ఇంటి వద్దే ఓటు వినియోగం | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దే ఓటు వినియోగం

Published Sat, May 4 2024 7:00 AM

ఇంటి వద్దే ఓటు వినియోగం

సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు అధికారులు ఈ హోమ్‌ ఓటింగ్‌ అవకాశాన్ని కల్పించారు. 80ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి పైబడిన దివ్యాంగులు తమ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సైతం అవసరమైన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో 9 మంది దివ్యాంగులు, 51 మంది వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేములవాడలో 215 మంది దివ్యాంగులు, 62 మంది వృద్ధులు ఓటు హక్కును ఇంటినుంచి వినియోగించుకున్న వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement