మంచిర్యాలలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Sat, May 4 2024 7:55 AM

-

నస్పూర్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మంచిర్యాలలో రోడ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు పట్టణ సీఐ బన్సీలాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

● చెన్నూర్‌, గోదావరిఖని, జైపూర్‌ నుంచి బెల్లంపల్లికి వెళ్లాల్సిన వాహనాలు శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం జంక్షన్‌ నుంచి నేషనల్‌ హైవే మీదుగా వెళ్లాలి.

● లక్సెట్టిపేట, హాజీపూర్‌ వైపు నుంచి బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌, సీసీసీ నస్పూర్‌, జైపూర్‌, గోదావరిఖని వైపునకు వెళ్లాల్సిన వాహనాలు వయా బైపాస్‌ రోడ్డు గద్దె రాగడి, క్యాతన్‌పల్లి మీదుగా నేషనల్‌ హైవే ద్వారా వెళ్లాలి.

● బెల్లంపల్లి, మందమర్రి వైపు నుంచి గోదావరిఖని వైపు వెళ్లాల్సిన వాహనాలు మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా నేషనల్‌ హైవే మీదుగా వెళ్లాలి.

● మంచిర్యాల నుంచి సీసీసీ నస్పూర్‌, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌, గోదావరిఖని వైపునకు వెళ్లాల్సిన వాహనాలు గద్దెరాగడి క్యాతన్‌పల్లి మీదుగా నేషనల్‌ హైవే పై నుంచి వెళ్లాలి.

● మంచిర్యాల నుంచి హాజీపూర్‌, లక్సెట్టిపేట వైపునకు వెళ్లాల్సిన వాహనాలు లక్ష్మీ థియేటర్‌ చౌరస్తా నుంచి బైపాస్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి.

● సాధారణ ప్రయాణికులు, కార్లు, ఆటోలు, బైకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీ వైపునకు, పాత మంచిర్యాల వైపు నుంచి ఐబీ వైపునకు, సీసీసీ నస్పూర్‌ వైపు నుంచి ఓవర్‌ బ్రిడ్జి వైపునకు అనుమతి లేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement