పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

Published Sat, May 4 2024 4:40 AM

పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

పెళ్లకూరు: పేదల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పాలన సాగించిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సుపరిపాలనతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా కిలివేటి సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి, వెంకటరత్నం, చక్రపాణి, రఘునాయుడు, అమరేంద్రరెడ్డి, బాబురెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, వీరకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement