నా! నేను వచ్చేస్తా’ నాటిక, రాత్రి 10 గంటలకు తెలుగు కళాసమితి విశాఖవారి ‘ నిశ్శబ్దమా... నీ ఖరీదెంత?’ నాటిక, రాత్రి 11 గంటలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రాజుగారి గోచి’ ప్రదర్శిస్తారు. 28వ తేదీ : రాత్రి 8: 30 గంటలకు శ్రీకారం, రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి ‘ రైతు భారతం’ నాటిక, రాత్రి 10: 30 గంటలకు రసఝరి పొన్నూరి నాటిక ‘కాపలా’ 11: 30 గంటలకు కళాంజలి హైదరాబాదు వారి‘ రైతే రాజు’ 12: 30 గంటలకు మైత్రి కళానిలయం విజయవాడ వారి ‘బంధం’ నాటిక ప్రదర్శిస్తారు. 29వ తేదీ : రాత్రి 8: 30 గంటలకు అభినయ గుంటూరి వారి ‘ఇంద్రప్రస్థం’, 10: 30 గంటలకు చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ‘చీకటి పువ్వు నాటిక’, 11: 30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ పొలకలూరు వారి ‘కౌసల్యా సుప్రజా రామ’, 12: 30 గంటలకు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి ‘రాత’ నాటికలు ప్రదర్శించనున్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సమర్థతతో నిర్వహించాలని చెప్పారు. ఉదయం 8 గంటలకు కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఈసీఐ సూచించిన మార్గదర్శకాల్ని విస్మరించరాదని తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 12 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ కోసం మరో రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ఒక రౌండ్ లో 14 పోలింగ్ కేంద్రాలలోని ఓట్లు లెక్కించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం లోపలికి అనుమతించరాదన్నారు. నాలుగు రోజులు ముందుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. విధి నిర్వహణలో పొరపాట్లు జరగకుండా అధికారులు నిఘా ఉంచాలని తెలిపారు. లెక్కింపు కేంద్రంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామనే విషయాన్ని అభ్యర్థులకు తెలపాలని చెప్పారు. ఈనెల 28వ తేదీన ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 30న ఓట్ల లెక్కింపు సిబ్బందికి మొదటి దశ శిక్షణ, మూడో తేదీన రెండో దశ శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి నిష్ణాతులైన మాస్టర్ ట్రైనర్లను నియమించాలని తెలిపారు. ముఖ్యంగా ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సామగ్రి సమకూర్చుకోవాలి: జేసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని ఆర్ఓలను జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్. శ్రీధర్ ఆదేశించారు. ఈసీఐ మార్గదర్శకాలు, నిబంధనలపై పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, ఆరోఓలు, ఏఆరోఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్ బాషా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం 30న ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణ -
సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్ సెర్చ్
● జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ● ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు ● ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి బాపట్ల టౌన్: నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ తెలిపారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజున అనంతరం జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ● బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో, బాపట్ల రూరల్ ఇన్స్పెక్టర్ వై.శ్రీహరి, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ యు.శ్రీనివాసులు, బాపట్ల రూరల్ సీఐ బి.హజరత్బాబు ఏపీఎస్పీ బలగాలతో బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న వెస్ట్ పిన్నిబోయినవారిపాలెంలో తనిఖీలు చేశారు. ● చీరాల టూ టౌన్ సీఐ కె.సోమశేఖర్ ఆధ్వర్యంలో స్టేషన్ పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ బలగాలతో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న శృంగారపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ● చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని జబ్బర్ కాలనీ, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలవకూరులో పోలీస్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేశారు. -
పాముకాటుతో కౌలు రైతు మృతి
బల్లికురవ: పొలం నుంచి పశువుల మేత కోసుకుని వస్తుండగా పాము కాటు వేయడంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మండలంలోని కొప్పరపాడు సుగాలి తండాలో జరిగింది. తండా వాసులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. భూక్యా రమేష్ నాయక్ (44) తండాకు దక్షిణ భాగంలో 99 సెంట్ల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. అందులో బెండ, పశుగ్రాసం సాగు చేపట్టాడు. సాయంత్రం బెండతోటకు మందుకొట్టి, పశువులకు మేత కోసుకుని ఇంటికి వస్తున్నాడు. చీకట్లో రోడ్డుకు అడ్డుగా పడుకున్న పామును పొరపాటున తొక్కడంతో కాటు వేసింది. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు. హుటాహుటిన చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈలోపే రమేష్ నాయక్ మృతి చెందాడు. అతడికి భార్య దేవిబాయి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం తండ్రి కోటా నాయక్ బల్లికురవ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ బండి శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకున్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అందరితో కలివిడిగా ఉండే రమేష్నాయక్ పాముకాటుతో చనిపోవడంతో తండాలో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఈసీ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా బాపట్ల: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను ఆయన ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆరు నియోజకవర్గాల ఈవీఎంలు ఉన్న గదులను పరిశీలించి, దస్త్రాలు తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కొనసాగించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు వచ్చేందుకు మార్గాలు ఏర్పాటు చేసి, బారికేడ్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరినీ కళాశాల ప్రాంగణం వైపు రానివ్వకూడదని స్పష్టం చేశారు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించేలా వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూం నడిపించాలని, అక్కడే మీడియా సెంటరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొంత దూరంలో వాహనాల పార్కింగ్ స్థలం ఎంపిక చేయాలని ఎస్పీకి సూచించారు. మూడంచల భద్రతపై అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా అప్రమత్తం చేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, ఆర్డీవో జి.రవీందర్, అధికారులు ఉన్నారు. -
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్
బాపట్లటౌన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ రోజు జూన్ 4న జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో, ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు వాహనాల్లో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్లో పోయరాదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చడానికి అనుమతి లేదని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు బాణ సంచా విక్రయించకూడదన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులు ప్రచారం చేయడం నేరమని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసు అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిలేదు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ పటిష్ట బందోబస్తు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అశేష భక్తుల మధ్య శిడిమానోత్సవం చీరాల టౌన్: మండలంలోని కొత్తపాలెం గ్రామ పంచాయతీలో కొలువుదీరిన పోలేరమ్మ ఆలయ 24వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ నెల 17 నుంచి నిర్వహిస్తున్న తిరునాళ్లలో ఆఖరి రోజు శిడి మానోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు బక్కా శివప్రసాద్రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి అమ్మవారికి పూజలు, అమ్మవారి సేవ, ప్రభోత్సవాలు భక్తిశ్రద్ధలతో చేశారు. శిడి పెళ్లి కొడుకు వేషధారణలో గ్రామంలో ఉత్సవం చేసి, శిడిమానులో మేకను పెట్టి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. పోలేరమ్మను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, సిద్దారెడ్డి, సురేష్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాంబాబురెడ్డి పాల్గొన్నారు. -
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎం.హనుమంతరావు చీరాల టౌన్: పశు పోషకులు విధిగా జీవాలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ మద్దు హనుమంతరావు సూచించారు. మంగళవారం మండలంలోని బోయినవారిపాలెం గ్రామంలో పశు వైద్యురాలు డాక్టర్ పావని ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు చిటుకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన హనుమంతరావు మాట్లాడుతూ తొలకరి వర్షాలకు గ్రామాల్లోని గొర్రెలు, మేకలు లేత పచ్చని గడ్డి తినడంతో క్లాస్టీడియా బ్యాక్టీరియా కడుపులోకి చేరి అనారోగ్యానికి గురై మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు. చిటుకు వ్యాధి రాకుండా గొర్రెలకు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని చెప్పారు. రైతులు, పశు పోషకులు తమ జీవాలకు టీకాలు వేయించాలన్నారు. అనంతరం ఈపురుపాలెం పశు వైద్యశాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. పశు వైద్యురాలు పావనికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఏడీ డాక్టర్ చిట్టిబాబు, పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. -
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
● సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ● ఏఎస్పీ టీపీ విఠలేశ్వర్ చీరాల అర్బన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో అలాగే ముందు రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఏఎస్పీ టీపీ విఠలేశ్వర్ తెలిపారు. అలజడులు సృష్టిస్తే.. రౌడీ షీట్ తెరుస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనల్లో కొంత మందిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. జూన్ 4న కౌంటింగ్ రోజు పట్టణం, రూరల్ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. గెలిచినా, ఓడినా అందరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. సమావేశంలో ఒన్టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
చీరాల రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న భూ యాజమాన్య హక్కు చట్టం అమలైతే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ అధ్యక్షతన ఏపీ భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆధిక సంఖ్యలో ఈ చట్టానికి సానుకూలత వ్యక్తమవ్వగా.. ఒకరిద్దరు రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూములకు సంబంధించిన వ్యవహారం ఎంతో గజిబిజిగా ఉందని, ఒకే భూమిని అనేక మంది తమదంటే తమదని పోటీలు పడుతున్నారని చెప్పారు. మరికొందరైతే ఆ భూములకు హక్కుదారులమంటూ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారని, తద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు చివరకు మోసపోతున్నారని చెప్పారు. నిజమైన లబ్ధిదారుడి గుర్తింపే ల్యాండ్ టైటిలింగ్.. ప్రస్తుతం భూములు అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయని, ఆయా భూములన్నింటిని ఏకం చేసి నిజమైన లబ్ధిదారుడికి భూమిని అందించేందుకు ఏర్పాటు చేసేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వక్తలు పేర్కొన్నారు. వందేళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో భూములకు సంబంధించిన నియమాలు ఇప్పటికీ అలాగే నడుస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూముల విషయంలో కోర్టుల్లో జరుగుతున్న కేసులు లక్షల్లో పెండింగులో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ దస్తావేజులు రిజిస్ట్రార్ ఇవ్వడం లేదనే మాట అవాస్తవమని.. ఒరిజినల్ దస్తావేజులు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంబంధిత యజమానికి రిజిస్ట్రార్ అందజేస్తున్నారని స్పష్టం చేశారు. కొందరు ఈ విషయాలను తప్పుగా ప్రజలకు ప్రచారం చేస్తున్నారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టాన్ని అమలుచేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసి కచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని కొందరు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మాచర్ల మోహనరావు, విశ్రాంత తహసీల్దారు కోటేశ్వరరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, రిటైర్డు ఏసీపీ కట్టా రాజ్ వినయ్ కుమార్, మేడ వెంకటరావు, గాదె హరిహరరావు, వసంతరావు, గజవల్లి శ్రీనివాసరావు, గూడూరి శివరామ్ ప్రసాద్, ఎల్లమందారెడ్డి, సూర్యప్రకాశరావు, జయరామిరెడ్డి, రామేశ్వర కుమార్, మణిబాబు, రామ్మనోహర్ లోహియ, న్యాయవాది అంబటి పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు వక్తలు -
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
● అదనపు ప్రధాన ఎన్నికల అధికారికి వినతి ● వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షుడు కాలేషా చీరాల టౌన్: దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ చీరాల అభ్యర్థి ఎంఎం కొండయ్యపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కాలేషా మాట్లాడుతూ కొండయ్య దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడి, ఎన్నికల సంఘం నిబంధనలను విస్మరించారన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్భాషలాడిన వీడియో పుటేజీలు అందించి, ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులను అవ హేళన చేస్తూ మాట్లాడిన వీడియో పుటేజీ కూడా అందించామని తెలిపారు. జాతీయ దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 92ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కొండయ్య మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లను అందించి చీరాల ఆర్వో, డీఎస్పీకి ఫిర్యాదులు చేసినా.. ఎఫ్ఐఆర్ కాపీలు అందించినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూపాటి రమణయ్య, బత్తుల సాయికుమార్, రాజేంద్ర ఉన్నారు. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
నరసరావుపేట టౌన్: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ భాస్కర్ మంగళవారం తెలిపారు. పోలింగ్ రోజు టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మారణాయుధాలతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుపడిన ఎమ్మెల్యే మామ రామకోటిరెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో లాం కోటేశ్వరరావు, శాఖమూరి మారుతి, బండా నాగూర్, మహబూబ్ బాషా, ఖాజా, ఇంటూరి మహేష్, తిరుపతి తొమ్మిది మంది అరెస్ట్ చేశారు. -
మాచర్ల టార్గెట్గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్లాల్కు ఫిర్యాదు చేసింది. ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్చార్జ్గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు. అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్రాజ్ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.పేట్రేగిపోయిన పచ్చమూకలు 11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.‘నారా’యణస్వామి భక్తి కారంపూడి సర్కిల్లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్కు పిలవలేదు. పైగా బాధితుడైన ఎస్ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్
మాచర్ల: మాచర్ల పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ సోమవారం కూడా అమలుచేశారు. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసుల ఉన్నతాధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్న విషయం విదితమే. పట్టణంలో టాస్క్ఫోర్స్, సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం స్పందిస్తోంది. పట్టణంలో పలు ఇళ్లల్లో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. ప్రముఖ నాయకుల ఇళ్లతో పాటు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. రింగ్రోడ్డు సెంటర్, పాలవాయి జంక్షన్, గుంటూరు రోడ్డు, నెహ్రూనగర్, అంబేడ్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, తూర్పు బావి తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో పోలీసుల పహారా పలు ఇళ్లల్లో సోదాలు -
బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం పి పద్మ కోరారు. సోమవారం ఆమె ఐటీడీఏ పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024–25 విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరేందుకు 21–5–2024 నుంచి 30–5–2024 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో అన్నీ తరగతులకు ఎస్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. బీసీలు 3వ తరగతిలో ఆరు, 4వ తరగతిలో ఆరు, ఎస్సీలు 3వ తరగతిలో ఆరు, 4వ తరగతిలో ఆరు, 5వ తరగతిలో ఐదు, ఓిసీలు 3వ తరగతిలో ఆరు , 4వ తరగతిలో ఆరు, 5వ తరగతిలో మూడు, 7వ తరగతిలో నాలుగు సీట్లు ఖాళీలు ఉన్నాయని పద్మ వివరించారు . అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. -
దేవదాయ శాఖ చెరువులో అక్రమంగా తవ్వకాలు
జే.పంగులూరు: దేవదాయ శాఖ భూముల్లో తెలుగుదేశం నాయకులు అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాల్ని అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని చందలూరు గ్రామంలో దేవదాయ శాఖ కింద 20 ఎకరాల మేర ఊర చెరువు ఉంది. ఇందులోని మట్టిని గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు ఆదివారం అక్రమంగా తవ్వకాలు చేశారు. దీన్ని గ్రామంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా పంచాయతీ కింద తీస్తున్నామని ధీమాగా చెప్పారు. రేపు రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, దిక్కున్నోడికి చెప్పుకో ? అంటూ బెదిరించారు. విషయం దేవదాయ శాఖ అధికారులకు తెలిసింది. మట్టిని ఎలా తవ్వుతారని గుమస్తాను పంపి హెచ్చరించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో చేసేది లేక ఈవో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి అక్రమ మట్టి తవ్వకాల్ని ఆపించారు. దేవదాయ శాఖ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బరి తెగించిన చందలూరు టీడీపీ నాయకులు వచ్చేది తమ ప్రభుత్వమేనని దురుసు ప్రవర్తన అడ్డుకున్న అధికారులు -
భవిష్యత్లో ఉన్నతంగా ఎదగాలి
అద్దంకి: విద్యార్థులు చక్కగా చదివి భవిష్యత్లో గొప్పగా ఎదగాలని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమరాలు సుభాషిణి సూచించారు. ఆమె సోమవారం పట్టణంలో సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో వాసవీ సగర్లోని శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రకాశం పంతులు జయంతికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంగ్లా రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం మునిమనుమరాలుగా పుట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన గొప్ప సాహసవంతుడని చెప్పారు. సంకా సుబ్రహ్మణ్యం సౌజన్యంతో విద్యార్థుల కోసం ‘భారతీయ మహిళామణలు’ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో మహిళామణులు చరిత్రలతోపాటు సృజన కవుల కవితలను పొందుపరచారు. పదో తరగతిలో 550 మార్కులకుపైగా సాధించిన 143 మంది విద్యార్థులకు బహుమతులు, అత్యుత్తమ మార్కులు సాధించిన 31 మందికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఊటుకూరి ఉమా అన్నపూర్ణ, వీరవల్లి సుబ్బారావు, డాక్డర్ యు. దేవపాలన, అన్నమనేని వెంకట్రావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, ఇలపావులూరి శేషతల్పసాయి, షేక్ మహ్మద్ రఫీ, రోటరీ క్లబ్ సభ్యులు ఊటూకూరి రామకోటేశ్వరరావు, సాహితీ మిత్రమండలి సభ్యులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభాషిణి ‘భారతీయ మహిళామణలు’ పుస్తకావిష్కరణ 143 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం -
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈనెల 22న బుధవారం ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఽధ్వర్యాన మెగా లోన్ మేళా నిర్వహించనున్నట్లు చాబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ దాసరి దేవరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు మద్దతుగా తాము మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో పాల్గొనే వారికి ఉచిత ప్రవేశ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుందని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈనెల 22న సోమవారం ఉదయం 10 గంటలకు నోరీ హాస్పిటల్ సమీపంలోని ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే మెగాలోన్ మేళాకు హాజరు కావాలని కోరారు. మెగాలోన్ మేళాలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్వయంగాగానీ 79959 15450, 89197 37517 నంబర్లలోగానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈదురుగాలుల బీభత్సం నకరికల్లు: మండలంలో సోమవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులు వీచడంతోపాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగి స్తంభాలు విరిగిపడ్డాయి. పలుగ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పోలింగ్ రోజు గొడవలపై విచారణ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధితో పాటు దుగ్గిరాల మండలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన గొడవలపై డీఎస్పీ సీహెచ్ రవికాంత్ పలు ప్రాంతాల్లో సిబ్బందితో సోమవారం విచారణ చేపట్టారు. మే 13న పలు పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు గొడవలు సృష్టించి దాడులకు పాల్పడ్డారు. వారు ఏ పార్టీకి చెందిన వారు, జరిగిన గొడవలు ఏమిటి? ఎవరెవరు చేశారు? ఎంతమంది పాల్గొన్నారు ? అనే వివరాలను సేకరించారు. కొందరు జూన్ 4న దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ముందుగానే పసిగట్టి అనుమానితులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. అనుమానితుల పేర్లు సేకరిస్తున్నట్టు సమాచారం. -
క్విజ్ పోటీల్లో ఐశ్వర్య ప్రతిభ
నగరం: ఇటీవల చీరాలకు చెందిన గీతా యంగ్ సైంటిస్ట్ సంస్థ ఆన్లైన్లో జిల్లాస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించింది. ఇందులో అల్లపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.ఐశ్వర్య ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం ఆమెను హెచ్ఎం వై. రాజేశ్వరి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.వి. శ్రీనివాసరావు, నరేంద్రబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు తాడికొండ: తుళ్లూరు మండలం వడ్లమానులో ఎస్సీ కులానికి చెందిన కారంశెట్టి వెంకట్రావు ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన ఐదుగురు టీడీపీ నాయకులపై తుళ్ళూరు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన గోళ్ళ గోపీనాథ్రెడ్డి, చిలుకూరి జగదీష్రెడ్డి, చల్లా మన్మథరెడ్డి, ఉయ్యూరు రాజశేఖరరెడ్డి, చల్లా వెంకట నరసింహారెడ్డి ఎన్నికల ముందు రోజు సెంటర్కు వచ్చిన కారంశెట్టి వెంకట్రావును టీడీపీకి ఓట్లు వేయాలని అడగ్గా ఆయన నిరాకరించాడు. ఆ సమయంలో వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన వారు వెంకట్రావు ఇంటిపైకి వెళ్ళి కులం పేరుతో దూషించడంతోపాటు తల నరికి సైలెన్సర్కు వేలాడదీసుకొని వెళతానని బెదిరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ అనురాధ తెలిపారు. -
బైక్ అదుపుతప్పి మత్య్సకారుడి మృతి
చీరాల అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మత్య్సకారుడు మృతి చెందిన ఘటన సోమవారం వాడరేవు–ఊటుకూరి సుబ్బయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈపూరుపాలెం రూరల్ ఎస్ఐ ఎం.శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం ఊటుకూరి సుబ్బయ్యపాలేనికి చెందిన వి.బాలాజీ (45) సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వాడరేవు వచ్చి తిరిగి గ్రామానికి పయనమయ్యాడు. మార్గంమధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
లాడ్జీలు, రిసార్ట్స్ల్లో పోలీసుల తనిఖీలు
చీరాల: నియోజకవర్గంలోని లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్లో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, రికార్డుల్ని పరిశీలించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వన్టౌన్ సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లాడ్జీలు, రిసార్ట్స్ల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, తరచూ ఘర్షణ పడే వ్యక్తులు, పాత నేరస్తులు ఉన్నారేమోనని ఆరా తీస్తున్నట్లు చెప్పారు. పాత నేరస్తులు, అనుమానితుల వివరాలను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జీల నిర్వాహకులకు తెలిపారు. గ్రామాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా గానీ, గుంపులుగా గానీ సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. -
మారీచ్లపై ఉక్కుపాదం
కొల్లూరు : కృష్ణా నదిని కొల్లగొడుతున్న ఇసుక మారీచుల ఆటకట్టించేందుకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. ఆయన సోమవారం మండలంలోని జువ్వలపాలెం,గాజుల్లంకతో పాటు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన పెదలంక ఇసుక క్వారీల్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి క్వారీల్ని పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మైనింగ్, రెవెన్యూ, పోలీస్, సెబ్ అధికారుల్ని ఆదేశించారు. జువ్వలపాలెంలో గతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఆరా తీశారు. ప్రస్తుతం చేపట్టకుండా నిరోధించాలని, నదీ ప్రాంతంలో వెబ్క్యామ్ల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారుల్ని ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై అధికారుల్ని ప్రశ్నించారు. స్థానికులు చేస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వాహనాలపై కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పెసర్లంక అరవిందవారధి, పెదలంక పరిధిలో ఇసుక తవ్వకాలు చేపట్టడానికి అనువుగా ఉన్న ఈపూరు పొలిమేర డొంక మార్గాలతో పాటు, నదీ పరీవాహక గ్రామాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు దిగకుండా ర్యాంపుల వద్ద గండ్లు చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి అరికట్టేలా చర్యలు చేపట్టాలని కొల్లూరు తహసీల్దార్ పుల్లారావును ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో హేలా షోరోన్, రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ, వేమూరు సీఐ రామకృష్ణ, కొల్లూరు ఎస్ఐ రవీంద్రరెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు రేపల్లె రూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మండలంలోని పెనుమూడి ఇసుక రీచ్ను సోమవారం ఆయన ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పెనుమూడి కృష్ణానది తీరం వెంబడి నుంచి ఇసుక తరలించేందుకు ప్రస్తుతం ఎటువంటి రీచ్లకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కృష్ణా తీరం వెంబడి రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇసుక తరలింపుల్ని అడ్డుకోవాలని సూచించారు. రేపల్లె, భట్టిప్రోలు, కొల్లూరు మండలాలలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వారితో పాటు వారికి సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో హేలా షారోన్, తహసీల్దార్ రవీంద్ర, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి తనిఖీలు ఇసుక అక్రమ తవ్వకాలపై క్రిమినల్ చర్యలుఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలి మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని అనమనమూరులో ఇసుక రీచ్ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తవ్వకాల్ని నిషేధించాలని, దానికి తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న దారిని మూయించాలని ఆదేశించారు. ఆయన వెంట జేసీ శ్రీధర్, ఆర్డీవో శివరామకృష్ణారెడ్డి, తహసీల్దార్ సుశీల, పోలీసు అధికారులు, ఎస్ఐలు ఉన్నారు.భట్టిప్రోలు: ఇసుక అక్రమ తవ్వకాలపై క్రిమినల్ చర్యలు తీసుకుని వాహనాల్ని సీజ్ చేయాలని రేపల్లె ఆర్డీవో హేలా షారోన్ పోలీసుల్ని ఆదేశించారు. సోమవారం భట్టిప్రోలు మండలంలోని ఓలేరు, పెదలంక కాకుల డొంకలో రీచ్లను పరిశీలించారు. రాత్రిపూట ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. రీచ్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రీచ్ల వద్ద పరిరక్షణ చర్యలు చేపట్టాలని, సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆమె వెంట మైనింగ్ ఏడీ రాజేష్, రివర్ కన్వర్జేషన్ అధికారి భానుబాబు, ఏఈ నాయక్, తహసీల్దార్ ఐ. మునిలక్ష్మి, సర్వేయర్ బి. శ్రీనివాసరావు ఉన్నారు. -
వైభవంగా మొగదారమ్మ ఉత్సవాలు ప్రారంభం
నిజాంపట్నం: మత్స్యకారుల ఇలవేల్పు మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాలు నిజాంపట్నంలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు,ఆయన సోదరుడు మోపిదేవి హరనాథబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట రమణారావు మాట్లాడుతూ మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాల్ని ఏటా అంగరంగవైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు. ఉత్సాహంగా జల క్రీడలు ఉత్సవాలను పురస్కరించుకుని తొలిరోజు ఉత్సాహంగా జల క్రీడలు నిర్వహించారు. 25 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నగరం: స్థానిక శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థాన 14 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 25నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం తెలిపారు.బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూజల అనంతరం ప్రతిరోజు అన్నదానం చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి మార్టూరు: నాడు–నేడులో భాగంగా పెండింగ్లో ఉన్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ జిల్లా ప్రతినిధి ఏ.ఎల్.ఎస్.ఓ. సాగర్ సూచించారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో సోమవారం ఆయన మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల అధికారులతో నాడు–నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగర్ ఇసుక ఇన్వాయిస్, ఇండెంట్, పెండింగ్లో ఉన్న ఇతర పనులు, ఐఎఫ్పీ ప్యానల్స్ వివరాల గురించి సమీక్షించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంఈవోలు, సీఆర్పీలు పాల్గొన్నారు. ఈవీఎంలకు మూడంచెల భద్రత బాపట్ల టౌన్: జిల్లావ్యాప్తంగా బాపట్ల లోక్ సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, (ఈవీఎం) కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన విషయం తెలిసిందే. ఈ స్ట్రాంగ్ రూముల వద్ద ఎస్పీ వకుల్జిందాల్, కలెక్టర్ పి. రంజిత్బాషా ఆధ్వర్యంలో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులతో మూడు షిప్టుల్లో 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. నిరంతర నిఘాకు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిరంతర పోలీసు పహారా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా చోరీచీరాల అర్బన్: చీరాల రూరల్ మండలం పుల్లాయపాలెంలోని పోలింగ్ బూత్లో సీసీ కెమెరా చోరీకి గురైంది. ఈపూరుపాలెం రూరల్ పోలీసుల వివరాల మేరకు.. పుల్లాయపాలెంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో ఒకటి కనిపించలేదు. మహిళా పోలీసు ధనలక్ష్మి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఈపూరుపాలెం ఎస్ఐ శివకుమార్ తెలిపారు. సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 504.80 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 806.60 అడుగుల వద్ద ఉంది. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చీరాల–వేటపాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. వేటపాలెం సమీపంలో డౌన్ లైన్లో రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు జీఆర్పీ ఎస్ఐ సీహెచ్. కొండయ్య తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మార్టూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని ద్రోణాదుల గ్రామానికి చెందిన సిరికొండ వెంకటేశ్వర్లు, నాగమ్మ (60) దంపతులు మార్టూరు జాతీయ రహదారి పక్కన బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల13వ తేదీ సాయంత్రం జాతీయ రహదారి పక్కన సుధా వే బ్రిడ్జి ఎదురు నడిచి వెళ్తున్న నాగమ్మను యద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామానికి చెందిన అయినాల సంపత్ కుమార్ బైకుపై వెళ్తూ ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమ్మను అదేరోజు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement