రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్‌ ఆరోపణలు | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్‌ ఆరోపణలు

Published Fri, May 3 2024 7:27 PM

Modi, Bjp Want To destroy Constitution : Rahul Gandhi

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేస్తున్నారని, దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం ఆరోపించారు.

రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి నామినేషన్ పత్రాల దాఖలు కోసం చివరి క్షణంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఒడిశాలోని రాయగడ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. పర్యటనను రద్దు చేసుకున్నందుకు ఒడిశా ప్రజలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతర దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  

కాంగ్రెస్, ఇండియా కూటములు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దానిని నాశనం చేయాలని చూస్తున్నాయి అని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement