మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

Published Sat, May 4 2024 12:45 AM

మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జన రంజక పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొరల పాలనను సాగనంపినట్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కూడా సాగనంపాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల స్థితిగతులను నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అయితేనే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా ఉన్నారని, ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు బహుమతిగా ఇద్దామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మోతీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పాలమూరు, మన పిల్లల భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్‌, సంజీవ్‌ముదిరాజ్‌, చల్లా అశ్లేషారెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్‌, కౌన్సిలర్‌ జాజిమొగ్గు నర్సింహులు, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement