హోం ఓటింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

హోం ఓటింగ్‌ ప్రారంభం

Published Sat, May 4 2024 12:05 AM

-

వనపర్తి: పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో శుక్రవారం హోం ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా 269 మంది ఓటర్లు హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారందరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఎనిమిది పోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 40 మంది దివ్యాంగులు, 75 మంది వృద్ధులు మొత్తం 115 మంది హోమ్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నారు. అలాగే 240 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement