12 మందిని కరిచిన కుక్కలు | Sakshi
Sakshi News home page

12 మందిని కరిచిన కుక్కలు

Published Sat, May 4 2024 7:25 AM

12 మందిని కరిచిన కుక్కలు

రాయికల్‌(జగిత్యాలరూరల్‌): జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రంలోని కేశవనగర్‌లో శుక్రవారం వీధికుక్కల దాడిలో సుమారు 12 మంది గాయపడ్డారు. కేశవనగర్‌కు చెందిన శ్రీనివాస్‌, నవీన్‌, రాజిరెడ్డి, రమేశ్‌, లక్ష్మి, సత్యనారాయణ, నర్సారెడ్డి, విష్ణు, రాజేశ్వరి, శ్రీలేఖ మరో ఇద్దరిని వీధికుక్కలు కరిచాయి. మున్సిపల్‌ సిబ్బంది వెంటనే స్పందించి వీధికుక్కలను పట్టుకున్నారు. గాయపడినవారంతా రాయికల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలోని చింతలవాడకు చెందిన షాకీర్‌(45) శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న వెల్డింగ్‌ షాపులో పనిచేసే షాకీర్‌.. కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement