No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 4:40 AM

-

ఇదివరకు ఒకటో తేదీ వస్తే పండుగ వచ్చినట్టుండేదని అవ్వాతాతలు చెబుతున్నారు. వలంటీర్‌ ఇంటికి వచ్చి ఆత్మీయంగా పలకరిస్తే ఆనందంగా అనిపించేదని.. చేతికి పింఛన్‌ సొమ్ము అందగానే ప్రాణం లేచి వచ్చేదని వెల్లడిస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన పనిలేదు అనే ధైర్యం వచ్చేదని తెలియజేస్తున్నారు.. ఇలా సాఫీగా సాగిపోతున్న మా జీవితాలను చంద్రబాబు కష్టాల కడలిలోకి నెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. పింఛన్‌ నగదు కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో తిరగలేక ప్రాణం పోయేలా ఉందని వాపోతున్నారు. ఇంతగా తమపై కక్షగట్టడం ధర్మం కాదని.. తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement
Advertisement