తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సైన్స్పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉపగ్రహాల తయారీ విధానంపై అవగాహన పెంపొందించడానికి 200 మందితో కూడి న సైన్సు టీచర్ల బృందం డార్విన్ సంస్థ ఆధ్వర్యంలో ఇస్రోను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ విధానంపై బోధన, ఉపగ్రహాలు, టెలిస్కోప్ తయారీ విధానంపై అవగాహన కల్పించాలని డార్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం ఏటా 200 నుంచి 300 మంది ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన సైన్స్ టీచర్లను ఇస్రోకు తీ సుకెళ్లి అక్కడ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఉపగ్రహాలు, టెలీస్కోప్ తయారీ విధానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సైన్స్ టీచర్లు సుమారు 200 మంది ఇస్రోను సందర్శించారు. మొదట శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, అన్నాదురైతో సహా నలుగురు శాస్త్రవేత్తలతో ఉపాధ్యాయులు ముఖాముఖీ నిర్వహించారు. సైన్స్ బోధన సమయంలో ఉపయోగించాల్సిన టెక్నిక్స్తోపాటు ఉపగ్రహాలు, టెలీస్కోప్ తయారీ విధానంపై తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరోనాటికల్ విభాగంలో ప్రస్తుతం సాగుతున్న పరిశోధనలను పరిశీలించారు. పర్యటనలో పాల్గొన్న తిరువళ్లూరుకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ డెలోరస్పాండ్యన్ మాట్లాడుతూ డార్వీన్ సంస్థ సైన్స్ ఉపాధ్యాయులను ఇస్రో తీసుకెళ్లడం, వేర్వేరు పరిశోధనలపై శాస్త్రవేత్తలతో ముఖాముఖీ నిర్వహించడం అబినందించదగ్గ విషయమన్నారు. మే 24 నుంచి 26 వరకు కోయంబత్తూరు జిల్లా అన్ననూర్లోని నవభారత్ మెట్రిక్ పాఠశాలలో ఉపగ్రహాల తయారీ, మైక్రోస్కోప్, టెలీస్కోప్ తయారు చేసే విధానంపై శిక్షణ తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దినేష్, జిల్లాల కోర్డినేటర్లు నెల్సన్, కన్నన్, కర్పగం, జయంతి, రాజ్కుమార్, రూపావతి, పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఉపాధ్యాయుల ఇస్రో పర్యటన
Published Sat, May 4 2024 5:40 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement