7న కడపకు రాహుల్‌గాంధీ రాక | Sakshi
Sakshi News home page

7న కడపకు రాహుల్‌గాంధీ రాక

Published Sat, May 4 2024 9:15 AM

7న కడపకు  రాహుల్‌గాంధీ రాక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రానున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి సభాస్థలిగా మున్సిపల్‌ మైదానాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.

నేడు సదస్సు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 4న ఐ ఎం ఎ .హాల్‌ లో ’మన ఆర్థిక పరిస్థితి– దేశ భవిష్యత్తు’అనే అంశం పై సదస్సు నిర్వహించనున్నట్లు ఆ ఫోరం జిల్లా నాయకులు కామనురు శ్రీనివాసులురెడ్డి,బి దస్తగిరిరెడ్డి తెలిపారు శుక్రవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ప్రధాన వక్తగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. దేశం వెలిగిపోతోందని పేదరికం తగ్గిపోయింది అంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీలు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఈ సదస్సు ద్వారా అన్ని అంశాలను కూలంకుషంగా తెలియజేయటానికి అలాగే హాజరైన వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని చెప్పారు. ఈ సదస్సుకు మేధావులు ఉపాధ్యాయులు , ఉద్యోగులు, బ్యాంకింగ్‌ పోస్టల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌, ఎల్‌ఐసీ, ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement