ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి | Sakshi
Sakshi News home page

ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి

Published Sat, May 4 2024 12:20 AM

ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి

కొత్తకోట రూరల్‌: రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొత్తకోటలో నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్‌సీటీఈ అనుమతితో ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈసీ అనుమతితో పదోన్నతులు, బదిలీలు చేట్టాలన్నారు. అంతేగాకుండా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, జీపీఎఫ్‌, మెడికల్‌ బిల్స్‌, జీఎల్‌ఐ మెచ్యూరిటీ అయిన బండ్ల నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్‌, గద్వాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు హరికృష్ణ, రాఘవేంద్రాచారి, అరవింద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవన్న, కృష్ణ, శివనారాయణ, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement