-
ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జిల్లా ఎన్నికల అధికారి విజయ సునీత ఆదేశం సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాడేరు, అరకులోయ స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ తుహిన్సిన్హా, అరకు ఆర్వో వి.అభిషేక్, సబ్కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఏఎస్పీ ధీరజ్తో కలిసి తనిఖీ చేశారు. భద్రత చర్యలను పరిశీలించారు. అనంతరం వచ్చే నెల నాల్గో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునుకు సంబంధించిన గదులను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లోపూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని, అభ్యర్థులు, ఏజెంట్ల పరిశీలనకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. బారికేడ్లు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత సిబ్బంది నిరంతరం అప్రమ్తతంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్ఎం రాజు,డీఈఈ అనుదీప్,పాడేరు సీఐ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
జిల్లా అధికారి ప్రసాదరావు ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నట్టు జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని కరిముఖిపుట్టు పంచాయతీ తాంగుల గ్రామంలో మలేరియా నివారణ మందు పిచికారీ పనులను పరిశీలించారు. పిచికారీకి సిద్ధం చేసిన మలేరియా నివారణ మందు మోతాదు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని గిరిజనులతో మాట్లాడారు. వీధుల్లో మురుగు, చెత్ల నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. ఇంటి బయట, లోపల మందును పిచికారీ చేయించుకోవాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దోమల నివారణ మందు తొలివిడత పిచికారీ చురుగ్గా జరుగుతోందన్నారు. మండలంలో 128 గ్రామాల్లో తొలివిడత పిచికారీ జరుగుతోందన్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శేషయ్య, మండల మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేశ్వరరావు, ఎంపీహెచ్ఈవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం సందర్శన
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం ఏపీజెన్కో డైరెక్టర్ ఎంవీవీ సత్యనారాయణ సందర్శించారు. వించ్ మార్గంలో విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు నిర్వహిస్తున్న జనరేటర్ల సామర్థ్య పరీక్షలను ఆయన పరిశీలించారు. జనరేటర్ల ఉత్పత్తి, వినియోగం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కంట్రోల్ రూంలో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. అనంతరం సీలేరు కాంప్లెక్స్కు నీటిని అందించే జోలాపుట్టు జలాశయాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీలేరు కాంప్లెక్స్ సీఈ బొడ్డుశ్రీధర్, ఎస్ఈ సివిల్ కేకేవీ ప్రశాంత్కిశోర్, ఎస్ఈ హెచ్పీసీ స్వామినాయుడు, ఎస్ఈ విద్యుత్సౌధ చంద్రశేఖర్రెడ్డి, మాచ్ఖండ్ ఎస్ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఈఈ జనరేషన్ బి.గోవిందరాజులు పాల్గొన్నారు.జనరేటర్లను పరిశీలించిన ఏపీ జెన్కో డైరెక్టర్ సత్యనారాయణ -
ఉత్సవాలు విజయవంతం చేయాలి
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి ఉత్సవాలను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.విజయసునీత కోరారు. ఇందుకు సంబంధించి అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 9,10,11తేదీల్లో నిర్వహించే ఉత్పవాల్లో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల మూడు రోజులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, 24గంటల పాటు వైద్యబృందాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని,ప్రైవేట్ జీపులకు సంబంధించి ఓవర్లోడ్ ఉండకూడదన్నారు. రెండు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్సిన్హా, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్కలెక్టర్ ధాత్రిరెడ్డి, పాడేరు ఏఎస్పీ ధీరజ్, డీఆర్వో పద్మావతి, ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొట్టగుళ్లి రామారావు, వెంకటరమణ,యాదగిరి శ్రీను పాల్గొన్నారు. -
చివరి దశకు జీడిపిక్కల వ్యాపారం
సాక్షి,పాడేరు: జీడిపిక్కల వ్యాపారం చివరిదశకు చేరుకుంది. ఒడిశా వ్యాపారులు గిరి రైతుల నుంచి పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 58,460 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుండగా ఎకరాకు 300 కిలోల వరకు దిగుబడి వస్తుండగా రూ.30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దిగుబడి తగ్గినపపటికీ సీజన్ ప్రారంభంలో గిట్టుబాటు ధర లేక రైతులు నిరాశకు గురయ్యారు. ఈ సీజన్లో కిలో రూ.80 నుంచి రూ.100 లోపే విక్రయాలు జరిగాయి. కొయ్యూరు, రాజవొమ్మంగి ప్రాంతాల్లో సీజన్ ప్రారంభం నుంచి కిలో రూ.90లోపే వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంత రైతులు ఆదాయం కోల్పోయారు. పాడేరు మండలం వంట్లమామిడి, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మాత్రం కిలో రూ.100కు కొనుగోలు చేయడం రైతులకు ఊరటనిచ్చింది. ఒడిశాకు సరిహద్దులో ఉన్న డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, మోతుగూడెం, ధారకొండ ప్రాంతాల్లో ఒడిశా వ్యాపారులు కిలో రూ.100 నుంచి రూ.110కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పోటీపడి కొనుగోలు చేస్తున్న ఒడిశా వ్యాపారులు కిలోకు రూ.100కు పైగా ధర చెల్లింపుసీజన్ ప్రారంభంలో నష్టం జీడిపిక్కల సీజన్ ప్రారంభంలో విక్రయించడం వల్ల నష్టపోయాను. కిలో రూ.84కు విక్రయించా. ఇప్పుడు రూ.100కు పైగా ధర ఉంది. ఇప్పుడు విక్రయించిన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. – డి.కనకరాజు, జీడిరైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం -
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల దుర్వినియోగం
రంపచోడవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కమిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎంపీపీ బందం శ్రీదేవి ఆరోపించారు. శుక్రవారం ఆమె మండలంలోని సీతపల్లి, వాడపల్లి, పెదగెద్దాడ, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేవారు. దీనిలో భాగంగా ఆమె రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యుల అనుమతి లేకుండా హెచ్డీఎస్ నిధులను వైద్యాధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారని తెలిపారు. నిధుల ఖర్చుకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్, క్యాష్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు ఏమీ లేవన్నారు. సకాలంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించలేదన్నారు. నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ విజయ సునీత, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరేకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పెదగెద్దాడ పీహెచ్సీలో రోగులకు సరిగ్గా వైద్య సేవలు అందడం లేదని ఆమె ఆరోపించారు. సర్పంచ్ వడల ప్రసాద్తో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. సమాచార బోర్డుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి సంబంధించిన వివరాలు లేవన్నారు. ఎంపీటీసీలు కుంజం వంశీ, బచ్చల మంగయ్యమ్మ పాల్గొన్నారు. వైద్యాధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి -
● తారబు సోయగం
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులోని ప్రకృతి అందాల మధ్య తారబు జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాల నురగలను తలపిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అందాలను తిలకించేందుకు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, జైపూర్, ఒడిశా నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతంలో స్నానాలు చేస్తూ వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. – ముంచంగిపుట్టు -
అందుబాటులో అత్యవసర వైద్యం
ఒకప్పుడు రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక వసతులతో అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చింది. గత మూడేళ్లుగా మెరుగైన వైద్యసేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రి 11 మండలాల ప్రజలకు పెద్దదిక్కుగా మారింది. ఇక్కడి ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి డా. కె లక్ష్మి ప్రత్యేకదృష్టి సారించి వైద్యులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. గతంలో అత్యవసర వైద్యం కోసం వచ్చే కేసులను రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారు. ఈ పరిస్థితుల్లో అంచెలంచెలుగా అత్యాధునిక వైద్యసేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఐసీయూ విభాగం ఏర్పాటు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగం ఏర్పాటు చేయడంతో అత్యవసర కేసులకు ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ఐసీయూ విభాగంలో వెంటిలేటర్ అందుబాటులో ఉంది. అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నప్పుడు కృత్రిమ శ్వాస అందించివచ్చని వైద్యులు తెలిపారు. కేవలం కార్పొరేట్ ఆస్పత్రిల్లో మాత్రమే ఉండే ఈ సదుపాయం వల్ల రోగుల బంధువులకు అవస్థలు తప్పినట్టే. గతంలో అత్యవసర వైద్యం అందించాలంటే రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్కు తరలించేందుకు సుమారు గంటకు పైగా సమయం పట్టేది. వైద్యం అందించాల్సిన కీలకమైన సమయం రోగిని తరలించేందుకే సరిపోయేది. ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్యంలో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరిచింది. కొత్త పీహెచ్సీల ఏర్పాటుతో పాటు ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేసింది. ● ఒకప్పుడు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఒక్క ప్రత్యేక వైద్య నిపుణుడు కూడా లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ప్రస్తుతం ఉన్న 16 మంది వైద్యుల్లో 12 మంది నిపుణులు ఉన్నారు. వీరిలో గైనిక్, ఆర్దోపెడిక్, ఈఎన్టీ, కంటి వైద్య శస్త్ర చికిత్స నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు ఉన్నారు. శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయి. 11 మండలాలకు పెద్దదిక్కుగా రంపచోడవరం ఏరియా ఆస్పత్రి పూర్తిస్థాయిలో వైద్యనిపుణులు రోగులకు అన్నిరకాల వైద్యసేవలు పూర్తిగా తగ్గిన రిఫర్ కేసుల సంఖ్య తాజా ఐసీయూ విభాగం ఏర్పాటు దశలవారీగా సౌకర్యాలు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో దశలవారీగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒకప్పుడు రిఫర్ చేసే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఇక్కడే కీలకమైన సర్జరీలు జరుగుతున్నాయి. ఐసీయూ విభాగం అందుబాటులోకి వచ్చింది. వివిధ పరీక్షలకు సంబంధించి అత్యాధునిక ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. – కె లక్ష్మి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి రంపచోడవరం వైద్య సేవలు చాలా బాగున్నాయి రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు చాలా బాగున్నాయి. ప్రసూతి సేవలు కోసం ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు. సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఇలాంటి సేవలు అందడం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – పద్మ, తాటివాడ, రంపచోడవరం మండలం -
ఇంటర్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ విద్య: ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ జైల్ రోడ్లో నిర్వహించే బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థునులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జే. విజయ తెలిపారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు ఒకేషనల్ కోర్సులను ఇంగ్లిషు, తెలుగు మీడియంలో బోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థినులు వెంటనే కాలేజీలో సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి వారైనా కాలేజీలో చేరవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. -
పూర్తిస్థాయిలో వైద్యసేవలు
● రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ● ఐసీయూ యూనిట్ ప్రారంభం రంపచోడవరం: రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) విభాగం అందుబాటులోకి వచ్చిందని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్గనోరే తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగాన్ని సూపరింటెండెంట్ డా. కె.లక్ష్మితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రమాదాలకు గురైనవారితో పాటు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా సీరియస్ కేసులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులకు ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేసి వారికి ఆహారం అందజేస్తున్నామని పీవో తెలిపారు. -
ప్రశాంతంగా కౌన్సెలింగ్
కొమ్మాది (విశాఖ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఆధ్వర్యంలో నడుస్తున్న డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్. రూపావతి తెలిపారు. మొత్తం ఏడు గురుకుల బాలికల కళాశాలలు కలిపి అన్ని గ్రూపుల నుంచి 188 ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లు తెలిపారు. -
లేపాక్షి రకం విత్తనాల పంపిణీ
గత ఏడాది చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ద్వారా మండలంలోని సీతగుంట పంచాయతీలో రోగులపేట, చిట్రాయిపుట్టు రైతులకు పంపిణీ చేశాం. గతేడాది సీతగుంట పంచాయతీలో సుమారు 350 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. దీంతో పాటుగా అడుగులపుట్టు, సీకరి, అరడకోట, గలగండ, గంపరాయి, పెదకోడాపల్లి పంచాయతీల్లో సాగు చేస్తున్నారు. 90 రోజుల వేసవి పంటకు రైతులకు మంచి దిగుబడి వస్తుంది. ఎక్కువగా నీరు అందుబాటులో ఉన్న ఇసుక నేలల్లో సాగుకు అనుకూలంగా ఉంది.గత ఏడాది కంటే సాగు విసీ్త్రర్ణం పెరిగే అవకాశం ఉంది. – ఏ.శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి,పెదబయలు మండలం. -
మరికొన్నిసమ్మర్ స్పెషల్స్
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని వన్వే సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్–సోలాపూర్(01452) వన్ వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 11.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.45 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 7 గంటలకు సోలాపూర్ వెళ్తుంది. భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి (01056) వన్వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.53 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి వెళ్తుంది. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలం అసరాడ తోటమామిడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి నుంచి కొయ్యూరు వెళ్తున్న మొట్టడం జీవన్ , పాంగి దారబాబులు పెదవలస నుంచి చింతపల్లి వస్తున్న పాంగి చిరంజీవి, రాశికుమారి, అన్నపూర్ణలు ద్విచక్రవాహనాల్లో వస్తుండగా ఇరువురి వాహనాలు ఎదురెదురుగా వచ్చి అదుపుతప్పడంతో అసరాడ సమీపంలోని ప్రధాన రహదారిపై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం పాడేరు, నర్సీపట్నం ఆసుపత్రులకు రిఫర్ చేశారు. -
మరికొన్ని రైళ్ల రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: పెయిరింగ్ రైళ్లు ఆలస్యం కారణంగా ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరులో శుక్రవారం ఉద యం 10.15 గంటలకు బయలుదేరాల్సిన వీటీ బెంగళూరు–అగర్తలా(12503)హమ్సఫర్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–ఎస్ఎంవీ బెంగళూరు (08845) రాత్రి 12.30 గంటలకు బయలుదేరింది. ● శుక్రవారం ఉదయం 5.45గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన విశాఖ– సికింద్రాబాద్(20833) వందేభారత్ సుమారు 3 గంటలు ఆలస్యంగా 8.45 గంటలకు బయలుదేరింది. సికింద్రాబాద్లో మధ్యా హ్నం 3 గంలకు బయలుదేరాల్సిన సికింద్రాబాద్–విశాఖ(20834) 2.15 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి– ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22807)ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా రాత్రి 11.55 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 11.40 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06090) స్పెషల్ సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా శనివారం తెల్లవారు 4 గంటలకు బయలుదేరింది. ● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– హౌరా (12840) సూపర్ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్ సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. -
ఘనంగా క్షీరాభిషేకం
డాబాగార్డెన్స్ (విశాఖ) : బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం క్షీరాభిషేక సేవ నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.500 చెల్లించిన యెడల పూజకు దంపతులు లేదా ఇద్దరిని అనుమతించనున్నట్టు చెప్పారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు 0891–2566514, 2711725 నంబర్లలో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి, ఏఈవోలు కె. తిరుమలేశ్వరరావు, వెంపలి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కనకమహాలక్ష్మికి సహస్ర తులసీదళార్చన.. కనకమహాలక్ష్మి దేవాలయంలో శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సహస్ర తులసిపూజ నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,500 పూజా రుసుం చెల్లించి పాల్గొనవచ్చు. భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్కొత్తరోడ్డు శాఖ, అకౌంట్ నంబరు 060810011006691, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0806091లో చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన భక్తులు వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా 8985515989 నంబరుకు వాట్సప్ చేయాలి. -
వేరుశనగ సాగు..లాభాలు బాగు
పెదబయలు: గిరిజన ప్రాంత రైతులు సంప్రదాయ పంటలు పసుపు, పిప్పళ్ల పంటలు పండిస్తూనే ఖరీఫ్ వరి సాగుపై ఎక్కువ దృష్ఠి పెడుతున్నారు.అలాగే వాణిజ్య పంటలపై మండలంలోని సీతగుంట, అరడకోట, అడుగులుపుట్టు, గలగండ, గంపరాయి, ముంచంగిపుట్టు మండలం దారెల, పెదగుడ, ఏనుగురాయి, మాకవరం, దోడిపుట్టు పంచాయతీల్లో ఎక్కువగా వాణిజ్య పంటలు వేరుశనగలు మండలంలో 650 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. మన్యంలో పండించే వేరుశనగలకు మార్కెట్లో మంచి ధర ఉంది. దీంతో రైతులు గత రెండేళ్ల నుంచి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండలంలోని సీతగుంట, అడుగులపుట్టు పంచాయతీల్లో వందల ఎకరాల్లో మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ ఏడాది మరింతగా సాగు విస్తరించారు. సబ్సిడీపై విత్తనాలు మండలంలోని ఖరీఫ్ వరి, సామలు, రాగుల పంటలకు సంబంధించి రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. మెట్ట పంటలు సామలు, రాగులు, కొర్రలు ఇతర పంటలకు సంబంధించి పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ వరి కోసం దుక్కులు దున్నుతున్నారు. అలాగే ఇటీవల ప్రభుత్వం సబ్సిడీ పసుపు విత్తనాలు అందించడంతో రైతులు నాటుతున్నారు. వేసవి దుక్కుల వల్ల ఎంతో ప్రయోజం ఉంటుందని, కలుపు నివారణలో వర్షం పడితే నీటిని ఎక్కువ పీల్చుకుంటుందని, సేంద్రియ ఎరువులు వేసిన ఎక్కువగా భూమిలో కలుస్తుందని వేసిన పంట బాగా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్కు రైతులు సన్నద్ధం విత్తనాల పంపిణీ జోరుగా వేసవి దుక్కులు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పెందుర్తి : వెంకటాద్రిపై కొలువైన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్షేణ అరాధన, పుణ్యావహవచనం, అంకురార్పణ, బుత్సంగ్రహణం, యాగాశాల అర్చన, అగ్ని ప్రతిష్ట జరిగాయి. వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ, హోమాలు చేస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు జరుగుతాయి. మూడో రోజు శనివారం వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా సాయంత్రం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగో రోజు ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. వెంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో స్వామివారు రథంపై పయనిస్తూ చినముషిడివాడ సప్తగిరినగర్లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు సాగుతూ భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. ఆఖరి రోజు సోమవారం ఉదయం స్వామి వారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానమాచరిస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. తొలిరోజు పూజల్లో ఈవో నీలిమ, ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
10 కిలోల గంజాయి స్వాధీనం
సీతమ్మధార: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ద్వారకా స్టేషన్కు అప్పగించారు. వివరాలివీ.. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రకాష్, సాయిదళవి ఒడిశాలో 10 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కేరళ వెళ్లేందుకు విశాఖ వచ్చారు. రామాటాకీస్ రోడ్డులో బస్ కోసం వేచి ఉన్నారు. అయితే వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో అటువైపు వెళ్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద గంజాయిని గుర్తించి.. ద్వారకా పోలీసులకు అప్పగించారు. -
గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని బాలుర గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్థానిక సబ్బవరం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని సబ్బవరం, దేవరాపల్లి, గొలుగొండ, శ్రీకృష్ణాపురం గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆన్లైన్ విధానం ద్వారా సీట్లు భర్తీ చేశారు. మిగులు సీట్ల కోసం మెరిట్ అధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి సీట్లు భర్తీ చేసేందుకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్కు సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా కళాశాలల్లో 188 సీట్లు ఖాళీగా ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 81 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ చైర్మన్గా ఉమ్మడి జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపావతి, సభ్యులుగా ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్ సీహెచ్.వి.వి.సత్యారావు, ఆర్.రామకృష్ణ, సీహెచ్ రవీంద్రనాథ్, వి.రత్నవల్లి వ్యవహరించారు. -
పలు రైళ్లు రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా నడస్తున్నందున ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరాల్సిన రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నట్లు, అంతే ఆలస్యంగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరబ్ప్రసాద్ తెలిపారు. ● విశాఖలో గురువారం రాత్రి 11.20 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్ (18519) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ సుమారు 4 గంటలు ఆలస్యంగా శుక్రవారం తెల్లవారు 3 గంటలకు బయల్దేరింది. ● సంత్రగచ్చిలో గురువారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సంత్రగచ్చి– తాంబర (06090) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా శుక్రవారం తెల్లవారు 4 గంటలకు బయల్దేరింది. ఆలస్యంగా వందేభారత్ రాకపోకలు విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834) వందేభారత్ ఎక్స్ప్రెస్ గురువారం సుమారు మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 8.45 గంటలకు విశాఖలో బయల్దేరింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్లో సుమారు ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బయల్దేరింది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్ గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: ముంబై డివిజన్, చత్రపతి శివాజి టెర్మినస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల నిమిత్తం, ప్లాట్ఫాంల విస్తరణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే కోణార్క్ ఎక్స్ప్రెస్ను గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరబ్ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు భువనేశ్వర్లో బయల్దేరే భువనేశ్వర్–ముంబై సిఎస్టిఎం(11020) కోణార్క్ ఎక్స్ప్రెస్ దాదర్ స్టేషన్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 1వ తేదీన మాత్రమే ముంబై సీఎస్టీఎంలో బయల్దేరాల్సిన ముంబై సీఎస్టీఎం– భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్ప్రెస్ దాదర్ నుంచి బయల్దేరుతుంది. -
వాల్తేర్ డివిజన్‘కమర్షియల్’ రికార్డ్
● ఏప్రిల్లో రూ.2.8 కోట్ల ఆదాయం తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమర్షియల్ విభాగం సిబ్బంది ఏప్రిల్ నెలలో అత్యుత్తమ పనితీరు కనబరిచి, రికార్డు స్థాయి ఆదాయాన్ని సంపాదించారు. ఏప్రిల్ నెలలో వాల్తేర్ డివిజన్ కమర్షియల్ విభాగం చేపట్టిన 47, 837 డ్రైవ్ల ద్వారా సుమారు రూ. 2.8కోట్లు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గత రికార్డులన్నీ అధిగమించి ఈస్ట్కోస్ట్రైల్వే జోన్ పరిధిలోనే ఒక నెలలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన డివిజన్గా నూతన రికార్డు నెలకొల్పిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ సిబ్బందిని అభినందించారు. వాల్తేర్ డివిజన్, కమర్షియల్ సిబ్బంది అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ ఫలితంగా ఇది సాధ్యం అయిందని ప్రశంసించారు. -
విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన వైభవంగా విర్వహించారు. ఆలయ బేడా మండపంలో ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగలతో స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఏఈవో ఎన్.ఆనంద్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా నిత్య కల్యాణం వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేణ పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. -
ఇగ్నో ప్రవేశాలకుదరఖాస్తుల ఆహ్వానం
ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2024 విద్యా సంవత్సరం జూలై ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ గోనిపాటి ధర్మారావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కేంద్రం పరిధిలోని 11 జిల్లాల విద్యార్థులు https:// ignouadmi ssion.samarth.edu.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు జూన్ 30 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు ఎంవీపీకాలనీ ఉషోదయ కూడలిలోని ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement