దేశానికి మోదీ నాయకత్వం అవసరం | Sakshi
Sakshi News home page

దేశానికి మోదీ నాయకత్వం అవసరం

Published Sat, May 4 2024 12:35 AM

దేశానికి మోదీ నాయకత్వం అవసరం

అచ్చంపేట రూరల్‌: దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ అన్నారు. శుక్రవారం పట్టణంలో శివసేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంకోసం మోదీ మరోసారి ప్రధాని కావాలని, శివసైనికులు బీజేపీ అభ్యర్ధి భరత్‌ ప్రసాద్‌ గెలుపునకు శ్రమించాలని కోరారు. సమావేశంలో విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు మారుతి, యువసేన అధ్యక్షుడు విష్ణు, వెంకటేష్‌, తరుణ్‌, అభిలాష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement