-
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘింస్తూ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీచర్లకు చార్జ్ మెమోలు జారీ చేసి వారిచ్చే వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయంగా విద్యాశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ ప్రాథమిక పాఠశాల టీచరు రాఘవేంద్రగుప్తా, నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల టీచరు వై.మంజునాథ్ ఇద్దరూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి బ్రహ్మసముద్రం మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఓబుళపతి మండలంలోని ఇతర టీచర్ల పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్లను అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తమవద్ద అందుబాటులో ఉన్నట్లు సదరు టీచర్లు వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్లు పెట్టారు. వీరి వ్యవహారంపై ‘సి’ విజిల్ యాప్ ద్వారా ఆధారాలతో సహ ఎన్నికల కమిషన్కు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం చార్జ్మెమోలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే బ్రహ్మసముద్రం ఎంఈఓపై చర్యలకు ఆర్జేడీకి సిఫార్సు చేశామని చెబుతున్నా... ఆర్జేడీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. ఈ ఇద్దరికంటే ఆ టీచరు పెద్ద తప్పు చేశాడా? వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేశారు. ఆయన చేసిన నేరం ఏంటంటే...‘పదో తరగతి పరీక్షల నిర్వహణ, కోడింగ్ పనులు, స్పాట్ వాల్యూయేషన్ సిబ్బంది రెమ్యూనరేషన్ను ప్రభుత్వం గతేడాది పెంచిందని ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై మార్చి 23న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై ఆయనకు ఎలాంటి నోటీసులు, చార్జ్ మెమోలు ఇవ్వకుండా ఏకంగా సస్పెండ్ చేశారు. అయితే టీడీపీకి కార్యకర్తల్లా పనిచేసిన ఇద్దరు టీచర్లపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ‘పచ్చ’పాత ధోరణిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్కుమార్రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటనలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
విత్తన నాణ్యతలో లోపాలుంటే చర్యలు
బెళుగుప్ప: విత్తన నాణ్యతలో లోపాలుంటే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారిణి (డీఏఓ) ఉమామహేశ్వరమ్మ అన్నారు. మండల కేంద్రంలోని వినాయక సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. వేరుశనగ విత్తన ప్రాసెసింగ్కు రైతుల నుంచి సేకరించిన విత్తనాల వివరాలు, ఆర్బీకేల ద్వారా పంపించిన వివరాలను పరిశీలించారు. నాణ్యత లేని విత్తనకాయలను పంపినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ ఎల్లప్ప, వ్యవసాయ అధికారులు పృథ్విసాగర్, వాసుకి రాణి, రాకేష్నాయక్ పాల్గొన్నారు. పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కళ్యాణదుర్గం రూరల్: ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కళ్యాణదుర్గం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీధర్ కుమార్ తెలిపారు. Sbtet.ap.gov. in/apSBTET వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28లోగా పరీక్ష ఫీజు రూ.400 చెల్లిచాలని, జూన్ 2న తిరుపతిలోని ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. -
పరీక్ష రోజు ఫీజు చెల్లించినా హాల్టికెట్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు సాగుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి విద్యార్థులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. ఇప్పుడెవరైనా ఫీజు చెల్లించకపోయినా పరీక్ష జరిగే రోజైనా చెల్లించి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు. ఈ అవకాశాన్ని ఫెయిల్ అయిన విద్యార్థులందూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 13,332 మంది విద్యార్థులు హాజరవుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి సిలబస్లో మార్పు.. వచ్చే విద్యా సంవత్సరం (2024–25) నుంచి పదో తరగతి సిలబస్ మారుతుందని డీఈఓ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి విద్యార్థీ పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోయినా హెచ్ఎంలను కలిస్తే హాల్టికెట్లు ఇస్తారని, వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ తెలిపారు. రేపటి నుంచి టెన్త్ ‘సప్లి’ -
టమాట సీజన్ ప్రారంభం
● పెరుగుతున్న ధరలతో సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు ● ఎక్కడ చూసినా టమాట సాగే.. ఆత్మకూరు: కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు టమాట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర ఏకంగా రూ.500 వరకు పలుకుతోంది. గత ఏడాది వర్షాలు సరిగా కురవక, పంటలు అనుకున్న విధంగా చేతికి రాక నష్టం వాటిల్లింది. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో చాలా మంది రైతులు టమాట సాగు చేస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులు ఎక్కువగా ఈ పంటపై ఆధారపడుతున్నారు. గత ఏడాది ఈ సీజన్లో 215 హెక్టార్లలో టమాట సాగైంది. ఈ ఏడాది విస్తీర్ణం బాగా పెరగవచ్చని వ్యవసాయ సిబ్బంది తెలిపారు. నర్సరీల్లో డిమాండ్ మార్కెట్లో టమాట నారకు డిమాండ్ పెరిగింది. ఎకరాకు 15 వేల నుంచి 20 వేల మొక్కల వరకూ సాగు చేస్తారు. ప్రస్తుతం ఒక మొక్క 50 పైసల వరకూ పలుకుతోంది. జిల్లాలో 150 నర్సరీలకు పైగానే ఉన్నాయి. ఒక ఎకరాలో టమాట పంట పెట్టేందుకు రూ.20 వేల వరకూ పెట్టుబడి వస్తుందని రైతులు తెలియజేస్తున్నారు. అనుకూలిస్తే ఆకాశానికి.. పడితే పాతాళానికే టమాట లాభాలు లాటరీల్లా ఉన్నట్లు ఉంటాయి. ధర లేకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక, రోడ్డు పక్కన పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది 15 కిలోల బాక్సు ధర దాదాపు రూ.2 వేల వరకు పలికింది. అయితే, ఆ సమయంలో ఎక్కువగా పంట చేతికి రాకపోవడం గమనార్హం. అయితే, ఏది ఎలా ఉన్నా, టమాట ధరల్లో అనిశ్చితి కొనసాగుతున్నా, రైతులు మాత్రం ఎంతో ఆశతో పంట సాగు చేస్తూనే ఉన్నారు. -
No Headline
అనంతపురం: ఓట్ల లెక్కింపు ఘడియలు దగ్గరయ్యే కొద్దీ ఉద్విఘ్న వాతావరణం నెలకొంటోంది. ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎన్నికల ఫలితాల ముందుగానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్ ప్రోగ్రాంలకు ఎటువంటి అనుమతుల్లేవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకుల సందేశాలు, నిరాధార ఆరోపణలు, రచ్చబండ చర్చలు, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన వాటిని నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలతో పాటు బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. జూదం, కోడిపందేలు, బెట్టింగ్ మొదలైన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా, మద్యం, వస్తువులు అక్రమ రవాణా జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 6,289 మంది బైండోవర్ సీఐ, ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్, పెట్రోలింగ్, ఔట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా 6,289 మందిని బైండోవర్ చేశారు. 136 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్కు కౌన్సెలింగ్ ఇచ్చారు.మట్కా, అక్రమ మద్యం, గుండాగిరీ చేస్తున్న 8 మందిని జిల్లా నుంచి బహిష్కరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఒక వైపు శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటూనే, మరో వైపు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటలూ నిరంతర సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బలగాల పహారా ఏర్పాట్లు ఉన్నాయి. జిల్లాలో 24 గంటలూ పటిష్ట పోలీసు నిఘా జూన్ 4న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భద్రత పెంపు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా గ్రామాల్లో గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు -
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘింస్తూ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీచర్లకు చార్జ్ మెమోలు జారీ చేసి వారిచ్చే వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయంగా విద్యాశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ ప్రాథమిక పాఠశాల టీచరు రాఘవేంద్రగుప్తా, నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల టీచరు వై.మంజునాథ్ ఇద్దరూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి బ్రహ్మసముద్రం మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఓబుళపతి మండలంలోని ఇతర టీచర్ల పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్లను అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తమవద్ద అందుబాటులో ఉన్నట్లు సదరు టీచర్లు వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్లు పెట్టారు. వీరి వ్యవహారంపై ‘సి’ విజిల్ యాప్ ద్వారా ఆధారాలతో సహ ఎన్నికల కమిషన్కు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం చార్జ్మెమోలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే బ్రహ్మసముద్రం ఎంఈఓపై చర్యలకు ఆర్జేడీకి సిఫార్సు చేశామని చెబుతున్నా... ఆర్జేడీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. ఈ ఇద్దరికంటే ఆ టీచరు పెద్ద తప్పు చేశాడా? వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేశారు. ఆయన చేసిన నేరం ఏంటంటే...‘పదో తరగతి పరీక్షల నిర్వహణ, కోడింగ్ పనులు, స్పాట్ వాల్యూయేషన్ సిబ్బంది రెమ్యూనరేషన్ను ప్రభుత్వం గతేడాది పెంచిందని ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై మార్చి 23న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై ఆయనకు ఎలాంటి నోటీసులు, చార్జ్ మెమోలు ఇవ్వకుండా ఏకంగా సస్పెండ్ చేశారు. అయితే టీడీపీకి కార్యకర్తల్లా పనిచేసిన ఇద్దరు టీచర్లపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ‘పచ్చ’పాత ధోరణిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్కుమార్రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటనలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మే 1 వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి. వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 22,510 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ రెండో సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం కలుగండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. అన్ని చోట్ల ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి, డీవీఈఓ వెంకటరమణనాయక్, డీఈఓ వరలక్ష్మి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సుజాత, కార్మిక శాఖ డీసీ లక్ష్మీనరసయ్య, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్బాబు, తదితరులు పాల్గొన్నారు. నేడూ ఇంటర్ ఫీజు చెల్లించొచ్చు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద గురువారం కూడా చెల్లించవచ్చు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ ఎం.వెంకటరమణనాయక్ కోరారు. తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అన్ని యాజమాన్యాల కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక చొరవ తీసుకుని ఎవరైనా ఫీజు చెల్లించని వారు ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. ఆన్లైన్ మూల్యాంకనంపై అవగాహన అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులు వర్చువల్ విధానంలో అవగాహన కల్పించారు. అనంతపురంలోని కొత్తూరు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల నుంచి 150 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇంటర్ బోర్డు అధికారులు వి.సుబ్బారావు, వి.రమేష్ ఆన్లైన్ మూల్యాంకనం చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. సదస్సులో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, డీఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వర్షం వస్తే స్ట్రాంగ్ రూముల్లోకి నీరు వెళ్లకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమును తనిఖీ చేసి లీకేజీకి అవకాశం ఉందా అనేది గమనించాలని, లీకేజీకి ఆస్కారం ఉంటే తక్షణం మరమ్మతు చేయాలని చెప్పారు. గదులకు వెనుక, ముందు టార్ఫాలిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పై అంతస్తు నుంచి నీరు గదిలోకి దిగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఓ రాంభూపాల్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ ఓబుళరెడ్డి, అధికారులు ఉన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్కుమార్ -
ఆకట్టుకున్న మాక్డ్రిల్
● శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తాడిపత్రిలో పోలీసుల మాబ్ ఆపరేషన్ ● రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరుపై రైల్వే శాఖ ప్రదర్శనతాడిపత్రి అర్బన్: కౌంటింగ్ రోజున శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, కేంద్ర పోలీసు బలగాలు తీసుకునే చర్యలపై తాడిపత్రిలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో డీఎస్పీ జనార్దన్నాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. హింసాత్మక సంఘటన జరిగితే, గుంపును నియంత్రించేందుకు చేసే హెచ్చరికలను ప్రయోగాత్మకంగా చూపించారు. హెచ్చరిక వినకపోతే వారు మేజిస్ట్రేట్ అనుమతితో బాష్పవాయువు ప్రయోగం, తమను తాము రక్షించుకోవడానికి లాఠీ చార్జ్, ఆపై వాటర్ కెనాన్ వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. మాక్డ్రిల్లో పాల్గొన్న పోలీసులు ప్రతి సన్ని వేషాన్ని ఆద్యంతం రక్తికట్టించడంతో చూసిన ప్రజలు అవాక్కయ్యారు. తొలుత అక్కడ నిజంగానే యుద్ధవాతావరణం నెలకొందని కొందరు పరుగులు తీశారు. తర్వాత అక్కడున్న వారందరూ మఫ్టీలో ఉన్న పోలీసులేనని తెలుసుకుని ఆసక్తిగా గమనించారు. గూళ్యపాళ్యం రైల్వేస్టేషన్లో... గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు రైల్వే సాంకేతిక నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది స్పందించే తీరుపై బుధవారం గూళ్లపాళ్యం రైల్వే స్టేషన్లో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను అబ్బురపరిచింది. రైలు పట్టాలు తప్పిందంటూ డివిజన్ కేంద్రం గుంతకల్లులో అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే ఆగమేఘాలపై అధికారులు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ప్రత్యేక రైలుల్లో సేఫ్టీ, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, కమర్షియల్, మెడికల్ విభాగాలకు చెందిన ఉన్నతాకారులతోపాటు సిబ్బంది ప్రమాదస్థలిని చేరుకుని విభాగాల వారిగా ఎవరికి వారు సహాయక చర్యలు చేపట్టే విధానాన్ని అందరూ రక్తికట్టించారు. మొత్తం ప్రక్రియను జోనల్ పీసీఎస్ఎం ప్రదీప్కుమార్, డిప్యూటీ సీఎస్ఓ అప్పారావు, డీఆర్ఎం వినీత్సింగ్, ఏడీఆర్ఎం సుధాకర్ తదితరులు పర్యవేక్షించారు. బోగీలను ఒకదానిపై ఒకటి ఎక్కించి ప్రమాద దృశ్యాన్ని కళ్లకు కట్టించారు. బోగిల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడం, గాయపడిన వారికి చికిత్సలు అందజేయడం, అంబులెన్స్లో తరలించడం, మంటలు చెలరేగితే ఆర్పే విధానం తదితర అంశాలను దాదాపు 3 గంటల పాటు ప్రదర్శించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీపీఓ జయశంకర్చౌహన్, సీనియర్ డీఈఎన్ కోర్డినేషన్ అక్కిరెడ్డి తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
కూడేరు: పది తర్వాత ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న కూడేరు మండల విద్యార్థుల ఇక్కట్లు దూరం చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకూ ఇంటర్, ఆపై చదువులకు కూడూరు మండలంలోని విద్యార్థులు ఉరవకొండ, అనంతపురానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తెస్తూ ప్రభుత్వం కూడేరులోనే జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సం నుంచే తరగతుల ప్రారంభానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే జూనియర్ కళాశాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ బ్లాక్ను కేటాయించారు. జూనియర్ కళాశాల ఏర్పాటుపై జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎంపీసీ, బైపీసీ గ్రూపులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారన్నారు. కో–ఎడ్యుకేషన్ విధానం కొనసాగుతుందన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని, దరఖాస్తులు ఉన్నతపాఠశాలలోనే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరానికి ప్రవేశాలు దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు -
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
అనంతపురం: నేరచరిత లేని వారిని బైండోవర్ చేయరాదని వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ గౌతమి శాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తాడిపత్రిలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేరచరిత లేని వారిని సైతం బైండోవర్లు చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి రాబోతోందని, సీఎంగా వైఎస్ జగన్ రెండో దఫా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ వారిని మాత్రమే బైండోవర్ చేయాలని కోరారు. నేరచరిత లేని వారు, ఎన్నికల సమయంలో ఆటంకాలు సృష్టించని వారిని బైండోవర్లు చేయకూడదని ఎస్పీని కోరినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ప్రశాంతతకు మారు పేరని, గతంలో ఒక హోంగార్డు, ఒక పోలీసుతోనే నాలుగు పోలింగ్ బూత్ల నిర్వహణ చేపట్టారంటేనే ఈ విషయం అర్థం చేసుకోవచ్చన్నారు. ఉరవకొండ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఒక్కో పల్లెలో 10 మందిని బైండోవర్ చేస్తుండడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరునాళ్లు, జాతరలు జరిగే కాలం ఇదని, ఈ నేపథ్యంలో ఆంక్షలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. కౌంటింగ్కు ఏజెంట్లుగా ఉన్న వారిని ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగియాలని ఆకాంక్షించారు. శింగనమల వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో సాధారణ పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, జనరల్ సెక్రటరీ ఈ. వెంకట రాముడు, ఉపాధ్యక్షుడు జూటూరు సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు టి. గోకుల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీకి వైఎస్సార్ సీపీ నేతల వినతి -
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
అనంతపురం అగ్రికల్చర్: బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పశుసంవర్దకశాఖకు మంచిపేరు తీసుకురావాలని నూతన విలేజ్ అనిమల్ హస్పెండరీ అసిస్టెంట్ల (వీఏహెచ్ఏ)కు పశుశాఖ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం సూచించారు. ఆర్బీకే వేదికగా రైతులకు నాణ్యమైన సేవలందించాలన్నారు. కొత్తగా నియమితులైన 280 మంది వీఏహెచ్ఏలకు ఏప్రిల్ 1 నుంచి నిర్వహిస్తున్న 45 రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పశుశాఖ జేడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి జేడీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించిన 280 మందిని బ్యాచ్లుగా విభజించి అనంతపురం జేడీ కార్యాలయ ప్రాంగణంలో రెండు బ్యాచ్లు, సాయినగర్ పశువుల ఆస్పత్రిలో ఒక బ్యాచ్, రెడ్డిపల్లి ప్రాంతీయ పశుశిక్షణా కార్యాలయంలో రెండు బ్యాచ్లు, సిద్ధరాంపురం పశుగ్రాస క్షేత్రంలో ఒక బ్యాచ్ చొప్పన ఆరు బ్యాచ్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి 28 మంది అధికారులను నియమించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ఆర్బీకే వేదికగా రైతులకు అందజేయాలన్నారు. పశు, జీవ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పశుశాఖ జేడీ, డీడీలు, ఏడీలు, పలువురు డాక్టర్లను ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీఏహెచ్ఏలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో గురువారం పంచాయతీ కార్యదర్శులను కలసి రిపోర్టు చేసుకుని విధుల్లో చేరాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశుశాఖ డీడీలు డాక్టర్ వై.రమేష్రెడ్డి, డాక్టర్ జి.వెంకటేష్, కోర్సు కో ఆర్డినేటర్లు, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు. ప్రభుత్వానికి, పశుశాఖకు మంచిపేరు తీసుకురండి వీఏహెచ్ఏల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పశుశాఖ జేడీ సుబ్రహ్మణ్యం -
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
విడపనకల్లు: అల్లర్లకు పాల్పడకుండా, ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గురువారం సుంకలమ్మ ముత్యాల పల్లకీ ఊరేగింపు చేసుకుంటామని గ్రామస్తులు ఎస్ఐ ఖజాహుస్సేన్, తహసీల్దార్ దస్తగిరయ్యకు రెండు రోజుల క్రితం వినతి పత్రం సమర్పించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కలెక్టర్ బుధవారం వేల్పుమడుగు గ్రామంలో పర్యటించారు. స్థానిక సర్పంచు తిప్పారెడ్డి, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పలు చోట్ల పోలింగ్ అనంతరం నెలకొన్న పరిణామాలను వివరించారు. గొడవలకు తావివ్వమంటేనే అనుమతి ఇస్తామన్నారు. అందరం కలసికట్టుగా,సామరస్యంగా జాతర జరుపుకుంటామని గ్రామస్తులు తెలపడంతో అనుమతినిచ్చారు. అనంతరం సుంకలమ్మ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి, తిమ్మారెడ్డి, నారాయణరెడ్డి, పెద్దన్న, శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ పరమేషప్ప, పాల్గొన్నారు. రికార్డులు పక్కాగా ఉండాలి రికార్డులు పక్కాగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. బుధవారం విడపనకల్లు తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో తహసీల్దారు దస్తగిరయ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో రికార్డుల గదిని పరిశీలించారు. రికార్డులు ఎప్పటికప్పుడు అడ్డేట్గా ఉండేలా చూసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయం నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నామో ప్రజలకు తెలిసేలా సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. సీసీఆర్సీ కార్డుల మంజూరు కోసం అర్హులైన రైతులను గుర్తించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర బంధం
గుంతకల్లు టౌన్: వివాహేతర బంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని బేల్దారి బోయ దేవేంద్రప్రసాద్(39)ను ఆయన భార్య ప్రియుడు హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను బుధవారం గుంతకల్లు వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామసుబ్బయ్య వెల్లడించారు. గుంతకల్లులోని అంకాలమ్మ గుడి వీధిలో నివాసముంటున్న దేవేంద్రప్రసాద్ బేల్దారిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొన్నేళ్ల క్రితం కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, కవితకు పెళ్లి కాక ముందే గుంతకల్లు మండలం నెలగొండకు చెందిన ఆమె సమీప బంధువు సుద్దికుంట సోమశేఖర్తో వివాహేతర సంబంధం ఉండేది. ప్రసాద్తో వివాహమైన తర్వాత కూడా ఆమెతో సోమశేఖర్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ తరుచూ ఇంటికెళ్లొచ్చేవాడు. ఏడాది క్రితం ఈ విషయాన్ని గుర్తించిన ప్రసాద్ ఇద్దరినీ మందలించాడు. అప్పటి నుంచి కవిత ఇంటికి సోమశేఖర్ వెళ్లేవాడు కాదు. అయితే ఎలాగైనా ప్రసాద్ అడ్డు తొలగించుకోవాలని భావించిన సోమశేఖర్ పథకం రచించాడు. ప్రసాద్తో కలసి బేల్దారి పనిచేసిన విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామానికి చెందిన జలపతి పెద్దరాయుడిని లోబర్చుకున్నాడు. ఈ నెల 14న రాత్రి మందు పార్టీ పెట్టుకుందామని ప్రసాద్కు పెద్దరాయుడితో ఫోన్ చేయించాడు. దీంతో పెద్దరాయుడిని ప్రసాద్ కలిశాడు. ఇద్దరూ కలసి గుంతకల్లు శివారులోని కల్వరి టెంపుల్ సమీపంలో ఉన్న నల్లరేగడి పొలంలో పీకల్లోతు మందు తాగారు. ఆ సమయంలో ప్యాపిలి రాముడుతో కలసి అక్కడకు చేరుకున్న సోమశేఖర్ నైలాన్ తాడుతో ప్రసాద్ గొంతు బిగించాడు. ఊపిరి ఆడక పెనుగులాడుతున్న ప్రసాద్ను ప్యాపిలి రాముడు గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ప్రసాద్ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి ముగ్గురూ జారుకున్నారు. 15వ తేదీ ఉదయం పొలాల్లో ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. హతుడి తండ్రి లక్ష్మణ్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో హత్యగా నిర్ధారించారు. విచారణ అనంతరం సోమశేఖర్, పెద్దరాయుడు, ప్యాపిలి రాముడిని పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
‘తాగునీటికి ఇబ్బంది లేదు’
అనంతపురం అర్బన్: జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డికి కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. తాగునీటి సరఫరా, శాంతిభద్రతలు, తదితర అంశాలపై సీఎస్ మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. నీటి సమస్య ఉన్న ఏడు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తున్నామని చెప్పారు. సీపీడబ్ల్యూ పథకాల కింద గ్రామాలకు నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నామన్నారు. అవసరమైన చోట అదనపు బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాపై ఫిర్యాదుల స్వీకరణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో మునిసిపల్ ఆర్డీ పీవీఎస్ఎన్ మూర్తి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, సీపీఓ అశోక్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో13.3 మి.మీ వర్షపాతం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా 28 మండలాల పరిధిలో 13.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడు మండలంలో అత్యధికంగా 45.2 మి.మీ వర్షం కురిసింది. ఆ తర్వాత అనంతపురం 37.2 మి.మీ, బుక్కరాయసముద్రం 34.2 మి.మీ, నార్పల 28.2 మి.మీ, కంబదూరు 20.2 మి.మీ, గార్లదిన్నె 20 మి.మీ, శింగనమల 18.8 మి.మీ, పామిడి 17.6 మి.మీ, కణేకల్లు 17.2 మి.మీ, గుత్తి 16.2 మి.మీ, ఆత్మకూరు 15.6 మి.మీ, గుమ్మఘట్ట 14.8 మి.మీ, యాడికి 13.4 మి.మీ, బొమ్మనహాళ్ 13.2 మి.మీ, శెట్టూరు 12.4 మి.మీ, వజ్రకరూరు 12.2 మి.మీ, కళ్యాణదుర్గం 10.6 మి.మీ, కూడేరు 10.2 మి.మీ వర్షం పడింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉద్యాన పంటల నష్టం రూ.1.84 కోట్లు గాలీవానతో కూడిన వర్షంతో జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి,శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో ప్రధానంగా అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాట పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33 మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వేగంగా మరమ్మతు పనులు అనంతపురం టౌన్: విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టినట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర తెలిపారు. ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా 60 విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో సంస్థకు రూ.12.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురువడంతో అనంతపురం రూరల్ మండలం ఏ.నారాయణపురం, సోమనాథ్నగర్, రాయల్నగర్ తదితర ప్రాంతాల్లో 10కి పైగా స్తంభాలు నేలకూలాయి. మంగళవారం ఉదయమే విద్యుత్ సిబ్బంది మరమ్మతు పనులు వేగంగా చేపట్టి వినియోగదారులకు సకాలంలో విద్యుత్ అందేలా చూశారు. జిల్లా వ్యాప్తంగా 33 కేవీ విద్యుత్ స్తంభాలు..10, 11కేవీ స్తంభాలు..20, ఎల్టీ లైన్ స్తంభాలు.. 30తోపాటు 4 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు ఎస్ఈ వెల్లడించారు. రాప్తాడు మండలంలో అత్యధికం గాలీవానకు ఉద్యాన పంటలకు నష్టం -
25న భారీ వర్షం!
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఈనెల 25న భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ప్రధానంగా అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో మంచి వర్షాలు పడవచ్చన్నారు.ధర్మవరం, కదిరి, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్లలో వర్షపాతం బాగా నమోదు కావచ్చన్నారు. రాగల ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.2 డిగ్రీల నుంచి 39.6 డిగ్రీలు, కనిష్టం 24.6 డిగ్రీల నుంచి 26.7 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమ ఉదయం 61 నుంచి 78, మధ్యాహ్నం 34 నుంచి 42 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. నైరుతి దిశగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నందున ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తం కావాలన్నారు. భూములు దుక్కులు చేసుకుని విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 24 నుంచి విత్తన పంపిణీ ● 18,750 క్వింటాళ్ల విత్తనానికి రిజిస్ట్రేషన్లు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో రైతులకు రాయితీతో విత్తన పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుని తమ వాటా సొమ్ము చెల్లిస్తున్నారు. మంగళవారం నాటికి 21,226 మంది రైతులు 18,750 క్వింటాళ్లకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 40 శాతం రాయితీతో భూ విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు (మూడు కిలోలు బస్తాలు) పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి గుత్తి: రైతు భరోసా కేంద్రాలకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని డీఏఓ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. పట్టణంలోని వేరుశనగ విత్తన ప్రాసెసింగ్ యూనిట్ (పవన్ ఆగ్రో ఏజెన్సీ)ను మంగళవారం జిల్లా వ్యవసాయాధికారిణి (డీఏఓ) ఉమామహేశ్వరమ్మ తనిఖీ చేశారు. వేరుశనగ విత్తన కాయలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక వైఎస్సార్ అగ్రీ ల్యాబ్ను ఆమె తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటరాముడు, ఏఓ ముస్తాక్ అహ్మద్, టెక్నికల్ ఏఓలు రాకేష్ నాయక్, మెహరన్నీషా బేగం, ఏఈఓ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవం.. ధర్మవరం అర్బన్: అశేష భక్త జనసందోహం నడుమ ధర్మవరంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణతో పట్టణం మార్మోగింది. మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ తేరుబజార్కు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి కొలువుదీరారు. ఉదయం 7 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4గంటలకు బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు. మడుగుతేరు (రథోత్సవం)కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రథానికి పూజలు చేసిన ఎమ్మెల్యే మడుగుతేరును లాగారు. ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిమంది భక్తులు రథం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం ప్రారంభించారు. తేరుబజార్ నుంచి అంజుమన్ సర్కిల్ వరకూ భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగారు. -
కౌంటింగ్కు ముగ్గురు పరిశీలకులు
అనంతపురం అర్బన్: ‘చిన్నపాటి పొరపాటుకూ తావివ్వకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. కౌంటింగ్ కోసం జిల్లాకు ప్రత్యేకంగా ముగ్గురు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. వారు ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తారు.పోలింగ్ తరువాత అందిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలి’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పరిశీలకునిగా మనీష్ సింగ్ వ్యవహరిస్తారన్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకునిగా అజయ్నాథ్ ఝ, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్కుమార్ను కౌంటింగ్ పరిశీలకులుగా నియమించారని చెప్పారు. పోలింగ్ రోజు, ఆ తరువాతి రోజున అందిన ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసు శాఖకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. వాటి పరిష్కారానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఫిర్యాదుకూ రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. షాడో పార్టీలను ఏర్పాటు చేయాలి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కోసం షాడో పార్టీలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత, కౌంటింగ్ ప్రక్రియ తరువాత గొడవలు జరిగే అవకాశం ఉంటుందని, గత ఎన్నికల్లో బైండోవర్ చేసిన వారి జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి ఎవరు లేరు అనేది గుర్తించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, సమస్యలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రాళ్లు, కర్రలు, ఇనుప కడ్డీలు, ఇతర వస్తువులు నిర్మాణ పనులకు కాకుండా అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్ఓ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులురెడ్డి, వసంతబాబు, వెన్నెలశ్రీను, రాంభూపాల్రెడ్డి, జి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’పై దృష్టి పెట్టండి ఉపాధి పథకం కింద కూలీలకు విరివిగా పనులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల కల్పనపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉపాఽధి హామీ పథకం ఏపీఓలు, ఏపీడీలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. లేబర్ బడ్జెట్కు కేటాయించిన లక్ష్యంలో 79 శాతం పూర్తి చేశారన్నారు. కంబదూరు మండలం ముందంజలో ఉండగా, విడపనకల్లు మండలం చివరిస్థానంలో ఉందని, పురోగతి సాధించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని మండలాల్లో పురోగతి చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు కలెక్టర్ వినోద్కుమార్ -
తల్లిదండ్రుల చెంతకు బాలికలు
అనంతపురం సిటీ: బెంగళూరు సిటీ చూడాలన్న ఆకాంక్షతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ముంబయికి చెందిన ఇద్దరు బాలికలను రైల్వే పోలీసులు కాపాడి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు... ముంబయిలోని కుంచికుట్టేరి ప్రాంతానికి చెందిన 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఈ నెల 18న ఇంట్లో చెప్పకుండా ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. తమ పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే, పోలీస్ స్టేషన్లకు ముంబయి పోలీసులు చేరవేశారు. ఈ క్రమంలో రైలు గుంతకల్లుకు చేరుకోగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు బోగీలను గాలించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి వివరాలు ఆరా తీశారు. బెంగళూరు చూడాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని, అయితే తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చెప్పాపెట్టకుండా రైలెక్కి వచ్చేసినట్లు బాలికలు వివరించారు. ఆర్పీఎఫ్ నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ఆదేశాల మేరకు బాలల సంక్షేమ సమితి డీసీపీఓ మంజునాథ, పీఓ(ఐసీ) వెంకటేశ్వరి గుంతకల్లుకు వెళ్లి బాలికలను అనంతపురానికి తీసుకువచ్చారు. ఇద్దరినీ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి ఎదుట హాజరుపరిచి, కౌన్సెలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించి, వారొచ్చే వరకూ బుడ్డప్పనగర్లోని చిల్డ్రన్ హోంలో ఆశ్రయం కల్పించారు. మూడు రోజుల అనంతరం మంగళవారం అనంతపురానికి చేరుకున్న తల్లిదండ్రులకు బాలికలను సురక్షితంగా అప్పగించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ, పీఓ వెంకటేశ్వరి, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ వసంత పాల్గొన్నారు. -
ఏపీఎల్ విజేత ‘రైజింగ్ స్టార్స్’
అనంతపురం: అనంతపూర్ క్రికెట్ లీగ్ (ఏపీఎల్) – 2 విజేత ట్రోఫీని అనంత రైజింగ్ స్టార్ గెలుచుకుంది. అనంత క్రీడాగ్రామంలోని ప్రధాన మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ సిక్సర్స్, అనంత రైజింగ్ స్టార్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రైజింగ్ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. జట్టు బ్యాటర్ బి.ప్రశాంత్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 58 పరుగులు చేశారు. ఇండియన్ సిక్సర్స్ బౌలర్లు హరిశంకర్రెడ్డి, ఎం.ఖాన్, వి.సంజయ్ నాయుడు చెరో రెండు వికెట్లు చొప్పున తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియన్ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కోగటం హనీష్ వీరారెడ్డి 35 పరుగులు, ప్రవీణ్కుమార్ రెడ్డి 22 పరుగులతో రాణించారు. రైజింగ్ స్టార్స్ బౌలర్లు ఎం.దీపక్ , షాహిద్ చెరో రెండు వికెట్లు తీశారు. 19 పరుగులతో అనంత రైజింగ్ స్టార్స్ గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని ఆర్డీటీ చైర్మన్ ఎం.తిప్పేస్వామి అందజేశారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును బి.ప్రశాంత్కు భారత మహిళా మాజీ క్రికెటర్ సునేత్ర పరాన్జేపే అందజేశారు. కార్యక్రమంలో ఐపీఎల్ మాజీ క్రీడాకారుడు పైడికల్వ విజయ్కుమార్ (డెక్కన్ ఛార్జర్స్), కె.మధు ఆచారి, బీఆర్ ప్రసన్న, షబ్బీర్ అహమ్మద్, భీమలింగారెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్కుమార్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, డాక్టర్ సుప్రియా చౌదరి, కోచ్లు పాల్గొన్నారు. -
వలంటీర్ హత్యకేసులో నిందితుల అరెస్ట్
గోరంట్ల: మండలంలోని కొత్తబోయినపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం మల్లాపల్లి గ్రామ మాజీ వలంటీర్ అనిల్కుమార్ యాదవ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల సీఐ సుబ్బరాయుడుతో కలసి పెనుకొండ డీఎస్పీ షేక్ బాజీజాన్సైదా వెల్లడించారు. మల్లాపల్లికి చెందిన అనిల్కుమార్... మరో ఇద్దరు స్నేహితులతో కలసి కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా పెసలపర్తి గ్రామానికి ఆదివారం సాయంత్రం మద్యం సేవించేందుకు వెళ్లాడు. అదే క్రమంలో కొత్తచెరువుకు చెందిన సైఫుల్లా తన ఐదుగురు స్నేహితులతో కలసి కారులో పెసలపర్తికి చేరుకున్నాడు. ఇరు వర్గాలు మద్యం కొనుగోలు చేసి, సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పక్కపక్కనే కూర్చొని సేవించారు. ఆ సమమయంలో సైఫుల్లా స్నేహితులు మద్యం మత్తులో గట్టిగా కేకలు వేయడంతో అనిల్కుమార్, అతని స్నేహితులు వారించారు. ఆ సమయంలో కోపగించుకున్న సైఫుల్లా, మిత్రబృందం వాగ్వాదానికి దిగి అనిల్కుమార్, అతని స్నేహితులను బెదిరించారు. అనంతరం స్నేహితులతో కలసి స్వగ్రామానికి ద్విచక్ర వాహనాల్లో అనిల్కుమార్ బయలుదేరాడు. కొత్తబోయినపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుకనే కారులో వచ్చిన సైఫుల్లా, అతని స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళుతున్న అనిల్కుమార్ను అడ్డుకుని దాడి చేశారు. ఘటనలో అనిల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. హతుడి తండ్రి నరసింహప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నిందితులు దూదేకుల సైఫుల్లా, ముష్టూరి కుమార్, గొల్ల రఘునాథ్యాదవ్, గణేష్కుమార్, చింతకాయల హేమంత్కుమార్, గొల్ల సాయినాథ్ యాదవ్ కొత్తచెరువు వీఆర్వో ఓబులేసు ఆధ్వర్యంలో పోలీసుల వద్ద లొంగిపోయారు. కాగా, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచే క్రమంలో వైద్య పరీక్షలకు గోరంట్లలోని ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వైద్యాధికారి పావని నిరాకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేనంటూ రాతపూర్వకంగా ఆమె పోలీసులకు ఇచ్చారు. -
ముమ్మరంగా కార్డెన్ సెర్చ్
అనంతపురం: ఎస్పీ గౌతమి శాలి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేశారు. పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, అక్రమ మద్యం, నాటుసారా, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆయా గ్రామాల్లో ఫుట్పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదన్నారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ● అనంతపురం నగరంలో కేంద్ర సాయుధ బలగాలతో డీఎస్పీ టీవీవీ ప్రతాప్ ఫ్లాగ్మార్చ్ చేపట్టారు. గొడవలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని నగర వాసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుంచి సుభాష్ రోడ్డు, సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, బసవన్న కట్ట, గాంధీ బజార్, తాడిపత్రి బస్టాండ్, తిలక్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకూ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. అనంతపురం డీఎస్పీతో పాటు నగర సీఐలు వి.రెడ్డప్ప, ఆర్.ప్రతాప్రెడ్డి, నారాయణరెడ్డి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పాల్గొన్నాయి. ● సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాప్తాడు, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ అధికారులను ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయా స్టేషన్లను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సమస్యాత్మక గ్రామాలు, అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ట్రబుల్ మాంగర్స్ను గుర్తించి వెంటనే బైండోవర్ చేయాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత గ్రామాల్లో హింసకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇటుకలపల్లి సీఐ మునిస్వామి, నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ప్రమాదంలో యువకుడి మృతి – మరొకరికి తీవ్రగాయాలు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... కామారుపల్లికి చెందిన వంశీ (19), ప్రశాంత్ ఇద్దరూ బేల్దారి పనితో జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ ఆ వివాహితులే. మంగళవారం రాత్రి 8 గంటలకు అనంతపురంలో చికెన్ కొనుగోలు చేసి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కురుగుంట కోళ్లఫారం సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఘటనలో టిప్పర్ దూసుకెళ్లడంతో వంశీ రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరినీ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి వంశీ మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లి మల్లయ్య కొట్టాల సమీపంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నట్లుగా సమాచారం. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనంతో సహా టిప్పర్ డ్రైవర్ ఉడాయించాడు. సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య పుట్టపర్తి టౌన్: పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నాననే బాధతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్లో నివాసముంటున్న ఆనంద్, ఉష దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గౌతమ్ (23) అనంతపురం శివారులోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఏడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించేలోపు విగతజీవిగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. డీఎస్పీ బాధ్యతల స్వీకరణ తాడిపత్రి అర్బన్: తాడిపత్రి పోలీస్ సబ్డివిజనల్ అధికారిగా కె.జనార్ధన్నాయుడు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సీఐలు, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం తాడిపత్రి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉన్న డీఐజీ షిమోషిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయనకు డీఐజీ సూచించారు. తాడిపత్రిలో ప్రశాంత జీవనానికి భంగం కలిగించేవారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. గుత్తి ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ రాజ్కుమార్ హఠాన్మరణం గుత్తి రూరల్: ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, గుత్తి మండల ఎన్నికల నోడల్ అధికారి జీవీ రాజ్కుమార్(53) మంగళవారం హఠాన్మరణం చెందారు. రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స సమయంలోనే పరిస్థితి విషమించి ఆయన మృతిచెందారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, రాజ్కుమార్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా కడప. ఉద్యోగరీత్యా అనంతపురంలో ఆయన స్థిరపడ్డారు. రాజ్కుమార్ మరణవార్త తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్బాషా, ఈఈ జవహర్కుమార్, జిల్లాలోని డీఈఈ, ఏఈఈ, జేటీఓ, ఇతర ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది అనంతపురంలోని డీఈఈ నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. -
24న విత్తన మేళాకు తరలిరండి
ధర్మవరం రూరల్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం– పాలెం వారి ఆధ్వర్యంలో ఈ నెల 24న విత్తన మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు యం.మల్లారెడ్డి మంగళవారం ఓ ప్రటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తన రకాలను విక్రయానికి అందుబాటులో ఉంచడంతో పాటు పంటల సమగ్ర సమాచారం గురించి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంకు తరలిరావాలని రైతులను కోరారు. మరింత సమాచారం కోసం 9490409163 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
మైదాన ప్రాంతాల్లో ఎక్కువ
పిడుగుపాటు మరణాలు సాధారణంగా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో ఉన్న సమయంలో మెరుపులు కనిపించిన వెంటనే నేలపై మోకాళ్లమీద కూర్చొని తల కిందకు వంచి ఉండాలి. ఎత్తైన చెట్లు, శిథిల భవనాల కింద ఉండకూడదు. వ్యవసాయ పనుల్లో ఉన్న వారు అందరూ ఒకే చోట గుంపుగా ఉండకూడదు.నేలపై బోర్లా పడుకోకుండా తలవంచి మోకాళ్ల మీద కూర్చోవడం ఉత్తమం. గొడుగులు వాడకూడదు, చేతిలో పలుగు, పార లాంటి ఇనుప వస్తువులు ఏవీ ఉండకూడదు. సెల్ఫోన్లో మాట్లాడటం, కెమెరా ద్వారా ఫొటోలు తీయడం మంచిది కాదు. ఉరుముల సమయంలో పాత్రలు కడగడం, స్నానం చేయడం మంచిదికాదు. ఇళ్లపై పిడుగు పడడం చాలా అరుదుగా ఉంటుంది. పిడుగు బారి నుంచి తప్పించుకునేందుకు నివాస గృహాలే మేలు. – డాక్టర్ జి.నారాయణస్వామి, శాస్త్రవేత్త, రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం -
పిడుగుల కాలం.. అప్రమత్తత అవసరం
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల వర్షాకాలం మొదలైతే చాలు పిడుగులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏటా పిడుగు పాటుతో పశు, జీవ సంపదతో పాటు ఇతర మూగ జంతువులు, మనుషులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గడ్డివాములు, పూరిగుడిసెలు, చెట్లు కాలిపోయి ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఆకాశం మేఘావృతమై మిరుమిట్లు గొలిపే కాంతి (మెరుపు), పెద్ద శబ్ధంతో గుడుగు (ఉరుము) వచ్చిందంటే చాలు పిడుగు పడటం గ్యారెంటీ అని ప్రజలు నిర్ధారిస్తున్నారు. పిడుగుపాటు నష్టాలు మచ్చుకు కొన్ని ● 2023, మే 28న శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన యువకులు వడ్డే బాలకృష్ణ, గౌరీశంకర్ పిడుగుపాటుతో మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో వర్షం రావడం వల్ల మధ్యలో ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. ఆ సమయంలో పిడుగు పాటుకు గురై అక్కడిక్కడే మృతిచెందారు. ● 2023, మే 31న గుమ్మఘట్ట మండలం దేవిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు గొల్ల పరమేష్కు చెందిన 10 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది. ● 2023, జూన్ 1న యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో పిడుగుపాటుకు రైతు దస్తగిరికి చెందిన పాడి ఆవు మృత్యువాత పడింది. రూ.50 వేలకు పైగా నష్టం జరిగింది. పిడుగు అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత (ఎలెక్ట్రాన్లు అధికంగా ఉన్నటువంటి) మేఘాలు కిందకు వస్తాయి. అంటే మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లాంటి మేఘాల్లో ఎలెక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి. సైన్స్ ప్రకారం రుణావేశిత మేఘాల్లోని ఎలెక్ట్రాన్లు ధనావేశిత మేఘాల వైపు ఆకర్షితమవుతుంటాయి. అయితే ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లినపుడు దగ్గరలో ఏ వస్తువున్నా అటువైపు ఎలెక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో మేఘాల నుంచి ఎలెక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ వలయంగా మారి భూమి మీదకు దూసుకువస్తాయి. వాటినే మనం పిడుగులుగా పిలుస్తాం. మరో రూపంలో ఆకాశంలో మేఘాలు పరస్పరం ఢీకొన్న సమయంలో వెలువడే కాంతిని మెరుపు. వచ్చే శబ్ధాలను ఉరుములు, విడుదలయ్యే విద్యుత్ను పిడుగు అంటారు. ఒక్క పిడుగు ద్వారా కొన్ని కోట్ల వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక పిడుగులో దాదాపు 30 కోట్ల ఓల్టుల విద్యుత్ ఉంటుందని అంటున్నారు. అది ఎంత శక్తివంతమైనదంటూ పిడుగు మనిషిని నేరుగా తాకితే అక్కడిక్కడే బూడిదైపోవడం ఖాయం. పిడుగుపాటుకు పశువులు, జీవాలతో పాటు మనుషులు బలి ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు గత సోమవారం రాత్రి బత్తలపల్లి మండలం ఉప్పర్ల పల్లి గ్రామ సమీపంలో పిడుగుపాటుకు దంపెట్ల గ్రామానికి చెందిన జింకా చంద్రశేఖర్ (55) మృతి చెందాడు. ఉప్పర్లపల్లి గ్రామ సమీపంలోని రైతు సుధీర్ పొలంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం రాత్రి పొలం వద్ద ఉన్నప్పుడే వర్షం మొదలైంది. దీంతో ఇంటి దారి పట్టాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అధికం కావడంతో సమీపంలోని కోళ్లఫాం వద్దకు వెళుతుండగా పిడుగు పడింది. దీంతో ఆందోళనకు గురైన చంద్రశేఖర్ కోళ్లఫాంలోని రైతుల వద్దకు చేరుకుని దాహంగా ఉందని నీళ్లు తాగుతూ కుప్పకూలి మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
మనం అరెస్టు చేయడమే కానీ మనల్ని అరెస్టు చేయడం ఉంటుందనుకోలే!!
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
తప్పక చదవండి
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement