సుభాష్నగర్: ఈ వేసవిలోనే అత్యధికంగా శుక్రవా రం రికార్డు స్థాయిలో జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ నార్త్ మండలంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భగభగ మండుతున్న ఎండ దాటికి జ నం ఉదయం 11 దాటిందంటే రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని ఖలీల్వాడి, బస్టాండ్, కుమార్గల్లీ, పూసల గల్లీ, ఇతరత్ర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వర్నిలో 45.3, జక్రాన్పల్లిలో 45.0 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు బ యటికి రాకపోవడమే మంచిదని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటి పెరుగుతున్నాయి. జక్రాన్పల్లిలో ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలు, కొరట్పల్లిలో 37.0, ముప్కాల్లో 36.6 డిగ్రీలుగా నమోదయ్యాయి.