దొంగలను పట్టిచ్చిన సీసీ కెమెరా | Sakshi
Sakshi News home page

దొంగలను పట్టిచ్చిన సీసీ కెమెరా

Published Sat, May 4 2024 7:25 AM

దొంగలను పట్టిచ్చిన సీసీ కెమెరా

మేడిపల్లి(వేములవాడ): భీమారం మండలం దేశాయిపేట ఎల్లమ్మ ఆలయంలో గురువారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీసీ కెమెరాలను తన సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవడంతో చోరీ దృశ్యాలను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. రంగాపూర్‌ గ్రామ శివారులో ఇద్దరు దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎవరికీ తెలియకుండా దొంగతనం చేస్తామనుకున్న వారిని మూడో కన్ను అయినా సీసీ కెమెరా పట్టిచ్చింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement