ప్రచార హోరు | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Published Sat, May 4 2024 5:15 AM

ప్రచా

జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు

6న కామారెడ్డిలో

కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ

హాజరుకానున్న ప్రియాంక గాంధీ

7న కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సుయాత్ర

జనసమీకరణపై పార్టీల దృష్టి

సాక్షి, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంపై ఫోకస్‌ చేసిన బీజేపీ నాయకత్వం సంగారెడ్డి–కామారెడ్డి జిల్లాలకు మధ్య అందోల్‌లో ప్రధాని మోదీతో సభ నిర్వహించింది. కాంగ్రెస్‌ నాయకత్వం ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ సభ కోసం ఎల్లారెడ్డి అనుకున్నా తర్వాత కామారెడ్డికి మార్చారు. ఈ నెల 6న కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేశారు. అలాగే ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ నెల 7న కా మారెడ్డి పట్టణంలో రోడ్‌షో అనంతరం సుభాష్‌రోడ్డులో జరిగే సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 6న కామారెడ్డిలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయడానికి పార్టీ నేత లు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించాలని ప్లాన్‌ చేస్తున్నారు. సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో పెద్దఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలు భావిస్తున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 7న కామారెడ్డికి చేరుకోనున్న నేపథ్యంలో కామారెడ్డిలో నిర్వహించే రోడ్‌షో, సభలకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మా జీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌లు రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. ర్యాలీకి భారీ జనాన్ని సమీకరించడం ద్వారా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రచార హోరు
1/1

ప్రచార హోరు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement