ఎండ ప్రచండం | Sakshi
Sakshi News home page

ఎండ ప్రచండం

Published Sat, May 4 2024 5:55 AM

-

ఆరు మండలాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత

భువనగిరిటౌన్‌ : భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని ఆరు మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, ఏడు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలో 45.5డిగ్రీల ఎండ కాసింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement