హెలీప్యాడ్‌ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

హెలీప్యాడ్‌ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే

Published Sat, May 4 2024 12:20 AM

హెలీప్యాడ్‌ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే

కొత్తకోట: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి కొత్తకోటకు వస్తున్న నేపథ్యంలో పట్టణ శివారులోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేశారో పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేస్తున్నారన్నారు. పదేళ్లు పాలించిన బీజేపీ నాయకులు ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా రాముడి పేరు చెప్పుకొంటూ రాజకీయాలు చేశారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెంట కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ధన్వాడ బాలస్వామి, యాదయ్యసాగర్‌, సంద వెంకటేష్‌, గోకరయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement