చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ

Published Sat, May 4 2024 5:00 AM

చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ

మహబూబాబాద్‌: కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారుల మధ్య గుమ్చీల ఏర్పాటు విషయంలో శుక్రవారం ఘర్షణ జరిగింది. జిల్లా కేంద్రంలో మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం చేసి వ్యాపారులకు గదులు కేటాయించారు. అయితే వ్యాపారులు షాపులను ఏర్పాటు చేసుకోకుండా తాత్కాలికంగా గాంధీపార్క్‌లో ఏర్పాటు చేసిన షాపుల్లోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. కాగా మార్కెట్‌కు సంబంధించిన కొంత మంది గురువారం రాత్రి మోడల్‌ మార్కెట్‌ ఎదుట రెండు గుమ్చీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇతర వ్యాపారులు గుమ్చీలను ఎలా ఏర్పాటు చేస్తారని వారితో వాగ్వాదం చేశారు. గుమ్చీలను రోడ్డుపై పడేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే మున్సిపల్‌ సిబ్బందితో చేరుకొని జేసీబీతో గుమ్చీలను తొలగించే క్రమంలో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా ఎట్టి పరిస్థితుల్లో మోడల్‌ మార్కెట్‌ ఎదుట గుమ్చీలను ఏర్పాటు చేయవద్దని వ్యాపారులు కోరారు.

Advertisement
Advertisement