మాజీ సీఎం హామీ నెరవేర్చలేదని నిరసన | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం హామీ నెరవేర్చలేదని నిరసన

Published Sat, May 4 2024 7:55 AM

మాజీ సీఎం హామీ నెరవేర్చలేదని నిరసన

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరినదిపై వంతెన నిర్మాణానికి 2018లో సీఎం హోదాలో ఇచ్చిన హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని, శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలకు వస్తుండడంపై గోదావరి వంతెన సాధన సమితి సభ్యులు శుక్రవారం స్థానిక కాలేజీ రోడ్డులోని గోదావరి నది వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తులా మధుసూదన్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ జిల్లాకు ఏం చేశారని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చి తప్పారని, మందమర్రిలో లెదర్‌పార్కు ఏర్పాటు హామీలకే పరిమితమైందని పేర్కొన్నారు. గత వర్షాకాలం వరదల్లో మంచిర్యాల నీట మునిగినా, పంటలు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లా ప్రజలు కేసీఆర్‌ మాటలను నమ్మే పరిస్థితి లేదని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్ల నాగేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పట్టింపులకు పోకుండా టెండర్లు పూర్తయిన వంతెన నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలకుంట్ల మల్లయ్య, బానోతు దాస్య, ఐ.శివకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement