అనుమానాస్పద స్థితిలో తాపీమేస్త్రి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో తాపీమేస్త్రి మృతి

Published Sat, May 4 2024 6:30 AM

-

ఇచ్ఛాపురం రూరల్‌: గత తొమ్మిది రోజులుగా కనిపించకుండాపోయిన తాపీమేసీ్త్ర మామిడి చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించిన ఘటన శుక్రవారం ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..గార మండలం పొగాకువానిపేటకు చెందిన నీలాపు సూర్యనారాయణ(68) కొంతకాలంగా ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. గత నెల 25న ఉదయం ఇచ్ఛాపురం వెళ్లిన సూర్యనారాయణ తిరిగి రాకపోవడంతో స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు ఆదినారాయణ ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లొద్దపుట్టి సమీపంలోని మామిడి చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. మృతుడు సూర్యనారాయణగా కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
Advertisement