ఆదాయపన్ను రద్దుకు కృషి | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను రద్దుకు కృషి

Published Sat, May 4 2024 7:55 AM

ఆదాయపన్ను రద్దుకు కృషి

● కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం ● పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ

కాసిపేట: సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చి ఆదాయపన్ను రద్దు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ మతతత్వ రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోదీ, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్‌, సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, అక్బర్‌ఆలీ, సత్యనారాయణ, వెంకటస్వామి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలి పెంచుతాం

మండలంలోని పల్లంగూడ, గుర్వాపూర్‌ గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ కూలీలను కలిసి ఎమ్మెల్యే వినోద్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధిహామీ కూలీలకు రోజువారీ కూలి రూ.400 పెంచనున్నట్లు తెలిపారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Advertisement
 
Advertisement