పిల్లలను బడుల్లో చేర్పించాలి | Sakshi
Sakshi News home page

పిల్లలను బడుల్లో చేర్పించాలి

Published Sat, May 18 2024 3:40 AM

పిల్లలను బడుల్లో చేర్పించాలి

అత్తిలి: బడిఈడు పిల్లలను పాఠశాలల్లో నమోదు చేయించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు అందేలా చూడాలని జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ పి.శ్యాంసుందర్‌ అన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో శుక్రవారం చేపట్టిన దివ్యాంగుల పిల్లల నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు సమీపంలోని భవిత కేంద్రంలో పిల్లలను చేర్పించాలని ఆయన కోరారు. పిల్లలు లోపాన్ని అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ప్రత్యేక విద్యను అందిస్తున్నారన్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షలు, ఉద్యోగాల్లో రాయితీలు వర్తిస్తాయన్నారు. సమగ్ర శిక్ష ద్వారా అలవెన్సులు కూడా అందిస్తున్నామన్నారు. జిల్లా సహిత విద్య కో–ఆర్డినేటర్‌ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, టి.శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపాధ్యాయులు యేసురాజు, కేఎన్‌ రమ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement