ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగికి కత్తిపోటు | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగికి కత్తిపోటు

Published Sat, May 4 2024 5:45 AM

ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగికి కత్తిపోటు

తిరువళ్లూరు: ప్రైవేటు సంస్థలో తీసుకున్న అప్పు వాయిదా తమ వద్దకు వస్తే చెల్లిస్తామని, ఫోన్‌లో పిలిపించి కత్తులతో దాడి చేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కుళం గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌(27) పట్టణంలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అజిత్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించిన యువకుడు తాను సంస్థకు వాయిదా చెల్లించాల్సివుందని తిరువళ్లూరులోని ఐసీఎంఆర్‌ దగ్గరకు వస్తే అక్కడ నగదు ఇస్తామని చెప్పాడు. దీంతో అజిత్‌కుమార్‌ ద్విచక్ర వాహనంలో అక్కడికి వెళ్లాడు. అనంతరం అజిత్‌కుమార్‌ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతడి కళ్లలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి, తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి, 108లో అజిత్‌కుమార్‌ను తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు నిర్ధారించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement