రిజర్వేషన్లు తొలగిస్తారన్నది అపోహ | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు తొలగిస్తారన్నది అపోహ

Published Sat, May 4 2024 8:15 AM

రిజర్వేషన్లు తొలగిస్తారన్నది అపోహ

విద్యానగర్‌: ఈడబ్ల్యూఎస్‌ ద్వారా అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన బీజేపీనే గెలిపించాలని కరీంనగర్‌ రెడ్డి సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు రేకులపల్లి రవీందర్‌ రెడ్డి, కాసర్ల మధుకర్‌ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాటలను వక్రీకరించారని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి, రిజర్వేషన్లు తొలిగిస్తారన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రావుల కిరణ్‌ రెడ్డి, కాల్వ పూర్ణచందర్‌ రెడ్డి, కూర మైపాల్‌ రెడ్డి, న్యాలకొండ ప్రసన్న కుమార్‌రెడ్డి, వర్ణ పెద్దిరెడ్డి, దారం జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement