బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Published Sat, May 4 2024 5:15 AM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

జహీరాబాద్‌ ఎంపీ స్థానం

ప్రధానికి గిఫ్ట్‌గా ఇవ్వాలి

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్‌: దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన కామారెడ్డి, రాజంపేట మండలాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వికసిత భారత్‌ కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. జహీరాబాద్‌ ఎంపీ స్థానాన్ని గెలిపించి ప్రధాని నరేంద్రమోదీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. గెలుపు ఖాయమైందని కానీ మెజార్టీ కోసమే కష్టపడుతున్నామన్నారు. కనీసం లక్షకు పైగా మెజారిటీతో గెలిపించుకోవాలని పేర్కొ న్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులతో జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లుగా భారత్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పో యిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వా త ఇంకా అద్భుతమైన పాలన సాగుతుందన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, రాజంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement